logo

ఇంటి నంబరుకు డబ్బులివ్వాలట!

ఇంటి నంబరు కేటాయింపునకు లంచం తీసుకుంటూ మున్సిపల్‌ ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్‌ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.

Updated : 24 May 2024 05:21 IST

అనిశాకు చిక్కిన ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్‌

స్వాధీనం చేసుకున్న నగదు

ఎల్బీనగర్, న్యూస్‌టుడే: ఇంటి నంబరు కేటాయింపునకు లంచం తీసుకుంటూ మున్సిపల్‌ ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్‌ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్మన్‌ఘాట్‌కు చెందిన విశ్రాంత ఉద్యోగి నర్సింహారెడ్డి స్థానికంగా ఇటీవల ఇంటిని నిర్మించుకున్నాడు. నిర్మాణం పూర్తయిన తర్వాత అసెస్‌మెంట్, ఇంటి నంబరు కోసం దరఖాస్తు చేసుకొని, కట్టాల్సిన నగదు రూ.67 వేలు ఆన్‌లైన్‌లోనే చెల్లించాడు.

విజయ్‌ భార్గవ్‌ కృష్ణ

రుసుం చెల్లించిన ఇంటి నంబరు కేటాయించకపోవడంతో ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్‌ విజయ్‌ భార్గవ్‌ కృష్ణను సంప్రదించాడు. అతడు రూ.10 వేలు లంచం డిమాండ్‌ చేశారు. దీంతో బాధితుడు రంగారెడ్డి జిల్లా ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. గురువారం సాయంత్రం సరూర్‌నగర్‌ సర్కిల్‌ కార్యాలయంలో బాధితుడి నుంచి నగదు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు, ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్‌ విజయ్‌ భార్గవ్‌ కృష్ణను అదుపులోకి తీసుకున్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని