ఏడాది వయసున్న కుమార్తె కళ్లెదుటే తల్లి ఆత్మహత్య
ఏడాది వయసున్న కుమార్తె కళ్లెదుటే తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. అభం శుభం ఎరగని ఆ చిన్నారి.. తన తల్లికి ఏమైందో తెలియక పాల కోసం గుక్క పెట్టి ఏడుస్తుండటంతో ఇరుగుపొరుగువారు వచ్చి చూసేసరికి ఆ ఇల్లాలు ఫ్యాన్కు వేలాడుతూ కనిపించిన ఘటన దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది.
కుమార్తెతో ప్రీతి కుమారి
దుండిగల్: ఏడాది వయసున్న కుమార్తె కళ్లెదుటే తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. అభం శుభం ఎరగని ఆ చిన్నారి.. తన తల్లికి ఏమైందో తెలియక పాల కోసం గుక్క పెట్టి ఏడుస్తుండటంతో ఇరుగుపొరుగువారు వచ్చి చూసేసరికి ఆ ఇల్లాలు ఫ్యాన్కు వేలాడుతూ కనిపించిన ఘటన దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై రాజేష్ వివరాల మేరకు.. బిహార్కు చెందిన రాహుల్, ప్రీతి కుమారి (24) దంపతులు నగరానికి వలస వచ్చి బహదూర్పల్లి గ్రీన్హిల్స్ కాలనీలో ఉంటున్నారు. వీరి కుమార్తె రితిక (1) ఉంది. రాహుల్ ఓ పరిశ్రమలో ఎలక్ట్రీషియన్. బుధవారం ఉదయం విధులకు వెళ్లాడు. 11:30 సమయంలో చిన్నారి గుక్క పట్టి ఏడుస్తుండటంతో ఇరుగుపొరుగువారు వెళ్లి తలుపులు తట్టారు. స్పందన లేకపోవడంతో బద్దలుగొట్టి చూడగా ఫ్యాన్కు ఉరేసుకున్న ప్రీతికుమారి కనిపించింది. దంపతుల మధ్య మనస్పర్థల కారణంగా ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
డ్రోన్తో ట్రాఫిక్ పర్యవేక్షించి.. నియంత్రించి
[ 15-06-2024]
ఫైనాన్షియల్ జిల్లా, ఐటీ క్షేత్రాలతో ప్రాధాన్యాన్ని సంతరించుకున్న సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవడంలోనూ ముందుంటోంది. -
తక్కువ సమయం.. ఎక్కువ మందికి ప్రయోజనం
[ 15-06-2024]
క్యాన్సర్ చికిత్సలో కీలకమైన రేడియోషన్ థెరఫీలో అత్యాధునిక సేవలు ఎంఎన్జేలో అందుబాటులోకి రానున్నాయి. -
హాజరుకు నకిలీ మకిలి
[ 15-06-2024]
పారిశుద్ధ్య కార్మికులను వేధిస్తూ.. వారి జీతాన్ని జేబులో వేసుకుంటోన్న కేటుగాళ్లకు జీహెచ్ఎంసీ అడ్డాగా మారింది. -
కసి పెంచుకొని.. ఉసురు తీసి
[ 15-06-2024]
ప్రతీకారంతో ఒకరు.. వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఇంకొకరు.. ఇంట్లో గొడవల కారణంగా మరొకరు.. డబ్బుల విషయమై ఓ మహిళ, మరో వ్యక్తి హత్యకు గురయ్యారు. -
మరో 100 రోడ్లకు వాణిజ్య హోదా
[ 15-06-2024]
ఆదాయం పెంపు దిశగా జీహెచ్ఎంసీ మరో ముందడుగు వేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో మరో వంద రోడ్లకు వాణిజ్య హోదా ఇచ్చేందుకు కసరత్తు ప్రారంభించింది. -
ఉస్మానియా ప్రాంగణంలో జైలు వార్డు ఏర్పాటుకు సన్నాహాలు
[ 15-06-2024]
ఉస్మానియా ఆసుపత్రి ప్రాంగణంలో ‘జైలు వార్డు’ ఏర్పాటుకు పోలీసు, జైళ్లశాఖ అధికారులు, వైద్యాధికారులతో సన్నాహాలు చేస్తున్నారు. -
నేటి నుంచి డయల్ యువర్ ఎండీ
[ 15-06-2024]
జలమండలి పరిధిలో ప్రజలు ఎదుర్కొనే సమస్యలపై గతంలో నిర్వహించిన డయల్ యువర్ ఎండీ కార్యక్రమాన్ని పునరుద్ధరిస్తున్నట్లు జలమండలి ఎండీ సుదర్శన్రెడ్డి తెలిపారు. -
అదిరే.. కళ్లు చెదిరే
[ 15-06-2024]
యువ ఫ్యాషన్ డిజైనర్లు సరికొత్త డిజైన్లతో తమ సృజన చాటారు. -
గోదావరి నుంచి అత్యవసర పంపింగ్
[ 15-06-2024]
నగర అవసరాలకు గోదావరి జలాల తరలింపునకు సంబంధించి అత్యవసర పంపింగ్కు జలమండలి సిద్ధమవుతోంది. -
తాజా..తాజాగా..
[ 15-06-2024]
రైతులు పండించిన కూరగాయలు, పండ్లు మరింత తాజాగా వినియోగదారులకు అందనున్నాయి. -
అవకాశాల పెన్నిధి.. ఆకర్షణీయ ఉపాధి
[ 15-06-2024]
మార్కెట్లో లభించే ప్రతి వస్తువు వినియోగించే వరకు భద్రంగా ఉండాలంటే దానికి ప్రత్యేకమైన ప్యాకింగ్ అవసరం. -
తెలుగు వైతాళికుడు రామోజీరావు
[ 15-06-2024]
రామోజీరావు అక్షరశిల్పి అని సీనియర్ పాత్రికేయుడు, హాస్యావధాని శంకరనారాయణ నివాళులర్పించారు. ఆయన తెలుగు వైతాళికుడని కొనియాడారు. -
27 నుంచి రామకృష్ణ మఠంలో ‘శౌర్య క్యాంప్’
[ 15-06-2024]
యువతలో ఆత్మవిశ్వాసం పెంపొందించేలా దోమలగూడలోని రామకృష్ణ మఠంలో.. ఈ నెల 27 నుంచి మూడు రోజుల పాటు ‘శౌర్య’ పేరిట శిబిరం నిర్వహిస్తున్నట్లు మఠం అధ్యక్షుడు స్వామి బోధమయానంద స్వామి తెలిపారు. -
హైదరాబాద్ విద్యార్ధికే ఐసెట్ ఫస్ట్ ర్యాంక్
[ 15-06-2024]
తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(టీజీఐసెట్)లో మొదటి ర్యాంక్ హైదరాబాద్ విద్యార్ధినే వరించింది. -
అధ్వాన దారులు.. అవస్థల ప్రయాణాలు
[ 15-06-2024]
జిల్లాలో రహదారులు, భవనాలశాఖ ప్రధాన రోడ్లతో పాటు పల్లెలకు అనుసంధానంగా ఉన్న పంచాయతీరాజ్ రోడ్లు అధ్వానంగా మారాయి. -
అటవీ భూమిని వీడని కబ్జా పర్వం!
[ 15-06-2024]
రెండు దశాబ్దాలుగా తెలంగాణ అటవీ భూములను ఆక్రమించుకుని కర్ణాటక వాసులు సాగు చేస్తూ పంటలు పండిస్తున్నారు. -
కానరాని.. ఖనిజ సంక్షేమ నిధి
[ 15-06-2024]
జిల్లా వ్యాప్తంగా ఉన్న గ్రామాల్లో ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి. వీటి తవ్వకాలతో సర్కారుకు ఏటా రూ.కోట్లల్లో ఆదాయం సమకూరుతోంది. -
కాలువలు పూడ్చిన వారిపై క్రిమినల్ కేసులు
[ 15-06-2024]
చంద్రవంచ శివారులో దశాబ్దాలుగా కాగ్నా నదికి అనుసంధానంగా ఉన్న పరీవాహక కాలువలను పూడ్చివేసిన వారిపై క్రిమినల్ కేసు నమోదు చేసేందుకు సిఫారసు చేస్తామని తాండూరు తహసీల్దారు కేతావత్ తారాసింగ్ వెల్లడించారు. -
కలకలం రేపుతున్న చిరుత సంచారం
[ 15-06-2024]
వికారాబాద్ పరిసర ప్రాంతంలోని అనంతగిరి అడవిలో చిరుత పులి సంచారం మరోమారు కలకలం రేపుతోంది. -
డా.శుభాకర్కు ఎఫ్ఆర్సీపీ పురస్కారం
[ 15-06-2024]
వైద్య రంగంలో అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఎర్రగడ్డలోని ప్రభుత్వ ఛాతీ ఆసుపత్రి మాజీ మెడికల్ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ డా. కె.శుభాకర్ శుక్రవారం ఈడెన్బర్గ్లోని రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్ నుంచి అరుదైన ఎఫ్ఆర్సీపీ పురస్కారాన్ని అందుకున్నారు. -
అద్దె పేరుతో వచ్చి.. దోపిడీకి యత్నించి
[ 15-06-2024]
ఉపాధి కోసం నగరానికొచ్చారు. ఏ పని చేసినా ఎక్కువ డబ్బు రావట్లేదు. సులువుగా డబ్బు సంపాదించాలనే ఆలోచన తట్టింది. -
పోలీసు వేషం.. ఘరానా మోసం
[ 15-06-2024]
పోలీసు అధికారినంటూ బెదిరిస్తూ మోసాలకు పాల్పడుతున్న మాయగాడు జాదవ్ సన్నీ(35)ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు టాస్క్ఫోర్స్ డీసీపీ సాధన రష్మి పెరుమాళ్ శుక్రవారం మీడియాకు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
‘డియర్ కామ్రేడ్’పై పోస్ట్ పెట్టిన విజయ్ దేవరకొండ.. స్పందించిన రష్మిక
-
తాడేపల్లిలో రహదారి వివాదం.. ఘోర పరాభవం తర్వాత కూడా మారని జగన్ తీరు
-
ఎన్టీఆర్ భవన్కు చంద్రబాబు.. శ్రేణుల ఘనస్వాగతం
-
లోయలో పడిన టెంపో.. 10 మంది మృతి
-
దయచేసి దిల్లీకి నీరు విడుదల చేయండి: ఆప్ నేత ఆతిశీ
-
త్వరలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం: ఏపీ మంత్రి రాంప్రసాద్రెడ్డి