logo

హైటెక్స్‌లో ట్రావెల్‌ మార్ట్‌ ప్రదర్శన ప్రారంభం

మాదాపూర్‌లోని హైటెక్స్‌లో ఇండియా ఇంటర్నేషనల్‌ ట్రావెల్‌ మార్ట్‌(ఐఐటీఎం) పేరిట ఏర్పాటు చేసిన పర్యాటక, ట్రావెల్స్‌ సంస్థల ప్రదర్శన శుక్రవారం ప్రారంభమైంది.

Published : 02 Dec 2023 01:43 IST

ప్రదర్శనలో ఏర్పాటు చేసిన వివిధ రాష్ట్రాల పర్యాటక శాఖ స్టాళ్లు

మాదాపూర్‌: మాదాపూర్‌లోని హైటెక్స్‌లో ఇండియా ఇంటర్నేషనల్‌ ట్రావెల్‌ మార్ట్‌(ఐఐటీఎం) పేరిట ఏర్పాటు చేసిన పర్యాటక, ట్రావెల్స్‌ సంస్థల ప్రదర్శన శుక్రవారం ప్రారంభమైంది. వివిధ రాష్ట్రాల పర్యాటక శాఖలు ఇక్కడ స్టాల్స్‌ ఏర్పాటు చేసి తమ రాష్ట్రంలో ఉన్న పర్యాటక ప్రదేశాలు, వాటి విశిష్ఠతలు, పర్యాటక ప్యాకేజీల వివరాలను సందర్శకులకు అవగాహన కల్పిస్తున్నారు. తెలంగాణ, ఒడిశా, ఉత్తర్‌ప్రదేశ్‌, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, రాజస్థాన్‌, గుజరాత్‌, తమిళనాడు తదితర రాష్ట్రాల పర్యాటక శాఖలు తమ ప్రాంత సంస్కృతిని ప్రతిబింబిస్తూ స్టాళ్లను తీర్చిదిద్దారు. పలు ప్రైవేటు టూరిజం, ట్రావెల్‌ సంస్థలు సైతం ఈ ప్రదర్శనలో స్టాల్స్‌ ఏర్పాటు చేశాయి.  3వ తేదీ వరకు ప్రదర్శన కొనసాగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని