logo

Hyderabad: రంగనాథస్వామి దేవస్థాన ప్రధాన అర్చకుడు హఠాన్మరణం

జియాగూడలోని ఫ్రఖ్యాత రంగనాథస్వామి దేవస్థానం ప్రధాన అర్చకుడు శృంగారం రాజగోపాలాచార్యులు (55) హఠాన్మరణం చెందారు.

Published : 24 Apr 2024 03:32 IST

రాజగోపాలాచార్యులు

జియాగూడ: జియాగూడలోని ఫ్రఖ్యాత రంగనాథస్వామి దేవస్థానం ప్రధాన అర్చకుడు శృంగారం రాజగోపాలాచార్యులు (55) హఠాన్మరణం చెందారు. సోమవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూసినట్లు ఆయన సోదరులు, ఆలయ నిర్వాహకులు ఎస్‌.టి.చారి, శేషాచార్యులు తెలిపారు. రాజగోపాలాచార్యులుకు భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. శతాధిక దేవాలయాల ప్రతిష్ఠాపక యజ్ఞాచార్యులుగా, దేవతామూర్తుల అలంకార భట్టర్‌గా, మన దేశంలోనే కాకుండా  విదేశాల్లోనూ హిందూ దేవాలయాల పురోభివృద్ధికి పాటుపడిన యజ్ఞాచార్యులుగా  ఖ్యాతిపొందారు. బుధవారం పురానాపూల్‌ దహనవాటికలో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నట్లు  సోదరులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు