logo

బెట్టింగ్‌లకు బానిసై.. ఆత్మహత్య

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ గేమ్‌లకు బానిసైన యువకుడు అప్పులపాలై వాటిని తీర్చలేక ఆత్మహత్య చేసుకున్న ఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లా  కొత్తకుంటపల్లిలో ఆదివారం చోటు చేసుకుంది.

Published : 27 May 2024 09:07 IST

శశాంక్‌రెడ్డి

లింగాల, న్యూస్‌టుడే: ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ గేమ్‌లకు బానిసైన యువకుడు అప్పులపాలై వాటిని తీర్చలేక ఆత్మహత్య చేసుకున్న ఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లా  కొత్తకుంటపల్లిలో ఆదివారం చోటు చేసుకుంది. లింగాలకు చెందిన మల్లెపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి, వనజ దంపతుల ఏకైక కుమారుడు శశాంక్‌రెడ్డి(32)కి ఏడాది క్రితం నల్గొండ జిల్లా డిండి మండలానికి చెందిన యువతితో వివాహం జరిగింది. శశాంక్‌ హైదరాబాదులో చార్టర్డ్‌ అకౌంటెంట్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఆన్‌లైన్‌ బెట్టింగ్, ఇతర వ్యసనాలకు బానిసయ్యాడు.  అప్పులతో మానసిక వేదనకు గురయ్యారు. శనివారం రాత్రి భార్యకు చెప్పకుండా ఇంటి నుంచి స్కూటీపై ఒక్కడే కొత్తకుంటపల్లి వెళ్లారు. తండ్రికి ఫోన్‌ చేసి కొత్తకుంటపల్లిలోని మామాడి తోటలో చెట్టుకు ఉరేసుకొని కనిపించాడు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని