బోసినవ్వుల బాల్యం.. అమ్మకానికి బేరం
తల్లి పొత్తిళ్లలో సేదతీరాల్సిన పసికందుల్ని వస్తువులా అమ్మకానికి పెడుతున్నారు. చైల్డ్లైన్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, పోలీసులు నిరంతరం తనిఖీలు, ప్రత్యేక కార్యక్రమాలతో అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నా..
పేద తల్లిదండ్రులే లక్ష్యంగా.. ఆసుపత్రి సిబ్బందే దళారులుగా..
ప్రభుత్వ శాఖలు నిఘా పెడుతున్నా.. ఆగని దందా
ఈనాడు- హైదరాబాద్: తల్లి పొత్తిళ్లలో సేదతీరాల్సిన పసికందుల్ని వస్తువులా అమ్మకానికి పెడుతున్నారు. చైల్డ్లైన్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, పోలీసులు నిరంతరం తనిఖీలు, ప్రత్యేక కార్యక్రమాలతో అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నా.. చిన్నారుల్ని దొడ్డిదారిలో విక్రయించే ముఠాలు యథేచ్ఛగా తమ పనిచేసుకుంటూ వెళ్తున్నాయి. ఆడపిల్ల పుట్టిందని, పిల్లలు అనారోగ్యంతో ఉన్నారని.. పోషణ భారం భరించలేమని భావించే తల్లిదండ్రులే లక్ష్యంగా కొన్ని ముఠాలు చెలరేగుతున్నాయి. ఆడపిల్లకు, అబ్బాయికి వేర్వేరు ధరలు నిర్ణయించి అమ్మేస్తున్నారు. తాజాగా మేడిపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో మూడు నెలల పసికందును విక్రయిస్తూ ముగ్గురు మధ్యవర్తులు పట్టుబడడం కలకలం రేపింది. ఇలా ఏటా వందలాది మంది చిన్నారుల్ని గుట్టుచప్పుడు కాకుండా బేరసారాలాడి అమ్మేస్తున్నట్లు అధికారులే అంగీకరిస్తున్నారు.
ఆసుపత్రుల దగ్గరే దందా..
ప్రధానంగా ఆసుపత్రులు, కొందరు దారి తప్పిన వైద్యులు కేంద్రంగా చిన్నారుల అమ్మకాలు జరుగుతున్నాయి. నగరంలోని పేట్లబుర్జు, నిలోఫర్ సహా కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల దగ్గర తిష్ఠ వేస్తున్న కొందరు కేటుగాళ్లు.. బేరసారాలకు తెరతీస్తున్నారు. ఏటా వేలాది మంది కాన్పులు, రోజుల వయసున్న చిన్నారులకు చికిత్స కోసం నగరంలోని ఆసుపత్రులకు వస్తుంటారు. వీరిలో కొందరు మూడు, నాలుగు కాన్పులైనా ఆడపిల్ల పుట్టిందని, ఒకేసారి ఇద్దరు ఆడపిల్లలు పుట్టారని, అనారోగ్యంతో ఉన్న చిన్నారి పోషణభారం భరించలేమంటూ అక్కడే తోటివారితో మనోగతాన్ని పంచుకుంటుంటారు. ఇలాంటి వారిని లక్ష్యంగా చేసుకునే కొందరు ఇతరులకు అమ్మేస్తామనో లేక దత్తత ఇప్పిస్తామనో నమ్మిస్తున్నారు. కొన్ని ఆసుపత్రుల్లో కొందరు ప్రసూతి సేవలందించే సిబ్బంది ఈ తరహా అక్రమాలకు పాల్పడుతున్నారు. తాజాగా మేడిపల్లిలో ఉదంతంలో ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ నిర్వహించే మహిళ దళారీ పాత్ర పోషించి చిన్నారిని అమ్మేందుకు ప్రయత్నించడం ఓ ఉదాహరణ.
దత్తతకు ఆలస్యం
పిల్లలున్న నిరుపేదలు పోషణభారం ఇతర సమస్యలతో విక్రయిస్తున్నారు. మరోవైపు సంతానలేమి సమస్య ఉన్న దంపతులు దత్తత పేరుతో చట్టవిరుద్ధంగా చిన్నారుల్ని కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటివి అడ్డుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ అడాప్షన్ రీసోర్స్ అథారిటీ (కారా) పేరుతో చర్యలు తీసుకుంటోంది. చిన్నారుల దత్తత కోసం దరఖాస్తు చేసినా ఏళ్ల తరబడి నిరీక్షించాల్సి రావడంతో అడ్డదారిలో కొనుగోలుకు ప్రయత్నిస్తున్నారు. నగరంలోని శిశు విహార్లోని చిన్నారుల దత్తత కోసం 2050 మంది దరఖాస్తు చేసుకోగా... అక్కడున్నది 186 మంది శిశువులు మాత్రమే. చిన్నారి దత్తత కోసం సగటున 3-4 ఏళ్ల సమయం పడుతోంది. భారీ పోటీ వల్ల ఎక్కువ మంది ఆసుపత్రులు, వివిధ ప్రాంతాల్లో దళారులను సంప్రదిస్తుంటారు. చైల్డ్లైన్, మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం(ఏహెచ్టీయూ) తరచూ ప్రత్యేక ఆపరేషన్లతో నిఘా పెడుతున్నా పరిమితంగా ఉంది.
గతేడాది ఆపరేషన్ ముస్కాన్ గణాంకాలు
కాపాడిన చిన్నారులు 2617
ఇందులో బాల కార్మికులు 1531
యాచకులుగా మారిన వారు 109
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మ్యాన్హోల్ నుంచి వంటనూనెల వ్యర్థాలు
[ 27-07-2024]
ఆర్టీసీ క్రాస్రోడ్డు పరిధిలోని ప్రధాన రహదారిపై ఓ డ్రైనేజీ మ్యాన్హోల్ నుంచి శుక్రవారం ఉదయం వంటనూనెల వ్యర్థాలు పొంగిపొర్లాయి. -
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
[ 27-07-2024]
రైల్లో దూర ప్రయాణం.. రాత్రిళ్లు చల్లగాలి.. కబుర్లు చెప్పుకుంటూ నిద్రలోకి జారుకుంటే చాలు.. అదును కోసం చూస్తున్న దొంగలకు పండగే. -
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
[ 27-07-2024]
మహేశ్వరంలోని ఓ హోటల్లో చోరీ చేసేందుకు వచ్చిన ఓ దొంగ.. పోలీసులకు కనీసం ఒక్క క్లూ కూడా దొరక్కుండా.. ఎంతో జాగ్రత్తగా పథకం వేశాడు. -
పనులు కదలాలి.. ప్రగతి పరుగిడాలి
[ 27-07-2024]
ఎనిమిదేళ్ల కిందట రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రాంటుగా హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ)కు అందిన మొత్తం కేవలం రూ.250 కోట్లు. అప్పటి నుంచి బల్దియాకు ఒక్కపైసా కూడా గ్రాంటుగా నిధులందలేదు. -
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
[ 27-07-2024]
రాజీవ్ రహదారిపై అతివేగంగా కారు నడిపి బస్సును ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి చెందారు. -
ఆ భూముల జాడ.. దేవుడికే తెలియాలి
[ 27-07-2024]
రాజధాని పరిధిలో 9వేల ఎకరాలకుపైనే దేవాదాయశాఖ భూములున్నాయి. నిత్యం ధూప, దీప నైవేద్యాల కోసం గతంలో అనేక మంది భూవిరాళాలు ఇచ్చారు. -
పాలక మండలి సభ్యుల సంబరాలు
[ 27-07-2024]
నగరం అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరు శాఖలకు కలిపి పద్దులో రూ.10వేల కోట్లను కేటాయించడంపై కాంగ్రెస్కు చెందిన జీహెచ్ఎంసీ పాలకమండలి సభ్యులు శుక్రవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు. -
మా ఇష్టం.. మేమిట్లే జేస్తం
[ 27-07-2024]
రాజధాని నగరంలో బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు వేగంగా పెరుగుతుండడంతో వాటికి అవసరమైన ఇటుకల తయారీ కోసం కొందరు నీళ్లు సమృద్ధిగా ఉన్న జంటజలాశయాల పరివాహక ప్రాంతాన్ని ఎంచుకున్నారు. -
కుటుంబాలను కూల్చేస్తున్న రీల్స్
[ 27-07-2024]
రీల్స్ మోజులో పడి తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగిల్చినవారు కొందరైతే.. కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకున్నవారు మరికొందరు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
యువతలో పెరుగుతున్న హృద్రోగ ముప్పు
[ 27-07-2024]
యువతలో గుండె సమస్యలు పెరుగుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. -
విద్యుత్తు అధికారుల్లో సూర్యాఘర్ జోష్
[ 27-07-2024]
సౌర విద్యుత్తును 300 యూనిట్ల వరకూ పొందే ‘పీఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’ పథకంలో ఎక్కువ మందిని చేర్పించే విద్యుత్తు అధికారులకు కేంద్రం ప్రోత్సహకాలు ప్రకటించింది. -
మాజీ రాష్ట్రపతి సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం సందర్శన
[ 27-07-2024]
శంషాబాద్ మండలం శ్రీరామనగరంలో వెలిసిన సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శుక్రవారం సందర్శించారు. -
దేశభక్తి చాటిన కార్గిల్ విజయోత్సవ ర్యాలీ
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధ విజయోత్సవానికి పాతికేళ్ల సందర్భంగా శుక్రవారం నారాయణగూడలోని రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి(అర్బీవీఆర్ఆర్) మహిళా కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్-2, తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ స్వచ్ఛంద సంస్థల సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ పలు ప్రాంతాల్లో కొనసాగింది. -
కోట్పల్లి కల్పవల్లి
[ 27-07-2024]
జిల్లాలో అతిపెద్దదైన కోట్పల్లి ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. బడ్జెట్లో రూ.8 కోట్లు కేటాయించింది. -
అరణ్యం కబ్జా పర్వం.. కొనసాగుతున్న వివాదం!
[ 27-07-2024]
రెండు దశాబ్దాలుగా జిల్లాకు చెందిన అటవీ భూములను ఆక్రమించుకుని కర్ణాటక వాసులు సాగు చేస్తూ పంటలు పండిస్తున్నారు. -
బాధిత అంధ బాలికను, కుటుంబాన్ని ఆదుకోవాలి
[ 27-07-2024]
మలక్పేట ప్రభుత్వ అంధ బాలికల వసతి గృహం వద్ద శుక్రవారం ఆందోళనలు కొనసాగాయి. -
రాష్ట్రపతి నిలయాల్లో సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం
[ 27-07-2024]
ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతిగా రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం, సిమ్లా, దిల్లీలోని రాష్ట్రపతి భవనాల సందర్శనకు సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు రాష్ట్రపతి నిలయం అధికారులు తెలిపారు. -
శిల్పారామం పేరు, లోగో వాడొద్దు
[ 27-07-2024]
అనుమతి లేకుండా శిల్పారామం పేరు, లోగోను ఇతరులు ఉపయోగించరాదని శిల్పారామం ప్రత్యేకాధికారి జి.కిషన్రావు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. -
ఆలయాల్లో కానుకలు చోరీ!
[ 27-07-2024]
దేవాలయాలు లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న టి.నరేందర్(27)ను శుక్రవారం అరెస్ట్ చేసినట్టు ఫలక్నుమా ఏసీపీ ఎన్.ఎల్.నారాయణరాజు తెలిపారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం