నంబర్లు భళా.. కాసుల గలగల..! రూ.లక్షలు పలుకుతున్న ఫ్యాన్సీ నంబర్లు
అంకెలు కాసులు కురిపిస్తున్నాయి. ఏటా ఫ్యాన్సీ నంబర్లకు డిమాండ్ పెరుగుతుండడంతో రవాణాశాఖ పంటపండుతోంది.
2023-24లో ఏకంగా రూ.119 కోట్ల ఆదాయం
ఈనాడు, హైదరాబాద్ : అంకెలు కాసులు కురిపిస్తున్నాయి. ఏటా ఫ్యాన్సీ నంబర్లకు డిమాండ్ పెరుగుతుండడంతో రవాణాశాఖ పంటపండుతోంది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో కేవలం ఫ్యాన్సీ నంబర్ల ద్వారానే రూ.119.73 కోట్లు ఆదాయం సమకూరింది. 2014-15లో అది కేవలం రూ.23.24 కోట్లే. పదేళ్లలో దాదాపు అయిదు రెట్లు పెరగడం విశేషం. చాలామంది వాహనదారులు తమ ఖరీదైన కార్ల కోసం ఫ్యాన్సీ నంబర్లు దక్కించుకుంటున్నారు. 2020 వరకు ఫ్యాన్సీ నంబర్లను మ్యాన్వల్గా వేలం వేసేవారు. దీంతో పారదర్శకత లోపించి అరకొరగానే ఆదాయం సమకూరేది. వాహనదారుల ఆదరణతో 2021 నుంచి ఆర్టీఏ ఆన్లైన్లో వేలం నిర్వహించి విక్రయిస్తుండటంతో ఆదాయం అమాంతంగా పెరిగింది. అంతకుముందు సంవత్సరం రూ.79.13 కోట్లు వస్తే..ఆన్లైన్ చేసిన తర్వాత 2021-22లో ఆదాయం రూ.110.43 కోట్లు దాటింది. ప్రస్తుతం కొత్తగా అమల్లోకి వచ్చిన ‘టీజీ’ కోడ్తో తొలి పదివేల నంబర్ల వరకు మధ్యలో ఎలాంటి ఆంగ్ల అక్షరాలు రావు. పది వేలు దాటితే టీజీ09 తర్వాత ఆంగ్ల అక్షరాలు వచ్చి తర్వాత వాహనాల నంబర్లు ఉంటాయి. ప్రస్తుతం ఈ సిరీస్ కొత్తగా ఉండటంతో ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. తాజాగా టీజీ09 9999 నంబరు ఏకంగా రూ.25 లక్షలపైనే పలకడం విశేషం. ఓ వ్యక్తి తన రూ.2.50 కోట్ల విలువైన కారుకు ఈ నంబరును ఎంపిక చేసుకున్నారు. ఖరీదైన కార్లకు నంబర్లు ఫ్యాన్సీగా ఉండాలని పోటాపోటీగా వేలంలో పాల్గొని దక్కించుకుంటున్నారు. 99999, 0001 లాంటి నంబర్లకు ఎక్కువగా డిమాండ్ ఉంటోందని జేటీసీ రమేష్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దుర్భాషలాడాడని కుమారుడిని చంపేసిన తల్లి
[ 16-06-2024]
తల్లి ప్రవర్తన సరిగా లేదని దుర్భాషలాడుతుండడంతో ఓ బాలుడిని తల్లే గొంతు నులిమి చంపేసింది. ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నించి చివరికి పోలీసులకు దొరికిపోయింది. -
పట్టుదల ఉంటే లక్ష్య సాధన సులువు: సినీనటి తాప్సీ
[ 16-06-2024]
విద్యార్థులు ఎటువంటి లక్ష్యాన్నైనా సాధించాలంటే వారిలో పట్టుదల ముఖ్యమని సినీ నటి తాప్సీ పన్ను పేర్కొన్నారు. హైదరాబాద్ పబ్లిక్స్కూల్ స్నాతకోత్సవాన్ని శనివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. -
శాస్త్రీయ కళల్లో భారతీయత ప్రతిబింబిస్తుంది
[ 16-06-2024]
శాస్త్రీయ సంప్రదాయ కళల్లో భారతీయ సంస్కృతి ప్రతిబింబిస్తుందని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. శృతి లయ కేంద్ర నటరాజాలయ ఆధ్వర్యంలో... -
రాజ్యాంగ రూపకల్పనలో న్యాయవాదుల పాత్ర అమోఘం
[ 16-06-2024]
భారత రాజ్యాంగ రూపకల్పనలో న్యాయవాదుల పాత్ర కీలకమని ఆలిండియా లాయర్స్ యూనియన్ (ఐలు) జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు బికాస్ రాజన్ భట్టాచార్య అన్నారు. -
న్యాయవాదుల సహకార సంఘం సేవలు అభినందనీయం
[ 16-06-2024]
ఒంటరిగా సాధించలేనిది.. జట్టు కట్టి సాధించొచ్చని, న్యాయవాదుల సహకార సంఘం అందుకు నిదర్శనమని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేన్రెడ్డి అన్నారు. -
చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం
[ 16-06-2024]
చేవెళ్ల ప్రభుత్వాసుపత్రిలో శనివారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్తో డయాలసిస్ కేంద్రంలో మంటలు సంభవించాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఇజ్రాయెల్ దళాలకు ఎదురుదెబ్బ.. 8 మంది సైనికులు మృతి
-
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (16/06/24)
-
విమానం కూల్చివేత ఘటన .. ఎనిమిది దశాబ్దాలకు వీడిన మిస్టరీ!
-
మొదట ఆ ఐదుగురిని తప్పించండి! సీనియర్ ఆటగాళ్లపై తీవ్రంగా మండిపడ్డ పాక్ క్రికెటర్
-
కువైట్ అగ్నిప్రమాద ఘటన.. అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం!