ఆశలు పెంచి.. నిరాశలో ముంచి..!
భూ సమస్యల పరిష్కారానికి ఏర్పాటుచేసిన ‘ధరణి’తో పోర్టల్ వల్ల నేటికీ ఇక్కట్లు తప్పడంలేదు. జిల్లా వ్యాప్తంగా వేలాది సమస్యలు పేరుకుపోయాయి
ధరణి తప్పులతో ప్రజలకు తిప్పలు
పూడూరు తహసీల్దారు కార్యాలయం వద్ద అర్జీదారులు
న్యూస్టుడే, వికారాబాద్, తాండూరు గ్రామీణ, పూడూరు: భూ సమస్యల పరిష్కారానికి ఏర్పాటుచేసిన ‘ధరణి’తో పోర్టల్ వల్ల నేటికీ ఇక్కట్లు తప్పడంలేదు. జిల్లా వ్యాప్తంగా వేలాది సమస్యలు పేరుకుపోయాయి. దీనికి సంబంధించి ‘న్యూస్టుడే’ కథనం.
ఏ చిన్న పొరపాటు దొర్లినా..
భూముల క్రయవిక్రయాలతో పాటు దస్త్రాల నవీకరణను పారదర్శకంగా నిర్వహించేందుకు గత ప్రభుత్వం అత్యంత సాంకేతికతతో కూడిన ధరణి పోర్టల్ను ప్రవేశపెట్టింది. దీనివల్ల పలు చిక్కులు వచ్చి పడ్డాయి. ప్రధానంగా డిజిటల్ పట్టాదారు పాసుపుస్తకంలో ఏ చిన్న తప్పు దొర్లినా సవరించుకునే అవకాశం లేకపోవడం పెద్ద సమస్యగా మారింది.
గత మూడేళ్లుగా కర్షకుల విన్నపం మేరకు 11 రకాల సమస్యల పరిష్కారానికి సిటిజన్ లాగిన్లో ‘అప్లికేషన్ ఫర్ పాస్బుక్ డేటా కరెక్షన్’ (పొరపాట్ల సవరణ దరఖాస్తు) పేరిట నూతన ఐచ్ఛికాలను అందుబాటులోకి తెచ్చినా ప్రయోజనం లేకుండా పోయింది. ః సవరణ కోసం సమర్పించిన దరఖాస్తులను తొలుత కలెక్టర్లు పరిశీలించి క్షేత్రస్థాయి విచారణ నిమిత్తం ఆయా మండలాల తహసీల్దార్లకు పంపిస్తారు. సహేతుకమైన కారణం చెప్పకుండానే తిరస్కరిస్తుండటంతో సమస్యలు పేరుకుపోతున్నాయి.
‘భూమాత’ ఎప్పుడొస్తుందో...: ధరణి పోర్టల్ను రద్దు చేసి ‘భూమాత’ పేరిట నూతన పథకం ప్రవేశపెడతామని కాంగ్రెస్ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక పలు దఫాలు ధరణిపై చర్చించినా నేటికీ ఓ నిర్ణయం తీసుకోలేదు. ప్రభుత్వం మార్పుతో ధరణి సమస్యలు పరిష్కారానికి నోచుకుంటాయని ఆశించిన రైతులకు నిరాశే మిగిలింది.
పైసలిస్తేనే భూమి రిజిస్ట్రేషన్
అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నప్పటికీ భూ యాజమాన్యపు హక్కుల్ని బదలాయించాలంటే రెవెన్యూ అధికారుల చేయి తడపాల్సిందేనని రైతులు వాపోతున్నారు. తాండూరు రెవెన్యూ పరిధిలో కొందరు సిబ్బంది ఎకరానికి రూ.5వేల చొప్పున లేదంటే ఒక లావాదేవీకి రూ.5వేల చొప్పున వసూలు చేస్తున్నారు. ఏవైనా పత్రాలు లేకుంటే అధికారులు అడిగినంత (రూ.10వేల నుంచి రూ.50వేలు) ఇస్తేనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేస్తున్నారు.
ఆధారాలతో అర్జీ పెట్టినా ఫలితం లేదు
- నర్సిములు, కొత్తపల్లి
నాకు రావాల్సిన 1.20 ఎకరాల భూమి ధరణి వచ్చిన తరువాత గ్రామంలోని మరొకరి పేరున నమోదైంది. మార్చాలని కోరుతూ తగిన ఆధారాలతో అర్జీ పెట్టుకుని రెండేళ్లుగా తిరుగుతున్నా. ఇప్పటివరకు పరిష్కారం కాకపోవటంతో మరోసారి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేశా. నేటికీ కార్యాలయం చుట్టూ తిరగాల్సి వస్తోంది.
కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నా..
- వనంపల్లి ఇంద్రారెడ్డి, పెండ్లిమడుగు, వికారాబాద్
పెండ్లిమడుగులో 2017లో 0-16 ఎకరాల భూమి కొనుగోలు చేశా. పాత పాస్ పుస్తకం వచ్చింది. ధరణిలో మాత్రం అదే గ్రామానికి చెందిన జంగంగారి ఇంద్రారెడ్డి, తండ్రి ధర్మారెడ్డి అంటూ పేరే నమోదై అతనికి కొత్త పాస్ పుస్తకం వచ్చింది. తప్పును సవరించాలని నేటికీ తిరుగుతూనే ఉన్నాను.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంపులోకి పంపించి.. నాలాలోకి తరలించి
[ 16-06-2024]
రాజధానిలో చిన్నపాటి వర్షానికే చెరువుల్లా మారుతున్న రోడ్ల సమస్యకు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చూపించబోతోంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశాలతో దీనిపై అధికారులు కార్యాచరణ రూపొందించారు. -
ఒకరు దేశ సేవలో.. మరొకరు ఐటీ రంగంలో
[ 16-06-2024]
ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఒకరు దేశ సేవలో.. మరొకరు ఐటీ సేవల్లో. దుండిగల్లోని ఎయిర్ఫోర్స్ అకాడమీలో శనివారం జరిగిన పాసింగ్ అవుట్ పరేడ్ అనంతరం క్యాడెట్స్ వారి తల్లిదండ్రులతో మాట కలిపినప్పుడు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. -
స్వీయ తప్పిదాలతోనే పాస్పోర్టు జారీలో ఆలస్యం
[ 16-06-2024]
ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయం పరిధిలో 5 సేవా కేంద్రాలు, 14 పోస్టాఫీసు పాస్పోర్టు సేవా కేంద్రాలు పనిచేస్తున్నాయి. రోజూ 4,000 పాస్పోర్టులు మంజూరు చేస్తున్నారు. -
కలుషిత జలాలు.. లీకేజీలు..
[ 16-06-2024]
సార్...మా ప్రాంతంలో మురుగు నీరు పొంగుతోంది.. మా బస్లీలో నల్లాల్లో కలుషిత నీళ్లు వస్తున్నాయి.. మా కాలనీలో తక్కువ ఒత్తిడితో నీరు సరఫరా అవుతోంది.. -
నకిలీలు గుర్తించేందుకు విజిలెన్స్ బృందాలు
[ 16-06-2024]
పారిశుద్ధ్య కార్మికుల జీతాలను దోచుకునే వారిపై చర్యలుంటాయని జీహెచ్ఎంసీ ఈవీడీఎం(ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్) విభాగం స్పష్టం చేసింది. -
జులై 7 నుంచి 29 వరకు బోనాలు
[ 16-06-2024]
తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ఠ మరింత ఇనుమడించేలా ఆషాఢ బోనాలు నిర్వహించాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులకు స్పష్టం చేశారు. -
మురుగు కనుమరుగయ్యేలా
[ 16-06-2024]
ఓఆర్ఆర్ చుట్టూ ఉన్న ఇళ్లు, వాణిజ్య, వ్యాపార సముదాయాల్లో ఉత్పత్తయ్యే మురుగు చెరువులు, కుంటలు ఇతర జలవనరుల్లో కలిసిపోకుండా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. -
బాలికల భద్రతకు ‘భరోసా’
[ 16-06-2024]
సమాజంలో ఆడపిల్లలు ఎదుర్కొంటున్న లింగ వివక్ష, హింస, వేధింపులను బాల్య దశ నుంచే అడ్డుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పాఠశాలల్లో బాలికా సాధికారత క్లబ్ (కమిటీలు) ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. -
జిల్లా కలెక్టర్గా ప్రతీక్ జైన్
[ 16-06-2024]
వికారాబాద్ జిల్లాకు కొత్త కలెక్టర్గా భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ప్రతీక్ జైన్ నియమితులయ్యారు. నేడు (ఆదివారం) ఉదయం 11.30 గంటలకు కలెక్టర్ ఛాంబర్లో పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. -
వయోధికుల్ని వేధించడం క్షమించరాని నేరం
[ 16-06-2024]
జన్మనిచ్చి.. అల్లారుముద్దుగా పెంచి, ప్రయోజకుల్ని చేసిన తల్లిదండ్రులపై వేధింపులు క్షమించరాని నేరమని శాసనసభాపతి గడ్డం ప్రసాద్కుమార్ అన్నారు. -
రామోజీరావు స్ఫూర్తి భావితరాలకు ఆదర్శం
[ 16-06-2024]
రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు మన మధ్య భౌతికంగా లేకపోయినప్పటికి ఆయన స్ఫూర్తి భావితరాలకు ఆదర్శంగా నిలుస్తుందని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలోని నాగన్పల్లి రామోజీ ఫౌండేషన్ ప్రభుత్వ పాఠశాల -
కూకట్పల్లి జోనల్ కమిషనర్ బదిలీ
[ 16-06-2024]
కూకట్పల్లి జోనల్ కమిషనర్ అభిలాష అభినవ్ బదిలీ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత జనవరి 5న ఇక్కడ పనిచేస్తున్న వి.మమతను బదిలీ చేస్తూ -
ప్రీమియం ఎక్స్ప్లోజివ్స్కు ఐఐసీటీ సాంకేతికత బదిలీ
[ 16-06-2024]
క్షిపణులు, అంతరిక్ష అనువర్తనాల్లో కీలకమైన సీఎల్-20 సింథసిస్ను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(ఐఐసీటీ), హైదరాబాద్లోని ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ సంస్థతో కలిసి అభివృద్ధి చేసింది. -
పాతబస్తీలో ‘ఈద్-అల్-అదా’ సందడి
[ 16-06-2024]
పాతబస్తీలో ‘ఈద్-అల్-అదా’ (బక్రీద్) సందడి ఊపందుకుంది. త్యాగానికి మారుపేరుగా నిలిచే పండగను సోమవారం జరుపుకోవడానికి ముస్లింలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. -
బవారియా గ్యాంగ్ పంజా
[ 16-06-2024]
నగరంపై ఉత్తరప్రదేశ్కు చెందిన భవారియా గ్యాంగ్ పంజా విసిరింది. ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు దొంగలు వరుసగా నాలుగు చైన్ స్నాచింగ్లకు పాల్పడ్డారు. -
దుర్భాషలాడాడని కుమారుడిని చంపేసిన తల్లి
[ 16-06-2024]
తల్లి ప్రవర్తన సరిగా లేదని దుర్భాషలాడుతుండడంతో ఓ బాలుడిని తల్లే గొంతు నులిమి చంపేసింది. ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నించి చివరికి పోలీసులకు దొరికిపోయింది. -
పట్టుదల ఉంటే లక్ష్య సాధన సులువు: సినీనటి తాప్సీ
[ 16-06-2024]
విద్యార్థులు ఎటువంటి లక్ష్యాన్నైనా సాధించాలంటే వారిలో పట్టుదల ముఖ్యమని సినీ నటి తాప్సీ పన్ను పేర్కొన్నారు. హైదరాబాద్ పబ్లిక్స్కూల్ స్నాతకోత్సవాన్ని శనివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. -
శాస్త్రీయ కళల్లో భారతీయత ప్రతిబింబిస్తుంది
[ 16-06-2024]
శాస్త్రీయ సంప్రదాయ కళల్లో భారతీయ సంస్కృతి ప్రతిబింబిస్తుందని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. శృతి లయ కేంద్ర నటరాజాలయ ఆధ్వర్యంలో... -
రాజ్యాంగ రూపకల్పనలో న్యాయవాదుల పాత్ర అమోఘం
[ 16-06-2024]
భారత రాజ్యాంగ రూపకల్పనలో న్యాయవాదుల పాత్ర కీలకమని ఆలిండియా లాయర్స్ యూనియన్ (ఐలు) జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు బికాస్ రాజన్ భట్టాచార్య అన్నారు. -
న్యాయవాదుల సహకార సంఘం సేవలు అభినందనీయం
[ 16-06-2024]
ఒంటరిగా సాధించలేనిది.. జట్టు కట్టి సాధించొచ్చని, న్యాయవాదుల సహకార సంఘం అందుకు నిదర్శనమని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేన్రెడ్డి అన్నారు. -
చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం
[ 16-06-2024]
చేవెళ్ల ప్రభుత్వాసుపత్రిలో శనివారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్తో డయాలసిస్ కేంద్రంలో మంటలు సంభవించాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఇజ్రాయెల్ దళాలకు ఎదురుదెబ్బ.. 8 మంది సైనికులు మృతి
-
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (16/06/24)
-
విమానం కూల్చివేత ఘటన .. ఎనిమిది దశాబ్దాలకు వీడిన మిస్టరీ!
-
మొదట ఆ ఐదుగురిని తప్పించండి! సీనియర్ ఆటగాళ్లపై తీవ్రంగా మండిపడ్డ పాక్ క్రికెటర్
-
కువైట్ అగ్నిప్రమాద ఘటన.. అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం!