కళ్లలోనూ క్యాన్సర్ ముప్పు!
రకరకాల క్యాన్సర్ల గురించి చాలామందికి అవగాహన ఉండటం సహజమే. అయితే కళ్లకు కూడా క్యాన్సర్ సోకుతుందనేది చాలా తక్కువ మందికే తెలుసు.
ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో 25 వేల కేసులు
నేడు ప్రపంచ క్యాన్సర్ అవగాహన దినం
ఈనాడు, హైదరాబాద్: రకరకాల క్యాన్సర్ల గురించి చాలామందికి అవగాహన ఉండటం సహజమే. అయితే కళ్లకు కూడా క్యాన్సర్ సోకుతుందనేది చాలా తక్కువ మందికే తెలుసు. ప్రభుత్వ కంటి ఆసుపత్రి అయిన సరోజనిదేవితో పాటు ఎల్వీప్రసాద్ నేత్ర వైద్యశాలకు తరచూ ఇలాంటి కేసులు వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఎల్వీ ప్రసాద్లో ఇప్పటివరకు 25 వేల కేసులకు చికిత్స అందించారు. శనివారం ప్రపంచ క్యాన్సర్ అవగాహన దినం సందర్భంగా ప్రత్యేక కథనం..
ఏ వయసు వారైనా.. కంటి క్యాన్సర్ నేత్రాల చుట్టూ ఉన్న కణజాలం, కనురెప్పలు, కళ్లను రక్షించే పల్చటి పొర (కంజంక్టివా)ల్లో వచ్చే అవకాశం ఉంది. అప్పుడే పుట్టిన నవజాత శిశువుల నుంచి పెద్ద వాళ్ల వరకు ముప్పు ఉంది. మొదటి దశలోనే గుర్తించి చికిత్స అందించకపోతే కంటి చూపే కాకుండా ప్రాణాల మీదకు వస్తుందని చెబుతున్నారు. కంటి చుట్టూ, లోపల కణుతులు ఉంటే.. నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. కంటి క్యాన్సర్కు సరైన కారణాలు లేనప్పటికీ.. ధూమపానం, వైరస్ ఇన్ఫెక్షన్లు, అల్ట్రా వయలెట్ కాంతికి ఎక్కువ సార్లు బహిర్గతం కావడం వల్ల సోకవచ్చంటున్నారు.
లక్షణాలు ఇవి.. క్యాన్సర్ ముప్పు ఉంటే కొన్ని సాధారణ లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఈ లక్షణాలు ఉన్నంత మాత్రాన క్యాన్సర్ అని భయపడాల్సిన అవసరం లేదు. లక్షణాలు కన్పిస్తే.. నిర్లక్ష్యం చేయకుండా నేత్ర వైద్యుడ్ని కలిసి పరీక్షలు చేయించుకోవాలి.
* కన్ను ఉబ్బడం * వాచిన కనురెప్పలు లేదా కనురెప్పల పరిమాణం పెరగడం * కళ్ల పరిమాణంలో వ్యత్యాసం * కంటిలో తెల్లని ప్రతిబింబం * కంటిలో పెరుగుతున్న నల్లని మచ్చలు * కళ్లు ఎర్రబడటంతో పాటు నొప్పి * అస్పష్టమైన చూపు లేదా పాక్షికంగా, పూర్తిగా చూపు కోల్పోవడం
తొలి దశలో గుర్తిస్తే మేలు
-డాక్టర్ స్వాతి కలికి, ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రి
ఏ క్యాన్సర్ అయినా తొలి దశలో గుర్తిస్తే చికిత్స ద్వారా చూపు పోకుండా చూడొచ్చు. ఇంట్లో ఎవరికైనా కంటి క్యాన్సర్ ఉంటే.. అంతా క్రమబద్ధంగా పరీక్షలు చేయించుకోవాలి. క్యాన్సర్ రోగి ఏ దశలో ఆసుపత్రికి వచ్చారనే దానిపై ఆధారపడి చికిత్స ఉంటుంది. చిన్న కణితులకు లేజర్తో చికిత్స అందిస్తారు. పెద్ద కణుతులకు శస్త్రచికిత్స అవసరం కావొచ్చు. ఇంకా ఎక్కువ ఉంటే కీమోథెరపీ, కొన్నిసార్లు రేడియో థెరపీతో తొలగించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వ్యభిచారం చేయడానికి వచ్చావా? పోలీసులకు పట్టిస్తాం
[ 10-05-2024]
డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన యువతిని కలిసిన వ్యక్తిని దుండగులు భయపెట్టి రూ.60వేలతో పరారైన ఘటన ఫిల్మ్నగర్ ఠాణా పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... -
మల్కాజిగిరి.. విలక్షణమే ప్రతిసారీ
[ 10-05-2024]
అతిపెద్ద లోక్సభ నియోజకవర్గమైన మల్కాజిగిరిలో ప్రజల తీర్పు ప్రతిసారీ విలక్షణంగానే ఉంటోంది. 2009లో ఏర్పాటైన ఈ లోక్సభ నియోజకవర్గం పరిధిలో 31,50,303 మంది ఓటర్లు ఉన్నారు. -
జనం పోటెత్తి.. జాతర హోరెత్తి
[ 10-05-2024]
కాంగ్రెస్ కార్యకర్తల కేరింతలు.. నాయకుల హర్షాతిరేకాల నడుమ సరూర్నగర్ స్టేడియంలో గురువారం రాత్రి ఆ పార్టీ నిర్వహించిన జన జాతర సభ విజయవంతమైంది. -
కమలానికి అండగా.. ప్రచారంలో భిన్నంగా
[ 10-05-2024]
రాజధాని పరిధిలో నాలుగు లోక్సభ స్థానాల్లో విజయమే లక్ష్యంగా భాజపా ప్రణాళికను అమలు చేస్తోంది. ముఖ్యంగా సంఘ్ పరివార్ ఇందులో కీలక భూమిక పోషిస్తోంది. ఈ పరివారంలోని సభ్యులు వినూత్న ప్రచారం చేస్తున్నారు. -
ఓటేద్దాం.. ఛాలెంజ్ చేద్దాం
[ 10-05-2024]
ఓటింగ్శాతం పెంచేందుకు కాలనీ సంక్షేమ సంఘాలు ఛాలెంజ్ విసురుతున్నాయి. ‘మీరు ఓటేయండి...మీకు తెలిసిన పది మందికి ఓటేయాలని ఛాలెంజ్ విసరండి’ అంటూ కొత్త నినాదాన్ని తెరపైకి తీసుకొస్తున్నాయి. -
లోక్సభ బరి.. 17 మంది మహిళల గురి
[ 10-05-2024]
లోక్సభ ఎన్నికల్లో నాలుగు నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల నుంచి ఇద్దరు మహిళలు మాత్రమే పోటీ చేస్తున్నారు. మిగిలిన వారు రాష్ట్రంలో పెద్దగా ఉనికి లేని పార్టీలు, స్వతంత్రులుగా బరిలో ఉన్నారు. -
మోదీ ఇచ్చిన హామీలేవీ అమలు కాలేదు: కేటీఆర్
[ 10-05-2024]
తెలంగాణ కోసం తెగించి కోట్లాడేది భారాసేనని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. గురువారం అల్వాల్లో ఏర్పాటు చేసిన యువ ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడారు. -
లబ్ధిదారులే గెలిపిస్తారు
[ 10-05-2024]
‘హైదరాబాద్ లోక్సభ స్థానంలో ఓటర్లు అభివృద్ధిని కాంక్షిస్తున్నారు. 40 ఏళ్లుగా ఇక్కడ గెలుస్తున్నామని చెప్పుకుంటున్న నేతలు మౌలిక సదుపాయాల కల్పనను విస్మరించారు. మతం పేరుతో రెచ్చగొట్టి ఓట్లు అడుగుతారే తప్ప.. -
కక్కుర్తి పడొద్దు.. భోజనాలు బాగుండాలి
[ 10-05-2024]
ఎన్నికల నిర్వహణలోని అధికారులు, సిబ్బందికి నాసిరకం భోజనం సరఫరా అవుతోంది. అన్నం, కూరలు సరిగా ఉండట్లేదంటూ కొన్ని రోజులుగా దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. -
లష్కర్ నుంచి ఎన్నికయ్యారు.. కేంద్రంలో మంత్రులయ్యారు
[ 10-05-2024]
సికింద్రాబాద్ లోక్సభకు ప్రాతినిధ్యం వహించిన నలుగురు నేతలకు కేంద్ర మంత్రులుగా పనిచేసే అవకాశం దక్కడం విశేషం. 1979 ఉప ఎన్నికలు, 1980లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించిన పి.శివశంకర్.. -
నాడు సందడిగా.. నేడు సైలెంట్గా
[ 10-05-2024]
ఎన్నికల ప్రచారమంటేనే హంగూ, ఆర్భాటం అధికం.. మైకుల గోల, కార్యకర్తల హంగామా మామూలుగా ఉండదు..అసెంబ్లీ ఎన్నికలు జరిగి 5 నెలలే అయినా లోక్సభ ఎన్నికల్లో ఏమాత్రం ఆ సందడి కనిపించడం లేదు. -
మోదీతోనే దేశానికి ప్రత్యేక గుర్తింపు: కొండా
[ 10-05-2024]
భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ పనితీరుతోనే ప్రపంచంలోనే దేశానికి ప్రత్యేక గుర్తింపు వచ్చిందని భాజపా అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. -
హామీలు అమలు చేస్తాం: కాంగ్రెస్
[ 10-05-2024]
చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్రెడ్డిని గెలిపించాలని తాండూరు ఎమ్మెల్యే మనోహర్రెడ్డి ఓటర్లను కోరారు. పట్టణంలోని 2,3,4,5,6,25 వార్డులలో గురువారం ఇంటింటి ప్రచారం నిర్వహించి మాట్లాడారు. -
మేం ఓటేస్తాం.. మరి మీరు..
[ 10-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గరకొచ్చేసింది. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని మేధావులు, ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు. పోలింగ్ కేంద్రాలకు వెళ్లలేని వృద్ధులు, దివ్యాంగుల కోసం ఈసారి ఇంటి వద్దే ఓటింగ్ సౌకర్యాన్ని కల్పించారు. -
బీసీలు ఏకమై కాసానిని గెలిపించాలి
[ 10-05-2024]
అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పదేళ్ల పాలన సుభిక్షంగా కొనసాగిందని, ఐదు మాసాల కాంగ్రెస్ ప్రభుత్వ పాలన అస్తవ్యస్థంగా మారిందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితారెడ్డి అన్నారు. -
కొత్త వారికి కలిసొస్తుందా..!
[ 10-05-2024]
చేవెళ్ల లోక్సభ నియోజక వర్గానికి ఇప్పటి వరకు జరిగిన రెండు ఎన్నికల్లోనూ భారాస నుంచి కొత్తగా పోటీచేసిన అభ్యర్థులే విజయం సాధించారు. -
పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్
[ 10-05-2024]
లోక్సభ ఎన్నికల దృష్ట్యా రాజధానిలో ఎన్నికల ప్రచారం..ఎక్కువ మంది గుమిగూడడంపై ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు గురువారం వేర్వేరు నోటిఫికేషన్లు జారీ చేశారు. -
మహిళల అభ్యున్నతికి మోదీ ప్రాధాన్యం
[ 10-05-2024]
మహిళల స్వయంసమృద్ధి, ఆత్మగౌరవానికి ప్రధాని మోదీ అధిక ప్రాధాన్యమిస్తున్నారని భాజపా మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు, తమిళనాడు దక్షిణ కోయంబత్తూరు ఎమ్మెల్యే వనతి శ్రీనివాసన్ అన్నారు. -
‘యాదాద్రి కట్టినా.. రాజకీయాలకు వాడుకోలేదు’
[ 10-05-2024]
దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. గురువారం తెల్లాపూర్ ఎంఐజీ కాలనీలో మెదక్ భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా ప్రచార సభ నిర్వహించారు. -
బాచుపల్లి.. ఘటనలో ఐదుగురి అరెస్టు
[ 10-05-2024]
బాచుపల్లి రేణుకాఎల్లమ్మ కాలనీలో గోడ కూలిన ఘటనపై నమోదైన కేసులో ఐదుగురిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. అర్జన్ నిర్మాణ సంస్థకు చెందిన రైజ్ ప్రాజెక్టు వద్ద రక్షణ గోడ కూలడంతో ఏడుగురు వలస కార్మికులు దుర్మరణం -
ప్రధాని రాక.. ట్రాఫిక్ ఆంక్షలు నేడు
[ 10-05-2024]
ఎల్బీ స్టేడియంలో శుక్రవారం భాజపా బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా సా.4 గంటల నుంచి రాత్రి 8 వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు. -
నన్నొదిలేసి వెళ్లిపోతావా బిడ్డా..
[ 10-05-2024]
షాపింగ్కని తల్లిని తీసుకొచ్చిన కుమారుడు వదిలేసి పలాయనం చిత్తగించిన ఘటన కేపీహెచ్బీ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. ఎస్హెచ్వో వెంకటేశ్వరరావు వివరాల ప్రకారం.. -
నరేంద్రమోదీ నాయకత్వానికి అండగా నిలవాలి: కిషన్రెడ్డి
[ 10-05-2024]
భారత్ కీర్తిప్రతిష్ఠలను ప్రపంచానికి చాటిచెప్పిన నరేంద్రమోదీ నాయకత్వానికి ఈ దఫా ఎన్నికల్లోనూ ప్రజలు అండగా నిలవాలని కేంద్ర మంత్రి, భాజపా సికింద్రాబాద్ అభ్యర్థి కిషన్రెడ్డి కోరారు. -
కాంగ్రెస్ గ్యారంటీలను ప్రజలు నమ్మరు: కొండా
[ 10-05-2024]
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన గ్యారంటీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని భాజపా చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం రాత్రి చేవెళ్ల పట్టణ కేంద్రంలో రోడ్షో నిర్వహించారు.