బాలలూ.. మీకెందుకు వాహనాలు
మద్యం తాగి కారు నడిపి ఇద్దరు టెకీల మరణానికి కారణమైన పుణెకు చెందిన మైనర్ ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో గ్రేటర్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
పుణె ఘటన నేపథ్యంలో గ్రేటర్లో ఆందోళన
ఈనాడు, హైదరాబాద్: మద్యం తాగి కారు నడిపి ఇద్దరు టెకీల మరణానికి కారణమైన పుణెకు చెందిన మైనర్ ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో గ్రేటర్లో ఆందోళన వ్యక్తమవుతోంది. నగరంలోనూ మైనర్లు విచ్చలవిడిగా కార్లు, బైకులు నడుపుతున్నారు. తల్లిదండ్రులు వారించక కేసుల్లో ఇరుక్కుంటున్నారు. పుణెలో 12వ తరగతి విద్యార్థి మద్యం తాగి కారు అతివేగంగా నడిపి బైక్పై వెళుతున్న ఇద్దరు టెకీలను ఢీకొనడటంతో వారు మృతిచెందగా మైనర్కు వెంటనే బెయిల్ రావడంతో మృతుల కుటుంబికులు ఆందోళనకు దిగారు. మైనర్కు కారు ఇచ్చినందుకు, మద్యం సరఫరా చేసినందుకు తండ్రితోపాటు బార్ యజమానులను అరెస్టు చేసినా ఆందోళన ఆగడం లేదు. 18 ఏళ్లు నిండిన తర్వాతే డ్రైవింగ్ నేర్చుకొని లైసెన్సు పొందిన తర్వాతే కారు లేదా ద్విచక్ర వాహనాలు నడిపేందుకు అర్హత వస్తుంది. నగరంలో పదోతరగతి, ఇంటర్ చదివేవారే డ్రైవింగ్ చేస్తున్నారు. తల్లిదండ్రులకు తెలిసి కొందరు, తెలియక కొందరు వాహనాలతో రోడ్లపైకి వస్తున్నారు. డ్రైవింగ్పై అవగాహన లేకపోవడం, నిబంధనలు గురించి తెలియక ప్రమాదాలకు కారణమవుతున్నారు.
దొరికితే ఇబ్బందే..
మైనర్లు వాహనాలు నడపటం చట్టరీత్యా నేరం. పెద్దలు అభ్యంతరం చెప్పకపోవడం కూడా నేరమే. అలా చేస్తే వాహన యజమాని శిక్షార్హుడు. ముఖ్యంగా యువత, ఉద్యోగులకు జైలుశిక్ష పడితే వారి కేరీర్పై ప్రభావం చూపుతుంది. నగరంలో జరుగుతున్న తనిఖీల్లో 20-30 శాతం మందికి డ్రైవింగ్ లైసెన్సులు ఉండటం లేదు. కొందరు లైసెన్సులు గడువు తీరినా పునరుద్ధరించుకోవడం లేదు.
శిక్షణే రక్షణ..
- కారు లేదా బైకు నడపాలంటే శిక్షణ తప్పనిసరి. డ్రైవింగ్ శిక్షణ స్కూలు పకడ్బందీగా ఉండాలి. కంప్యూటర్ ఆధారిత నమూనా కారులాంటి యంత్రం (సిమ్యులేటర్) తప్పనిసరిగా అందుబాటులో ఉండాలి.
- యాక్సిలరేటర్, బ్రేక్, క్లచ్పై అవగాహన కల్పిస్తారు. 1 నుంచి 5 వరకు గేర్లు ఎలా మార్చాలి.. ఎక్కడ ఏ గేరు వాడాలి.. పూర్తిగా గేర్లు మార్చే విధానంపై శిక్షణ ఉంటుంది.
- వాహనం ఎత్తుగా ఉన్న ప్రాంతానికి వెళ్లేటప్పుడు, పల్లపు ప్రాంతానికి దిగేటప్పుడు ఏం చేయాలి.. ఎడమ, కుడి మలుపులు, యుటర్న్లు తీసుకునేప్పుడు జాగ్రత్తలు చెబుతారు.
- ఇక రహదారులపై ట్రాఫిక్లో నడిపే విధానం.. ఓవర్ టేకింగ్.. సిగ్నళ్ల వద్ద నిలిచే విధానం.. ఏ గేరులో ఉండాలి.. ఎలా ముందుకు వెళ్లాలనే అంశాలను సిమ్యులేటర్పై శిక్షకుడు వివరిస్తారు.
- వర్షం, మంచు కురుస్తున్న సమయంలో డ్రైవింగ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ఏ లైట్లు వినియోగించాలో నేర్పిస్తారు. స్టీరింగ్ పట్టుకునే విధానం.. దానిని ఉపయోగించే తీరుపై సిమ్యులేటర్పై నేర్చుకోవచ్చు.
- ట్రాఫిక్ నిబంధనలు.. సూచనలు.. ఆర్టీఏ చట్టాలు.. వాటిని ఉల్లంఘిస్తే విధించే జరిమానాలు గురించి వివరిస్తారు.
- శిక్షణకు ముందు సంబంధిత ఆర్టీఏ కార్యాలయంలో ఎల్ఎల్ఆర్ తీసుకోవాలి. అది ఉంటేనే శిక్షణ వాహనం నడపేందుకు అవకాశం ఉంటుంది. శిక్షణ పూర్తి అయిన తర్వాత ధ్రువపత్రం ఇస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మ్యాన్హోల్ నుంచి వంటనూనెల వ్యర్థాలు
[ 27-07-2024]
ఆర్టీసీ క్రాస్రోడ్డు పరిధిలోని ప్రధాన రహదారిపై ఓ డ్రైనేజీ మ్యాన్హోల్ నుంచి శుక్రవారం ఉదయం వంటనూనెల వ్యర్థాలు పొంగిపొర్లాయి. -
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
[ 27-07-2024]
రైల్లో దూర ప్రయాణం.. రాత్రిళ్లు చల్లగాలి.. కబుర్లు చెప్పుకుంటూ నిద్రలోకి జారుకుంటే చాలు.. అదును కోసం చూస్తున్న దొంగలకు పండగే. -
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
[ 27-07-2024]
మహేశ్వరంలోని ఓ హోటల్లో చోరీ చేసేందుకు వచ్చిన ఓ దొంగ.. పోలీసులకు కనీసం ఒక్క క్లూ కూడా దొరక్కుండా.. ఎంతో జాగ్రత్తగా పథకం వేశాడు. -
పనులు కదలాలి.. ప్రగతి పరుగిడాలి
[ 27-07-2024]
ఎనిమిదేళ్ల కిందట రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రాంటుగా హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ)కు అందిన మొత్తం కేవలం రూ.250 కోట్లు. అప్పటి నుంచి బల్దియాకు ఒక్కపైసా కూడా గ్రాంటుగా నిధులందలేదు. -
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
[ 27-07-2024]
రాజీవ్ రహదారిపై అతివేగంగా కారు నడిపి బస్సును ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి చెందారు. -
ఆ భూముల జాడ.. దేవుడికే తెలియాలి
[ 27-07-2024]
రాజధాని పరిధిలో 9వేల ఎకరాలకుపైనే దేవాదాయశాఖ భూములున్నాయి. నిత్యం ధూప, దీప నైవేద్యాల కోసం గతంలో అనేక మంది భూవిరాళాలు ఇచ్చారు. -
పాలక మండలి సభ్యుల సంబరాలు
[ 27-07-2024]
నగరం అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరు శాఖలకు కలిపి పద్దులో రూ.10వేల కోట్లను కేటాయించడంపై కాంగ్రెస్కు చెందిన జీహెచ్ఎంసీ పాలకమండలి సభ్యులు శుక్రవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు. -
మా ఇష్టం.. మేమిట్లే జేస్తం
[ 27-07-2024]
రాజధాని నగరంలో బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు వేగంగా పెరుగుతుండడంతో వాటికి అవసరమైన ఇటుకల తయారీ కోసం కొందరు నీళ్లు సమృద్ధిగా ఉన్న జంటజలాశయాల పరివాహక ప్రాంతాన్ని ఎంచుకున్నారు. -
కుటుంబాలను కూల్చేస్తున్న రీల్స్
[ 27-07-2024]
రీల్స్ మోజులో పడి తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగిల్చినవారు కొందరైతే.. కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకున్నవారు మరికొందరు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
యువతలో పెరుగుతున్న హృద్రోగ ముప్పు
[ 27-07-2024]
యువతలో గుండె సమస్యలు పెరుగుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. -
విద్యుత్తు అధికారుల్లో సూర్యాఘర్ జోష్
[ 27-07-2024]
సౌర విద్యుత్తును 300 యూనిట్ల వరకూ పొందే ‘పీఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’ పథకంలో ఎక్కువ మందిని చేర్పించే విద్యుత్తు అధికారులకు కేంద్రం ప్రోత్సహకాలు ప్రకటించింది. -
మాజీ రాష్ట్రపతి సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం సందర్శన
[ 27-07-2024]
శంషాబాద్ మండలం శ్రీరామనగరంలో వెలిసిన సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శుక్రవారం సందర్శించారు. -
దేశభక్తి చాటిన కార్గిల్ విజయోత్సవ ర్యాలీ
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధ విజయోత్సవానికి పాతికేళ్ల సందర్భంగా శుక్రవారం నారాయణగూడలోని రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి(అర్బీవీఆర్ఆర్) మహిళా కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్-2, తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ స్వచ్ఛంద సంస్థల సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ పలు ప్రాంతాల్లో కొనసాగింది. -
కోట్పల్లి కల్పవల్లి
[ 27-07-2024]
జిల్లాలో అతిపెద్దదైన కోట్పల్లి ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. బడ్జెట్లో రూ.8 కోట్లు కేటాయించింది. -
అరణ్యం కబ్జా పర్వం.. కొనసాగుతున్న వివాదం!
[ 27-07-2024]
రెండు దశాబ్దాలుగా జిల్లాకు చెందిన అటవీ భూములను ఆక్రమించుకుని కర్ణాటక వాసులు సాగు చేస్తూ పంటలు పండిస్తున్నారు. -
బాధిత అంధ బాలికను, కుటుంబాన్ని ఆదుకోవాలి
[ 27-07-2024]
మలక్పేట ప్రభుత్వ అంధ బాలికల వసతి గృహం వద్ద శుక్రవారం ఆందోళనలు కొనసాగాయి. -
రాష్ట్రపతి నిలయాల్లో సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం
[ 27-07-2024]
ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతిగా రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం, సిమ్లా, దిల్లీలోని రాష్ట్రపతి భవనాల సందర్శనకు సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు రాష్ట్రపతి నిలయం అధికారులు తెలిపారు. -
శిల్పారామం పేరు, లోగో వాడొద్దు
[ 27-07-2024]
అనుమతి లేకుండా శిల్పారామం పేరు, లోగోను ఇతరులు ఉపయోగించరాదని శిల్పారామం ప్రత్యేకాధికారి జి.కిషన్రావు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. -
ఆలయాల్లో కానుకలు చోరీ!
[ 27-07-2024]
దేవాలయాలు లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న టి.నరేందర్(27)ను శుక్రవారం అరెస్ట్ చేసినట్టు ఫలక్నుమా ఏసీపీ ఎన్.ఎల్.నారాయణరాజు తెలిపారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం