తండ్రీకొడుకుల ఘరానా మోసం
కుమారుడిని పావుగా వాడుకొని తండ్రి తప్పటడుగు వేశాడు. రూ.డబ్బుపై ఆశతో ఘరానా మోసానికి పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదుతో తండ్రీకొడుకు జైలు పాలయ్యారు.
విదేశాల్లో తెలుగు విద్యార్థులకు టోకరా
రూ.2.06 కోట్ల వసూళ్లు
వివరాలు వెల్లడిస్తున్న సీసీఎస్ జాయింట్ సీపీ గజరావు భూపాల్
ఈనాడు, హైదరాబాద్: కుమారుడిని పావుగా వాడుకొని తండ్రి తప్పటడుగు వేశాడు. రూ.డబ్బుపై ఆశతో ఘరానా మోసానికి పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదుతో తండ్రీకొడుకు జైలు పాలయ్యారు. విదేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థులను మోసగించిన ముగ్గురిని నగర సైబర్క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం బషీర్బాగ్ నగర పోలీసు కమిషనరేట్లో డీసీపీ స్నేహమెహ్రా, ఏసీపీ కేవీఎం ప్రసాద్, ఇన్స్పెక్టర్ కె.హరిభూషణరావుతో కలిసి సీసీఎస్ జాయింట్ సీపీ డాక్టర్ గజరావు భూపాల్ మీడియాకు వివరాలు వెల్లడించారు.
మలక్పేట నివాసి దేవరశెట్టి పెద్ద వెంకటేశ్వర్లు(58) వ్యాపారి. ఇతడి కుమారుడు డి.గౌతమ్(22) ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. తండ్రి సూచనతో కెనడా, అమెరికా దేశాల్లోని విశ్వవిద్యాలయాల్లో చదువుకునేందుకు వచ్చిన తెలుగు విద్యార్థుల ఫోన్ నంబర్లు సేకరించాడు. వీరందరితో వాట్సాప్ గ్రూప్లు తయారు చేశాడు. వారి చదువు, కుటుంబ వివరాలు రాబట్టి .. నగరంలోని తండ్రికి చేరవేస్తుండే వాడు. విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్ చేస్తూ ఆయన కొత్త తరహా మోసాలకు తెరతీశాడు.
క్రెడిట్కార్డుతో చెల్లిస్తే రాయితీ: తన కుమారుడు కెనడాలో చదువుతున్నాడని, అతడికి అక్కడున్న క్రెడిట్కార్డు ద్వారా విద్యాసంస్థల్లో సెమిస్టర్ ఫీజులు చెల్లిస్తే 10 శాతం రాయితీ వస్తుందంటూ నమ్మించేవాడు. అది నమ్మి నగదు వెంకటేశ్వర్లు బ్యాంకు ఖాతాలో జమచేసే వారు. గతేడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 32 మంది విద్యార్థుల నుంచి రూ.2.06కోట్లు వసూలు చేశారు. నారాయణగూడ ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారి అమెరికాలో చదువుతున్న కుమారుడి సెమిస్టర్ ఫీజు రూ.6.69 లక్షలు పెద్దవెంకటేశ్వర్లు ఖాతాలో జమచేశాడు. గతేడాది నవంబరులో ఒకే క్రెడిట్కార్డు నుంచి 27 మంది విద్యార్థులకు ఫీజులు చెల్లించినట్లు ఫిర్యాదులు రావటంతో, ఆ విశ్వవిద్యాలయం వ్యాపారి కుమారుడి ఫీజును వెనక్కి ఇచ్చింది. బాధితుడి ఫిర్యాదుతో గత నెల 6న కేసు నమోదు చేశారు.
దుబాయ్ వయా గోవా: వెంకటేశ్వర్లు విద్యార్థుల నుంచి సేకరించిన నగదులో 35శాతం కమీషన్ మినహాయించుకొని.. మిగతాది గోవాలోని కోహీర్కర్ నితేష్(38) బ్యాంకు ఖాతాలో జమచేస్తాడు. అతడు 5శాతం కమీషన్ తీసుకొని మిగతా సొమ్మును క్రిప్టో కరెన్సీగా మార్చి దుబాయ్లోని జిబ్రేన్ ఖాతాకు మళ్లించేవాడు. జిబ్రేన్ తన వద్ద ఉన్న క్లోనింగ్ చేసిన క్రెడిట్కార్డులతో విద్యార్థుల ఫీజులు చెల్లించే వాడు. అక్కడి బాధితుల ఫిర్యాదుతో పోలీసులు క్రెడిట్కార్డు మోసాలను గుర్తించేవారు. నకిలీ కార్డులతో చెల్లింపులు జరిగినట్టు బయటపడటంతో మరోసారి విద్యార్థుల తల్లిదండ్రులు సెమిస్టర్ ఫీజులు చెల్లించాల్సి వచ్చేది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో మోసాలచిట్టా వెలుగుచూసింది. నిందితుల ఖాతాలోని రూ.2,71,790 నగదు లావాదేవీలను నిలిపివేశారు. గౌతమ్ అడ్మిషన్ను విశ్వవిద్యాలయం రద్దు చేసింది. స్వదేశానికి వచ్చి అరెస్టయ్యాడు. కోహీర్కర్ నితేష్నూ అరెస్టు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
[ 27-07-2024]
రైల్లో దూర ప్రయాణం.. రాత్రిళ్లు చల్లగాలి.. కబుర్లు చెప్పుకుంటూ నిద్రలోకి జారుకుంటే చాలు.. అదును కోసం చూస్తున్న దొంగలకు పండగే. -
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
[ 27-07-2024]
మహేశ్వరంలోని ఓ హోటల్లో చోరీ చేసేందుకు వచ్చిన ఓ దొంగ.. పోలీసులకు కనీసం ఒక్క క్లూ కూడా దొరక్కుండా.. ఎంతో జాగ్రత్తగా పథకం వేశాడు. -
పనులు కదలాలి.. ప్రగతి పరుగిడాలి
[ 27-07-2024]
ఎనిమిదేళ్ల కిందట రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రాంటుగా హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ)కు అందిన మొత్తం కేవలం రూ.250 కోట్లు. అప్పటి నుంచి బల్దియాకు ఒక్కపైసా కూడా గ్రాంటుగా నిధులందలేదు. -
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
[ 27-07-2024]
రాజీవ్ రహదారిపై అతివేగంగా కారు నడిపి బస్సును ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి చెందారు. -
ఆ భూముల జాడ.. దేవుడికే తెలియాలి
[ 27-07-2024]
రాజధాని పరిధిలో 9వేల ఎకరాలకుపైనే దేవాదాయశాఖ భూములున్నాయి. నిత్యం ధూప, దీప నైవేద్యాల కోసం గతంలో అనేక మంది భూవిరాళాలు ఇచ్చారు. -
పాలక మండలి సభ్యుల సంబరాలు
[ 27-07-2024]
నగరం అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరు శాఖలకు కలిపి పద్దులో రూ.10వేల కోట్లను కేటాయించడంపై కాంగ్రెస్కు చెందిన జీహెచ్ఎంసీ పాలకమండలి సభ్యులు శుక్రవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు. -
మా ఇష్టం.. మేమిట్లే జేస్తం
[ 27-07-2024]
రాజధాని నగరంలో బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు వేగంగా పెరుగుతుండడంతో వాటికి అవసరమైన ఇటుకల తయారీ కోసం కొందరు నీళ్లు సమృద్ధిగా ఉన్న జంటజలాశయాల పరివాహక ప్రాంతాన్ని ఎంచుకున్నారు. -
మ్యాన్హోల్ నుంచి వంటనూనెల వ్యర్థాలు
[ 27-07-2024]
ఆర్టీసీ క్రాస్రోడ్డు పరిధిలోని ప్రధాన రహదారిపై ఓ డ్రైనేజీ మ్యాన్హోల్ నుంచి శుక్రవారం ఉదయం వంటనూనెల వ్యర్థాలు పొంగిపొర్లాయి. -
కుటుంబాలను కూల్చేస్తున్న రీల్స్
[ 27-07-2024]
రీల్స్ మోజులో పడి తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగిల్చినవారు కొందరైతే.. కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకున్నవారు మరికొందరు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
యువతలో పెరుగుతున్న హృద్రోగ ముప్పు
[ 27-07-2024]
యువతలో గుండె సమస్యలు పెరుగుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. -
విద్యుత్తు అధికారుల్లో సూర్యాఘర్ జోష్
[ 27-07-2024]
సౌర విద్యుత్తును 300 యూనిట్ల వరకూ పొందే ‘పీఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’ పథకంలో ఎక్కువ మందిని చేర్పించే విద్యుత్తు అధికారులకు కేంద్రం ప్రోత్సహకాలు ప్రకటించింది. -
మాజీ రాష్ట్రపతి సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం సందర్శన
[ 27-07-2024]
శంషాబాద్ మండలం శ్రీరామనగరంలో వెలిసిన సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శుక్రవారం సందర్శించారు. -
దేశభక్తి చాటిన కార్గిల్ విజయోత్సవ ర్యాలీ
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధ విజయోత్సవానికి పాతికేళ్ల సందర్భంగా శుక్రవారం నారాయణగూడలోని రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి(అర్బీవీఆర్ఆర్) మహిళా కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్-2, తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ స్వచ్ఛంద సంస్థల సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ పలు ప్రాంతాల్లో కొనసాగింది. -
కోట్పల్లి కల్పవల్లి
[ 27-07-2024]
జిల్లాలో అతిపెద్దదైన కోట్పల్లి ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. బడ్జెట్లో రూ.8 కోట్లు కేటాయించింది. -
అరణ్యం కబ్జా పర్వం.. కొనసాగుతున్న వివాదం!
[ 27-07-2024]
రెండు దశాబ్దాలుగా జిల్లాకు చెందిన అటవీ భూములను ఆక్రమించుకుని కర్ణాటక వాసులు సాగు చేస్తూ పంటలు పండిస్తున్నారు. -
బాధిత అంధ బాలికను, కుటుంబాన్ని ఆదుకోవాలి
[ 27-07-2024]
మలక్పేట ప్రభుత్వ అంధ బాలికల వసతి గృహం వద్ద శుక్రవారం ఆందోళనలు కొనసాగాయి. -
రాష్ట్రపతి నిలయాల్లో సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం
[ 27-07-2024]
ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతిగా రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం, సిమ్లా, దిల్లీలోని రాష్ట్రపతి భవనాల సందర్శనకు సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు రాష్ట్రపతి నిలయం అధికారులు తెలిపారు. -
శిల్పారామం పేరు, లోగో వాడొద్దు
[ 27-07-2024]
అనుమతి లేకుండా శిల్పారామం పేరు, లోగోను ఇతరులు ఉపయోగించరాదని శిల్పారామం ప్రత్యేకాధికారి జి.కిషన్రావు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. -
ఆలయాల్లో కానుకలు చోరీ!
[ 27-07-2024]
దేవాలయాలు లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న టి.నరేందర్(27)ను శుక్రవారం అరెస్ట్ చేసినట్టు ఫలక్నుమా ఏసీపీ ఎన్.ఎల్.నారాయణరాజు తెలిపారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్