అడుగుకో అగాధం.. ప్రమాదాల ప్రయాణం
రాజధానిలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారింది. సగానికిపైగా వీధుల్లో గుంతలు దర్శనమిస్తున్నాయి. అర కిలోమీటరు కూడా సాఫీగా ప్రయాణించలేని దుస్థితి. నాలుగేళ్లుగా రహదారి పనులు నిలిచి పోవడమే ఇందుకు కారణం.
వర్షమొస్తే మరింత నరకం
కేపీహెచ్బీలో ఛిద్రమైన దారి
రాజధానిలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారింది. సగానికిపైగా వీధుల్లో గుంతలు దర్శనమిస్తున్నాయి. అర కిలోమీటరు కూడా సాఫీగా ప్రయాణించలేని దుస్థితి. నాలుగేళ్లుగా రహదారి పనులు నిలిచి పోవడమే ఇందుకు కారణం. ఫలితంగా వాహనదారులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. గుంతల్లో ప్రయాణిస్తూ అనారోగ్యాలకు గురవుతున్నారు. వర్షం కురిస్తే వరదతో రోడ్లు మరింత ప్రమాదకరంగా మారుతాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ఈనాడు, హైదరాబాద్
ఉదాహరణలివిగో..
- ఉప్పరపల్లి నుంచి నలందా నగర్ మీదుగా లంగర్హౌజ్ వెళ్లే రోడ్డుపై అడుగడుగునా గుంతలే. అత్తాపూర్, హైదర్గూడ, రాజేంద్రనగర్, కాటేదాన్ ప్రాంతాల్లోని కాలనీ రోడ్లు దారుణంగా ఉన్నాయి.
లంగర్హౌజ్లోని ప్రధాన రహదారి
- లంగర్హౌజ్ ప్రధాన రహదారిపై వర్షం వెలిసినా.. వరద అలాగే ఉంటుంది. దాదాపు వంద మీటర్ల మేర వరద నిలుస్తోంది.
- మల్కాజిగిరి సాయినగర్ సూర్యా టవర్ లేన్ రోడ్డును ఏడాది క్రితం తవ్వి, నేటికీ పనులు చేపట్టలేదు.
- కేపీహెచ్బీ కళామందిర్ వద్ద, కొండాపూర్లోని కొత్తగూడ ల్యాండ్ మార్క్ రెసిడెన్సీ చుట్టుపక్కల కాలనీ రోడ్లపై అడుగడుగునా గుంతలే.
- ఓల్డ్ అల్వాల్ మంజీర కాలనీ, ఆర్కేపురం సైనిక్ నగర్లో ఏడాది కింద తవ్వి, నేటికీ మరమ్మతు చేయలేదని స్థానికులు ఫిర్యాదు చేశారు.
కాలనీ రహదారులే ఎక్కువ..
- సీసీ రోడ్లు 6,167 కి.మీ
- నగరంలో మొత్తం రోడ్ల పొడవు 9,013 కి.మీ
- అందులో బీటీ రోడ్లు 2,846 కి.మీ
రూ.వేల కోట్లు.. అయినా రోడ్లకు తూట్లు..
నగరంలో నాలుగు లైన్లు, అంతకన్నా ఎక్కువ వెడల్పు ఉండే 811 కి.మీ ప్రధాన రహదారులను జీహెచ్ఎంసీ ప్రైవేటు సంస్థలకు ఇచ్చింది. ఐదేళ్ల నిర్వహణకు రూ.1,839 కోట్లు చెల్లించేలా ఒప్పందం చేసుకుంది. మొదటి మూడేళ్లలో పలు ప్రాంతాల్లో నూతన రోడ్లు నిర్మించాలి. తర్వాత రెండేళ్లు గుంతలు పడకుండా చూసుకోవాలి. కానీ ప్రైవేటు రోడ్లపై ఎక్కడ చూసినా భారీ గుంతలు దర్శనమిస్తున్నాయి.
- నగరంలో కాలనీ రోడ్లను తాగునీరు, మురుగునీటి పైపులైన్లు, విద్యుత్తు కేబుళ్ల కోసం తరచుగా తవ్వుతున్నారు. మరమ్మతులు మాత్రం చేయడం లేదు.
- గుంతలను ఎప్పటికప్పుడు పూడ్చాలన్న లక్ష్యంతో జీహెచ్ఎంసీ ఏటా రూ.25 కోట్లు వెచ్చించి ఐఆర్టీ బృందాలను నియమిస్తుంది. ఇంజినీర్లు ఆయా బృందాల వద్ద కమీషన్లు తీసుకుని, పనులు చేయకున్నా.. బిల్లులు ఇస్తున్నారనే విమర్శలున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పనులు కదలాలి.. ప్రగతి పరుగిడాలి
[ 27-07-2024]
ఎనిమిదేళ్ల కిందట రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రాంటుగా హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ)కు అందిన మొత్తం కేవలం రూ.250 కోట్లు. అప్పటి నుంచి బల్దియాకు ఒక్కపైసా కూడా గ్రాంటుగా నిధులందలేదు. -
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
[ 27-07-2024]
మహేశ్వరంలోని ఓ హోటల్లో చోరీ చేసేందుకు వచ్చిన ఓ దొంగ.. పోలీసులకు కనీసం ఒక్క క్లూ కూడా దొరక్కుండా.. ఎంతో జాగ్రత్తగా పథకం వేశాడు. -
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
[ 27-07-2024]
రాజీవ్ రహదారిపై అతివేగంగా కారు నడిపి బస్సును ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి చెందారు. -
ఆ భూముల జాడ.. దేవుడికే తెలియాలి
[ 27-07-2024]
రాజధాని పరిధిలో 9వేల ఎకరాలకుపైనే దేవాదాయశాఖ భూములున్నాయి. నిత్యం ధూప, దీప నైవేద్యాల కోసం గతంలో అనేక మంది భూవిరాళాలు ఇచ్చారు. -
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
[ 27-07-2024]
రైల్లో దూర ప్రయాణం.. రాత్రిళ్లు చల్లగాలి.. కబుర్లు చెప్పుకుంటూ నిద్రలోకి జారుకుంటే చాలు.. అదును కోసం చూస్తున్న దొంగలకు పండగే. -
పాలక మండలి సభ్యుల సంబరాలు
[ 27-07-2024]
నగరం అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరు శాఖలకు కలిపి పద్దులో రూ.10వేల కోట్లను కేటాయించడంపై కాంగ్రెస్కు చెందిన జీహెచ్ఎంసీ పాలకమండలి సభ్యులు శుక్రవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు. -
మా ఇష్టం.. మేమిట్లే జేస్తం
[ 27-07-2024]
రాజధాని నగరంలో బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు వేగంగా పెరుగుతుండడంతో వాటికి అవసరమైన ఇటుకల తయారీ కోసం కొందరు నీళ్లు సమృద్ధిగా ఉన్న జంటజలాశయాల పరివాహక ప్రాంతాన్ని ఎంచుకున్నారు. -
మ్యాన్హోల్ నుంచి వంటనూనెల వ్యర్థాలు
[ 27-07-2024]
ఆర్టీసీ క్రాస్రోడ్డు పరిధిలోని ప్రధాన రహదారిపై ఓ డ్రైనేజీ మ్యాన్హోల్ నుంచి శుక్రవారం ఉదయం వంటనూనెల వ్యర్థాలు పొంగిపొర్లాయి. -
కుటుంబాలను కూల్చేస్తున్న రీల్స్
[ 27-07-2024]
రీల్స్ మోజులో పడి తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగిల్చినవారు కొందరైతే.. కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకున్నవారు మరికొందరు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
యువతలో పెరుగుతున్న హృద్రోగ ముప్పు
[ 27-07-2024]
యువతలో గుండె సమస్యలు పెరుగుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. -
విద్యుత్తు అధికారుల్లో సూర్యాఘర్ జోష్
[ 27-07-2024]
సౌర విద్యుత్తును 300 యూనిట్ల వరకూ పొందే ‘పీఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’ పథకంలో ఎక్కువ మందిని చేర్పించే విద్యుత్తు అధికారులకు కేంద్రం ప్రోత్సహకాలు ప్రకటించింది. -
మాజీ రాష్ట్రపతి సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం సందర్శన
[ 27-07-2024]
శంషాబాద్ మండలం శ్రీరామనగరంలో వెలిసిన సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శుక్రవారం సందర్శించారు. -
దేశభక్తి చాటిన కార్గిల్ విజయోత్సవ ర్యాలీ
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధ విజయోత్సవానికి పాతికేళ్ల సందర్భంగా శుక్రవారం నారాయణగూడలోని రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి(అర్బీవీఆర్ఆర్) మహిళా కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్-2, తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ స్వచ్ఛంద సంస్థల సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ పలు ప్రాంతాల్లో కొనసాగింది. -
కోట్పల్లి కల్పవల్లి
[ 27-07-2024]
జిల్లాలో అతిపెద్దదైన కోట్పల్లి ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. బడ్జెట్లో రూ.8 కోట్లు కేటాయించింది. -
అరణ్యం కబ్జా పర్వం.. కొనసాగుతున్న వివాదం!
[ 27-07-2024]
రెండు దశాబ్దాలుగా జిల్లాకు చెందిన అటవీ భూములను ఆక్రమించుకుని కర్ణాటక వాసులు సాగు చేస్తూ పంటలు పండిస్తున్నారు. -
బాధిత అంధ బాలికను, కుటుంబాన్ని ఆదుకోవాలి
[ 27-07-2024]
మలక్పేట ప్రభుత్వ అంధ బాలికల వసతి గృహం వద్ద శుక్రవారం ఆందోళనలు కొనసాగాయి. -
రాష్ట్రపతి నిలయాల్లో సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం
[ 27-07-2024]
ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతిగా రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం, సిమ్లా, దిల్లీలోని రాష్ట్రపతి భవనాల సందర్శనకు సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు రాష్ట్రపతి నిలయం అధికారులు తెలిపారు. -
శిల్పారామం పేరు, లోగో వాడొద్దు
[ 27-07-2024]
అనుమతి లేకుండా శిల్పారామం పేరు, లోగోను ఇతరులు ఉపయోగించరాదని శిల్పారామం ప్రత్యేకాధికారి జి.కిషన్రావు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. -
ఆలయాల్లో కానుకలు చోరీ!
[ 27-07-2024]
దేవాలయాలు లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న టి.నరేందర్(27)ను శుక్రవారం అరెస్ట్ చేసినట్టు ఫలక్నుమా ఏసీపీ ఎన్.ఎల్.నారాయణరాజు తెలిపారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి