అమ్మలు.. ఆశయం వైపు అడుగులు
పిల్లలు, కుటుంబం కోసం కెరీర్ను త్యాగం చేసిన అమ్మలు ఎందరో మన ఇంట్లో, పక్క ఇంట్లో, ఎదురింట్లో కనిపిస్తుంటారు. ఉన్నత చదువులు చదివి.. మంచి కొలువు సాధించి తమ కాళ్లపై తాము నిలబడుతున్న దశలో పెళ్లి, పిల్లల కోసం ఇష్టమైన కెరీర్ను వదిలిపెట్టక తప్పని పరిస్థితి.
సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ కెరీర్ ప్రారంభిస్తున్న మహిళలు
అవకాశాలు కల్పిస్తున్న పలు కార్పొరేట్ సంస్థలు
శిక్షణ పొందుతున్న మహిళలు
ఈనాడు, హైదరాబాద్: పిల్లలు, కుటుంబం కోసం కెరీర్ను త్యాగం చేసిన అమ్మలు ఎందరో మన ఇంట్లో, పక్క ఇంట్లో, ఎదురింట్లో కనిపిస్తుంటారు. ఉన్నత చదువులు చదివి.. మంచి కొలువు సాధించి తమ కాళ్లపై తాము నిలబడుతున్న దశలో పెళ్లి, పిల్లల కోసం ఇష్టమైన కెరీర్ను వదిలిపెట్టక తప్పని పరిస్థితి. ఇలాంటి వారు పిల్లలు కాస్త పెద్ద కాగానే తిరిగి కెరీర్ ప్రారంభించేందుకు అవకాశాలు పెరిగాయి. అందుకు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించే శిక్షణ సంస్థలు సైతం అందుబాటులోకి వచ్చాయి. ఆత్మవిశ్వాసంతో పది, పదిహేను ఏళ్ల తర్వాత వృత్తి జీవితంలో అడుగుపెడుతున్నారు. శాస్త్రవేత్తలు సైతం తిరిగి పరిశోధనా ప్రాజెక్టుల్లో చేరుతున్నారు.
3,700 మందికి.. పురుషులతో సమానంగా మహిళలు రాణిస్తున్నా వృత్తి, ఉద్యోగాలు, వ్యాపారాల్లో మాత్రం వీరి భాగస్వామ్యం తక్కువగా ఉంటోంది. వ్యాపారాలు వృద్ధి చెందాలన్నా.. ఉత్పాదకతలో పెంపుదల చూడాలన్నా మహిళా శ్రామిక శక్తిని వినియోగించుకోవాలని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. మహిళల్లో ఉండే అపారమైన సామర్థ్యాలను వినియోగించుకునేలా శిక్షణ ఇస్తే చాలు వారిని భాగస్వాములను చేయవచ్చు. ముఖ్యంగా కుటుంబం కోసం కెరీర్ను మధ్యలో వదిలేసిన అమ్మల కోసం శిక్షణ సంస్థలు వెలిశాయి. వీరు రెజ్యూమ్ సిద్ధం చేసే దగ్గర్నుంచి.. ఇటీవల వచ్చిన ఆన్లైన్లో ప్రొఫెషనల్ ప్రొఫైల్ను అప్డేట్ చేయడం వరకు నేర్పిస్తున్నాయి. మాక్ ఇంటర్వ్యూలు, పని ప్రదేశంలో ఉండాల్సిన నైపుణ్యాలు, కార్యశాలలు, పరిశ్రమ ప్రముఖులతో సంభాషణలతో వారిలోని బేరుకు పోగొట్టి ఆత్మవిశ్వాసం పెంపొందించేలా చేస్తున్నాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ(డీఎస్టీ) మహిళలు తిరిగి పరిశోధనలు చేపట్టేలా వేర్వేరు పథకాల కింద ప్రత్యేక ప్రాజెక్టుల్లో చేరేందుకు అవకాశం ఇస్తోంది. ఈ విధంగా ఇటీవల కాలంలో 3,700 మంది చేరినట్లు డీఎస్టీ ప్రగతి నివేదికలో పేర్కొంది.
డాక్టర్గా నిలిచారు.. అమ్మగా గెలిచారు
కుమార్తె డాక్టర్ ఎలిజబెత్తో తల్లి డాక్టర్ జయలత
ఈనాడు, హైదరాబాద్: వృత్తిలో పడి ఎంతో మంది కుటుంబాలను నిర్లక్ష్యం చేస్తుంటారు. ఆ ప్రభావం పిల్లల పెంపకంపైనా పడుతుంది. కానీ ఎంత బిజీగా ఉన్నా సరే.. అటు వృత్తి ఇటు వ్యక్తిగత జీవితాన్ని సమన్వయం చేసుకుంటూ జీవితంలో రాణిస్తూ అద్భుతాలు చేసే తల్లులు ఎందరో.. ఆ కోవలోకి చెందుతారు ప్రభుత్వ ఎంఎన్జే కేన్సర్ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ జయలత. వృత్తిగత జీవితంలో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ.. ఒక తల్లిగా పిల్లలను ఉన్నతంగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. డాక్టర్ జయలత దంపతులిద్దరూ వృత్తి పరంగా వైద్యులే. ఆమె రేడియాలజిస్టు.. ఆయన ప్లాస్టిక్ సర్జన్. దంపతులిద్దరూ ఉదయం ఆసుపత్రికి వెళ్తే మళ్లీ ఇంటికి ఎప్పుడు చేరేది వాళ్ల చేతిలో ఉండదు. పిల్లలు చిన్నప్పుడు వాళ్ల పెంపకం ఒక సవాలుగా మారేదని డాక్టర్ జయలత చెప్పుకొచ్చారు. ఆ సమయంలో తన భర్త కూడా సంపూర్ణ సహకారం అందించడంతో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ పిల్లలను కెరీర్ పరంగా తీర్చిదిద్దగలిగామన్నారు. ‘మా అమ్మాయి...మమ్మల్ని చూసి చిన్నప్పటి నుంచే డాక్టర్ అవుతానని పట్టుపట్టింది. మాకైతే ముందు ఇష్టం లేదు. ఎంబీబీఎస్, పీజీ, సూపర్స్పెషాలిటీ...ఇవన్నీ పూర్తి అయ్యేసరికి 10-15 ఏళ్లు పడుతుంది. అంత ఓపిక ఉంటుందా భావించినా సరే...ఆమె వెనక్కి తగ్గలేదు. పట్టుదలగా ఎంబీబీఎస్ పూర్తి చేసి.. అమెరికాలో పీజీ చేసేందుకు సిద్ధమైంది. మా అబ్బాయి ఇంజినీరింగ్ ఎంపిక చేసుకున్నాడు. పిల్లలకు నేను చెప్పేది ఒక్కటే. ఏదైనా లక్ష్యాన్ని పెట్టుకొని గట్టిగా ప్రయత్నిస్తే...సాధించక పోవడం అంటూ ఉండదు. ఏదైనా పిల్లలపై రుద్దకూడదు. వారిపై నమ్మకం ఉంచి... ఒక స్నేహితుడు, ఒక గైడ్లా వ్యవహరిస్తే చాలు...వారే అద్భుతాలు చేసి చూపిస్తారు. ఒక వైద్యురాలిగా కేరీర్ పరంగా ఎంత తృప్తి ఉందో.. ఒక తల్లిగా పిల్లల కెరీర్ను తీర్చిదిద్దడంలో తన పాత్ర పోషించినందుకు అంతే తృప్తి ఉంది.
14 ఏళ్ల తర్వాత..
- ఏంజెలీనా డైసీ
సుదీర్ఘ విరామం అనంతరం తిరిగి ఉద్యోగం సాధించడం కచ్చితంగా అంత సులభం కాదు. నైపుణ్యాలను పెంపొందించుకుని 14 ఏళ్ల విరామం తర్వాత మోటివిటీ ల్యాబ్స్లో అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్గా తిరిగి కెరీర్ను ప్రారంభించడం నాలో మరింత విశ్వాసాన్ని పెంచింది.
భయాలు పోగొట్టి..
- విశ్వేశ్వరి
ఉద్యోగం వదిలిపెట్టి ఆరేళ్లు అయ్యింది. తిరిగి కెరీర్ను ప్రారంభించేందుకు ఇంటర్వ్యూలు ఎదుర్కోవడం అన్నింటి కంటే పెద్ద సవాల్. దీన్ని అధగమించడానికి మాక్ ఇంటర్వ్యూలకు హాజరయ్యా. కెరీర్ సేవలను వినియోగించుకుని క్యాప్జెమినిలో సీనియర్ అనలిస్ట్గా కెరీర్ను ప్రారంభించా.
చాలా అవకాశాలు ఉన్నాయ్..
-అరవింద్ తూపురాణి, ప్లేస్మెంట్స్ హెడ్, ఓడిన్ స్కూల్
కెరీర్ తిరిగి ప్రారంభించాలనుకునేవారికి ప్రస్తుతం పరిస్థితి చాలా అనుకూలం. ఉబర్, డన్ హంబీ, క్యాప్జెమిని, బ్లెండ్ 360, జీఎఫ్ కె, ఫోర్డ్, ఎస్ అండ్ పీ గ్లోబల్, సిటీ బ్యాంకుతో సహా అనేక కార్పొరేట్ సంస్థలు మహిళలు, తల్లులను ఉద్యోగంలోకి ఆహ్వానిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
[ 27-07-2024]
మహేశ్వరంలోని ఓ హోటల్లో చోరీ చేసేందుకు వచ్చిన ఓ దొంగ.. పోలీసులకు కనీసం ఒక్క క్లూ కూడా దొరక్కుండా.. ఎంతో జాగ్రత్తగా పథకం వేశాడు. -
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
[ 27-07-2024]
రాజీవ్ రహదారిపై అతివేగంగా కారు నడిపి బస్సును ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి చెందారు. -
పనులు కదలాలి.. ప్రగతి పరుగిడాలి
[ 27-07-2024]
ఎనిమిదేళ్ల కిందట రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రాంటుగా హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ)కు అందిన మొత్తం కేవలం రూ.250 కోట్లు. అప్పటి నుంచి బల్దియాకు ఒక్కపైసా కూడా గ్రాంటుగా నిధులందలేదు. -
ఆ భూముల జాడ.. దేవుడికే తెలియాలి
[ 27-07-2024]
రాజధాని పరిధిలో 9వేల ఎకరాలకుపైనే దేవాదాయశాఖ భూములున్నాయి. నిత్యం ధూప, దీప నైవేద్యాల కోసం గతంలో అనేక మంది భూవిరాళాలు ఇచ్చారు. -
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
[ 27-07-2024]
రైల్లో దూర ప్రయాణం.. రాత్రిళ్లు చల్లగాలి.. కబుర్లు చెప్పుకుంటూ నిద్రలోకి జారుకుంటే చాలు.. అదును కోసం చూస్తున్న దొంగలకు పండగే. -
పాలక మండలి సభ్యుల సంబరాలు
[ 27-07-2024]
నగరం అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరు శాఖలకు కలిపి పద్దులో రూ.10వేల కోట్లను కేటాయించడంపై కాంగ్రెస్కు చెందిన జీహెచ్ఎంసీ పాలకమండలి సభ్యులు శుక్రవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు. -
మా ఇష్టం.. మేమిట్లే జేస్తం
[ 27-07-2024]
రాజధాని నగరంలో బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు వేగంగా పెరుగుతుండడంతో వాటికి అవసరమైన ఇటుకల తయారీ కోసం కొందరు నీళ్లు సమృద్ధిగా ఉన్న జంటజలాశయాల పరివాహక ప్రాంతాన్ని ఎంచుకున్నారు. -
మ్యాన్హోల్ నుంచి వంటనూనెల వ్యర్థాలు
[ 27-07-2024]
ఆర్టీసీ క్రాస్రోడ్డు పరిధిలోని ప్రధాన రహదారిపై ఓ డ్రైనేజీ మ్యాన్హోల్ నుంచి శుక్రవారం ఉదయం వంటనూనెల వ్యర్థాలు పొంగిపొర్లాయి. -
కుటుంబాలను కూల్చేస్తున్న రీల్స్
[ 27-07-2024]
రీల్స్ మోజులో పడి తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగిల్చినవారు కొందరైతే.. కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకున్నవారు మరికొందరు. -
రామోజీ పిల్మ్సిటీలో ప్రెండిషిప్ వీక్
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
యువతలో పెరుగుతున్న హృద్రోగ ముప్పు
[ 27-07-2024]
యువతలో గుండె సమస్యలు పెరుగుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. -
విద్యుత్తు అధికారుల్లో సూర్యాఘర్ జోష్
[ 27-07-2024]
సౌర విద్యుత్తును 300 యూనిట్ల వరకూ పొందే ‘పీఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’ పథకంలో ఎక్కువ మందిని చేర్పించే విద్యుత్తు అధికారులకు కేంద్రం ప్రోత్సహకాలు ప్రకటించింది. -
మాజీ రాష్ట్రపతి సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం సందర్శన
[ 27-07-2024]
శంషాబాద్ మండలం శ్రీరామనగరంలో వెలిసిన సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శుక్రవారం సందర్శించారు. -
దేశభక్తి చాటిన కార్గిల్ విజయోత్సవ ర్యాలీ
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధ విజయోత్సవానికి పాతికేళ్ల సందర్భంగా శుక్రవారం నారాయణగూడలోని రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి(అర్బీవీఆర్ఆర్) మహిళా కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్-2, తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ స్వచ్ఛంద సంస్థల సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ పలు ప్రాంతాల్లో కొనసాగింది. -
కోట్పల్లి కల్పవల్లి
[ 27-07-2024]
జిల్లాలో అతిపెద్దదైన కోట్పల్లి ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. బడ్జెట్లో రూ.8 కోట్లు కేటాయించింది. -
అరణ్యం కబ్జా పర్వం.. కొనసాగుతున్న వివాదం!
[ 27-07-2024]
రెండు దశాబ్దాలుగా జిల్లాకు చెందిన అటవీ భూములను ఆక్రమించుకుని కర్ణాటక వాసులు సాగు చేస్తూ పంటలు పండిస్తున్నారు. -
బాధిత అంధ బాలికను, కుటుంబాన్ని ఆదుకోవాలి
[ 27-07-2024]
మలక్పేట ప్రభుత్వ అంధ బాలికల వసతి గృహం వద్ద శుక్రవారం ఆందోళనలు కొనసాగాయి. -
రాష్ట్రపతి నిలయాల్లో సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం
[ 27-07-2024]
ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతిగా రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం, సిమ్లా, దిల్లీలోని రాష్ట్రపతి భవనాల సందర్శనకు సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు రాష్ట్రపతి నిలయం అధికారులు తెలిపారు. -
శిల్పారామం పేరు, లోగో వాడొద్దు
[ 27-07-2024]
అనుమతి లేకుండా శిల్పారామం పేరు, లోగోను ఇతరులు ఉపయోగించరాదని శిల్పారామం ప్రత్యేకాధికారి జి.కిషన్రావు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. -
ఆలయాల్లో కానుకలు చోరీ!
[ 27-07-2024]
దేవాలయాలు లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న టి.నరేందర్(27)ను శుక్రవారం అరెస్ట్ చేసినట్టు ఫలక్నుమా ఏసీపీ ఎన్.ఎల్.నారాయణరాజు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
-
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?