పంపిణీ తక్కువ.. డిమాండ్ ఎక్కువ
వేసవి తుది దశకు వస్తున్నందున వానా కాలం (ఖరీఫ్) పనులకు రైతులు శ్రీకారం చుట్టారు. యాసంగిలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు సాగు ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నారు.
జిల్లాలో పచ్చిరొట్ట విత్తనాల కొరత
సాగులో జనుము
న్యూస్టుడే, పరిగి, వికారాబాద్, మున్సిపాలిటీ: వేసవి తుది దశకు వస్తున్నందున వానా కాలం (ఖరీఫ్) పనులకు రైతులు శ్రీకారం చుట్టారు. యాసంగిలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు సాగు ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నారు. నిస్సారంగా మారిన భూములను సారవంతం చేసేందుకు వారం రోజులుగా సేంద్రియ, కోళ్ల ఎరువుతో పాటు ఒండ్రుమట్టిని పొలాలకు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ సైతం రైతులకు వెన్నుదన్నుగా నిలవాలని యత్నిస్తోంది. ఇందులో భాగంగా పచ్చిరొట్ట విత్తనాలను 50 శాతం రాయితీపై సరఫరా చేసి నాణ్యమైన ఉత్పత్తులతో పాటు అధిక దిగుబడులను అందించాలని శాస్త్రవేత్తలతో సూచనలు, సలహాలను అందిస్తోంది. కానీ డిమాండ్ తగినట్లుగా సరఫరా చేయకపోవడంతో విత్తనాల కోసం అవస్థలు పడుతున్నారు.
రసాయనిక ఎరువులు వద్దని..
పరిగి, వికారాబాద్, తాండూరు, కొడంగల్ నియోజకవర్గాల పరిధిలో వివిధ రకాల పంటలు కలిపి ఆరు లక్షలకు పైగా సాగు కానున్నాయి. పచ్చిరొట్ట విత్తనాలు భూమికి బలం. ఒక డీఏపీ బస్తా రూ.1300 వరకు ఉండటంతో పెట్టుబడి వ్యయం పెరుగుతోంది. ఎకరాకు కనీసం రెండు బస్తాలు వినియోగిస్తున్నారు. అదే జీలుగ, జనుము అయితే అదనపు పోషకాలు అందిస్తాయి. ఈ విషయంలో క్రమేపి మార్పు రావడంతో విత్తనాలకు డిమాండ్ పెరిగింది. రసాయనిక ఎరువుల వినియోగంతో దిగుబడులు పడిపోవడంతో పాటు వాతావరణ కాలుష్యం, పంట ఉత్పత్తులు విషతుల్యంగా మారుతున్నాయని గ్రహిస్తున్నారు. క్రమక్రమంగా పచ్చిరొట్ట విత్తనాలను చల్లుకుని నేల గుణగణాలను మెరుగు పరిచేందుకు ప్రయత్నిస్తున్నారు.
- వ్యవసాయశాఖ 750 క్వింటాళ్ల జీలుగ, 897 క్వింటాళ్ల జనుము సరఫరా చేస్తోంది. జీలుగ విత్తనాలు 1800 క్వింటాళ్లు, జనుము 3800 క్వింటాళ్లకు అధికారులు ఇండెంట్ పంపారు. మొదటి విడతలో వీటిని పంపిణీ చేయగా రోజుల వ్యవధిలోనే అమ్ముడు పోయాయి. రెండో దఫా సరఫరా జరగకపోవడంతో నిత్యం సమీప వ్యవసాయ కారాలయాలకు వచ్చి వెళ్తున్నారు.
- గతేడాది 4వేల క్వింటాళ్లకు పైగా డిమాండ్ ఉంటే రెండు రకాల విత్తనాలు కలిపి కేవలం 2300 క్వింటాళ్ల విత్తనాలే సరఫరా అయ్యాయి. పెరిగిన వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని కనీసం ఈసారైనా డిమాండ్కు సరిపడా సరఫరా చేయాలని జిల్లా రైతులు కోరుతున్నారు.
రైతులకు అందుబాటులో ఉంచుతాం
గోపాల్, జిల్లా వ్యవసాయాధికారి
విత్తనాలకు ఒక్కసారిగా పెరిగిన డిమాండ్తో త్వరగా అయిపోయాయి. మళ్లీ తెప్పించి రైతులకు అందుబాటులో ఉంచుతాం. విచ్చలవిడిగా వాడుతున్న రసాయనిక ఎరువులతో సేంద్రియ కర్బన పదార్థం భూమిలో తగ్గి రైతులకు మేలు చేసే సూక్ష్మక్రిములు లక్షల్లో చనిపోతున్నాయి. ఈ ప్రభావం దిగుబడులపై స్పష్టంగా పడుతోంది. పచ్చిరొట్ట పట్ల రైతులకు అవగాహన కల్పిస్తూ సాగును పెంచుతాం. భూసారం పెంచేందుకు జిల్లాకు తగినన్ని జీలుగ, జనుము విత్తనాలు పంపిణీ చేస్తున్నాం. అన్నదాతల్లో వస్తున్న మార్పు ఆహ్వానించదగ్గ పరిణామం. రైతులందరూ ఇదే విధానాన్ని పాటించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మ్యాన్హోల్ నుంచి వంటనూనెల వ్యర్థాలు
[ 27-07-2024]
ఆర్టీసీ క్రాస్రోడ్డు పరిధిలోని ప్రధాన రహదారిపై ఓ డ్రైనేజీ మ్యాన్హోల్ నుంచి శుక్రవారం ఉదయం వంటనూనెల వ్యర్థాలు పొంగిపొర్లాయి. -
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
[ 27-07-2024]
రైల్లో దూర ప్రయాణం.. రాత్రిళ్లు చల్లగాలి.. కబుర్లు చెప్పుకుంటూ నిద్రలోకి జారుకుంటే చాలు.. అదును కోసం చూస్తున్న దొంగలకు పండగే. -
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
[ 27-07-2024]
మహేశ్వరంలోని ఓ హోటల్లో చోరీ చేసేందుకు వచ్చిన ఓ దొంగ.. పోలీసులకు కనీసం ఒక్క క్లూ కూడా దొరక్కుండా.. ఎంతో జాగ్రత్తగా పథకం వేశాడు. -
పనులు కదలాలి.. ప్రగతి పరుగిడాలి
[ 27-07-2024]
ఎనిమిదేళ్ల కిందట రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రాంటుగా హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ)కు అందిన మొత్తం కేవలం రూ.250 కోట్లు. అప్పటి నుంచి బల్దియాకు ఒక్కపైసా కూడా గ్రాంటుగా నిధులందలేదు. -
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
[ 27-07-2024]
రాజీవ్ రహదారిపై అతివేగంగా కారు నడిపి బస్సును ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి చెందారు. -
ఆ భూముల జాడ.. దేవుడికే తెలియాలి
[ 27-07-2024]
రాజధాని పరిధిలో 9వేల ఎకరాలకుపైనే దేవాదాయశాఖ భూములున్నాయి. నిత్యం ధూప, దీప నైవేద్యాల కోసం గతంలో అనేక మంది భూవిరాళాలు ఇచ్చారు. -
పాలక మండలి సభ్యుల సంబరాలు
[ 27-07-2024]
నగరం అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరు శాఖలకు కలిపి పద్దులో రూ.10వేల కోట్లను కేటాయించడంపై కాంగ్రెస్కు చెందిన జీహెచ్ఎంసీ పాలకమండలి సభ్యులు శుక్రవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు. -
మా ఇష్టం.. మేమిట్లే జేస్తం
[ 27-07-2024]
రాజధాని నగరంలో బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు వేగంగా పెరుగుతుండడంతో వాటికి అవసరమైన ఇటుకల తయారీ కోసం కొందరు నీళ్లు సమృద్ధిగా ఉన్న జంటజలాశయాల పరివాహక ప్రాంతాన్ని ఎంచుకున్నారు. -
కుటుంబాలను కూల్చేస్తున్న రీల్స్
[ 27-07-2024]
రీల్స్ మోజులో పడి తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగిల్చినవారు కొందరైతే.. కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకున్నవారు మరికొందరు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
యువతలో పెరుగుతున్న హృద్రోగ ముప్పు
[ 27-07-2024]
యువతలో గుండె సమస్యలు పెరుగుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. -
విద్యుత్తు అధికారుల్లో సూర్యాఘర్ జోష్
[ 27-07-2024]
సౌర విద్యుత్తును 300 యూనిట్ల వరకూ పొందే ‘పీఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’ పథకంలో ఎక్కువ మందిని చేర్పించే విద్యుత్తు అధికారులకు కేంద్రం ప్రోత్సహకాలు ప్రకటించింది. -
మాజీ రాష్ట్రపతి సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం సందర్శన
[ 27-07-2024]
శంషాబాద్ మండలం శ్రీరామనగరంలో వెలిసిన సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శుక్రవారం సందర్శించారు. -
దేశభక్తి చాటిన కార్గిల్ విజయోత్సవ ర్యాలీ
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధ విజయోత్సవానికి పాతికేళ్ల సందర్భంగా శుక్రవారం నారాయణగూడలోని రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి(అర్బీవీఆర్ఆర్) మహిళా కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్-2, తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ స్వచ్ఛంద సంస్థల సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ పలు ప్రాంతాల్లో కొనసాగింది. -
కోట్పల్లి కల్పవల్లి
[ 27-07-2024]
జిల్లాలో అతిపెద్దదైన కోట్పల్లి ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. బడ్జెట్లో రూ.8 కోట్లు కేటాయించింది. -
అరణ్యం కబ్జా పర్వం.. కొనసాగుతున్న వివాదం!
[ 27-07-2024]
రెండు దశాబ్దాలుగా జిల్లాకు చెందిన అటవీ భూములను ఆక్రమించుకుని కర్ణాటక వాసులు సాగు చేస్తూ పంటలు పండిస్తున్నారు. -
బాధిత అంధ బాలికను, కుటుంబాన్ని ఆదుకోవాలి
[ 27-07-2024]
మలక్పేట ప్రభుత్వ అంధ బాలికల వసతి గృహం వద్ద శుక్రవారం ఆందోళనలు కొనసాగాయి. -
రాష్ట్రపతి నిలయాల్లో సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం
[ 27-07-2024]
ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతిగా రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం, సిమ్లా, దిల్లీలోని రాష్ట్రపతి భవనాల సందర్శనకు సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు రాష్ట్రపతి నిలయం అధికారులు తెలిపారు. -
శిల్పారామం పేరు, లోగో వాడొద్దు
[ 27-07-2024]
అనుమతి లేకుండా శిల్పారామం పేరు, లోగోను ఇతరులు ఉపయోగించరాదని శిల్పారామం ప్రత్యేకాధికారి జి.కిషన్రావు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. -
ఆలయాల్లో కానుకలు చోరీ!
[ 27-07-2024]
దేవాలయాలు లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న టి.నరేందర్(27)ను శుక్రవారం అరెస్ట్ చేసినట్టు ఫలక్నుమా ఏసీపీ ఎన్.ఎల్.నారాయణరాజు తెలిపారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి