కిర్గిస్థాన్ నుంచి విద్యార్థులను సురక్షితంగా తీసుకురావాలి
కిర్గిస్థాన్లోని తెలుగు విద్యార్థులను సురక్షితంగా భారత్కు తీసుకువచ్చేలా తక్షణం చర్యలు చేపట్టాలని కేంద్రమంత్రి కిషన్రెడ్డిని జీవీకే ఎడ్యుటెక్ బృందం కోరింది.
కిషన్రెడ్డికి వినతిపత్రం ఇస్తున్న విద్యకుమార్
కాచిగూడ, న్యూస్టుడే: కిర్గిస్థాన్లోని తెలుగు విద్యార్థులను సురక్షితంగా భారత్కు తీసుకువచ్చేలా తక్షణం చర్యలు చేపట్టాలని కేంద్రమంత్రి కిషన్రెడ్డిని జీవీకే ఎడ్యుటెక్ బృందం కోరింది. స్థానికంగా ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో.. విద్యార్థులకు ఎలాంటి హాని జరగకుండా చూడాలని విజ్ఞప్తి చేసింది. బుధవారం విద్యకుమార్ నేతృత్వంలోని బృందం.. కిషన్రెడ్డిని కాచిగూడలోని నివాసంలో కలిసి వినతిపత్రం అందజేసింది. ఈ విషయమై కేంద్ర హోంమంత్రి అమిత్షాతో మాట్లాడని, విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్కు లేఖ కూడా రాసినట్లు కిషన్రెడ్డి వారికి తెలిపారు. ప్రస్తుతం అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని.. ఎవరూ అందోళన చెందాల్సిన అవసరంలేదన్నారు. సామాజిక మాధ్యమాల్లోని వదంతులను నమ్మొద్దని కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దుర్భాషలాడాడని కుమారుడిని చంపేసిన తల్లి
[ 16-06-2024]
తల్లి ప్రవర్తన సరిగా లేదని దుర్భాషలాడుతుండడంతో ఓ బాలుడిని తల్లే గొంతు నులిమి చంపేసింది. ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నించి చివరికి పోలీసులకు దొరికిపోయింది. -
పట్టుదల ఉంటే లక్ష్య సాధన సులువు: సినీనటి తాప్సీ
[ 16-06-2024]
విద్యార్థులు ఎటువంటి లక్ష్యాన్నైనా సాధించాలంటే వారిలో పట్టుదల ముఖ్యమని సినీ నటి తాప్సీ పన్ను పేర్కొన్నారు. హైదరాబాద్ పబ్లిక్స్కూల్ స్నాతకోత్సవాన్ని శనివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. -
శాస్త్రీయ కళల్లో భారతీయత ప్రతిబింబిస్తుంది
[ 16-06-2024]
శాస్త్రీయ సంప్రదాయ కళల్లో భారతీయ సంస్కృతి ప్రతిబింబిస్తుందని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. శృతి లయ కేంద్ర నటరాజాలయ ఆధ్వర్యంలో... -
రాజ్యాంగ రూపకల్పనలో న్యాయవాదుల పాత్ర అమోఘం
[ 16-06-2024]
భారత రాజ్యాంగ రూపకల్పనలో న్యాయవాదుల పాత్ర కీలకమని ఆలిండియా లాయర్స్ యూనియన్ (ఐలు) జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు బికాస్ రాజన్ భట్టాచార్య అన్నారు. -
న్యాయవాదుల సహకార సంఘం సేవలు అభినందనీయం
[ 16-06-2024]
ఒంటరిగా సాధించలేనిది.. జట్టు కట్టి సాధించొచ్చని, న్యాయవాదుల సహకార సంఘం అందుకు నిదర్శనమని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేన్రెడ్డి అన్నారు. -
చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం
[ 16-06-2024]
చేవెళ్ల ప్రభుత్వాసుపత్రిలో శనివారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్తో డయాలసిస్ కేంద్రంలో మంటలు సంభవించాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఇజ్రాయెల్ దళాలకు ఎదురుదెబ్బ.. 8 మంది సైనికులు మృతి
-
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (16/06/24)
-
విమానం కూల్చివేత ఘటన .. ఎనిమిది దశాబ్దాలకు వీడిన మిస్టరీ!
-
మొదట ఆ ఐదుగురిని తప్పించండి! సీనియర్ ఆటగాళ్లపై తీవ్రంగా మండిపడ్డ పాక్ క్రికెటర్
-
కువైట్ అగ్నిప్రమాద ఘటన.. అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం!