అనారోగ్యంతో యువతి మృతి
జ్వరంతో బాధపడుతున్న ఓ యువతి చికిత్స పొందుతూ.. మృతి చెందిన సంఘటన పరిగి పట్టణంలో శుక్రవారం జరిగింది.
చికిత్స చేసిన వైద్యులపై చర్యలకు తండ్రి డిమాండ్
పరిగి గ్రామీణ, న్యూస్టుడే: జ్వరంతో బాధపడుతున్న ఓ యువతి చికిత్స పొందుతూ.. మృతి చెందిన సంఘటన పరిగి పట్టణంలో శుక్రవారం జరిగింది. పరిగి ఎస్సై సంతోష్కుమార్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. దోమ మండల కేంద్రానికి చెందిన ఎండీ రుక్మొద్దీన్ ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగి. కుమార్తె యాస్మిన్ బేగం(22)కు జ్వరం రావడంతో ఈనెల 22న పరిగిలోని సాయి శ్రేణిక్ ఆసుపత్రిలో డాక్టర్ ప్రదీప్ వద్ద వైద్యం చేయించారు. ఆయన రాసిచ్చిన మందులు తీసుకుని గ్రామానికి వెళ్లారు. ఆర్ఎంపీ భాగ్యలక్ష్మి పరిశీలనలో రెండు రోజులు మందులు వాడారు. 23న ఆమె దేహంలో ఒక్కసారిగా మార్పులు రావడంతో పట్టణంలోని శ్రీబాలాజీ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. 24న అపస్మారక స్థితికి చేరుకుంది. పరీక్షించిన డాక్టర్ అభినవ్ సీపీఆర్ చేసి పరిస్థితి విషమించడంతో వెంటనే ఓ ఆసుపత్రికి పంపారు. అప్పటికే యువతి శరీరంపై దద్దుర్లు, మచ్చలు వచ్చాయి. హైదరాబాద్లోని వైద్యులు పరిశీలించి మృతి చెందినట్లు ధ్రువీకరించారు. తన బిడ్డ మృతికి కారణమైన వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రుక్మొద్దీన్ పరిగి ఠాణాలో ఫిర్యాదు చేశారు. అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై తెలిపారు. ఈ విషయమై ‘న్యూస్టుడే’ సాయి శ్రేణిక్ ఆస్పత్రి వైద్యుడు ప్రదీప్ను వివరణ కోరగా.. యాస్మిన్కు మొదటి రోజు చికిత్స అందించానని.. అందులో ఏ పొరపాటు జరగలేదన్నారు. ఆమె మృతికి కారణాలు తెలియవని పేర్కొన్నారు.
న్యాయమూర్తి వినూత్న తీర్పు
తాండూరు టౌన్, న్యూస్టుడే: బహిరంగ ప్రదేశంలో మద్యం తాగిన వారికి తాండూరు స్పెషల్ క్లాస్ జ్యుడీషియల్ న్యాయమూర్తి నామాల అశోక్ వినూత్న తీర్పు ఇచ్చారని తాండూరు పట్టణ సీఐ సంతోష్ కుమార్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. గురువారం పట్టణ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా, పట్టణానికి చెందిన యూసుఫ్, సమీర్, అబుబ్కర్ బహిరంగ ప్రదేశంలో మద్యం తాగుతుండగా, అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. శుక్రవారం కేసును పరిశీలించిన న్యాయమూర్తి ముగ్గురికి వినూత్న శిక్ష విధించారు. జిల్లా ఆస్పత్రిలో రోగులకు, పట్టణంలోని మసీదు వద్ద ఉండే పేదవారికి పండ్లు పంపిణీ చేయాలని ఆదేశించారు. ఆ మేరకు పండ్లు పంపిణీ చేయించామన్నారు.
పోలీసుల తీరు సరికాదు
తాండూరు టౌన్, న్యూస్టుడే: ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పీడీఎస్యూ నాయకుడు శ్రీనివాస్ విషయంలో పోలీసులు ప్రవర్తించిన తీరు దారుణమని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజా,విద్యార్థి సంఘాల నాయకులు శుక్రవారం డీఎస్పీ బాలకృష్ణారెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ సంఘటనకు బాధ్యులైన కానిస్టేబుల్ సత్తార్, ఎస్సై కాశీనాథ్పై చర్యలు తీసుకోవాలన్నారు. ఫైనాన్స్ నిర్వాహకులు వేధిస్తున్నారని ఫిర్యాదు చేయటానికి స్టేషన్కు వెళ్లిన శ్రీనివాస్ను కానిస్టేబుల్ ఈడ్చుకుంటూ తీసుకువెళ్లడమేమిటని ప్రశ్నించారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్, విజయలక్ష్మీ పండిత్, సోమశేఖర్, గీత, మహేందర్, చంద్రయ్య, రామకృష్ణ, అశోక్, సంజయ్గౌడ్, బుగ్గప్ప, దీపక్రెడ్డి, వెంకట్, అనిల్, చెన్నప్ప, మల్లేష్, బసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కల్లు సీసా విషయమై ఘర్షణ
వికారాబాద్, న్యూస్టుడే: కల్లు సీసా విషయంలో ఘర్షణ పడి, పరస్పరం దాడులు చేసుకున్న ఐదుగురిపై కేసు నమోదు చేసిన సంఘటన వికారాబాద్ పురపాలక సంఘం పరిధి గిరిగిట్పల్లిలో శుక్రవారం జరిగింది. వికారాబాద్ సీఐ నాగరాజు తెలిపిన ప్రకారం పట్టణంలోని ఆలంపల్లికి చెందిన శ్రీనివాస్, శంకర్ గిరిగిట్పల్లికి వెళ్లి రెండు సీసాల కల్లు తీసుకున్నారు. మరో సీసా కల్లు ఇవ్వమని అడగగా నిర్వాహకురాలికి, కొనుగోలుదారుల మధ్య గొడవ జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాస్, శంకర్పై దుకాణ నిర్వాహకురాలి కుమారుడు చరణ్గౌడ్, భర్త దత్తుగౌడ్ దాడి చేయగా, వీరు కూడా తిరగబడ్డారు. వికారాబాద్ పోలీస్ఠాణాలో పరస్పరం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మ్యాన్హోల్ నుంచి వంటనూనెల వ్యర్థాలు
[ 27-07-2024]
ఆర్టీసీ క్రాస్రోడ్డు పరిధిలోని ప్రధాన రహదారిపై ఓ డ్రైనేజీ మ్యాన్హోల్ నుంచి శుక్రవారం ఉదయం వంటనూనెల వ్యర్థాలు పొంగిపొర్లాయి. -
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
[ 27-07-2024]
రైల్లో దూర ప్రయాణం.. రాత్రిళ్లు చల్లగాలి.. కబుర్లు చెప్పుకుంటూ నిద్రలోకి జారుకుంటే చాలు.. అదును కోసం చూస్తున్న దొంగలకు పండగే. -
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
[ 27-07-2024]
మహేశ్వరంలోని ఓ హోటల్లో చోరీ చేసేందుకు వచ్చిన ఓ దొంగ.. పోలీసులకు కనీసం ఒక్క క్లూ కూడా దొరక్కుండా.. ఎంతో జాగ్రత్తగా పథకం వేశాడు. -
పనులు కదలాలి.. ప్రగతి పరుగిడాలి
[ 27-07-2024]
ఎనిమిదేళ్ల కిందట రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రాంటుగా హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ)కు అందిన మొత్తం కేవలం రూ.250 కోట్లు. అప్పటి నుంచి బల్దియాకు ఒక్కపైసా కూడా గ్రాంటుగా నిధులందలేదు. -
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
[ 27-07-2024]
రాజీవ్ రహదారిపై అతివేగంగా కారు నడిపి బస్సును ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి చెందారు. -
ఆ భూముల జాడ.. దేవుడికే తెలియాలి
[ 27-07-2024]
రాజధాని పరిధిలో 9వేల ఎకరాలకుపైనే దేవాదాయశాఖ భూములున్నాయి. నిత్యం ధూప, దీప నైవేద్యాల కోసం గతంలో అనేక మంది భూవిరాళాలు ఇచ్చారు. -
పాలక మండలి సభ్యుల సంబరాలు
[ 27-07-2024]
నగరం అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరు శాఖలకు కలిపి పద్దులో రూ.10వేల కోట్లను కేటాయించడంపై కాంగ్రెస్కు చెందిన జీహెచ్ఎంసీ పాలకమండలి సభ్యులు శుక్రవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు. -
మా ఇష్టం.. మేమిట్లే జేస్తం
[ 27-07-2024]
రాజధాని నగరంలో బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు వేగంగా పెరుగుతుండడంతో వాటికి అవసరమైన ఇటుకల తయారీ కోసం కొందరు నీళ్లు సమృద్ధిగా ఉన్న జంటజలాశయాల పరివాహక ప్రాంతాన్ని ఎంచుకున్నారు. -
కుటుంబాలను కూల్చేస్తున్న రీల్స్
[ 27-07-2024]
రీల్స్ మోజులో పడి తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగిల్చినవారు కొందరైతే.. కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకున్నవారు మరికొందరు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
యువతలో పెరుగుతున్న హృద్రోగ ముప్పు
[ 27-07-2024]
యువతలో గుండె సమస్యలు పెరుగుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. -
విద్యుత్తు అధికారుల్లో సూర్యాఘర్ జోష్
[ 27-07-2024]
సౌర విద్యుత్తును 300 యూనిట్ల వరకూ పొందే ‘పీఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’ పథకంలో ఎక్కువ మందిని చేర్పించే విద్యుత్తు అధికారులకు కేంద్రం ప్రోత్సహకాలు ప్రకటించింది. -
మాజీ రాష్ట్రపతి సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం సందర్శన
[ 27-07-2024]
శంషాబాద్ మండలం శ్రీరామనగరంలో వెలిసిన సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శుక్రవారం సందర్శించారు. -
దేశభక్తి చాటిన కార్గిల్ విజయోత్సవ ర్యాలీ
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధ విజయోత్సవానికి పాతికేళ్ల సందర్భంగా శుక్రవారం నారాయణగూడలోని రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి(అర్బీవీఆర్ఆర్) మహిళా కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్-2, తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ స్వచ్ఛంద సంస్థల సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ పలు ప్రాంతాల్లో కొనసాగింది. -
కోట్పల్లి కల్పవల్లి
[ 27-07-2024]
జిల్లాలో అతిపెద్దదైన కోట్పల్లి ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. బడ్జెట్లో రూ.8 కోట్లు కేటాయించింది. -
అరణ్యం కబ్జా పర్వం.. కొనసాగుతున్న వివాదం!
[ 27-07-2024]
రెండు దశాబ్దాలుగా జిల్లాకు చెందిన అటవీ భూములను ఆక్రమించుకుని కర్ణాటక వాసులు సాగు చేస్తూ పంటలు పండిస్తున్నారు. -
బాధిత అంధ బాలికను, కుటుంబాన్ని ఆదుకోవాలి
[ 27-07-2024]
మలక్పేట ప్రభుత్వ అంధ బాలికల వసతి గృహం వద్ద శుక్రవారం ఆందోళనలు కొనసాగాయి. -
రాష్ట్రపతి నిలయాల్లో సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం
[ 27-07-2024]
ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతిగా రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం, సిమ్లా, దిల్లీలోని రాష్ట్రపతి భవనాల సందర్శనకు సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు రాష్ట్రపతి నిలయం అధికారులు తెలిపారు. -
శిల్పారామం పేరు, లోగో వాడొద్దు
[ 27-07-2024]
అనుమతి లేకుండా శిల్పారామం పేరు, లోగోను ఇతరులు ఉపయోగించరాదని శిల్పారామం ప్రత్యేకాధికారి జి.కిషన్రావు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. -
ఆలయాల్లో కానుకలు చోరీ!
[ 27-07-2024]
దేవాలయాలు లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న టి.నరేందర్(27)ను శుక్రవారం అరెస్ట్ చేసినట్టు ఫలక్నుమా ఏసీపీ ఎన్.ఎల్.నారాయణరాజు తెలిపారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం