పక్కా ప్రణాళిక.. పటిష్ఠ కార్యాచరణ
జిల్లాలోని నాలుగు నియోజక వర్గాల్లో శాసన సభ ఎన్నికలు ప్రశాంతంగా సాగాయి. అక్కడక్కడా ఈవీఎంలు మొరాయించడం, పార్టీల అభ్యర్థులు గొడవ పడటం వంటి స్వల్ప ఘటనలు మినహా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు.
ఫలించిన ఎన్నికల సిబ్బంది కృషి
న్యూస్టుడే, వికారాబాద్ కలెక్టరేట్
కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన పరిశీలన తెరలు
జిల్లాలోని నాలుగు నియోజక వర్గాల్లో శాసన సభ ఎన్నికలు ప్రశాంతంగా సాగాయి. అక్కడక్కడా ఈవీఎంలు మొరాయించడం, పార్టీల అభ్యర్థులు గొడవ పడటం వంటి స్వల్ప ఘటనలు మినహా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు. రీ పోలింగ్ అనే మాటే లేకుండా అత్యంత సమర్థంగా ఎన్నికల నిర్వహణ సాగింది. కొన్నిచోట్ల అర్ధరాత్రి వరకూ పోలింగ్ జరిగినా సమస్యలు తలెత్తలేదు. దీంతో ప్రజలు అధికారుల తీరును ప్రశంసించారు. ఈ భగీరథ యత్నం సాఫీగా సాగడంలో కింది స్థాయి సిబ్బంది నుంచి పై స్థాయి కలెక్టర్ వరకు అందరి కృషి దాగి ఉంది. దీనిపై ‘న్యూస్టుడే’ కథనం
ప్రకటన వెలువడిన నాటినుంచే..
ఎన్నికల షెడ్యూల్ విడుదల నాటి నుంచే సిబ్బంది ఎన్నికల విధుల్లోకి వచ్చేశారు. చివరి ఓటు పోలయ్యే వరకు ప్రతి అధికారి తమ వంతుగా శ్రమించారు. సుమారు రెండు నెలలు పాటు అధికారులు ఎన్నికల విధుల్లోనే ఉన్నారు.
ఓటర్లలో చైతన్యానికి కృషి: ఈ ఎన్నికల్లో ప్రత్యేకంగా ఓటర్లను చైతన్యం చేయడానికి స్వీప్ విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందుగానే జిల్లాలో స్వీప్ నోడల్ అధికారులను, కోఆర్డినేటర్లను నియమించారు. నూటికి నూరు శాతం ఓటింగ్ను సాధించటానికి అధికారులు కృషి చేశారు. దీని కోసం డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో లిటరసీ క్లబ్లను ఏర్పాటు చేశారు.
సమైక్య కృషితోనే సాధించాం: కలెక్టర్
జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ జరగానికి పనిచేసిన ప్రతి ఒక్క సిబ్బంది కృషి దాగింది. అందరి సమైక్య కృషితోనే ఈ క్రతువు నిర్వహించగలిగాం. అవసరం మేరకు సిబ్బందిని నియమించి ఎప్పటికప్పుడు పర్యవేక్షించటంతో మరింత ప్రయోజనం కలిగింది. అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అభినందిస్తున్నాం.
ఫిర్యాదులపై స్పందన
ఎన్నికలకు సంబంధించి ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా డయల్ 1950, సి-విజల్, సువిధ యాప్ ద్వారా స్వీకరించారు. ఎప్పటికప్పుడు రికార్డు చేసి పరిష్కారం చూపారు. రాజకీయ పార్టీలు అభ్యర్థులు ఏంచేయాలి, చేయకూడదు అనేవి అధికారులు ఎప్పటికప్పుడు ఆయా పార్టీల ప్రతినిధులకు సమావేశాలను ఏర్పాటు చేసి వివరించారు.
వెబ్కాస్టింగ్, సాంకేతికత తోడు
జిల్లాలో ఒక్కొక్క పోలింగ్ ప్రాంతంలో ఒక వెబ్ కాస్టింగ్ సిబ్బందిని నియమించారు. వెబ్ కాస్టింగ్ సక్రంగా జరుగుతుందా అని వీరు ఎప్పటికప్పుడు పరిశీలించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రత్యేకంగా సిల్వర్ స్క్రీన్లను ఏర్పాటు చేసి పోలింగ్ కేంద్రాల్లో కొనసాగుతున్న కార్యక్రమాలను అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించారు. వెబ్ కాస్టింగ్ను ప్రత్యేకంగా 599 ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు.
సామగ్రి, పరిశీలకుల ఏర్పాటు
ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామగ్రిని గుర్తించటం వాటిని సమకూర్చుకోవటానికి ప్రత్యేకంగా సామగ్రి విభాగాన్ని ఏర్పాటు చేశారు. అలాగే ఎన్నికల పరిశీలకులు జిల్లాకు వచ్చినప్పుడు వారికి తగిన ఏర్పాట్లు చేయటానికి పరిశీలన విభాగం అందుబాటులోకి తెచ్చారు. అధికారుల రవాణాకు, ఈవీఎంల నిర్వహణకు, శాంతి భద్రతల పరిరక్షణకు, శిక్షణకు కమిటీలను ఏర్పాటు చేశారు.
అవగాహనకు శిక్షణ విభాగం ఏర్పాటు
విడివిడిగా విభాగాలను ఏర్పాటు చేసి వారికి బాధ్యతలను అప్పగించారు. ముఖ్యంగా ఉద్యోగుల పే స్కేల్ను పరిగణలోకి తీసుకుని పోలింగ్ కేంద్రాల్లో వివిధ స్థాయిలో అధికారులుగా నియమించారు. జిల్లాలో 1133 పోలింగ్ కేంద్రాలున్నాయి. 9,60,376 మంది ఓటర్లున్నారు. ఎన్నికల నిర్వహణపై ఉద్యోగులకు సృష్టమైన అవగాహన కల్పించటానికి శిక్షణ విభాగాన్ని ఏర్పాటు చేశారు.
నాలుగు నియోజక వర్గాలకు నలుగురు రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులును నియమించారు. అన్ని విభాగాల్లో కలిపి సుమారుగా 8600 మందిని ఎన్నికల్లో వినియోగించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
[ 27-07-2024]
రైల్లో దూర ప్రయాణం.. రాత్రిళ్లు చల్లగాలి.. కబుర్లు చెప్పుకుంటూ నిద్రలోకి జారుకుంటే చాలు.. అదును కోసం చూస్తున్న దొంగలకు పండగే. -
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
[ 27-07-2024]
మహేశ్వరంలోని ఓ హోటల్లో చోరీ చేసేందుకు వచ్చిన ఓ దొంగ.. పోలీసులకు కనీసం ఒక్క క్లూ కూడా దొరక్కుండా.. ఎంతో జాగ్రత్తగా పథకం వేశాడు. -
పనులు కదలాలి.. ప్రగతి పరుగిడాలి
[ 27-07-2024]
ఎనిమిదేళ్ల కిందట రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రాంటుగా హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ)కు అందిన మొత్తం కేవలం రూ.250 కోట్లు. అప్పటి నుంచి బల్దియాకు ఒక్కపైసా కూడా గ్రాంటుగా నిధులందలేదు. -
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
[ 27-07-2024]
రాజీవ్ రహదారిపై అతివేగంగా కారు నడిపి బస్సును ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి చెందారు. -
ఆ భూముల జాడ.. దేవుడికే తెలియాలి
[ 27-07-2024]
రాజధాని పరిధిలో 9వేల ఎకరాలకుపైనే దేవాదాయశాఖ భూములున్నాయి. నిత్యం ధూప, దీప నైవేద్యాల కోసం గతంలో అనేక మంది భూవిరాళాలు ఇచ్చారు. -
పాలక మండలి సభ్యుల సంబరాలు
[ 27-07-2024]
నగరం అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరు శాఖలకు కలిపి పద్దులో రూ.10వేల కోట్లను కేటాయించడంపై కాంగ్రెస్కు చెందిన జీహెచ్ఎంసీ పాలకమండలి సభ్యులు శుక్రవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు. -
మా ఇష్టం.. మేమిట్లే జేస్తం
[ 27-07-2024]
రాజధాని నగరంలో బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు వేగంగా పెరుగుతుండడంతో వాటికి అవసరమైన ఇటుకల తయారీ కోసం కొందరు నీళ్లు సమృద్ధిగా ఉన్న జంటజలాశయాల పరివాహక ప్రాంతాన్ని ఎంచుకున్నారు. -
మ్యాన్హోల్ నుంచి వంటనూనెల వ్యర్థాలు
[ 27-07-2024]
ఆర్టీసీ క్రాస్రోడ్డు పరిధిలోని ప్రధాన రహదారిపై ఓ డ్రైనేజీ మ్యాన్హోల్ నుంచి శుక్రవారం ఉదయం వంటనూనెల వ్యర్థాలు పొంగిపొర్లాయి. -
కుటుంబాలను కూల్చేస్తున్న రీల్స్
[ 27-07-2024]
రీల్స్ మోజులో పడి తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగిల్చినవారు కొందరైతే.. కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకున్నవారు మరికొందరు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
యువతలో పెరుగుతున్న హృద్రోగ ముప్పు
[ 27-07-2024]
యువతలో గుండె సమస్యలు పెరుగుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. -
విద్యుత్తు అధికారుల్లో సూర్యాఘర్ జోష్
[ 27-07-2024]
సౌర విద్యుత్తును 300 యూనిట్ల వరకూ పొందే ‘పీఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’ పథకంలో ఎక్కువ మందిని చేర్పించే విద్యుత్తు అధికారులకు కేంద్రం ప్రోత్సహకాలు ప్రకటించింది. -
మాజీ రాష్ట్రపతి సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం సందర్శన
[ 27-07-2024]
శంషాబాద్ మండలం శ్రీరామనగరంలో వెలిసిన సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శుక్రవారం సందర్శించారు. -
దేశభక్తి చాటిన కార్గిల్ విజయోత్సవ ర్యాలీ
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధ విజయోత్సవానికి పాతికేళ్ల సందర్భంగా శుక్రవారం నారాయణగూడలోని రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి(అర్బీవీఆర్ఆర్) మహిళా కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్-2, తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ స్వచ్ఛంద సంస్థల సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ పలు ప్రాంతాల్లో కొనసాగింది. -
కోట్పల్లి కల్పవల్లి
[ 27-07-2024]
జిల్లాలో అతిపెద్దదైన కోట్పల్లి ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. బడ్జెట్లో రూ.8 కోట్లు కేటాయించింది. -
అరణ్యం కబ్జా పర్వం.. కొనసాగుతున్న వివాదం!
[ 27-07-2024]
రెండు దశాబ్దాలుగా జిల్లాకు చెందిన అటవీ భూములను ఆక్రమించుకుని కర్ణాటక వాసులు సాగు చేస్తూ పంటలు పండిస్తున్నారు. -
బాధిత అంధ బాలికను, కుటుంబాన్ని ఆదుకోవాలి
[ 27-07-2024]
మలక్పేట ప్రభుత్వ అంధ బాలికల వసతి గృహం వద్ద శుక్రవారం ఆందోళనలు కొనసాగాయి. -
రాష్ట్రపతి నిలయాల్లో సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం
[ 27-07-2024]
ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతిగా రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం, సిమ్లా, దిల్లీలోని రాష్ట్రపతి భవనాల సందర్శనకు సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు రాష్ట్రపతి నిలయం అధికారులు తెలిపారు. -
శిల్పారామం పేరు, లోగో వాడొద్దు
[ 27-07-2024]
అనుమతి లేకుండా శిల్పారామం పేరు, లోగోను ఇతరులు ఉపయోగించరాదని శిల్పారామం ప్రత్యేకాధికారి జి.కిషన్రావు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. -
ఆలయాల్లో కానుకలు చోరీ!
[ 27-07-2024]
దేవాలయాలు లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న టి.నరేందర్(27)ను శుక్రవారం అరెస్ట్ చేసినట్టు ఫలక్నుమా ఏసీపీ ఎన్.ఎల్.నారాయణరాజు తెలిపారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు