logo

బంగారు పిల్లలం.. సరస్వతి సిరులం

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రమాదేవి పబ్లిక్‌ స్కూల్‌లో గురువారం పాఠశాల వైస్‌ ప్రిన్సిపల్‌ ఖమర్‌ సుల్తానా జాతీయ పతాకావిష్కరణ చేశారు.

Published : 27 Jan 2023 03:49 IST

దేశభక్తి గీతం ఆలపిస్తున్న రమాదేవి పబ్లిక్‌ స్కూల్‌ విద్యార్థులు

అబ్దుల్లాపూర్‌మెట్‌, న్యూస్‌టుడే: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రమాదేవి పబ్లిక్‌ స్కూల్‌లో గురువారం పాఠశాల వైస్‌ ప్రిన్సిపల్‌ ఖమర్‌ సుల్తానా జాతీయ పతాకావిష్కరణ చేశారు. ఎన్‌సీసీ క్యాడెట్లు గౌరవ వందనం సమర్పించారు. గణతంత్ర స్ఫూర్తిని కాపాడుకోవాలని వైస్‌ ప్రిన్సిపల్‌ పేర్కొన్నారు. విద్యార్థులు సైనికుల విశిష్టతను తెలిపే ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. దేశభక్తి గీతాలతో అలరించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు పాలుపంచుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని