logo

Hyderabad: కానిస్టేబుల్‌పై లాఠీ ఝుళిపించిన ఇన్‌స్పెక్టర్‌

పోలీసు ఇన్‌స్పెక్టర్‌ విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌పైనే లాఠీ ఝుళిపించారు. ఆదిభట్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని నాదర్‌గుల్‌లోని పోలింగ్‌ కేంద్రం దగ్గర గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది.

Updated : 01 Dec 2023 07:08 IST

ఈనాడు- హైదరాబాద్‌: పోలీసు ఇన్‌స్పెక్టర్‌ విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌పైనే లాఠీ ఝుళిపించారు. ఆదిభట్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని నాదర్‌గుల్‌లోని పోలింగ్‌ కేంద్రం దగ్గర గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. మహేశ్వరం భాజపా అభ్యర్థి అందెల శ్రీరాములు యాదవ్‌ నాదర్‌గుల్‌లోని జిల్లా పరిషత్తు పాఠశాలలోని పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లారు. ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఏఆర్‌ కానిస్టేబుల్‌ యాదగిరి  బయట ఎదురుచూస్తున్నారు. పెట్రోలింగ్‌ వాహనంలో ఆదిభట్ల ఇన్‌స్పెక్టర్‌ రఘువీర్‌రెడ్డి వచ్చారు. ఇన్‌స్పెక్టర్‌ను చూసిన కానిస్టేబుల్‌ సెల్యూట్‌ చేసేందుకుప్రయత్నించారు..‘‘సెల్యూట్‌ కొడుతున్నావేంటని’’ ప్రశ్నిస్తూ లాఠీతో కొట్టారు. దూరంగా నెట్టేశారు. అక్కడే ఉన్న ఓ వ్యక్తి దీన్ని చిత్రీకరించారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని