ఎంఆర్డీసీఎల్ ఎస్ఈ వెంకటరమణ మృతి
మూసీ నది అభివృద్ధి సంస్థ (ఎంఆర్డీసీఎల్) సూపరింటెండెంట్ ఇంజినీరు వెంకటరమణ గురువారం మృతిచెందారు.
ఈనాడు, హైదరాబాద్: మూసీ నది అభివృద్ధి సంస్థ (ఎంఆర్డీసీఎల్) సూపరింటెండెంట్ ఇంజినీరు వెంకటరమణ గురువారం మృతిచెందారు. ఏప్రిల్ 30న సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశంలో పాల్గొన్న ఆయనకు గుండెనొప్పి వచ్చింది. వెంటనే అధికారులు ఆయనను సోమాజిగూడలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అప్పట్నుంచి అపస్మారక స్థితిలోనే ఉన్నారు. జీహెచ్ఎంసీ ఎస్సార్డీపీ విభాగంలో కీలకంగా పనిచేశారని, పలు పైవంతెనలు, అండర్పాస్లను వేగంగా నిర్మించడంలో క్రియాశీలపాత్ర పోషించారని తోటి ఉద్యోగులు గుర్తుచేసుకున్నారు.
ఐదో అంతస్తు నుంచి దూకిన వృద్ధురాలు
శశికళ
చైతన్యపురి, న్యూస్టుడే: అనారోగ్య సమస్యలతో ఓ వృద్ధురాలు ఐదో అంతస్తు నుంచి దూకింది. ఈఘటన చైతన్యపురి ఠాణా పరిధిలో గురువారం చోటుచేసుకుంది. ఇన్స్పెక్టరు వెంకటేశ్వర్లు వివరాల ప్రకారం.. న్యూమారుతీనగర్లోని మారుతీ హైట్స్లో ప్రైవేటు ఉద్యోగి మహేశ్ తల్లి శశికళ(69), భార్యాపిల్లలతో ఉంటున్నాడు. శశికళ కొంతకాలంగా ఆస్తమాతో బాధపడుతోంది. గురువారం ఉదయం లిఫ్ట్లో భవనం ఐదో అంతస్తు చేరుకుంది. పిట్ట గోడ వద్ద కుర్చీ వేసుకొని పైనుంచి కిందకు దూకింది. వాచ్మెన్ గమనించి కుటుంబ సభ్యులకు విషయం తెలియజేశాడు. వారు వచ్చి చూసేసరికి మృతిచెందింది.
గొలుసు చోరీ.. మహిళలకు గాయాలు
సునీత
పోచారం (ఘట్కేసర్), న్యూస్టుడే: ద్విచక్ర వాహనంపై వెళ్తున్న తల్లీకూతుళ్లను వెంబడించి మెడలోని బంగారు గొలుసును స్నాచర్లు లాక్కొవడంతో కిందపడిపోయారు. ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన అన్నోజిగూడ దగ్గర గురువారం సాయంత్రం జరిగింది. ఘట్కేసర్ మున్సిపాలిటీకి చెందిన సునీత(50) పొదుపు సంఘం డబ్బులను జోడిమెట్లలోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్లో జమ చేయడానికి ద్విచక్రవాహనంపై వెళ్లింది. ఆ తర్వాత కుమారై శ్రీజను ఎక్కించుకుని ఘట్కేసర్కు బయలుదేరింది. అన్నోజిగూడ వంతెనపైకి రాగానే వెనుక నుంచి ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని యువకుల్లో ఒకడు శ్రీజ మెడలోని రెండు తులాల బంగారు గొలుసును లాక్కొన్నాడు. దీంతో వాహనం అదుపు తప్పి తల్లికుమార్తెలు పడిపోయారు. వారిని ఆసుపత్రికి తరలించారు.
ఆర్టీసీ నకిలీ లోగో.. ఇద్దరిపై కేసు
రాంనగర్, న్యూస్టుడే: ఆర్టీసీ ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా నకిలీ లోగోను సృష్టించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన ఇద్దరు వ్యక్తులపై హైదరాబాద్లోని చిక్కడపల్లి ఠాణాలో కేసు నమోదైంది. ఎస్సై మౌనిక తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్టీసీ సంస్థ లోగో మారినట్లు కొణతం దిలీప్, హరీశ్రెడ్డిలు ఫేక్ లోగో సృష్టించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. అయితే, ఇప్పటివరకు కొత్త చిహ్నాన్ని తమ సంస్థ అధికారికంగా విడుదల చేయలేదని, ఫేక్ లోగోను సృష్టించినవారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బస్ భవన్కు చెందిన ఉన్నతాధికారి ఎ.శ్రీధర్ గురువారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
పెట్టుబడికి రెట్టింపు ఇస్తామని నమ్మించి.. పత్తాలేకుండా పోయారు
జీఎస్ఆర్ ఇన్ఫ్రా గ్రూపు ఎండీపై కేసు
జూబ్లీహిల్స్, న్యూస్టుడే: జీఎస్ఆర్ ఇన్ఫ్రా గ్రూపు ఎండీపై జూబ్లీహిల్స్ ఠాణాలో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. కూకట్పల్లి హైదర్నగర్కు చెందిన వద్దలపు పవన్కుమార్ తల్లి సునీత, మరదలు దాసరి వనమాల నారాయణఖేడ్ వద్ద ఫామ్ లాండ్ ప్రాజెక్ట్స్లో రూ.1.2కోట్లు పెట్టుబడి పెట్టారు. ఈమేరకు జీఎస్ఆర్ ఇన్ఫ్రా గ్రూప్ ప్రైవేట్ లిమిటెడ్ మార్కెటింగ్ డైరెక్టర్ శిల్ప ద్వారా 2022లో డబ్బులు చెల్లించారు. రెండేళ్లకు రెట్టింపు డబ్బులు ఇస్తామంటూ సంస్థ వారిని నమ్మించింది. ఇందుకు సంబంధించి జీఎస్ఆర్ సంస్థ ఎండీ గుంటుపల్లి శ్రీనివాస్రావు తన భార్య పద్మజ పేరుతో ఆరు ఐసీఐసీఐ బ్యాంకు చెక్కులను వారికి ఇచ్చారు. పెట్టిన పెట్టుబడికి డబ్బులు చెల్లించాల్సిన సమయం ముగియడంతో వాటిని అడిగేందుకు పవన్కుమార్ తన తల్లి సునీత, మరదలు వనమాలతో కలిసి మాదాపూర్లోని జీఎస్ఆర్ కార్యాలయానికి వెళ్లగా మూసేసి కనిపించింది. జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 10లోని సంస్థ మరో కార్యాలయానికి వెళ్లగా అదీ మూసేసి ఉంది. గుంటుపల్లి శ్రీనివాస్రావు, శిల్ప చరవాణులు స్విచ్ ఆఫ్ అయ్యాయి. పవన్కుమార్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా 406, 420 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మ్యాన్హోల్ నుంచి వంటనూనెల వ్యర్థాలు
[ 27-07-2024]
ఆర్టీసీ క్రాస్రోడ్డు పరిధిలోని ప్రధాన రహదారిపై ఓ డ్రైనేజీ మ్యాన్హోల్ నుంచి శుక్రవారం ఉదయం వంటనూనెల వ్యర్థాలు పొంగిపొర్లాయి. -
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
[ 27-07-2024]
రైల్లో దూర ప్రయాణం.. రాత్రిళ్లు చల్లగాలి.. కబుర్లు చెప్పుకుంటూ నిద్రలోకి జారుకుంటే చాలు.. అదును కోసం చూస్తున్న దొంగలకు పండగే. -
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
[ 27-07-2024]
మహేశ్వరంలోని ఓ హోటల్లో చోరీ చేసేందుకు వచ్చిన ఓ దొంగ.. పోలీసులకు కనీసం ఒక్క క్లూ కూడా దొరక్కుండా.. ఎంతో జాగ్రత్తగా పథకం వేశాడు. -
పనులు కదలాలి.. ప్రగతి పరుగిడాలి
[ 27-07-2024]
ఎనిమిదేళ్ల కిందట రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రాంటుగా హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ)కు అందిన మొత్తం కేవలం రూ.250 కోట్లు. అప్పటి నుంచి బల్దియాకు ఒక్కపైసా కూడా గ్రాంటుగా నిధులందలేదు. -
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
[ 27-07-2024]
రాజీవ్ రహదారిపై అతివేగంగా కారు నడిపి బస్సును ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి చెందారు. -
ఆ భూముల జాడ.. దేవుడికే తెలియాలి
[ 27-07-2024]
రాజధాని పరిధిలో 9వేల ఎకరాలకుపైనే దేవాదాయశాఖ భూములున్నాయి. నిత్యం ధూప, దీప నైవేద్యాల కోసం గతంలో అనేక మంది భూవిరాళాలు ఇచ్చారు. -
పాలక మండలి సభ్యుల సంబరాలు
[ 27-07-2024]
నగరం అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరు శాఖలకు కలిపి పద్దులో రూ.10వేల కోట్లను కేటాయించడంపై కాంగ్రెస్కు చెందిన జీహెచ్ఎంసీ పాలకమండలి సభ్యులు శుక్రవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు. -
మా ఇష్టం.. మేమిట్లే జేస్తం
[ 27-07-2024]
రాజధాని నగరంలో బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు వేగంగా పెరుగుతుండడంతో వాటికి అవసరమైన ఇటుకల తయారీ కోసం కొందరు నీళ్లు సమృద్ధిగా ఉన్న జంటజలాశయాల పరివాహక ప్రాంతాన్ని ఎంచుకున్నారు. -
కుటుంబాలను కూల్చేస్తున్న రీల్స్
[ 27-07-2024]
రీల్స్ మోజులో పడి తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగిల్చినవారు కొందరైతే.. కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకున్నవారు మరికొందరు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
యువతలో పెరుగుతున్న హృద్రోగ ముప్పు
[ 27-07-2024]
యువతలో గుండె సమస్యలు పెరుగుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. -
విద్యుత్తు అధికారుల్లో సూర్యాఘర్ జోష్
[ 27-07-2024]
సౌర విద్యుత్తును 300 యూనిట్ల వరకూ పొందే ‘పీఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’ పథకంలో ఎక్కువ మందిని చేర్పించే విద్యుత్తు అధికారులకు కేంద్రం ప్రోత్సహకాలు ప్రకటించింది. -
మాజీ రాష్ట్రపతి సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం సందర్శన
[ 27-07-2024]
శంషాబాద్ మండలం శ్రీరామనగరంలో వెలిసిన సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శుక్రవారం సందర్శించారు. -
దేశభక్తి చాటిన కార్గిల్ విజయోత్సవ ర్యాలీ
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధ విజయోత్సవానికి పాతికేళ్ల సందర్భంగా శుక్రవారం నారాయణగూడలోని రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి(అర్బీవీఆర్ఆర్) మహిళా కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్-2, తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ స్వచ్ఛంద సంస్థల సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ పలు ప్రాంతాల్లో కొనసాగింది. -
కోట్పల్లి కల్పవల్లి
[ 27-07-2024]
జిల్లాలో అతిపెద్దదైన కోట్పల్లి ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. బడ్జెట్లో రూ.8 కోట్లు కేటాయించింది. -
అరణ్యం కబ్జా పర్వం.. కొనసాగుతున్న వివాదం!
[ 27-07-2024]
రెండు దశాబ్దాలుగా జిల్లాకు చెందిన అటవీ భూములను ఆక్రమించుకుని కర్ణాటక వాసులు సాగు చేస్తూ పంటలు పండిస్తున్నారు. -
బాధిత అంధ బాలికను, కుటుంబాన్ని ఆదుకోవాలి
[ 27-07-2024]
మలక్పేట ప్రభుత్వ అంధ బాలికల వసతి గృహం వద్ద శుక్రవారం ఆందోళనలు కొనసాగాయి. -
రాష్ట్రపతి నిలయాల్లో సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం
[ 27-07-2024]
ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతిగా రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం, సిమ్లా, దిల్లీలోని రాష్ట్రపతి భవనాల సందర్శనకు సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు రాష్ట్రపతి నిలయం అధికారులు తెలిపారు. -
శిల్పారామం పేరు, లోగో వాడొద్దు
[ 27-07-2024]
అనుమతి లేకుండా శిల్పారామం పేరు, లోగోను ఇతరులు ఉపయోగించరాదని శిల్పారామం ప్రత్యేకాధికారి జి.కిషన్రావు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. -
ఆలయాల్లో కానుకలు చోరీ!
[ 27-07-2024]
దేవాలయాలు లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న టి.నరేందర్(27)ను శుక్రవారం అరెస్ట్ చేసినట్టు ఫలక్నుమా ఏసీపీ ఎన్.ఎల్.నారాయణరాజు తెలిపారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి