పోలీసు నీడలో పోలింగ్
అడుగడుగునా సాయుధ బలగాలు.. పోలీసు వాహనాల పహారా.. సీసీ కెమెరాలతో డేగకళ్ల నిఘా..రాజధానిలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలోని 8,290 కేంద్రాల్లో ఆటంకం లేకుండా పోలింగ్ కొనసాగింది.
రాజధానిలో ప్రశాంతంగా ముగిసిన ఓటింగ్
ఈనాడు, హైదరాబాద్: అడుగడుగునా సాయుధ బలగాలు.. పోలీసు వాహనాల పహారా.. సీసీ కెమెరాలతో డేగకళ్ల నిఘా..రాజధానిలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలోని 8,290 కేంద్రాల్లో ఆటంకం లేకుండా పోలింగ్ కొనసాగింది. నగర పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, రాచకొండ కమిషనర్ డీఎస్ చౌహాన్ పోలింగ్ కేంద్రాలను సందర్శిస్తూ సిబ్బందికి సూచనలు చేశారు. పోలింగ్ కోసం బుధవారం సాయంత్రం నుంచే పోలీసులు సిద్ధమయ్యారు. గురువారం తెల్లవారుజామున నుంచి అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పరిస్థితిని ఆధీనంలోకి తీసుకున్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 391 రూట్ మొబైల్స్, 129 పెట్రోలింగ్ వాహనాలు, 122 ఇతర పోలీసు వాహనాలు, ఏడుగురు డీసీపీలు, 28 మంది ఏసీపీల ఆధ్వర్యంలో స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, 9 టాస్క్ఫోర్స్ బృందాలు, 9 స్పెషల్ ఫోర్స్, 71 మంది ఇన్స్పెక్టర్లు, 125 మంది ఎస్ఐలు విధుల్లో పాల్గొన్నారు. సైబరాబాద్లో 7 నియోజకవర్గాలకు ఏసీపీలను పోలీసు నోడల్ అధికారులుగా నియమించారు. 259 రూట్ మొబైల్స్, 27 ఫ్లయింగ్ స్క్వాడ్, 24 స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్, 24 ఎంసీసీ బృందాలు, 103 క్యూఆర్టీ సత్వర స్పందన బృందాలు, 40 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ బృందాలు పనిచేశాయి.
కంట్రోల్ రూము నుంచి రోనాల్డ్రాస్ సూచనలు : పోలింగ్ తీరును హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్రాస్ గురువారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని కంట్రోల్ రూము నుంచి పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల చుట్టుపక్కల ఏర్పాటు చేసిన సుమారు 2వేల సీసీ కెమెరాలు, ప్రతి పోలింగ్ కేంద్రంలోని వెబ్కాస్టింగ్ ఫుటేజీని పరిశీలించారు. వెల్లడైన నిర్వహణ లోపాలను చక్కదిద్దారు. ఎన్నికల ప్రక్రియకు సహకరించిన ఓటర్లు, అధికార యంత్రాంగం, సిబ్బందికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.
నగరంలో 6000 నిఘా నేత్రాలు: నగరవ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల్లో, వాటి ఆవరణలో 6వేల సీసీ కెమెరాలు ఏర్పాటుచేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలతో పరిస్థితులను అంచనా వేశారు. బంజారాహిల్స్లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి సీసీ ఫుటేజీలను పరిశీలిస్తూ సీపీ సందీప్శాండిల్య దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో సంయుక్త సీపీ పరిమళ, డీసీపీలు పుష్ప, రాధేష్ మురళి, ఎస్పీ సురేందర్రెడ్డి పర్యవేక్షించారు. కమాండ్ కంట్రోల్ నుంచి పర్యవేక్షణ, మార్గదర్శనం తదితరాలను స్పెషల్ పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా, స్పెషల్ జనరల్ అబ్జర్వర్ అజయ్ వి నాయక్ పరిశీలించారు. సీపీ సందీప్ శాండిల్యను అభినందించారు.
అడుగడుగునా రహస్య కెమెరాలు: ఎన్నికల వేళ.. ప్రతి ఒక్కరి కదలికలను నగర పోలీసులు కెమెరాల్లో బంధించారు. బీటెక్ విద్యార్థులను పెద్ద సంఖ్యలో వినియోగించుకున్నారు. వైఫై సీసీ కెమెరాలను అమర్చి వాటిని సంబంధిత ఠాణాకు అనుసంధానం చేశారు.
మూడంచెల భద్రత: ఈవీఎంలను భద్రపరిచేందుకు పోలీసులు మూడంచెల భద్రతా వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. గురువారం సాయంత్రం పోలింగ్ పూర్తయ్యాక పటిష్ట భద్రత మధ్య ఈవీఎంలను తరలించారు. హైదరాబాద్లో 15, రంగారెడ్డి-4, మేడ్చల్ జిల్లాలో-1 ఒకటి కలిపి మొత్తం 20 స్ట్రాంగ్ రూములున్నాయి. ఈ కేంద్రాల వద్ద మొదటి దశలో స్థానిక పోలీసులు, రెండో దశలో సాయుధ సిబ్బంది, మూడో దశలో పారామిలిటరీ బలగాలు గస్తీలో ఉంటాయి. ఇక్కడే ఓట్ల లెక్కింపు కేంద్రాలుంటాయి. స్ట్రాంగ్ రూంల వద్ద 144 సెక్షన్ అమలుచేస్తారు.సమీపంలో ఫైరింజన్లు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పనులు కదలాలి.. ప్రగతి పరుగిడాలి
[ 27-07-2024]
ఎనిమిదేళ్ల కిందట రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రాంటుగా హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ)కు అందిన మొత్తం కేవలం రూ.250 కోట్లు. అప్పటి నుంచి బల్దియాకు ఒక్కపైసా కూడా గ్రాంటుగా నిధులందలేదు. -
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
[ 27-07-2024]
మహేశ్వరంలోని ఓ హోటల్లో చోరీ చేసేందుకు వచ్చిన ఓ దొంగ.. పోలీసులకు కనీసం ఒక్క క్లూ కూడా దొరక్కుండా.. ఎంతో జాగ్రత్తగా పథకం వేశాడు. -
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
[ 27-07-2024]
రాజీవ్ రహదారిపై అతివేగంగా కారు నడిపి బస్సును ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి చెందారు. -
ఆ భూముల జాడ.. దేవుడికే తెలియాలి
[ 27-07-2024]
రాజధాని పరిధిలో 9వేల ఎకరాలకుపైనే దేవాదాయశాఖ భూములున్నాయి. నిత్యం ధూప, దీప నైవేద్యాల కోసం గతంలో అనేక మంది భూవిరాళాలు ఇచ్చారు. -
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
[ 27-07-2024]
రైల్లో దూర ప్రయాణం.. రాత్రిళ్లు చల్లగాలి.. కబుర్లు చెప్పుకుంటూ నిద్రలోకి జారుకుంటే చాలు.. అదును కోసం చూస్తున్న దొంగలకు పండగే. -
పాలక మండలి సభ్యుల సంబరాలు
[ 27-07-2024]
నగరం అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరు శాఖలకు కలిపి పద్దులో రూ.10వేల కోట్లను కేటాయించడంపై కాంగ్రెస్కు చెందిన జీహెచ్ఎంసీ పాలకమండలి సభ్యులు శుక్రవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు. -
మా ఇష్టం.. మేమిట్లే జేస్తం
[ 27-07-2024]
రాజధాని నగరంలో బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు వేగంగా పెరుగుతుండడంతో వాటికి అవసరమైన ఇటుకల తయారీ కోసం కొందరు నీళ్లు సమృద్ధిగా ఉన్న జంటజలాశయాల పరివాహక ప్రాంతాన్ని ఎంచుకున్నారు. -
మ్యాన్హోల్ నుంచి వంటనూనెల వ్యర్థాలు
[ 27-07-2024]
ఆర్టీసీ క్రాస్రోడ్డు పరిధిలోని ప్రధాన రహదారిపై ఓ డ్రైనేజీ మ్యాన్హోల్ నుంచి శుక్రవారం ఉదయం వంటనూనెల వ్యర్థాలు పొంగిపొర్లాయి. -
కుటుంబాలను కూల్చేస్తున్న రీల్స్
[ 27-07-2024]
రీల్స్ మోజులో పడి తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగిల్చినవారు కొందరైతే.. కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకున్నవారు మరికొందరు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
యువతలో పెరుగుతున్న హృద్రోగ ముప్పు
[ 27-07-2024]
యువతలో గుండె సమస్యలు పెరుగుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. -
విద్యుత్తు అధికారుల్లో సూర్యాఘర్ జోష్
[ 27-07-2024]
సౌర విద్యుత్తును 300 యూనిట్ల వరకూ పొందే ‘పీఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’ పథకంలో ఎక్కువ మందిని చేర్పించే విద్యుత్తు అధికారులకు కేంద్రం ప్రోత్సహకాలు ప్రకటించింది. -
మాజీ రాష్ట్రపతి సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం సందర్శన
[ 27-07-2024]
శంషాబాద్ మండలం శ్రీరామనగరంలో వెలిసిన సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శుక్రవారం సందర్శించారు. -
దేశభక్తి చాటిన కార్గిల్ విజయోత్సవ ర్యాలీ
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధ విజయోత్సవానికి పాతికేళ్ల సందర్భంగా శుక్రవారం నారాయణగూడలోని రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి(అర్బీవీఆర్ఆర్) మహిళా కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్-2, తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ స్వచ్ఛంద సంస్థల సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ పలు ప్రాంతాల్లో కొనసాగింది. -
కోట్పల్లి కల్పవల్లి
[ 27-07-2024]
జిల్లాలో అతిపెద్దదైన కోట్పల్లి ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. బడ్జెట్లో రూ.8 కోట్లు కేటాయించింది. -
అరణ్యం కబ్జా పర్వం.. కొనసాగుతున్న వివాదం!
[ 27-07-2024]
రెండు దశాబ్దాలుగా జిల్లాకు చెందిన అటవీ భూములను ఆక్రమించుకుని కర్ణాటక వాసులు సాగు చేస్తూ పంటలు పండిస్తున్నారు. -
బాధిత అంధ బాలికను, కుటుంబాన్ని ఆదుకోవాలి
[ 27-07-2024]
మలక్పేట ప్రభుత్వ అంధ బాలికల వసతి గృహం వద్ద శుక్రవారం ఆందోళనలు కొనసాగాయి. -
రాష్ట్రపతి నిలయాల్లో సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం
[ 27-07-2024]
ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతిగా రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం, సిమ్లా, దిల్లీలోని రాష్ట్రపతి భవనాల సందర్శనకు సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు రాష్ట్రపతి నిలయం అధికారులు తెలిపారు. -
శిల్పారామం పేరు, లోగో వాడొద్దు
[ 27-07-2024]
అనుమతి లేకుండా శిల్పారామం పేరు, లోగోను ఇతరులు ఉపయోగించరాదని శిల్పారామం ప్రత్యేకాధికారి జి.కిషన్రావు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. -
ఆలయాల్లో కానుకలు చోరీ!
[ 27-07-2024]
దేవాలయాలు లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న టి.నరేందర్(27)ను శుక్రవారం అరెస్ట్ చేసినట్టు ఫలక్నుమా ఏసీపీ ఎన్.ఎల్.నారాయణరాజు తెలిపారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి