logo

కాపలాదారులు లేక వెలవెల

ఎన్నికల ప్రభావంతో రాజధానిలో అపార్టుమెంట్లు కాపలాదారులు లేక వెలవెలబోతున్నాయి. పోలింగ్‌ కోసం నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన లక్షలాదిమంది బుధవారం సొంతూర్లకు ప్రయాణమయ్యారు

Published : 30 Nov 2023 04:41 IST

పోలింగ్‌కు సొంతూర్లకు ప్రయాణం

ఈనాడు- హైదరాబాద్‌: ఎన్నికల ప్రభావంతో రాజధానిలో అపార్టుమెంట్లు కాపలాదారులు లేక వెలవెలబోతున్నాయి. పోలింగ్‌ కోసం నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన లక్షలాదిమంది బుధవారం సొంతూర్లకు ప్రయాణమయ్యారు. ఇలా వెళ్లిన వారిలో ఎక్కువ మంది అపార్టుమెంట్లు, గేటెడ్‌ కమ్యూనిటీల్లో కాపలా, ఇతర పనులు చేస్తూ ఉపాధి పొందుతున్నవారే.  కొందరు  కుటుంబాలతో సహా వెళ్లిపోయారు. ఓటేయాలన్న తాపత్రయంతో వెళ్లిన వారు కొందరైతే, మరికొందరు వివిధ పార్టీలు డబ్బు పంచుతున్నాయనే సమాచారంతో బయలుదేరారు. నగరంలోని అపార్టుమెంట్లలో భద్రత, నీటి సరఫరా, ఇస్త్రీ, ఇతర చిన్నాచితకా పనులన్నీ వీరే చూసుకుంటారు.  ఒకేసారి రెండు, మూడ్రోజులు సెలవు పెట్టి  వెళ్లడంతో ఆయా పనులకు ఇబ్బంది ఎదురవుతోందని, రాత్రి వేళ భద్రత కోసం తాత్కాలికంగా ఎవరినైనా వెతుక్కోవాల్సి వస్తోందని స్థానికులు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని