ఘాటుగా చెప్తేనే వింటారా?
ఫార్మా, బల్క్డ్రగ్ పరిశ్రమల నుంచి వెలువడే ఘాటు వాసనలను నియంత్రించడానికి వీవోసీ వోలటైల్ (ఆర్గానిక్ కాంపౌండ్స్) మీటర్లు బిగించాలని పీసీబీ ఆదేశిస్తున్నా.. కొందరు పరిశ్రమల నిర్వాహకులు పట్టించుకోవడం లేదు.
పరిశ్రమల్లో వాసనల నియంత్రణకు చర్యలేవీ?
ఈనాడు, హైదరాబాద్
ఫార్మా, బల్క్డ్రగ్ పరిశ్రమల నుంచి వెలువడే ఘాటు వాసనలను నియంత్రించడానికి వీవోసీ వోలటైల్ (ఆర్గానిక్ కాంపౌండ్స్) మీటర్లు బిగించాలని పీసీబీ ఆదేశిస్తున్నా.. కొందరు పరిశ్రమల నిర్వాహకులు పట్టించుకోవడం లేదు. కార్మికులు తిరిగే ప్రాంతాలు, నివాస స్థలాలకు సమీపంలో ఉన్న పరిశ్రమల్లో వీటిని బిగించి ఉద్గారాలను తగ్గించాలని పీసీబీ సూచిస్తోంది. వీవోసీ హ్యాండ్ మెషీన్లు, ఆన్లైన్ మీటర్లు బిగించి పీసీబీ సర్వర్కు అనుసంధానించాలని చెబుతున్నా.. ఖర్చుతో పాటు నిఘా ఉంటుందని కొందరు వెనకడుగు వేస్తున్నారు. దీంతో ఆయా పరిశ్రమలపై పీసీబీకి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. పరిశ్రమల నిర్లక్ష్యంతో వాయునాణ్యతను ప్రభావితం చేసే బెంజీన్, ఇథిలీన్ గ్లైకాల్, ఫార్మాల్డిహైడ్, మిథైలీన్ క్లోరైడ్, టెట్రాక్లోరో ఇథైలీన్, టోలున్, జీలిన్ వంటి అస్థిర కర్బన సమ్మేళనాలు గాలిలో కలిసి వాయునాణ్యతపై ప్రభావం పడుతోంది.
కొన్నింటిపై చర్యలు.. మరికొన్నింటికి సూచనలు
అనుమతులు లేకుండా బల్క్ డ్రగ్ ఉత్పత్తులు తయారు చేయడం, నిబంధనలకు విరుద్ధంగా రెండు కేఎల్ సామర్థ్యంతో రియాక్టర్ల ఏర్పాటు, సింగిల్ స్టేజ్ స్క్రబ్బర్ల వినియోగంతో కాలుష్య ఉద్గారాలు పెరగడంతో మేడ్చల్కు చెందిన కొఠారు ల్యాబరేటరీస్పై పీసీబీ చర్యలు తీసుకుంది. మూసివేతకు ఆదేశాలిచ్చింది. ఆ సంస్థ కొన్ని నెలలకే నిబంధనల ప్రకారం పీసీబీ సూచించిన మేరకు స్క్రబ్బర్లు, బాయిలర్లు ఏర్పాటు చేయడంతో తిరిగి ఆ పరిశ్రమ తెరిచేందుకు ఆమోదం తెలిపింది. జీడిమెట్లలోని లక్సాయ్ లైఫ్ సైన్సెస్కు పీసీబీ పలు మార్గదర్శకాలు జారీచేసింది. బహిరంగ ప్రదేశాల్లో ఉద్గారాలు వదులుతున్నట్టు ఫిర్యాదులు రావడంతో అధికారుల బృందం తనిఖీలు నిర్వహించి వీవోసీ మానిటరింగ్ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. కాలుష్య ఉద్గారాలను తగ్గించేలా స్క్రబ్బర్కి హెచ్టీడీఎస్ ఎఫ్లూయెంట్ స్టోరేజ్ ట్యాంకులకు అనుసంధానించాలని సూచించింది. వీవోసీ మానిటరింగ్ వ్యవస్థ, వెంట్ కండెన్సర్ల వినియోగంతో ఉద్గారాలు నియంత్రించాలని సూచించింది. మల్లాపూర్కు చెందిన మురళి కెమికల్స్, శోధన ల్యాబరేటరీస్కు ఉద్గారాల నియంత్రణకు పలు మార్గదర్శకాలు జారీ చేసింది.
ఖర్చుతో పాటు నిఘా ఉంటుందనే..
నగరంలో 1500కు పైగా రెడ్ కేటగిరీ పరిశ్రమలు ఉన్నాయి. ఇక్కడి వాతావరణంలో వాయునాణ్యత, గాలిలో కలిసే అస్థిర కర్బన సమ్మేళనాల స్థాయులను తెలుసుకునేలా ఆన్లైన్ మానిటరింగ్ వ్యవస్థను పీసీబీ సర్వర్కు అనుసంధానించాలన్న నిబంధనలు ఉన్నాయి. కాలుష్యం పెరిగినప్పుడల్లా అప్రమత్తం చేయడంతో పాటు ఎందుకు పెరుగుతుందో వివరాలు సమర్పించాలని పీసీబీ సదరు నిర్వాహకులకు నోటీసులు పంపుతుంది. వివరణ ఇచ్చిన తర్వాత అదే పరిస్థితి ఉంటే టాస్క్ఫోర్స్ బృందాన్ని పంపి లోపాలు ఎక్కడున్నాయో గుర్తించి మార్గదర్శకాలు జారీ చేస్తుంది. ఆన్లైన్ మెషీన్లకు ఎక్కువ మొత్తంలో ఖర్చవుతుండటం, పైగా పీసీబీ నిఘా ఉంటుందని నిర్వాహకులు వీటిని వినియోగించడం లేదు. దీంతో ఘాటు వాసనలతో ఉక్కిరిబిక్కిరవుతున్న స్థానికులు పీసీబీకి వరుసగా ఫిర్యాదులు చేస్తున్నారు. ఆయా పరిశ్రమల సమీపంలో టాస్క్ఫోర్స్ బృందం తనిఖీ చేసినప్పుడల్లా 5 పీపీఎం కంటే ఎక్కువగానే సూచిక చూపుతుండటం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మ్యాన్హోల్ నుంచి వంటనూనెల వ్యర్థాలు
[ 27-07-2024]
ఆర్టీసీ క్రాస్రోడ్డు పరిధిలోని ప్రధాన రహదారిపై ఓ డ్రైనేజీ మ్యాన్హోల్ నుంచి శుక్రవారం ఉదయం వంటనూనెల వ్యర్థాలు పొంగిపొర్లాయి. -
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
[ 27-07-2024]
రైల్లో దూర ప్రయాణం.. రాత్రిళ్లు చల్లగాలి.. కబుర్లు చెప్పుకుంటూ నిద్రలోకి జారుకుంటే చాలు.. అదును కోసం చూస్తున్న దొంగలకు పండగే. -
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
[ 27-07-2024]
మహేశ్వరంలోని ఓ హోటల్లో చోరీ చేసేందుకు వచ్చిన ఓ దొంగ.. పోలీసులకు కనీసం ఒక్క క్లూ కూడా దొరక్కుండా.. ఎంతో జాగ్రత్తగా పథకం వేశాడు. -
పనులు కదలాలి.. ప్రగతి పరుగిడాలి
[ 27-07-2024]
ఎనిమిదేళ్ల కిందట రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రాంటుగా హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ)కు అందిన మొత్తం కేవలం రూ.250 కోట్లు. అప్పటి నుంచి బల్దియాకు ఒక్కపైసా కూడా గ్రాంటుగా నిధులందలేదు. -
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
[ 27-07-2024]
రాజీవ్ రహదారిపై అతివేగంగా కారు నడిపి బస్సును ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి చెందారు. -
ఆ భూముల జాడ.. దేవుడికే తెలియాలి
[ 27-07-2024]
రాజధాని పరిధిలో 9వేల ఎకరాలకుపైనే దేవాదాయశాఖ భూములున్నాయి. నిత్యం ధూప, దీప నైవేద్యాల కోసం గతంలో అనేక మంది భూవిరాళాలు ఇచ్చారు. -
పాలక మండలి సభ్యుల సంబరాలు
[ 27-07-2024]
నగరం అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరు శాఖలకు కలిపి పద్దులో రూ.10వేల కోట్లను కేటాయించడంపై కాంగ్రెస్కు చెందిన జీహెచ్ఎంసీ పాలకమండలి సభ్యులు శుక్రవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు. -
మా ఇష్టం.. మేమిట్లే జేస్తం
[ 27-07-2024]
రాజధాని నగరంలో బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు వేగంగా పెరుగుతుండడంతో వాటికి అవసరమైన ఇటుకల తయారీ కోసం కొందరు నీళ్లు సమృద్ధిగా ఉన్న జంటజలాశయాల పరివాహక ప్రాంతాన్ని ఎంచుకున్నారు. -
కుటుంబాలను కూల్చేస్తున్న రీల్స్
[ 27-07-2024]
రీల్స్ మోజులో పడి తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగిల్చినవారు కొందరైతే.. కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకున్నవారు మరికొందరు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
యువతలో పెరుగుతున్న హృద్రోగ ముప్పు
[ 27-07-2024]
యువతలో గుండె సమస్యలు పెరుగుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. -
విద్యుత్తు అధికారుల్లో సూర్యాఘర్ జోష్
[ 27-07-2024]
సౌర విద్యుత్తును 300 యూనిట్ల వరకూ పొందే ‘పీఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’ పథకంలో ఎక్కువ మందిని చేర్పించే విద్యుత్తు అధికారులకు కేంద్రం ప్రోత్సహకాలు ప్రకటించింది. -
మాజీ రాష్ట్రపతి సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం సందర్శన
[ 27-07-2024]
శంషాబాద్ మండలం శ్రీరామనగరంలో వెలిసిన సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శుక్రవారం సందర్శించారు. -
దేశభక్తి చాటిన కార్గిల్ విజయోత్సవ ర్యాలీ
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధ విజయోత్సవానికి పాతికేళ్ల సందర్భంగా శుక్రవారం నారాయణగూడలోని రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి(అర్బీవీఆర్ఆర్) మహిళా కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్-2, తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ స్వచ్ఛంద సంస్థల సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ పలు ప్రాంతాల్లో కొనసాగింది. -
కోట్పల్లి కల్పవల్లి
[ 27-07-2024]
జిల్లాలో అతిపెద్దదైన కోట్పల్లి ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. బడ్జెట్లో రూ.8 కోట్లు కేటాయించింది. -
అరణ్యం కబ్జా పర్వం.. కొనసాగుతున్న వివాదం!
[ 27-07-2024]
రెండు దశాబ్దాలుగా జిల్లాకు చెందిన అటవీ భూములను ఆక్రమించుకుని కర్ణాటక వాసులు సాగు చేస్తూ పంటలు పండిస్తున్నారు. -
బాధిత అంధ బాలికను, కుటుంబాన్ని ఆదుకోవాలి
[ 27-07-2024]
మలక్పేట ప్రభుత్వ అంధ బాలికల వసతి గృహం వద్ద శుక్రవారం ఆందోళనలు కొనసాగాయి. -
రాష్ట్రపతి నిలయాల్లో సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం
[ 27-07-2024]
ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతిగా రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం, సిమ్లా, దిల్లీలోని రాష్ట్రపతి భవనాల సందర్శనకు సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు రాష్ట్రపతి నిలయం అధికారులు తెలిపారు. -
శిల్పారామం పేరు, లోగో వాడొద్దు
[ 27-07-2024]
అనుమతి లేకుండా శిల్పారామం పేరు, లోగోను ఇతరులు ఉపయోగించరాదని శిల్పారామం ప్రత్యేకాధికారి జి.కిషన్రావు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. -
ఆలయాల్లో కానుకలు చోరీ!
[ 27-07-2024]
దేవాలయాలు లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న టి.నరేందర్(27)ను శుక్రవారం అరెస్ట్ చేసినట్టు ఫలక్నుమా ఏసీపీ ఎన్.ఎల్.నారాయణరాజు తెలిపారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం