సెల్ఫోన్లు కొట్టేసి.. సూడాన్కు తరలించి
నగరంలో సెల్ఫోన్ల స్నాచింగ్లకు పాల్పడుతున్న ఘరానా ముఠా ఆటకట్టించారు టాస్క్ఫోర్స్ పోలీసులు. సూడాన్ దేశస్థుడితో సహా 31 మందిని అరెస్టు చేశారు.
పోలీసులు స్వాధీనం చేసుకున్న ఫోన్లు
ఈనాడు, హైదరాబాద్: నగరంలో సెల్ఫోన్ల స్నాచింగ్లకు పాల్పడుతున్న ఘరానా ముఠా ఆటకట్టించారు టాస్క్ఫోర్స్ పోలీసులు. సూడాన్ దేశస్థుడితో సహా 31 మందిని అరెస్టు చేశారు. రూ.2కోట్ల విలువైన 713 మొబైల్ఫోన్లు, ఆటో, 2 కంప్యూటర్లు, ల్యాప్ట్యాప్ స్వాధీనం చేసుకున్నట్టు టాస్క్ఫోర్స్ డీసీపీ సాధన రష్మి పెరుమాళ్ ఆదివారం మీడియాకు తెలిపారు. ఇటీవల సెల్ చోరీ కోసం గుడిమల్కాపూర్లో దొంగలు ఒక యువకుడిని హత్య చేశారు. దీన్ని సీరియస్గా తీసుకున్న నగర సీపీ శ్రీనివాసరెడ్డి మూలాలు చేధించమని టాస్క్ఫోర్స్ను ఆదేశించారు. దీంతో దర్యాప్తు చేపట్టారు. ఇక్కడి సెల్ఫోన్ స్నాచర్లకు సూడాన్ మాయగాళ్లతో ఉన్న లింకులను బట్టబయలు చేశారు. ఫోన్లను కొట్టేసి పకడ్బందీగా విదేశాలకు తరలించే కేటుగాళ్ల తీరు పోలీసులను ఆశ్చర్యానికి గురిచేసింది. హత్య కేసులో వెలుగుచూసిన కొత్త అంశాలిలా ఉన్నాయి.
మూడు అంచెల్లో లావాదేవీలు.. నగరానికి చెందిన మహ్మద్ అమ్జాద్(35), సయద్ ఘయాజ్ హష్మి(35), షేక్ అన్సర్(27), మహ్మద్ ముజఫర్(35), మహ్మద్ ఖాలెద్(25), మహ్మద్ దస్తగిరి(28), మహ్మద్ హమేద్(18) మహ్మద్ మహమూద్ అలీ(30), సోహెల్ ఖాన్(22), మహ్మద్ ఖాన్(24), షేక్ మున్వర్(22), సయ్యద్ సాజిద్(44) సయ్యద్ షరీఫ్(48), మహ్మద్ ముస్తాక్(42), సయ్యద్ సలాయుద్దీన్(36) వేర్వేరు వృత్తుల్లో ఉన్నారు. సెల్ఫోన్ స్నాచింగ్లను ప్రవృత్తిగా మలచుకున్నారు. రద్దీ ప్రాంతాల్లోఅదను చూసి సెల్ఫోన్లు లాక్కొని పారిపోతారు. బాధితులు ఫిర్యాదు చేసే లోగానే ఫోన్లను నగరంలో వేర్వేరు ప్రాంతాల్లో మొబైల్ఫోన్ దుకాణాలు నిర్వహిస్తున్న రిసీవర్లు షేక్ షాబాజ్ఖాన్(26), మహ్మద్ ఆసిఫ్ అహ్మద్(28), మహ్మద్ గౌస్(28), మహ్మద్ అర్ష మొహియుద్దీన్(45), మహ్మద్ నవీద్ ఉద్దీన్ సలీమ్(42), మహ్మద్ నజారుద్దీన్(50), మహవీర్జైన్(44), మహ్మద్ అబ్దుల్ సిరాజ్(36) మజీద్ఖాన్(30), అబ్దుల్ హజీమ్(34), షేక్ జావెద్ అలి(30)లకు అందజేస్తారు. మొబైల్ టెక్నీషియన్లు సయ్యద్ రహీమ్(28), మహ్మద్ అర్బాజ్ ఖాన్(25), నిజాముద్దీన్(29), ఖాన్ సాదిక్ అహ్మద్(33) ఈ ఫోన్లను అన్లాక్ చేయటం, ఐఎంఈఐ నంబర్లను ట్యాంపరింగ్ చేస్తారు. కొత్త వాటిగా తయారు చేసిన ఈ ఫోన్లను కంపెనీల ఆధారంగా వేరు చేస్తారు. ఒక్కో ఫోన్ రూ.10,000-15,000 వరకు సూడాన్కు చెందిన ఫోన్ యాక్సరీస్ వ్యాపారి మహ్మద్ మూసా హస్సన్ గమరలంబియా(26) కొనుగోలు చేసి దేశ సరిహద్దులు దాటిస్తున్నాడు. వీరిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించినప్పుడు ఈ లింకులు బయటపడ్డాయి. నిందితులను రిమాండ్కు తరలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పనులు కదలాలి.. ప్రగతి పరుగిడాలి
[ 27-07-2024]
ఎనిమిదేళ్ల కిందట రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రాంటుగా హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ)కు అందిన మొత్తం కేవలం రూ.250 కోట్లు. అప్పటి నుంచి బల్దియాకు ఒక్కపైసా కూడా గ్రాంటుగా నిధులందలేదు. -
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
[ 27-07-2024]
మహేశ్వరంలోని ఓ హోటల్లో చోరీ చేసేందుకు వచ్చిన ఓ దొంగ.. పోలీసులకు కనీసం ఒక్క క్లూ కూడా దొరక్కుండా.. ఎంతో జాగ్రత్తగా పథకం వేశాడు. -
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
[ 27-07-2024]
రాజీవ్ రహదారిపై అతివేగంగా కారు నడిపి బస్సును ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి చెందారు. -
ఆ భూముల జాడ.. దేవుడికే తెలియాలి
[ 27-07-2024]
రాజధాని పరిధిలో 9వేల ఎకరాలకుపైనే దేవాదాయశాఖ భూములున్నాయి. నిత్యం ధూప, దీప నైవేద్యాల కోసం గతంలో అనేక మంది భూవిరాళాలు ఇచ్చారు. -
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
[ 27-07-2024]
రైల్లో దూర ప్రయాణం.. రాత్రిళ్లు చల్లగాలి.. కబుర్లు చెప్పుకుంటూ నిద్రలోకి జారుకుంటే చాలు.. అదును కోసం చూస్తున్న దొంగలకు పండగే. -
పాలక మండలి సభ్యుల సంబరాలు
[ 27-07-2024]
నగరం అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరు శాఖలకు కలిపి పద్దులో రూ.10వేల కోట్లను కేటాయించడంపై కాంగ్రెస్కు చెందిన జీహెచ్ఎంసీ పాలకమండలి సభ్యులు శుక్రవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు. -
మా ఇష్టం.. మేమిట్లే జేస్తం
[ 27-07-2024]
రాజధాని నగరంలో బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు వేగంగా పెరుగుతుండడంతో వాటికి అవసరమైన ఇటుకల తయారీ కోసం కొందరు నీళ్లు సమృద్ధిగా ఉన్న జంటజలాశయాల పరివాహక ప్రాంతాన్ని ఎంచుకున్నారు. -
మ్యాన్హోల్ నుంచి వంటనూనెల వ్యర్థాలు
[ 27-07-2024]
ఆర్టీసీ క్రాస్రోడ్డు పరిధిలోని ప్రధాన రహదారిపై ఓ డ్రైనేజీ మ్యాన్హోల్ నుంచి శుక్రవారం ఉదయం వంటనూనెల వ్యర్థాలు పొంగిపొర్లాయి. -
కుటుంబాలను కూల్చేస్తున్న రీల్స్
[ 27-07-2024]
రీల్స్ మోజులో పడి తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగిల్చినవారు కొందరైతే.. కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకున్నవారు మరికొందరు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
యువతలో పెరుగుతున్న హృద్రోగ ముప్పు
[ 27-07-2024]
యువతలో గుండె సమస్యలు పెరుగుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. -
విద్యుత్తు అధికారుల్లో సూర్యాఘర్ జోష్
[ 27-07-2024]
సౌర విద్యుత్తును 300 యూనిట్ల వరకూ పొందే ‘పీఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’ పథకంలో ఎక్కువ మందిని చేర్పించే విద్యుత్తు అధికారులకు కేంద్రం ప్రోత్సహకాలు ప్రకటించింది. -
మాజీ రాష్ట్రపతి సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం సందర్శన
[ 27-07-2024]
శంషాబాద్ మండలం శ్రీరామనగరంలో వెలిసిన సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శుక్రవారం సందర్శించారు. -
దేశభక్తి చాటిన కార్గిల్ విజయోత్సవ ర్యాలీ
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధ విజయోత్సవానికి పాతికేళ్ల సందర్భంగా శుక్రవారం నారాయణగూడలోని రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి(అర్బీవీఆర్ఆర్) మహిళా కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్-2, తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ స్వచ్ఛంద సంస్థల సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ పలు ప్రాంతాల్లో కొనసాగింది. -
కోట్పల్లి కల్పవల్లి
[ 27-07-2024]
జిల్లాలో అతిపెద్దదైన కోట్పల్లి ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. బడ్జెట్లో రూ.8 కోట్లు కేటాయించింది. -
అరణ్యం కబ్జా పర్వం.. కొనసాగుతున్న వివాదం!
[ 27-07-2024]
రెండు దశాబ్దాలుగా జిల్లాకు చెందిన అటవీ భూములను ఆక్రమించుకుని కర్ణాటక వాసులు సాగు చేస్తూ పంటలు పండిస్తున్నారు. -
బాధిత అంధ బాలికను, కుటుంబాన్ని ఆదుకోవాలి
[ 27-07-2024]
మలక్పేట ప్రభుత్వ అంధ బాలికల వసతి గృహం వద్ద శుక్రవారం ఆందోళనలు కొనసాగాయి. -
రాష్ట్రపతి నిలయాల్లో సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం
[ 27-07-2024]
ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతిగా రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం, సిమ్లా, దిల్లీలోని రాష్ట్రపతి భవనాల సందర్శనకు సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు రాష్ట్రపతి నిలయం అధికారులు తెలిపారు. -
శిల్పారామం పేరు, లోగో వాడొద్దు
[ 27-07-2024]
అనుమతి లేకుండా శిల్పారామం పేరు, లోగోను ఇతరులు ఉపయోగించరాదని శిల్పారామం ప్రత్యేకాధికారి జి.కిషన్రావు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. -
ఆలయాల్లో కానుకలు చోరీ!
[ 27-07-2024]
దేవాలయాలు లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న టి.నరేందర్(27)ను శుక్రవారం అరెస్ట్ చేసినట్టు ఫలక్నుమా ఏసీపీ ఎన్.ఎల్.నారాయణరాజు తెలిపారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే