పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు
రాజధానిలో పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా పోలీసులు సర్వం సిద్ధం చేశారు. డీఆర్సీ కేంద్రాల నుంచి పోలింగ్ కేంద్రాలకు ఈవీఎం తరలింపు.. ఓటింగ్ పూర్తయ్యాక స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచే వరకూ బందోబస్తు పరంగా అన్ని ఏర్పాట్లు చేశారు.
స్ట్రాంగ్రూంల చెంత మూడంచెల భద్రత
ఈనాడు, హైదరాబాద్: రాజధానిలో పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా పోలీసులు సర్వం సిద్ధం చేశారు. డీఆర్సీ కేంద్రాల నుంచి పోలింగ్ కేంద్రాలకు ఈవీఎం తరలింపు.. ఓటింగ్ పూర్తయ్యాక స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచే వరకూ బందోబస్తు పరంగా అన్ని ఏర్పాట్లు చేశారు. బుధవారం సాయంత్రానికి డీసీపీ, ఏసీపీ, ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లకు.. కేంద్ర బలగాలు, ఇతర జిల్లాల నుంచి అదనపు పోలీసు సిబ్బంది కలిపి దాదాపు 30 వేల మందికి విధుల కేటాయింపు పూర్తయింది. మొత్తం 78 కంపెనీల కేంద్ర బలగాలు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నాయి. మూడు కమిషనరేట్లలో కలిపి 8,290 పోలింగ్ కేంద్రాలున్నాయి. వాటిలో 2 వేల వరకూ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలున్నట్లు గుర్తించారు. దీనికి తగినట్లు భద్రతా ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రాలవారీగా సిబ్బందికి రూట్మ్యాప్ నిర్దేశించారు. ఈ మార్గాల్లో మాత్రమే ఎన్నికల సిబ్బంది ప్రయాణించాల్సి ఉంటుంది.
అలాంటి కేంద్రాల వద్ద సంయుక్తంగా..
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల దగ్గర కేంద్ర, రాష్ట్ర బలగాలు సంయుక్తంగా విధుల్లో ఉంటాయి. ఒక్కో కేంద్రంలో నలుగురు కేంద్ర సాయధ సిబ్బంది, వారికి ఒక ఎస్సై ఇన్ఛార్జిగా ఉంటారు. ఒకే చోట ఎక్కువ సమస్యాత్మక కేంద్రాలుంటే ఐదుగురు చొప్పున ఉంటారు. సాధారణ పోలింగ్ బూత్లో ఒక కానిస్టేబుల్ విధుల్లో ఉంటారు. భద్రతా సిబ్బంది పూర్తిగా పోలింగ్ కేంద్రం వెలుపలే గస్తీలో ఉంటారు. వారు కాకుండా పెట్రోలింగ్, బ్లూకోల్ట్, సత్వర స్పందన బృందం(క్విక్ రెస్పాన్స్ టీమ్), స్పెషల్ స్ట్రెకింగ్ ఫోర్స్, రూట్ మొబైల్స్ అందుబాటులో ఉంటాయి. ఘర్షణ చెలరేగినా.. పోలింగ్ కేంద్రాల దగ్గర అనూహ్య పరిస్థితులు ఏర్పడ్డా.. వెంటనే చేరుకునేలా పోలీస్స్టేషన్, డివిజన్, జోనల్ స్థాయిలో ఇన్స్పెక్టర్, ఏసీపీ, డీసీపీ స్థాయిలో ప్రత్యేక బృందాలను అందుబాటులో ఉంచారు. అదనంగా ఫ్లయింగ్ స్వ్కాడ్లు విధుల్లో ఉంటాయి. పోలింగ్ కేంద్రాల దగ్గర 200 మీటర్ల లోపు నలుగురికి మించి గుమిగూడకుండా ఆదేశాలిచ్చారు. ఓటర్లను ప్రలోభపెట్టకుండా తనిఖీలు ముమ్మరం చేశారు.
స్ట్రాంగ్ రూముల వద్ద 144 సెక్షన్
పోలింగ్ ముగిసిన వెంటనే ఈవీఎంలను భద్రంగా స్ట్రాంగ్ రూములకు తరలించేందుకు ముందస్తు భద్రతా ఏర్పాట్లు చేశారు. అక్కడకు తీసుకెళ్లాల్సిన మార్గాల ఖరారు పూర్తయింది. పోలీసు భద్రత మధ్య వీటిని తరలిస్తారు. స్ట్రాంగ్ రూముల వద్ద 144 సెక్షన్తో పాటు మూడంచెల భద్రత విధానాన్ని అమలుచేయనున్నారు. తొలి అంచెలో పారామిలిటరీ, రెండో అంచెలో సాయుధ సిబ్బంది, మూడోదశలో సివిల్ పోలీసులు భద్రతా విధుల్లో ఉంటారు. అగ్నిప్రమాదాలకు అవకాశం లేకుండా ఫైరింజన్లు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 16 ఓట్ల లెక్కింపు కేంద్రాలున్నాయి.
మహా నగరంలో పోలింగ్ కేంద్రాలు
కమిషనరేట్ కేంద్రాలు సమస్యాత్మకం
హైదరాబాద్ 1,700 666
రాచకొండ 3,388 701
సైబరాబాద్ 3,202 655
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మ్యాన్హోల్ నుంచి వంటనూనెల వ్యర్థాలు
[ 27-07-2024]
ఆర్టీసీ క్రాస్రోడ్డు పరిధిలోని ప్రధాన రహదారిపై ఓ డ్రైనేజీ మ్యాన్హోల్ నుంచి శుక్రవారం ఉదయం వంటనూనెల వ్యర్థాలు పొంగిపొర్లాయి. -
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
[ 27-07-2024]
రైల్లో దూర ప్రయాణం.. రాత్రిళ్లు చల్లగాలి.. కబుర్లు చెప్పుకుంటూ నిద్రలోకి జారుకుంటే చాలు.. అదును కోసం చూస్తున్న దొంగలకు పండగే. -
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
[ 27-07-2024]
మహేశ్వరంలోని ఓ హోటల్లో చోరీ చేసేందుకు వచ్చిన ఓ దొంగ.. పోలీసులకు కనీసం ఒక్క క్లూ కూడా దొరక్కుండా.. ఎంతో జాగ్రత్తగా పథకం వేశాడు. -
పనులు కదలాలి.. ప్రగతి పరుగిడాలి
[ 27-07-2024]
ఎనిమిదేళ్ల కిందట రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రాంటుగా హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ)కు అందిన మొత్తం కేవలం రూ.250 కోట్లు. అప్పటి నుంచి బల్దియాకు ఒక్కపైసా కూడా గ్రాంటుగా నిధులందలేదు. -
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
[ 27-07-2024]
రాజీవ్ రహదారిపై అతివేగంగా కారు నడిపి బస్సును ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి చెందారు. -
ఆ భూముల జాడ.. దేవుడికే తెలియాలి
[ 27-07-2024]
రాజధాని పరిధిలో 9వేల ఎకరాలకుపైనే దేవాదాయశాఖ భూములున్నాయి. నిత్యం ధూప, దీప నైవేద్యాల కోసం గతంలో అనేక మంది భూవిరాళాలు ఇచ్చారు. -
పాలక మండలి సభ్యుల సంబరాలు
[ 27-07-2024]
నగరం అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరు శాఖలకు కలిపి పద్దులో రూ.10వేల కోట్లను కేటాయించడంపై కాంగ్రెస్కు చెందిన జీహెచ్ఎంసీ పాలకమండలి సభ్యులు శుక్రవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు. -
మా ఇష్టం.. మేమిట్లే జేస్తం
[ 27-07-2024]
రాజధాని నగరంలో బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు వేగంగా పెరుగుతుండడంతో వాటికి అవసరమైన ఇటుకల తయారీ కోసం కొందరు నీళ్లు సమృద్ధిగా ఉన్న జంటజలాశయాల పరివాహక ప్రాంతాన్ని ఎంచుకున్నారు. -
కుటుంబాలను కూల్చేస్తున్న రీల్స్
[ 27-07-2024]
రీల్స్ మోజులో పడి తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగిల్చినవారు కొందరైతే.. కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకున్నవారు మరికొందరు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
యువతలో పెరుగుతున్న హృద్రోగ ముప్పు
[ 27-07-2024]
యువతలో గుండె సమస్యలు పెరుగుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. -
విద్యుత్తు అధికారుల్లో సూర్యాఘర్ జోష్
[ 27-07-2024]
సౌర విద్యుత్తును 300 యూనిట్ల వరకూ పొందే ‘పీఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’ పథకంలో ఎక్కువ మందిని చేర్పించే విద్యుత్తు అధికారులకు కేంద్రం ప్రోత్సహకాలు ప్రకటించింది. -
మాజీ రాష్ట్రపతి సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం సందర్శన
[ 27-07-2024]
శంషాబాద్ మండలం శ్రీరామనగరంలో వెలిసిన సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శుక్రవారం సందర్శించారు. -
దేశభక్తి చాటిన కార్గిల్ విజయోత్సవ ర్యాలీ
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధ విజయోత్సవానికి పాతికేళ్ల సందర్భంగా శుక్రవారం నారాయణగూడలోని రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి(అర్బీవీఆర్ఆర్) మహిళా కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్-2, తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ స్వచ్ఛంద సంస్థల సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ పలు ప్రాంతాల్లో కొనసాగింది. -
కోట్పల్లి కల్పవల్లి
[ 27-07-2024]
జిల్లాలో అతిపెద్దదైన కోట్పల్లి ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. బడ్జెట్లో రూ.8 కోట్లు కేటాయించింది. -
అరణ్యం కబ్జా పర్వం.. కొనసాగుతున్న వివాదం!
[ 27-07-2024]
రెండు దశాబ్దాలుగా జిల్లాకు చెందిన అటవీ భూములను ఆక్రమించుకుని కర్ణాటక వాసులు సాగు చేస్తూ పంటలు పండిస్తున్నారు. -
బాధిత అంధ బాలికను, కుటుంబాన్ని ఆదుకోవాలి
[ 27-07-2024]
మలక్పేట ప్రభుత్వ అంధ బాలికల వసతి గృహం వద్ద శుక్రవారం ఆందోళనలు కొనసాగాయి. -
రాష్ట్రపతి నిలయాల్లో సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం
[ 27-07-2024]
ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతిగా రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం, సిమ్లా, దిల్లీలోని రాష్ట్రపతి భవనాల సందర్శనకు సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు రాష్ట్రపతి నిలయం అధికారులు తెలిపారు. -
శిల్పారామం పేరు, లోగో వాడొద్దు
[ 27-07-2024]
అనుమతి లేకుండా శిల్పారామం పేరు, లోగోను ఇతరులు ఉపయోగించరాదని శిల్పారామం ప్రత్యేకాధికారి జి.కిషన్రావు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. -
ఆలయాల్లో కానుకలు చోరీ!
[ 27-07-2024]
దేవాలయాలు లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న టి.నరేందర్(27)ను శుక్రవారం అరెస్ట్ చేసినట్టు ఫలక్నుమా ఏసీపీ ఎన్.ఎల్.నారాయణరాజు తెలిపారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం