logo

బిర్యానీ కోసం వెళితే.. ప్రాణాలే పోయాయి

రాత్రి ఒంటిగంట సమయంలో బిర్యానీ కోసం బైకుపై ముగ్గురు బయలుదేరారు.. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా మరొకరు గాయాలతో బయటపడ్డారు.

Published : 28 May 2024 03:23 IST

బైక్‌ను ఢీకొట్టిన మినీబస్సు.. ఇద్దరి దుర్మరణం  

పద్మారావునగర్, న్యూస్‌టుడే: రాత్రి ఒంటిగంట సమయంలో బిర్యానీ కోసం బైకుపై ముగ్గురు బయలుదేరారు.. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా మరొకరు గాయాలతో బయటపడ్డారు. ఈ సంఘటన గాంధీనగర్‌ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ రాజు  వివరాల ప్రకారం..గుంటూరుకు చెందిన సూరగాని యజ్ఞనారాయణ(25), చీకటి సత్యనారాయణ(30) పద్మారావునగర్‌లో ఉంటూ ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నారు. గుంటూరుకు చెందిన కురేటి సాయిపవన్‌(32) ఈనెల 26న బావ యజ్ఞనారాయణ ఇంటికి వచ్చారు. బావమరిదికి బిర్యానీ తినిపించాలని రాత్రి ఒకటిన్నర సమయంలో సాయిపవన్‌తోపాటు మిత్రుడు సత్యనారాయణను కూడా తీసుకుని బైకుపై ముషీరాబాద్‌ వెళ్లారు. అక్కడి హోటల్‌లో బిర్యానీ అయిపోవడంతో లోయర్‌ ట్యాంక్‌బండ్‌ వద్ద దొరుకుతుందని అక్కడికి బయలుదేరారు. కవాడిగూడ క్రాస్‌రోడ్‌కు వెళ్లగానే ఎదురుగా ఓ మినీబస్సు రెడ్‌సిగ్నల్‌ దాటుకుని వేగంగా వచ్చి వీరి బైకును ఢీకొట్టింది. యజ్ఞనారాయణ, సాయిపవన్‌ బస్సు కిందపడి ప్రాణాలు కోల్పోగా, సత్యనారాయణకు స్వల్ప గాయాలయ్యాయి. బస్సు డ్రైవర్‌ పరారయ్యాడు. కేసు  దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు