బాతాఖానీ.. ఖాతా ఖాళీ
హుమాయున్నగర్కు చెందిన విశ్రాంత ఉద్యోగి వాట్సాప్ నంబరుకు లింక్ వచ్చింది. క్లిక్ చేస్తే బ్యాంకు ఖాతాకు పాన్కార్డు జత చేయకుంటే సేవలు నిలిపివేస్తామంటూ సారాంశం. కంగారుపడిన ఆయన డెబిట్కార్డు నెంబరు, ఓటీపీ చెప్పడంతో క్షణాల్లో రూ.1.33 లక్షలు లాగేశారు.
సేవలు నిలిపేస్తామంటూ లింక్లు పంపి.. ఓటీపీలు అడిగి దోచుకుంటున్న మాయగాళ్లు
5 రాష్ట్రాలకు విస్తరించిన జాంతారా ముఠాలు
హుమాయున్నగర్కు చెందిన విశ్రాంత ఉద్యోగి వాట్సాప్ నంబరుకు లింక్ వచ్చింది. క్లిక్ చేస్తే బ్యాంకు ఖాతాకు పాన్కార్డు జత చేయకుంటే సేవలు నిలిపివేస్తామంటూ సారాంశం. కంగారుపడిన ఆయన డెబిట్కార్డు నెంబరు, ఓటీపీ చెప్పడంతో క్షణాల్లో రూ.1.33 లక్షలు లాగేశారు.
లక్డీకపూల్లోని వ్యాపారి మొబైల్కు వచ్చిన లింక్ను క్లిక్ చేశారు. పాన్కార్డు నంబర్ను బ్యాంకు ఖాతాకు అప్డేట్ చేసుకోవాలని చెప్పడంతో ఆయన ఆన్లైన్లో వివరాలు నింపారు. బ్యాంకు ఛార్జీల పేరుతో రూ.10 చెల్లించి ఓటీపీ చెప్పారు. రూ.2 లక్షలు పోగొట్టుకున్నారు.
సైదాబాద్కు చెందిన విశ్రాంత ఉద్యోగి ఫోన్ నెంబర్కు కస్టమర్కేర్ నుంచి ఫోన్ చేశారు. బ్యాంక్ ఖాతా సేవలు నిలిచిపోయాయని పునరుద్ధరించేందుకు బ్యాంకు వివరాలు అడగటంతో ఆయన చెప్పేశారు. ఎనీడెస్క్ యాప్ను మొబైల్లో డౌన్లోడ్ చేయించి రూ.3.50లక్షలు కాజేశారు.
సికింద్రాబాద్లో ఉంటున్న చిరువ్యాపారికి ఉదయాన్నే ఫోన్కాల్ వచ్చింది. క్రెడిట్కార్డు పరిమితిని పెంచుతామంటూ లింకు పంపారు. దాన్ని క్లిక్ చేసి అట్నుంచి అడిగిన వివరాలు, ఓటీపీ పంచుకున్నాడు. అంతే రెండు దఫాలుగా రూ.లక్షతో ఇ-కామర్స్ ద్వారా వస్తువులు కొనుగోలు చేశారు.
ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. కరోనా అనంతరం డిజిటల్ లావాదేవీలు క్రెడిట్/డెబిట్కార్డులు వినియోగాలు తప్పనిసరి కావడంతో మాయగాళ్లు సామాన్యులను హడలెత్తిస్తున్నారు. గ్రేటర్ పరిధిలోని మూడు పోలీసు కమిషనరేట్స్ పరిధిలో 10 నెలల వ్యవధిలోనే సుమారు 5వేలకు పైగా సైబర్ కేసులు నమోదైనట్లు అంచనా. వీటిలో కస్టమర్కేర్ సెంటర్, ఓటీపీ ద్వారా సొమ్ము పోగొట్టుకున్నవి, పాన్కార్డు అప్డేట్, పాన్ నంబర్లకు ఖాతా లింక్ చేస్తామంటే నమ్మి మోసపోయిన కేసులు 1500 మందికి పైగా ఉన్నాయి. ఎనీడెస్క్/వ్యూయర్ యాప్ల ద్వారా బాధితుల సెల్ఫోన్, ల్యాప్ట్యాప్లను తమ ఆధీనంలోకి తీసుకుంటారు. బ్యాంకు ఖాతా నెంబరు, ఓటీపీలతో సొమ్మంతా స్వాహా చేస్తుంటారు. బాధితుల్లో విశ్రాంత ఉద్యోగులు, విద్యావంతులు, ఐటీ నిపుణులు, గృహిణులు, వ్యాపారులు అధికశాతం ఉంటున్నారు. కొట్టేసిన నగదును నిందితులు క్రిప్టో కరెన్సీగా మార్చి డిజిటల్ హవాలా మార్గంలో విదేశాలకు తరలిస్తున్నారు.
లింకులను క్లిక్ చేయొద్దు
- గుర్తుతెలియని వ్యక్తులు/సంస్థల పేరుతో ఫోన్లు, వాట్సాప్లకు వచ్చే లింకులను క్లిక్ చేయవద్దు.
- ఒక్కసారి పాన్కార్డు నంబరు వచ్చాక జీవితకాలం అదే కొనసాగుతుంది. ఆప్డేట్ చేయడం ఉండదు.
- బ్యాంకు ఖాతాలతో పాన్కార్డు అనుసంధానించాలని ఫోన్ వస్తే సంబంధిత బ్యాంకుకు నేరుగా వెళ్లి అధికారులను సంప్రదించండి.
- సైబర్ నేరం బారిన పడితే వెంటనే టోల్ఫ్రీ నంబర్ 1930కు ఫిర్యాదు చేయాలి. మాయగాళ్ల ఖాతాను స్తంభింపజేసే అవకాశం ఉంటుంది.
కేటుగాళ్లు ఎవరో తెలుసా?
నామమాత్రం చదువులు.. ఆకతాయిగా తిరిగే కుర్రాళ్లు.. ఒంటికి చెమట పట్టకుండా రూ.లక్షలు కొట్టేస్తున్నారు. గతంలో ఝార్ఖండ్ జాంతారాకే పరిమితమైన వీరు పాన్ఇండియాగా విస్తరించారు. బిహార్, ఛత్తీస్గఢ్, పశ్చిమబెంగాల్, ఝార్ఖండ్, రాజస్థాన్ల్లో ముఠాలుగా ఏర్పడి దందా సాగిస్తున్నారు. భరత్పూర్, పట్నా, బెగుసరాయ్, ధన్బాగ్, కోల్కతా నుంచి దేశవ్యాప్తంగా నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నారు. ఆన్లైన్ ద్వారా బ్యాంకు ఖాతాలు, పాన్కార్డులు, ఆధార్కార్డులు, ఫోన్ నంబర్లు సేకరిస్తున్నారు. రోజూ ఒక్కొక్కరు సుమారు 200-300 ఫిషింగ్ సందేశాలు, మెయిల్స్ పంపుతుంటారు. లావాదేవీలు నిలిపివేస్తారనే ఆందోళనతో లింకులను క్లిక్ చేసిన వారి బలహీనతను ఆసరా చేసుకొని ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. నిందితుల ఖాతాలను స్తంభింపజేసినా అప్పటికే నగదు వేర్వేరు ఖాతాల్లోకి చేరిపోతుంది.
ఈనాడు, హైదరాబాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మ్యాన్హోల్ నుంచి వంటనూనెల వ్యర్థాలు
[ 27-07-2024]
ఆర్టీసీ క్రాస్రోడ్డు పరిధిలోని ప్రధాన రహదారిపై ఓ డ్రైనేజీ మ్యాన్హోల్ నుంచి శుక్రవారం ఉదయం వంటనూనెల వ్యర్థాలు పొంగిపొర్లాయి. -
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
[ 27-07-2024]
రైల్లో దూర ప్రయాణం.. రాత్రిళ్లు చల్లగాలి.. కబుర్లు చెప్పుకుంటూ నిద్రలోకి జారుకుంటే చాలు.. అదును కోసం చూస్తున్న దొంగలకు పండగే. -
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
[ 27-07-2024]
మహేశ్వరంలోని ఓ హోటల్లో చోరీ చేసేందుకు వచ్చిన ఓ దొంగ.. పోలీసులకు కనీసం ఒక్క క్లూ కూడా దొరక్కుండా.. ఎంతో జాగ్రత్తగా పథకం వేశాడు. -
పనులు కదలాలి.. ప్రగతి పరుగిడాలి
[ 27-07-2024]
ఎనిమిదేళ్ల కిందట రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రాంటుగా హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ)కు అందిన మొత్తం కేవలం రూ.250 కోట్లు. అప్పటి నుంచి బల్దియాకు ఒక్కపైసా కూడా గ్రాంటుగా నిధులందలేదు. -
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
[ 27-07-2024]
రాజీవ్ రహదారిపై అతివేగంగా కారు నడిపి బస్సును ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి చెందారు. -
ఆ భూముల జాడ.. దేవుడికే తెలియాలి
[ 27-07-2024]
రాజధాని పరిధిలో 9వేల ఎకరాలకుపైనే దేవాదాయశాఖ భూములున్నాయి. నిత్యం ధూప, దీప నైవేద్యాల కోసం గతంలో అనేక మంది భూవిరాళాలు ఇచ్చారు. -
పాలక మండలి సభ్యుల సంబరాలు
[ 27-07-2024]
నగరం అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరు శాఖలకు కలిపి పద్దులో రూ.10వేల కోట్లను కేటాయించడంపై కాంగ్రెస్కు చెందిన జీహెచ్ఎంసీ పాలకమండలి సభ్యులు శుక్రవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు. -
మా ఇష్టం.. మేమిట్లే జేస్తం
[ 27-07-2024]
రాజధాని నగరంలో బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు వేగంగా పెరుగుతుండడంతో వాటికి అవసరమైన ఇటుకల తయారీ కోసం కొందరు నీళ్లు సమృద్ధిగా ఉన్న జంటజలాశయాల పరివాహక ప్రాంతాన్ని ఎంచుకున్నారు. -
కుటుంబాలను కూల్చేస్తున్న రీల్స్
[ 27-07-2024]
రీల్స్ మోజులో పడి తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగిల్చినవారు కొందరైతే.. కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకున్నవారు మరికొందరు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
యువతలో పెరుగుతున్న హృద్రోగ ముప్పు
[ 27-07-2024]
యువతలో గుండె సమస్యలు పెరుగుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. -
విద్యుత్తు అధికారుల్లో సూర్యాఘర్ జోష్
[ 27-07-2024]
సౌర విద్యుత్తును 300 యూనిట్ల వరకూ పొందే ‘పీఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’ పథకంలో ఎక్కువ మందిని చేర్పించే విద్యుత్తు అధికారులకు కేంద్రం ప్రోత్సహకాలు ప్రకటించింది. -
మాజీ రాష్ట్రపతి సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం సందర్శన
[ 27-07-2024]
శంషాబాద్ మండలం శ్రీరామనగరంలో వెలిసిన సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శుక్రవారం సందర్శించారు. -
దేశభక్తి చాటిన కార్గిల్ విజయోత్సవ ర్యాలీ
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధ విజయోత్సవానికి పాతికేళ్ల సందర్భంగా శుక్రవారం నారాయణగూడలోని రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి(అర్బీవీఆర్ఆర్) మహిళా కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్-2, తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ స్వచ్ఛంద సంస్థల సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ పలు ప్రాంతాల్లో కొనసాగింది. -
కోట్పల్లి కల్పవల్లి
[ 27-07-2024]
జిల్లాలో అతిపెద్దదైన కోట్పల్లి ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. బడ్జెట్లో రూ.8 కోట్లు కేటాయించింది. -
అరణ్యం కబ్జా పర్వం.. కొనసాగుతున్న వివాదం!
[ 27-07-2024]
రెండు దశాబ్దాలుగా జిల్లాకు చెందిన అటవీ భూములను ఆక్రమించుకుని కర్ణాటక వాసులు సాగు చేస్తూ పంటలు పండిస్తున్నారు. -
బాధిత అంధ బాలికను, కుటుంబాన్ని ఆదుకోవాలి
[ 27-07-2024]
మలక్పేట ప్రభుత్వ అంధ బాలికల వసతి గృహం వద్ద శుక్రవారం ఆందోళనలు కొనసాగాయి. -
రాష్ట్రపతి నిలయాల్లో సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం
[ 27-07-2024]
ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతిగా రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం, సిమ్లా, దిల్లీలోని రాష్ట్రపతి భవనాల సందర్శనకు సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు రాష్ట్రపతి నిలయం అధికారులు తెలిపారు. -
శిల్పారామం పేరు, లోగో వాడొద్దు
[ 27-07-2024]
అనుమతి లేకుండా శిల్పారామం పేరు, లోగోను ఇతరులు ఉపయోగించరాదని శిల్పారామం ప్రత్యేకాధికారి జి.కిషన్రావు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. -
ఆలయాల్లో కానుకలు చోరీ!
[ 27-07-2024]
దేవాలయాలు లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న టి.నరేందర్(27)ను శుక్రవారం అరెస్ట్ చేసినట్టు ఫలక్నుమా ఏసీపీ ఎన్.ఎల్.నారాయణరాజు తెలిపారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
స్టంట్ చేస్తూ, కాలుచేయి పోగొట్టుకున్న యువకుడు: రైల్వే పోస్టు వైరల్
-
మరో రికార్డును సొంతం చేసుకున్న విశాఖ ఉక్కు .. కార్మికుల హర్షాతిరేకాలు
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్