logo

నేనేంటో మీకు తెలుసు..ఆశీర్వదించండి: విష్ణువర్ధన్‌రెడ్డి

నేను మీకు తెలుసు..నా స్థానం మీ మనసు.. నన్ను ఆశీర్వదించండి అంటూ ఆలిండియా ఫార్వర్డ్‌బ్లాక్‌ అభ్యర్థి పాలమూరు విష్ణువర్దన్‌రెడ్డి ఓటర్లను కోరారు. షాద్‌నగర్‌లో మంగళవారం ఆయన ఆధ్వర్యంలో భారీ ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. వేలమంది యువకులు ర్యాలీలో పాల్గొన్నారు.

Updated : 29 Nov 2023 06:19 IST

షాద్‌నగర్‌, న్యూస్‌టుడే: నేను మీకు తెలుసు..నా స్థానం మీ మనసు.. నన్ను ఆశీర్వదించండి అంటూ ఆలిండియా ఫార్వర్డ్‌బ్లాక్‌ అభ్యర్థి పాలమూరు విష్ణువర్దన్‌రెడ్డి ఓటర్లను కోరారు. షాద్‌నగర్‌లో మంగళవారం ఆయన ఆధ్వర్యంలో భారీ ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. వేలమంది యువకులు ర్యాలీలో పాల్గొన్నారు. స్థానిక బాలాజీ టౌన్‌షిప్‌ వద్ద మొదలైన ఈ ర్యాలీ ద్వారా నియోజకవర్గంలోని పలు గ్రామాల మీదుగా సాగింది. అనంతరం పట్టణంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పాలమూరు ట్రస్టు ద్వారా అందించిన సేవలను వివరించారు. సింహం గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని విష్ణువర్ధన్‌రెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.


వీటికి 30న సెలవు
ఈనాడు, హైదరాబాద్‌ - న్యూస్‌టుడే, చార్మినార్‌: తెలంగాణ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో గురువారం నగరంలోని టీఎస్‌ఆర్టీసీ బస్సు పాస్‌ కౌంటర్లకు ఈ నెల 30న ఆర్టీసీ గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ సెలవు ప్రకటించింది. తిరిగి డిసెంబరు 1 నుంచి ఈ కేంద్రాలు ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 8.15 గంటల వరకూ పనిచేస్తాయని పేర్కొంది. సాలార్‌జంగ్‌ మ్యూజియానికి సెలవు ఉంటుందని డైరెక్టర్‌ డా.ఎ.నాగేందర్‌రెడ్డి తెలిపారు. సందర్శకులకు జూపార్కు ప్రవేశం ఉండదని జూ క్యూరేటరు డా.సునీల్‌ఎస్‌.హిరేమత్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని