దీపం వెలిగించే దిక్కేది?
రాజధానిలో వీధిలైట్లు వెలగట్లేదు. కాలనీల్లోనే కాదు.. ప్రధాన రహదారులపైనా ఇదే దుస్థితి. హైటెక్సిటీ, ఐటీ కారిడార్లోని ఇతర జనావాసాలనూ సమస్య వేధిస్తోంది. పాడైపోయిన లైట్లకు మరమ్మతు జరగట్లేదు.
పాతవి వెలగవు.. కొత్తవి బిగించరు
వీధిదీపాలపై రోజూ వెయ్యి ఫిర్యాదులు
నిధులు, నిర్వహణ సమస్యలతో జనాలకు అవస్థ
రాయదుర్గం- జూబ్లీహిల్స్ లింక్ రోడ్డులో వెలగని వీధిదీపాలు
ఈనాడు, హైదరాబాద్: రాజధానిలో వీధిలైట్లు వెలగట్లేదు. కాలనీల్లోనే కాదు.. ప్రధాన రహదారులపైనా ఇదే దుస్థితి. హైటెక్సిటీ, ఐటీ కారిడార్లోని ఇతర జనావాసాలనూ సమస్య వేధిస్తోంది. పాడైపోయిన లైట్లకు మరమ్మతు జరగట్లేదు. కొత్త ప్రాంతాల్లో, ప్రమాదాలు జరిగే చీకటి ప్రాంతాల్లో కొత్త వీధిలైట్ల ఏర్పాటు అందని ద్రాక్షగా మారింది. జీహెచ్ఎంసీతోపాటు, గ్రేటర్ పరిధిలో వీధి లైట్ల నిర్వహణ బాధ్యత చూస్తోన్న ఈఈఎస్ఎల్(ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్) కూడా నిధుల సమస్యలో కూరుకుపోవడం, నిర్వహణపై ఈఈఎస్ఎల్, బల్దియా ఇంజినీర్లు చేతులెత్తేయడంతో వీధులు చీకటిమయం అవుతువున్నాయి. దీనివల్ల బస్తీవాసులు నరకం చూస్తున్నారు. పాదచారులు రహదారులపై నడవలేకపోతున్నారు. ముందు నడుస్తూ వెళ్లే వారిని వాహనదారులు గమనించలేకపోతున్నారు. దుర్భర పరిస్థితులతో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందోననే ఆందోళన వ్యక్తమవుతోంది.
హెచ్చరించినా మారని తీరు..
జీహెచ్ఎంసీ పరిధిలోని వీధిలైట్ల నిర్వహణ ఈఈఎస్ఎల్ సంస్థ ఆరేళ్ల కిందట దక్కించుకుంది. ఆయా స్థానిక సంస్థలు, పంచాయతీల నుంచి సవ్యంగా బిల్లులు మంజూరవట్లేదంటూ.. రెండేళ్లుగా ఈఈఎస్ఎల్ జీహెచ్ఎంసీకి చెబుతోంది. నగరంలో వీధి లైట్ల నిర్వహణలోని లోపాలపై ప్రశ్నించినప్పుడల్లా.. ఆర్థిక పరిస్థితులు సరిగా లేవని వాపోతోంది. ‘‘ప్రతి నెలా జీహెచ్ఎంసీ తరఫున మేము బిల్లులను చెల్లిస్తున్నాం. ఎవరో నిధులు ఇవ్వట్లేదని హైదరాబాద్ను నిర్లక్ష్యం చేస్తే బిల్లులను ఆపేస్తాం.’’అని జీహెచ్ఎంసీ గతంలోనే హెచ్చరించింది.
బల్బుల కొరతతో..
నగరంలో దాదాపు 5.4 లక్షల వీధిలైట్లు ఉన్నాయి. వాటిలో 98శాతం లైట్లు రోజూ వెలగాలి. అప్పుడే ఆ నెల బిల్లును చెల్లిస్తామని జీహెచ్ఎంసీ ఒప్పందం చేసుకుంది. రెండేళ్లుగా.. ఆ ఒప్పందాన్ని ఈఈఎస్ఎల్ చేరుకోవట్లేదని ఇంజినీర్లు చెబుతున్నారు. దాంతో ఆరు నెలలుగా బిల్లులను ఆపేశామన్నారు. ఈ ఏడాది 10వేల కొత్త లైట్లను అందుబాటులో ఉంచాలని చెబితే.. ఇప్పటి వరకు ఒక్క లైటును కూడా ఇవ్వలేదని వాపోతున్నారు. 18, 30, 38 వాట్ల బల్పుల కొరత ఉందని చెబుతున్నారు.
ఇవిగో ఉదాహరణలు..
హైటెక్సిటీలోని మెటల్ చార్మినార్ నుంచి శిల్పారామం వరకు, నాసర్ బాలుర పాఠశాల నుంచి శిల్పాలేఅవుట్వరకు, జూబ్లిహిల్స్ రోడ్డు నెం.45 పైవంతెనపై, మాదాపూర్లోని టెలికాంనగర్, అంజయ్యనగర్, బోరబండ ఫేజ్-3, కేపీహెచ్బీ కాలనీ రోడ్లలో చీకట్లు అలముకున్నాయి.
నగరంలోని పలు ప్రధాన ఆస్పత్రుల వద్ద కూడా వీధిలైట్లు పనిచేయట్లేదు. గాంధీ ఆస్పత్రి వద్ద సెల్ఫోన్ ఫ్లాష్ లైట్లను ఉపయోగించి రోగులు, రోగి బంధువులు రోడ్డు దాటుతున్నారు. అక్కడ తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సికింద్రాబాద్లోని పద్మారావునగర్ వాకర్టౌన్ కాలనీలోని వీధిలైట్లన్నీ చెట్ల కొమ్మల్లో చిక్కుకున్నాయి. వారాసిగూడ జాన్సన్ గ్రామర్ స్కూల్ వీధిలో చీకట్లు కమ్ముకున్నాయి. సికింద్రాబాద్ పరేడ్గ్రౌండ్ రోడ్డు, మారేడుపల్లి జడ్జీల క్వార్టర్స్లోనూ అదే పరిస్థితి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మ్యాన్హోల్ నుంచి వంటనూనెల వ్యర్థాలు
[ 27-07-2024]
ఆర్టీసీ క్రాస్రోడ్డు పరిధిలోని ప్రధాన రహదారిపై ఓ డ్రైనేజీ మ్యాన్హోల్ నుంచి శుక్రవారం ఉదయం వంటనూనెల వ్యర్థాలు పొంగిపొర్లాయి. -
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
[ 27-07-2024]
రైల్లో దూర ప్రయాణం.. రాత్రిళ్లు చల్లగాలి.. కబుర్లు చెప్పుకుంటూ నిద్రలోకి జారుకుంటే చాలు.. అదును కోసం చూస్తున్న దొంగలకు పండగే. -
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
[ 27-07-2024]
మహేశ్వరంలోని ఓ హోటల్లో చోరీ చేసేందుకు వచ్చిన ఓ దొంగ.. పోలీసులకు కనీసం ఒక్క క్లూ కూడా దొరక్కుండా.. ఎంతో జాగ్రత్తగా పథకం వేశాడు. -
పనులు కదలాలి.. ప్రగతి పరుగిడాలి
[ 27-07-2024]
ఎనిమిదేళ్ల కిందట రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రాంటుగా హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ)కు అందిన మొత్తం కేవలం రూ.250 కోట్లు. అప్పటి నుంచి బల్దియాకు ఒక్కపైసా కూడా గ్రాంటుగా నిధులందలేదు. -
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
[ 27-07-2024]
రాజీవ్ రహదారిపై అతివేగంగా కారు నడిపి బస్సును ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి చెందారు. -
ఆ భూముల జాడ.. దేవుడికే తెలియాలి
[ 27-07-2024]
రాజధాని పరిధిలో 9వేల ఎకరాలకుపైనే దేవాదాయశాఖ భూములున్నాయి. నిత్యం ధూప, దీప నైవేద్యాల కోసం గతంలో అనేక మంది భూవిరాళాలు ఇచ్చారు. -
పాలక మండలి సభ్యుల సంబరాలు
[ 27-07-2024]
నగరం అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరు శాఖలకు కలిపి పద్దులో రూ.10వేల కోట్లను కేటాయించడంపై కాంగ్రెస్కు చెందిన జీహెచ్ఎంసీ పాలకమండలి సభ్యులు శుక్రవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు. -
మా ఇష్టం.. మేమిట్లే జేస్తం
[ 27-07-2024]
రాజధాని నగరంలో బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు వేగంగా పెరుగుతుండడంతో వాటికి అవసరమైన ఇటుకల తయారీ కోసం కొందరు నీళ్లు సమృద్ధిగా ఉన్న జంటజలాశయాల పరివాహక ప్రాంతాన్ని ఎంచుకున్నారు. -
కుటుంబాలను కూల్చేస్తున్న రీల్స్
[ 27-07-2024]
రీల్స్ మోజులో పడి తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగిల్చినవారు కొందరైతే.. కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకున్నవారు మరికొందరు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
యువతలో పెరుగుతున్న హృద్రోగ ముప్పు
[ 27-07-2024]
యువతలో గుండె సమస్యలు పెరుగుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. -
విద్యుత్తు అధికారుల్లో సూర్యాఘర్ జోష్
[ 27-07-2024]
సౌర విద్యుత్తును 300 యూనిట్ల వరకూ పొందే ‘పీఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’ పథకంలో ఎక్కువ మందిని చేర్పించే విద్యుత్తు అధికారులకు కేంద్రం ప్రోత్సహకాలు ప్రకటించింది. -
మాజీ రాష్ట్రపతి సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం సందర్శన
[ 27-07-2024]
శంషాబాద్ మండలం శ్రీరామనగరంలో వెలిసిన సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శుక్రవారం సందర్శించారు. -
దేశభక్తి చాటిన కార్గిల్ విజయోత్సవ ర్యాలీ
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధ విజయోత్సవానికి పాతికేళ్ల సందర్భంగా శుక్రవారం నారాయణగూడలోని రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి(అర్బీవీఆర్ఆర్) మహిళా కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్-2, తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ స్వచ్ఛంద సంస్థల సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ పలు ప్రాంతాల్లో కొనసాగింది. -
కోట్పల్లి కల్పవల్లి
[ 27-07-2024]
జిల్లాలో అతిపెద్దదైన కోట్పల్లి ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. బడ్జెట్లో రూ.8 కోట్లు కేటాయించింది. -
అరణ్యం కబ్జా పర్వం.. కొనసాగుతున్న వివాదం!
[ 27-07-2024]
రెండు దశాబ్దాలుగా జిల్లాకు చెందిన అటవీ భూములను ఆక్రమించుకుని కర్ణాటక వాసులు సాగు చేస్తూ పంటలు పండిస్తున్నారు. -
బాధిత అంధ బాలికను, కుటుంబాన్ని ఆదుకోవాలి
[ 27-07-2024]
మలక్పేట ప్రభుత్వ అంధ బాలికల వసతి గృహం వద్ద శుక్రవారం ఆందోళనలు కొనసాగాయి. -
రాష్ట్రపతి నిలయాల్లో సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం
[ 27-07-2024]
ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతిగా రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం, సిమ్లా, దిల్లీలోని రాష్ట్రపతి భవనాల సందర్శనకు సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు రాష్ట్రపతి నిలయం అధికారులు తెలిపారు. -
శిల్పారామం పేరు, లోగో వాడొద్దు
[ 27-07-2024]
అనుమతి లేకుండా శిల్పారామం పేరు, లోగోను ఇతరులు ఉపయోగించరాదని శిల్పారామం ప్రత్యేకాధికారి జి.కిషన్రావు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. -
ఆలయాల్లో కానుకలు చోరీ!
[ 27-07-2024]
దేవాలయాలు లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న టి.నరేందర్(27)ను శుక్రవారం అరెస్ట్ చేసినట్టు ఫలక్నుమా ఏసీపీ ఎన్.ఎల్.నారాయణరాజు తెలిపారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం