మా వద్ద ఓట్లున్నాయ్.. మీ రేటెంత!
‘మా వాళ్లందరి ఓట్లు 800 ఉన్నాయి. ఇప్పటి వరకు మేం ఎవరికి ఓటేయాలనేది నిర్ణయించుకోలేదు. మా నాయకుడు చెప్పాడని.. మీ వద్దకు వచ్చాం. ఓటుకు రూ.5000 ఇస్తే మొత్తం మీకే. కాదంటే.. మరో పార్టీ నుంచి పిలుపు వచ్చింది.
ఈనాడు, హైదరాబాద్ - రెజిమెంటల్బజార్, న్యూస్టుడే: ‘మా వాళ్లందరి ఓట్లు 800 ఉన్నాయి. ఇప్పటి వరకు మేం ఎవరికి ఓటేయాలనేది నిర్ణయించుకోలేదు. మా నాయకుడు చెప్పాడని.. మీ వద్దకు వచ్చాం. ఓటుకు రూ.5000 ఇస్తే మొత్తం మీకే. కాదంటే.. మరో పార్టీ నుంచి పిలుపు వచ్చింది. సగం అడ్వాన్స్ పంపితే.. మీకే కట్టుబడి ఉంటా’మంటూ జూబ్లీహిల్స్ పరిధిలోని హోటల్లో మధ్యవర్తితో గల్లీ నేత సాగించిన సంభాషణ.
‘‘ఖైరతాబాద్ నియోజకవర్గం పరిధిలోని ఫంక్షన్హాల్. వారం రోజులుగా అక్కడ ఘుమఘుమలాడే వంటకాలు సిద్ధం చేస్తున్నారు. కనీసం 1000 మందికి సరిపడా మాంసాహారం వండి వడ్డిస్తున్నారు. దీనికయ్యే ఖర్చంతా ప్రముఖ బిర్యానీ హోటల్ నిర్వాహకులు భరిస్తున్నారు. ఇక్కడికి రాలేని వారి ఇంటికే పార్శిల్ పంపుతున్నామ’’ని స్థానిక నాయకులు తెలిపారు. టోలిచౌకి ప్రాంతంలో ఆదివారం నుంచి విందు భోజనం సిద్ధం చేయటం విశేషం. డివిజన్లవారీగా ఓటర్లను ప్రభావితం చేసే నాయకులు, తటస్థ ఓటర్ల వివరాలు రాబడుతున్నారు. ఈ దఫా ఎన్నికల్లో ఒక్క ఓటు కూడా కీలకం కావటంతో గల్లీ నాయకులు, చోటా నేతలు సొమ్ము చేసుకునే పనిలో పడ్డారు. కుల, మత, కాలనీ సంఘ నేతలు అభ్యర్థులతో మంతనాలు ప్రారంభించారు. తమ చేతిలో ఉన్న ఓట్లన్నీ గంపగుత్తగా వేయిస్తామంటూ హామీ ఇస్తున్నారు. నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులు, అభ్యర్థుల మధ్య నెలకొన్న పోటీ ఆధారంగా ఓటుకు రేటు నిర్ణయిస్తున్నారు. ద్విముఖ పోటీ ఉన్న చోట రూ.5000-6000.. త్రిముఖ పోటీ ఉన్న ప్రాంతాల్లో రూ.1500-2000లకు దళారులు బేరసారాలు సాగిస్తున్నారు. గ్రేటర్ పరిధిలోని ఖైరతాబాద్, సనత్నగర్, జూబ్లీహిల్స్, కూకట్పల్లి, శేరిలింగంపల్లి, ముషీరాబాద్, అంబర్పేట, ఎల్బీనగర్, మల్కాజగిరి, మహేశ్వరం, చేవెళ్లలో ఓట్ల రాయబేరాలు భారీ ఎత్తున సాగుతున్నట్లు సమాచారం.
కాంగ్రెస్, భారాస వర్గీయుల ఘర్షణ
బోరబండ న్యూస్టుడే: ఓటర్లకు డబ్బు పంపిణీ చేస్తున్నారంటూ భారాస, కాంగ్రెస్ వర్గీయులు రెహ్మత్నగర్ డివిజన్ పరిధి మహాత్మనగర్లో బాహాబాహీకి దిగారు. మంగళవారం సాయంత్రం ఎన్నికల ప్రచారం ముగిశాక.. డబ్బు పంపిణీ చేస్తున్నారంటూ ఇరువర్గాలు పరస్పరం దాడికి దిగాయి. కాంగ్రెస్ నేత జేపీ జ్ఞానేశ్వర్, భారాస నాయకుడు కె.ఆనంద్ వర్గీయులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఘటనలో జ్ఞానేశ్వర్ తీవ్రంగా గాయపడ్డారు. జూబ్లిహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి అజహరుద్దీన్ కుమారుడు అసదుద్దీన్, కార్పొరేటర్ సీఎన్రెడ్డి బోరబండ పోలీస్స్టేషన్కు చేరుకుని ఫిర్యాదు చేశారు. తమ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు జ్ఞానేశ్వర్, ఆనంద్ ఇద్దరి మీద కేసులు నమోదు చేశారు.
ఎల్బీనగర్లో ‘మనీ’పర్సుల పంపిణీ
నగర శివారు ఎల్బీనగర్లో ఓ పార్టీ కొత్త తరహాలో నగదు పంపిణీ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని ఓ డివిజన్లో ప్రధాన పార్టీ అభ్యర్థి సతీమణి ఆదివారం రాత్రి మనీపర్సులు పంచిపెట్టారు. దాన్ని తెరచి చూడగా రూ.2000(నాలుగు రూ.500 నోట్లు) కనిపించాయి. పెద్ద మొత్తంలో కమీషన్లు కొడతారు.. మాకేమో రెండు, మూడు వేల రూపాయలు ఇస్తారంటూ ఒక వ్యక్తి ప్రస్తావించగా.. రూ.రెండు వేలు వచ్చినయ్గా అన్నా ఇంకేందంటూ మరో వ్యక్తి సర్దిచెప్పే ప్రయత్నం చేసినట్లు సాగిన సంభాషణ చర్చనీయాంశంగా మారింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మ్యాన్హోల్ నుంచి వంటనూనెల వ్యర్థాలు
[ 27-07-2024]
ఆర్టీసీ క్రాస్రోడ్డు పరిధిలోని ప్రధాన రహదారిపై ఓ డ్రైనేజీ మ్యాన్హోల్ నుంచి శుక్రవారం ఉదయం వంటనూనెల వ్యర్థాలు పొంగిపొర్లాయి. -
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
[ 27-07-2024]
రైల్లో దూర ప్రయాణం.. రాత్రిళ్లు చల్లగాలి.. కబుర్లు చెప్పుకుంటూ నిద్రలోకి జారుకుంటే చాలు.. అదును కోసం చూస్తున్న దొంగలకు పండగే. -
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
[ 27-07-2024]
మహేశ్వరంలోని ఓ హోటల్లో చోరీ చేసేందుకు వచ్చిన ఓ దొంగ.. పోలీసులకు కనీసం ఒక్క క్లూ కూడా దొరక్కుండా.. ఎంతో జాగ్రత్తగా పథకం వేశాడు. -
పనులు కదలాలి.. ప్రగతి పరుగిడాలి
[ 27-07-2024]
ఎనిమిదేళ్ల కిందట రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రాంటుగా హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ)కు అందిన మొత్తం కేవలం రూ.250 కోట్లు. అప్పటి నుంచి బల్దియాకు ఒక్కపైసా కూడా గ్రాంటుగా నిధులందలేదు. -
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
[ 27-07-2024]
రాజీవ్ రహదారిపై అతివేగంగా కారు నడిపి బస్సును ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి చెందారు. -
ఆ భూముల జాడ.. దేవుడికే తెలియాలి
[ 27-07-2024]
రాజధాని పరిధిలో 9వేల ఎకరాలకుపైనే దేవాదాయశాఖ భూములున్నాయి. నిత్యం ధూప, దీప నైవేద్యాల కోసం గతంలో అనేక మంది భూవిరాళాలు ఇచ్చారు. -
పాలక మండలి సభ్యుల సంబరాలు
[ 27-07-2024]
నగరం అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరు శాఖలకు కలిపి పద్దులో రూ.10వేల కోట్లను కేటాయించడంపై కాంగ్రెస్కు చెందిన జీహెచ్ఎంసీ పాలకమండలి సభ్యులు శుక్రవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు. -
మా ఇష్టం.. మేమిట్లే జేస్తం
[ 27-07-2024]
రాజధాని నగరంలో బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు వేగంగా పెరుగుతుండడంతో వాటికి అవసరమైన ఇటుకల తయారీ కోసం కొందరు నీళ్లు సమృద్ధిగా ఉన్న జంటజలాశయాల పరివాహక ప్రాంతాన్ని ఎంచుకున్నారు. -
కుటుంబాలను కూల్చేస్తున్న రీల్స్
[ 27-07-2024]
రీల్స్ మోజులో పడి తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగిల్చినవారు కొందరైతే.. కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకున్నవారు మరికొందరు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
యువతలో పెరుగుతున్న హృద్రోగ ముప్పు
[ 27-07-2024]
యువతలో గుండె సమస్యలు పెరుగుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. -
విద్యుత్తు అధికారుల్లో సూర్యాఘర్ జోష్
[ 27-07-2024]
సౌర విద్యుత్తును 300 యూనిట్ల వరకూ పొందే ‘పీఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’ పథకంలో ఎక్కువ మందిని చేర్పించే విద్యుత్తు అధికారులకు కేంద్రం ప్రోత్సహకాలు ప్రకటించింది. -
మాజీ రాష్ట్రపతి సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం సందర్శన
[ 27-07-2024]
శంషాబాద్ మండలం శ్రీరామనగరంలో వెలిసిన సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శుక్రవారం సందర్శించారు. -
దేశభక్తి చాటిన కార్గిల్ విజయోత్సవ ర్యాలీ
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధ విజయోత్సవానికి పాతికేళ్ల సందర్భంగా శుక్రవారం నారాయణగూడలోని రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి(అర్బీవీఆర్ఆర్) మహిళా కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్-2, తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ స్వచ్ఛంద సంస్థల సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ పలు ప్రాంతాల్లో కొనసాగింది. -
కోట్పల్లి కల్పవల్లి
[ 27-07-2024]
జిల్లాలో అతిపెద్దదైన కోట్పల్లి ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. బడ్జెట్లో రూ.8 కోట్లు కేటాయించింది. -
అరణ్యం కబ్జా పర్వం.. కొనసాగుతున్న వివాదం!
[ 27-07-2024]
రెండు దశాబ్దాలుగా జిల్లాకు చెందిన అటవీ భూములను ఆక్రమించుకుని కర్ణాటక వాసులు సాగు చేస్తూ పంటలు పండిస్తున్నారు. -
బాధిత అంధ బాలికను, కుటుంబాన్ని ఆదుకోవాలి
[ 27-07-2024]
మలక్పేట ప్రభుత్వ అంధ బాలికల వసతి గృహం వద్ద శుక్రవారం ఆందోళనలు కొనసాగాయి. -
రాష్ట్రపతి నిలయాల్లో సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం
[ 27-07-2024]
ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతిగా రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం, సిమ్లా, దిల్లీలోని రాష్ట్రపతి భవనాల సందర్శనకు సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు రాష్ట్రపతి నిలయం అధికారులు తెలిపారు. -
శిల్పారామం పేరు, లోగో వాడొద్దు
[ 27-07-2024]
అనుమతి లేకుండా శిల్పారామం పేరు, లోగోను ఇతరులు ఉపయోగించరాదని శిల్పారామం ప్రత్యేకాధికారి జి.కిషన్రావు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. -
ఆలయాల్లో కానుకలు చోరీ!
[ 27-07-2024]
దేవాలయాలు లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న టి.నరేందర్(27)ను శుక్రవారం అరెస్ట్ చేసినట్టు ఫలక్నుమా ఏసీపీ ఎన్.ఎల్.నారాయణరాజు తెలిపారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం