అమ్మలు.. ఆశయం వైపు అడుగులు
పిల్లలు, కుటుంబం కోసం కెరీర్ను త్యాగం చేసిన అమ్మలు ఎందరో మన ఇంట్లో, పక్క ఇంట్లో, ఎదురింట్లో కనిపిస్తుంటారు. ఉన్నత చదువులు చదివి.. మంచి కొలువు సాధించి తమ కాళ్లపై తాము నిలబడుతున్న దశలో పెళ్లి, పిల్లల కోసం ఇష్టమైన కెరీర్ను వదిలిపెట్టక తప్పని పరిస్థితి.
సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ కెరీర్ ప్రారంభిస్తున్న మహిళలు
అవకాశాలు కల్పిస్తున్న పలు కార్పొరేట్ సంస్థలు
శిక్షణ పొందుతున్న మహిళలు
ఈనాడు, హైదరాబాద్: పిల్లలు, కుటుంబం కోసం కెరీర్ను త్యాగం చేసిన అమ్మలు ఎందరో మన ఇంట్లో, పక్క ఇంట్లో, ఎదురింట్లో కనిపిస్తుంటారు. ఉన్నత చదువులు చదివి.. మంచి కొలువు సాధించి తమ కాళ్లపై తాము నిలబడుతున్న దశలో పెళ్లి, పిల్లల కోసం ఇష్టమైన కెరీర్ను వదిలిపెట్టక తప్పని పరిస్థితి. ఇలాంటి వారు పిల్లలు కాస్త పెద్ద కాగానే తిరిగి కెరీర్ ప్రారంభించేందుకు అవకాశాలు పెరిగాయి. అందుకు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించే శిక్షణ సంస్థలు సైతం అందుబాటులోకి వచ్చాయి. ఆత్మవిశ్వాసంతో పది, పదిహేను ఏళ్ల తర్వాత వృత్తి జీవితంలో అడుగుపెడుతున్నారు. శాస్త్రవేత్తలు సైతం తిరిగి పరిశోధనా ప్రాజెక్టుల్లో చేరుతున్నారు.
3,700 మందికి.. పురుషులతో సమానంగా మహిళలు రాణిస్తున్నా వృత్తి, ఉద్యోగాలు, వ్యాపారాల్లో మాత్రం వీరి భాగస్వామ్యం తక్కువగా ఉంటోంది. వ్యాపారాలు వృద్ధి చెందాలన్నా.. ఉత్పాదకతలో పెంపుదల చూడాలన్నా మహిళా శ్రామిక శక్తిని వినియోగించుకోవాలని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. మహిళల్లో ఉండే అపారమైన సామర్థ్యాలను వినియోగించుకునేలా శిక్షణ ఇస్తే చాలు వారిని భాగస్వాములను చేయవచ్చు. ముఖ్యంగా కుటుంబం కోసం కెరీర్ను మధ్యలో వదిలేసిన అమ్మల కోసం శిక్షణ సంస్థలు వెలిశాయి. వీరు రెజ్యూమ్ సిద్ధం చేసే దగ్గర్నుంచి.. ఇటీవల వచ్చిన ఆన్లైన్లో ప్రొఫెషనల్ ప్రొఫైల్ను అప్డేట్ చేయడం వరకు నేర్పిస్తున్నాయి. మాక్ ఇంటర్వ్యూలు, పని ప్రదేశంలో ఉండాల్సిన నైపుణ్యాలు, కార్యశాలలు, పరిశ్రమ ప్రముఖులతో సంభాషణలతో వారిలోని బేరుకు పోగొట్టి ఆత్మవిశ్వాసం పెంపొందించేలా చేస్తున్నాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ(డీఎస్టీ) మహిళలు తిరిగి పరిశోధనలు చేపట్టేలా వేర్వేరు పథకాల కింద ప్రత్యేక ప్రాజెక్టుల్లో చేరేందుకు అవకాశం ఇస్తోంది. ఈ విధంగా ఇటీవల కాలంలో 3,700 మంది చేరినట్లు డీఎస్టీ ప్రగతి నివేదికలో పేర్కొంది.
డాక్టర్గా నిలిచారు.. అమ్మగా గెలిచారు
కుమార్తె డాక్టర్ ఎలిజబెత్తో తల్లి డాక్టర్ జయలత
ఈనాడు, హైదరాబాద్: వృత్తిలో పడి ఎంతో మంది కుటుంబాలను నిర్లక్ష్యం చేస్తుంటారు. ఆ ప్రభావం పిల్లల పెంపకంపైనా పడుతుంది. కానీ ఎంత బిజీగా ఉన్నా సరే.. అటు వృత్తి ఇటు వ్యక్తిగత జీవితాన్ని సమన్వయం చేసుకుంటూ జీవితంలో రాణిస్తూ అద్భుతాలు చేసే తల్లులు ఎందరో.. ఆ కోవలోకి చెందుతారు ప్రభుత్వ ఎంఎన్జే కేన్సర్ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ జయలత. వృత్తిగత జీవితంలో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ.. ఒక తల్లిగా పిల్లలను ఉన్నతంగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. డాక్టర్ జయలత దంపతులిద్దరూ వృత్తి పరంగా వైద్యులే. ఆమె రేడియాలజిస్టు.. ఆయన ప్లాస్టిక్ సర్జన్. దంపతులిద్దరూ ఉదయం ఆసుపత్రికి వెళ్తే మళ్లీ ఇంటికి ఎప్పుడు చేరేది వాళ్ల చేతిలో ఉండదు. పిల్లలు చిన్నప్పుడు వాళ్ల పెంపకం ఒక సవాలుగా మారేదని డాక్టర్ జయలత చెప్పుకొచ్చారు. ఆ సమయంలో తన భర్త కూడా సంపూర్ణ సహకారం అందించడంతో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ పిల్లలను కెరీర్ పరంగా తీర్చిదిద్దగలిగామన్నారు. ‘మా అమ్మాయి...మమ్మల్ని చూసి చిన్నప్పటి నుంచే డాక్టర్ అవుతానని పట్టుపట్టింది. మాకైతే ముందు ఇష్టం లేదు. ఎంబీబీఎస్, పీజీ, సూపర్స్పెషాలిటీ...ఇవన్నీ పూర్తి అయ్యేసరికి 10-15 ఏళ్లు పడుతుంది. అంత ఓపిక ఉంటుందా భావించినా సరే...ఆమె వెనక్కి తగ్గలేదు. పట్టుదలగా ఎంబీబీఎస్ పూర్తి చేసి.. అమెరికాలో పీజీ చేసేందుకు సిద్ధమైంది. మా అబ్బాయి ఇంజినీరింగ్ ఎంపిక చేసుకున్నాడు. పిల్లలకు నేను చెప్పేది ఒక్కటే. ఏదైనా లక్ష్యాన్ని పెట్టుకొని గట్టిగా ప్రయత్నిస్తే...సాధించక పోవడం అంటూ ఉండదు. ఏదైనా పిల్లలపై రుద్దకూడదు. వారిపై నమ్మకం ఉంచి... ఒక స్నేహితుడు, ఒక గైడ్లా వ్యవహరిస్తే చాలు...వారే అద్భుతాలు చేసి చూపిస్తారు. ఒక వైద్యురాలిగా కేరీర్ పరంగా ఎంత తృప్తి ఉందో.. ఒక తల్లిగా పిల్లల కెరీర్ను తీర్చిదిద్దడంలో తన పాత్ర పోషించినందుకు అంతే తృప్తి ఉంది.
14 ఏళ్ల తర్వాత..
- ఏంజెలీనా డైసీ
సుదీర్ఘ విరామం అనంతరం తిరిగి ఉద్యోగం సాధించడం కచ్చితంగా అంత సులభం కాదు. నైపుణ్యాలను పెంపొందించుకుని 14 ఏళ్ల విరామం తర్వాత మోటివిటీ ల్యాబ్స్లో అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్గా తిరిగి కెరీర్ను ప్రారంభించడం నాలో మరింత విశ్వాసాన్ని పెంచింది.
భయాలు పోగొట్టి..
- విశ్వేశ్వరి
ఉద్యోగం వదిలిపెట్టి ఆరేళ్లు అయ్యింది. తిరిగి కెరీర్ను ప్రారంభించేందుకు ఇంటర్వ్యూలు ఎదుర్కోవడం అన్నింటి కంటే పెద్ద సవాల్. దీన్ని అధగమించడానికి మాక్ ఇంటర్వ్యూలకు హాజరయ్యా. కెరీర్ సేవలను వినియోగించుకుని క్యాప్జెమినిలో సీనియర్ అనలిస్ట్గా కెరీర్ను ప్రారంభించా.
చాలా అవకాశాలు ఉన్నాయ్..
-అరవింద్ తూపురాణి, ప్లేస్మెంట్స్ హెడ్, ఓడిన్ స్కూల్
కెరీర్ తిరిగి ప్రారంభించాలనుకునేవారికి ప్రస్తుతం పరిస్థితి చాలా అనుకూలం. ఉబర్, డన్ హంబీ, క్యాప్జెమిని, బ్లెండ్ 360, జీఎఫ్ కె, ఫోర్డ్, ఎస్ అండ్ పీ గ్లోబల్, సిటీ బ్యాంకుతో సహా అనేక కార్పొరేట్ సంస్థలు మహిళలు, తల్లులను ఉద్యోగంలోకి ఆహ్వానిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆమోదం 178.. తిరస్కరణ 124
[ 27-04-2024]
రాజధాని పరిధిలోని హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గాల్లో అభ్యర్థుల నామపత్రాల పరిశీలన శుక్రవారం ముగిసింది. -
ఓటర్లను కాదు నేతలను కొనేద్దాం
[ 27-04-2024]
సాధారణంగా ఎన్నికల సమయంలో ఓటర్లకు డబ్బులిచ్చి ప్రలోభపెడుతుండటం చూస్తుంటాం.. వింటుంటాం. ఈ లోక్సభ ఎన్నికల్లో మాత్రం నాయకులు పూర్తిగా ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. -
ఎన్వోసీ ఇవ్వడానికి రూ.5 లక్షల లంచం
[ 27-04-2024]
వాణిజ్య భవనానికి నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) ఇచ్చేందుకు రూ.5 లక్షల లంచం డిమాండ్ చేసిన నీటిపారుదల శాఖ డిప్యూటీ కార్యనిర్వాహక ఇంజినీరు(డీఈఈ) యాత పవన్కుమార్ అనిశాకు దొరికిపోయాడు. -
ఎవరి దారి వారిదే
[ 27-04-2024]
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో జాతీయ రహదారుల సంస్థ, మెట్రో రైలు సంస్థలు..ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. -
నిజాం కళాశాలలో ‘డూ యూ నో..?’ బోర్డులు
[ 27-04-2024]
ఉస్మానియా విశ్వవిద్యాలయం ‘తక్షు’ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. అందులో భాగంగా నిజాం కళాశాలలో చదివి ఉన్నతస్థాయికి ఎదిగిన పూర్వ విద్యార్థుల ఫ్లెక్సీలతో ‘డూ యూ నో’(మీకు తెలుసా..?) బోర్డులను కాలేజీ ప్రాంగణంలో ప్రిన్సిపల్ ప్రొ.బి.బీమా శుక్రవారం ఏర్పాటు చేయించారు. -
అక్కడికి రాలేం.. మీరే రండి
[ 27-04-2024]
గ్రేటర్ హైదరాబాద్లోని గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఎన్నికల అధికారులు ప్రకటనలు చేయడంతో చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల నుంచి కొన్ని ప్రతిపాదనలొచ్చాయి. -
ఐపీఎల్ టికెట్లు బ్లాక్లో విక్రయిస్తున్న ఇద్దరి అరెస్టు
[ 27-04-2024]
రెజిమెంటల్బజార్: ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ టికెట్లను బ్లాక్లో విక్రయిస్తున్న ఇద్దరిని బుధవారం ఉత్తర మండలం టాస్క్ఫోర్స్, గోపాలపురం పోలీసులు అరెస్టు చేశారు. -
కోడ్ ఉల్లంఘనలా.. ఫిర్యాదు చేయండి
[ 27-04-2024]
ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై హైదరాబాద్ జిల్లా పరిధిలోని రెండు ఎంపీ స్థానాలు, ఓ అసెంబ్లీ పరిధిలో ఏవేనీ ఫిర్యాదులు ఉన్నట్లయితే.. ఆయా స్థానాలకు నియమితులైన పరిశీలకులకు ఫిర్యాదు చేయొచ్చని జిల్లా ఎన్నికల అధికారి(డీఈఓ) రోనాల్డ్రాస్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
ప్రచారానికి వడదెబ్బ
[ 27-04-2024]
పార్లమెంట్ ఎన్నికల గడువు ముంచుకొస్తోంది.. ప్రస్తుతం అభ్యర్థులు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఇక అన్ని పార్టీలు ప్రచారం కోసం రంగంలోకి దిగనున్నాయి. -
మజ్లిస్ ఓటమికి మతతత్వ శక్తుల కుట్ర: ఒవైసీ
[ 27-04-2024]
26 ఏళ్లు శ్రమిస్తే దక్కిన ఎంపీ సీటును 1984 నుంచి కాపాడుకుంటూ వస్తున్నామని మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. -
ఎన్నికల వేడి.. రైళ్లు ప్రత్యేకమండి
[ 27-04-2024]
వేసవి సెలవులు వచ్చాయంటే ప్రత్యేక రైళ్లు వేయడం పరిపాటే. కానీ ఈ సారి వాటికి తోడు ఎన్నికలు కూడా వచ్చాయి. -
భార్య తిట్టిందని ఆత్మహత్య
[ 27-04-2024]
భార్య తిట్టిందని భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. అమీన్పూర్ ఎస్ఐ మల్లయ్య వివరాల ప్రకారం.. అమీన్పూర్ పురపాలిక బీరంగూడ మంజీరానగర్లో ఉంటున్న శ్రీనివాస్(29) మద్యానికి అలవాటుపడి ఇంటివద్దే ఉంటున్నాడు. -
స్వతంత్రంగా ఉంటాం
[ 27-04-2024]
ఉస్మానియా విశ్వవిద్యాలయం, జవహర్లాల్ సాంకేతిక విశ్వవిద్యాలయాలకు అనుబంధ గుర్తింపున్న ప్రైవేటు, కార్పొరేటు ఇంజినీరింగ్ కళాశాల్లో కొన్ని అనుబంధ గుర్తింపుతో పాటు ‘స్వయం ప్రతిపత్తి’ కోరుకుంటున్నాయి. -
కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకున్న బాలిక
[ 27-04-2024]
నాగపూర్లో కిడ్నాప్ అయిన ఓ బాలిక తప్పించుకుని సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల కథనం ప్రకారం మహారాష్ట్ర నాగపూర్కు చెందిన బాలిక (17) శుక్రవారం రాత్రి 9.30 గంటల సమయంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో డిప్యూటీ స్టేషన్ మాస్టర్ గదిలోకి పరుగున వచ్చింది. -
అక్రమ లేఅవుట్లు..ఆదాయానికి తూట్లు
[ 27-04-2024]
వ్యాపార వాణిజ్య పట్టణంగా రాష్ట్రంలో పేరున్న తాండూరులో అక్రమ లేఅవుట్లు యథేచ్ఛగా సాగి పోతున్నాయి. -
డ్వాక్రా మహిళలే కీలకం!
[ 27-04-2024]
జిల్లా వ్యాప్తంగా గ్రామం, వార్డు అనే తేడా లేకుండా అన్నిచోట్లా ‘డ్వాక్రా స్వయం సహాయక సంఘాలు’న్నాయి. వీటిలో వేలాది మంది కొనసాగుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్