logo

ఆరు గ్యారంటీలతో అభివృద్ధికి నాంది: వీర్లపల్లి

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే అమలు చేసే ఆరు గ్యారంటీలే అభివృద్ధికి నాంది అని ఎమ్మెల్యే అభ్యర్థి వీర్లపల్లి శంకర్‌, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్‌రెడ్డి అన్నారు. మంగళవారం వారు నందిగామ, కొత్తూరు, జిల్లేడుచౌదరిగూడెం మండలాల్లో సుడిగాలి పర్యటనతో ప్రచారం చేశారు.

Updated : 29 Nov 2023 06:52 IST

నందిగామలో కాంగ్రెస్‌ అభ్యర్థికి గజమాలతో కార్యకర్తల స్వాగతం

నందిగామ, కొత్తూరు, జిల్లేడుచౌదరిగూడెం, కేశంపేట, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే అమలు చేసే ఆరు గ్యారంటీలే అభివృద్ధికి నాంది అని ఎమ్మెల్యే అభ్యర్థి వీర్లపల్లి శంకర్‌, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్‌రెడ్డి అన్నారు. మంగళవారం వారు నందిగామ, కొత్తూరు, జిల్లేడుచౌదరిగూడెం మండలాల్లో సుడిగాలి పర్యటనతో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా వీర్లపల్లి  మాట్లాడుతూ.. మండల కేంద్రంతో పాటు తెలంగాణ ఇచ్చిన సోనియగాంధీ రుణం తీర్చుకోవడానికి ప్రతి ఒక్కరూ చేతి గుర్తుకు ఓటేసి కాంగ్రెస్‌ను గెలిపించాలని కోరారు. కేశంపేట మండల పరిధిలో వీర్లపల్లి శంకర్‌ సతీమణి అనురాధ ప్రచారం నిర్వహించారు.

షాద్‌నగర్‌పట్టణం: రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్‌ సునామీ సృష్టించడం ఖాయమని నిర్మాత, నటుడు బండ్ల గణేష్‌ అన్నారు. మంగళవారం పట్టణంలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన రోడ్‌షోలో ఆయన మాట్లాడుతూ.. రానున్నది కాంగ్రెస్‌ ప్రభుత్వమే కాబట్టి శంకర్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని