రక్తశుద్ధి.. ఆరోగ్య సిద్ధి
మూత్రపిండాల వ్యాధిగ్రస్థులకు సాంత్వన చేకూర్చేందుకు ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా నాలుగు సర్కార్ దవాఖానాల్లో డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేసింది.
అందుబాటులో కేంద్రాలు, బాధితులకు సాంత్వన
చికిత్స పొందుతున్న రోగులు
న్యూస్టుడే, వికారాబాద్ మున్సిపాలిటీ, పరిగి, తాండూరు టౌన్, కొడంగల్: మూత్రపిండాల వ్యాధిగ్రస్థులకు సాంత్వన చేకూర్చేందుకు ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా నాలుగు సర్కార్ దవాఖానాల్లో డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. కార్పొరేట్ స్థాయిలో ఆధునిక వసతులు కల్పించి వైద్య సేవలను అందుబాటులోకి తేవడంతో బాధితులకు హైదరాబాద్ వెళ్లే అవస్థలు తప్పాయి. స్థానికంగా ఉచిత సేవలు అందడంతో వారికి ఊరట కలిగింది. అయితే కొన్ని చోట్ల వసతులు సరిగా లేవని పూర్తిస్థాయిలో కల్పించాలని వారు కోరుతున్నారు. తాండూరు జిల్లా ఆసుపత్రి, వికారాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, పరిగి, కొడంగల్ సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో రక్తశుద్ధి సేవలను అందిస్తున్నారు. వికారాబాద్లో 2018 జనవరిలో సేవలు ప్రారంభించడంతో వికారాబాద్ పరిసర మండలాలతో పాటు, ఇతర మండలాలకు చెందిన వారు ఇక్కడ చికిత్స పొందుతున్నారు. పరిగి కేంద్రంలో కుల్కచర్ల, దోమ, పూడూరు మండలాల వారు, తాండూరు, కొడంగల్లో ఆ పరిసర గ్రామాల వారు కేంద్రాలను వినియోగించుంటున్నారు. కొడంగల్ కేంద్రంలో ఫర్నిచర్ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మందులను బయట తెచ్చుకోమ్మని అక్కడి సిబ్బంది సూచిస్తున్నారని రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లా వ్యాప్తంగా 23 పడకలు: తాండూరులో 8, వికారాబాద్, పరిగి, కొడంగల్ కేంద్రాల్లో 5 చొప్పున పడకలున్నాయి. తాండూరు 50, వికారాబాద్ 40, పరిగి 30, కొడంగల్ 35 మందికి సేవలు అందుతున్నాయి. పడకల ప్రకారం రక్తశుద్ధి చేస్తున్నారు. ఒక్కొక్కరికి నాలుగు గంటల పాటు సేవలందిస్తున్నారు. మందులు ఉచితంగా సరఫరా చేస్తున్నారు.
అంతా అధునాతనమే: డయాలేజర్ను మామూలుగా రోగికి 12, 13 సార్లు వినియోగిస్తారు. ప్రతి రోగికి ఒక పరికరాన్ని వినియోగించేలా జర్మనీ సంస్థ ప్రతినిధులతో ఒప్పందం చేసుకున్నారు. ఈ అధునాతనమైన విధానం కేవలం ప్రభుత్వ ఆస్పత్రిలోనే అందుబాటులో ఉంది. గతంలో వైద్యానికి నగరానికి వెళ్లిన ప్రతి సారి ఒక్కరికి అన్ని ఖర్చులు కనీసం రూ.10 వేల నుంచిరూ.15 వేల వరకు అయ్యేది. ఇప్పుడా పరిస్థితి తప్పింది.
పింఛన్ సౌకర్యం: రక్తశుద్ధి చేయించుకునే వారికి నెలకు రూ.2016 పింఛన్ అందుకుంటున్నారు. నాలుగు కేంద్రాల్లోని చికిత్స పొందుతున్న వారికి ఇది వర్తిస్తుంది. డయాలసిస్ చేసుకుంటున్నట్లు ధ్రువపత్రంతో దరఖాస్తు చేసుకుంటే పింఛన్ మంజూరు చేస్తారు.
40 మందికి సేవలందిస్తున్నాం
- మహ్మద్ రిజ్వాన్, ఇన్ఛార్జి, వికారాబాద్
ఈ కేంద్రంలో ప్రస్తుతం 40 మందికి రక్తశుద్ధి చేస్తున్నాం. ఒక్కొక్కరికి నెలకు 12 సార్లు సేవలు అందించాల్సి ఉంటుంది. వికారాబాద్ పరిసర మండలాలకు చెందినవారు, స్థానికులు ఇక్కడికి వస్తున్నారు. ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే చికిత్స చేస్తున్నాం. ముందుగా పేరు నమోదు చేసుకుని దరఖాస్తు చేసుకోవాలి. ప్రతి రోగికి నెలకు నాలుగు ఇంజక్షన్లు ఇస్తాం. అంతే కాకుండా ఇనుముకు సంబంధించినవి రెండు ఇస్తాం.
పింఛన్ రావడం లేదు: జ్ఞానేశ్వర్, ధన్నారం
జనవరి నుంచి పింఛన్ రావడం లేదు. ఎందుకు నిలిపివేశారో తెలియడం లేదు. 2021 నుంచి చికిత్స చేయించుకుంటున్నా. వికారాబాద్లో కేంద్రం ఏర్పాటుతో రోగులకు సౌకర్యంగా మారింది.
సేవలు బాగున్నాయి
- ఎల్లయ్య, బూచన్పల్లి, మర్పల్లి
వికారాబాద్ కేంద్రంలో సేవలు బాగున్నాయి. ఆరు నెలలుగా చికిత్స పొందుతున్నా. పింఛన్ ఇస్తారన్న విషయం ఇప్పుడే తెలిసింది. దరఖాస్తు చేస్తా. ప్రభుత్వ దవాఖానాలో సేవలు అందించడం మంచి పరిణామం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మ్యాన్హోల్ నుంచి వంటనూనెల వ్యర్థాలు
[ 27-07-2024]
ఆర్టీసీ క్రాస్రోడ్డు పరిధిలోని ప్రధాన రహదారిపై ఓ డ్రైనేజీ మ్యాన్హోల్ నుంచి శుక్రవారం ఉదయం వంటనూనెల వ్యర్థాలు పొంగిపొర్లాయి. -
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
[ 27-07-2024]
రైల్లో దూర ప్రయాణం.. రాత్రిళ్లు చల్లగాలి.. కబుర్లు చెప్పుకుంటూ నిద్రలోకి జారుకుంటే చాలు.. అదును కోసం చూస్తున్న దొంగలకు పండగే. -
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
[ 27-07-2024]
మహేశ్వరంలోని ఓ హోటల్లో చోరీ చేసేందుకు వచ్చిన ఓ దొంగ.. పోలీసులకు కనీసం ఒక్క క్లూ కూడా దొరక్కుండా.. ఎంతో జాగ్రత్తగా పథకం వేశాడు. -
పనులు కదలాలి.. ప్రగతి పరుగిడాలి
[ 27-07-2024]
ఎనిమిదేళ్ల కిందట రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రాంటుగా హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ)కు అందిన మొత్తం కేవలం రూ.250 కోట్లు. అప్పటి నుంచి బల్దియాకు ఒక్కపైసా కూడా గ్రాంటుగా నిధులందలేదు. -
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
[ 27-07-2024]
రాజీవ్ రహదారిపై అతివేగంగా కారు నడిపి బస్సును ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి చెందారు. -
ఆ భూముల జాడ.. దేవుడికే తెలియాలి
[ 27-07-2024]
రాజధాని పరిధిలో 9వేల ఎకరాలకుపైనే దేవాదాయశాఖ భూములున్నాయి. నిత్యం ధూప, దీప నైవేద్యాల కోసం గతంలో అనేక మంది భూవిరాళాలు ఇచ్చారు. -
పాలక మండలి సభ్యుల సంబరాలు
[ 27-07-2024]
నగరం అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరు శాఖలకు కలిపి పద్దులో రూ.10వేల కోట్లను కేటాయించడంపై కాంగ్రెస్కు చెందిన జీహెచ్ఎంసీ పాలకమండలి సభ్యులు శుక్రవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు. -
మా ఇష్టం.. మేమిట్లే జేస్తం
[ 27-07-2024]
రాజధాని నగరంలో బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు వేగంగా పెరుగుతుండడంతో వాటికి అవసరమైన ఇటుకల తయారీ కోసం కొందరు నీళ్లు సమృద్ధిగా ఉన్న జంటజలాశయాల పరివాహక ప్రాంతాన్ని ఎంచుకున్నారు. -
కుటుంబాలను కూల్చేస్తున్న రీల్స్
[ 27-07-2024]
రీల్స్ మోజులో పడి తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగిల్చినవారు కొందరైతే.. కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకున్నవారు మరికొందరు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
యువతలో పెరుగుతున్న హృద్రోగ ముప్పు
[ 27-07-2024]
యువతలో గుండె సమస్యలు పెరుగుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. -
విద్యుత్తు అధికారుల్లో సూర్యాఘర్ జోష్
[ 27-07-2024]
సౌర విద్యుత్తును 300 యూనిట్ల వరకూ పొందే ‘పీఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’ పథకంలో ఎక్కువ మందిని చేర్పించే విద్యుత్తు అధికారులకు కేంద్రం ప్రోత్సహకాలు ప్రకటించింది. -
మాజీ రాష్ట్రపతి సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం సందర్శన
[ 27-07-2024]
శంషాబాద్ మండలం శ్రీరామనగరంలో వెలిసిన సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శుక్రవారం సందర్శించారు. -
దేశభక్తి చాటిన కార్గిల్ విజయోత్సవ ర్యాలీ
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధ విజయోత్సవానికి పాతికేళ్ల సందర్భంగా శుక్రవారం నారాయణగూడలోని రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి(అర్బీవీఆర్ఆర్) మహిళా కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్-2, తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ స్వచ్ఛంద సంస్థల సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ పలు ప్రాంతాల్లో కొనసాగింది. -
కోట్పల్లి కల్పవల్లి
[ 27-07-2024]
జిల్లాలో అతిపెద్దదైన కోట్పల్లి ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. బడ్జెట్లో రూ.8 కోట్లు కేటాయించింది. -
అరణ్యం కబ్జా పర్వం.. కొనసాగుతున్న వివాదం!
[ 27-07-2024]
రెండు దశాబ్దాలుగా జిల్లాకు చెందిన అటవీ భూములను ఆక్రమించుకుని కర్ణాటక వాసులు సాగు చేస్తూ పంటలు పండిస్తున్నారు. -
బాధిత అంధ బాలికను, కుటుంబాన్ని ఆదుకోవాలి
[ 27-07-2024]
మలక్పేట ప్రభుత్వ అంధ బాలికల వసతి గృహం వద్ద శుక్రవారం ఆందోళనలు కొనసాగాయి. -
రాష్ట్రపతి నిలయాల్లో సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం
[ 27-07-2024]
ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతిగా రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం, సిమ్లా, దిల్లీలోని రాష్ట్రపతి భవనాల సందర్శనకు సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు రాష్ట్రపతి నిలయం అధికారులు తెలిపారు. -
శిల్పారామం పేరు, లోగో వాడొద్దు
[ 27-07-2024]
అనుమతి లేకుండా శిల్పారామం పేరు, లోగోను ఇతరులు ఉపయోగించరాదని శిల్పారామం ప్రత్యేకాధికారి జి.కిషన్రావు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. -
ఆలయాల్లో కానుకలు చోరీ!
[ 27-07-2024]
దేవాలయాలు లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న టి.నరేందర్(27)ను శుక్రవారం అరెస్ట్ చేసినట్టు ఫలక్నుమా ఏసీపీ ఎన్.ఎల్.నారాయణరాజు తెలిపారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..