ఈవీఎంలలో బలాలు.. బయట బలగాలు
శాసనసభ ఎన్నికల పోలింగ్ను ప్రశాంతంగా పూర్తి చేసిన యంత్రాంగం.. ఓట్ల లెక్కింపు కేంద్రాలపై దృష్టి కేంద్రీకరించింది. అభ్యర్థుల భవిష్యత్తును నిక్షిప్తం చేసుకున్న ఈవీఎం యంత్రాలను స్ట్రాంగ్రూంలో భద్రంగా ఉంచారు.
కౌంటింగ్ వేళ నిషేధాజ్ఞలు
3న మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్ల మూసివేత
ఈనాడు, హైదరాబాద్: శాసనసభ ఎన్నికల పోలింగ్ను ప్రశాంతంగా పూర్తి చేసిన యంత్రాంగం.. ఓట్ల లెక్కింపు కేంద్రాలపై దృష్టి కేంద్రీకరించింది. అభ్యర్థుల భవిష్యత్తును నిక్షిప్తం చేసుకున్న ఈవీఎం యంత్రాలను స్ట్రాంగ్రూంలో భద్రంగా ఉంచారు. గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్లోని 28 అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల పోలీస్ బలగాలను మోహరించారు. కొత్తగా సీసీ కెమెరాల పర్యవేక్షణ ఏర్పాటు చేశారు.
కేంద్ర, రాష్ట్ర పోలీసుల పహారా..
ఈవీఎం యంత్రాలను పంపిణీ చేసిన కేంద్రాలనే ఓట్ల లెక్కింపునకు ఎన్నికల అధికారులు ఎంపిక చేశారు. ఈవీఎం పంపిణీ కేంద్రాలకు పక్కనే లెక్కింపు కేంద్రాలను సిద్ధం చేశారు. స్ట్రాంగ్రూంలలో ఈవీఎంలను ఉంచాక వాటి భద్రతను రిటర్నింగ్ అధికారికి అప్పగించారు. ఆర్వో సూచనతో లెక్కింపు కేంద్రం వద్ద సశస్త్ర సీమ బల్ బలగాలు, తెలంగాణ ప్రత్యేక పోలీస్ సాయుధ బలగాలు, పరిసర ప్రాంతాల్లో శాంతిభద్రతలు, ట్రాఫిక్ పోలీసులను నియమించారు. ఒక్కో కేంద్రం వద్ద ఒక ప్లటూన్ సశస్త్ర సీమ బల్ బలగాలు విధులు నిర్వహిస్తున్నాయి. వీరికి అక్కడే వసతి కల్పించారు. నిరంతర భద్రత ఉన్నా.. అనుమానాస్పద సంఘటనలు, వ్యక్తులు సంచరిస్తే వెంటనే గుర్తించేందుకు చుట్టూ సీసీ కెమెరాలను అమర్చారు.
ఫలితాలు.. భావోద్వేగాలు
ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ఫలితాలు వెలువడం మొదలు కాగానే అభ్యర్థులు, రాజకీయపార్టీల నాయకులు భావోద్వేగాలకు లోనై హడావుడి సృష్టించడం, బాణసంచా కాల్చకుండా నిషేధం విధించారు. ఒకవేళ ఎవరైనా హంగామా సృష్టించినా.. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఓట్ల లెక్కింపు కేంద్రాలను రద్దీలేని ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. నాయకులు, అభ్యర్థులు గొడవలు సృష్టించినా, పోలీసులు వారిని పట్టుకునేందుకు వీలుగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం, సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం వంటివాటిలో ఓట్ల లెక్కింపు చేపట్టారు. సమస్యాత్మక నియోజకవర్గాల లెక్కింపును మైదానాలు, స్టేడియంలలో ఏర్పాటు చేశారు. రాజకీయ నాయకులు, వారి అనుచరులు వందల సంఖ్యలో వచ్చినా వాహనాలు ఉంచేందుకు పార్కింగ్ వసతిని కల్పించారు.
నగరంలో ఓట్ల లెక్కింపు సందర్భంగా ఆదివారం ఉదయం 6 నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకూ నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని నగర సీపీ సందీప్శాండిల్య శుక్రవారం తెలిపారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లో 15 కౌంటింగ్ కేంద్రాలున్నట్లు పేర్కొన్నారు. నగరంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. ఐదుగురు, అంతకుమించి వ్యక్తులు ఒకేచోట గుమికూడదన్నారు. కౌంటింగ్ కేంద్రాలకు కిలోమీటరు దూరంగా జెండాలు, కర్రలు, పేలుడు పదార్థాలు, గుమికూడటం, సమావేశాలు నిర్వహించకూడదన్నారు. ప్రజలను ఉద్దేశించి మైకుల్లో ప్రచారం, సమావేశాలు, ఆటపాటలు నిర్వహించకూడదని స్పష్టంచేశారు. శాంతిభద్రతల నిర్వహణలో భాగంగా నగరంలో 3వ తేదీ ఉదయం 6 నుంచి 4వ తేది ఉదయం 6 గంటల వరకూ మద్యం విక్రయాలు నిలిపివేయాలని ఉత్తర్వులు జారీచేశారు. మద్యం దుకాణాలు, రెస్టారెంట్లు, క్లబ్బులు, స్టార్ హోటళ్లకు నిబంధన వర్తిసుందని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఓట్ల లెక్కింపునకు పటిష్ఠ భద్రత
నాంపల్లిలో లెక్కింపు కేంద్రం వద్ద బందోబస్తు
ఈనాడు, హైదరాబాద్: నగరంలో ఆదివారం ఎన్నికల లెక్కింపునకు పోలీసు యంత్రాంగం పటిష్ఠమైన భద్రత ఏర్పాటు చేయనుంది. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు చేపట్టిన ప్రణాళిక సానుకూల ఫలితాన్నిచ్చింది. నగర సీపీ సందీప్శాండిల్య క్షేత్రస్థాయిలో పలు పోలింగ్ కేంద్రాలను చుట్టొస్తూ సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. గతంలో గొడవలు జరిగిన బోరబండ, మురాద్నగర్, ఆసిఫ్నగర్, నాంపల్లి, యాకుత్పుర, చాంద్రాయణగుట్ట, మలక్పేట్ తదితర ప్రాంతాల్లో ఈ దఫా ప్రశాంతంగా పోలింగ్ ముగియటంతో అక్కడి డీసీపీ, ఏసీపీ, ఇన్స్పెక్టర్లను సీపీ అభినందించారు. ఎన్నికల ఫలితం వెలువడే రోజున కూడా ఇదే స్ఫూర్తితో బందోబస్తు విధులు నిర్వర్తించాలని సూచించారు. నగరవ్యాప్తంగా హాట్స్పాట్స్ వద్ద అదనపు బలగాలను రంగంలోకి దింపనున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. శనివారం అర్ధరాత్రి నుంచే రాజకీయపార్టీల కార్యాలయాలు, అధికార, ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుల నివాసాలు, ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల నివాసాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. సామాజిక మాధ్యమాలపై నిఘా ఉంచారు. బంజారాహిల్స్లోని పోలీసు కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి క్షేత్రస్థాయి పరిస్థితులను పర్యవేక్షించేందుకు ఏర్పాట్లు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పనులు కదలాలి.. ప్రగతి పరుగిడాలి
[ 27-07-2024]
ఎనిమిదేళ్ల కిందట రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రాంటుగా హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ)కు అందిన మొత్తం కేవలం రూ.250 కోట్లు. అప్పటి నుంచి బల్దియాకు ఒక్కపైసా కూడా గ్రాంటుగా నిధులందలేదు. -
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
[ 27-07-2024]
మహేశ్వరంలోని ఓ హోటల్లో చోరీ చేసేందుకు వచ్చిన ఓ దొంగ.. పోలీసులకు కనీసం ఒక్క క్లూ కూడా దొరక్కుండా.. ఎంతో జాగ్రత్తగా పథకం వేశాడు. -
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
[ 27-07-2024]
రాజీవ్ రహదారిపై అతివేగంగా కారు నడిపి బస్సును ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి చెందారు. -
ఆ భూముల జాడ.. దేవుడికే తెలియాలి
[ 27-07-2024]
రాజధాని పరిధిలో 9వేల ఎకరాలకుపైనే దేవాదాయశాఖ భూములున్నాయి. నిత్యం ధూప, దీప నైవేద్యాల కోసం గతంలో అనేక మంది భూవిరాళాలు ఇచ్చారు. -
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
[ 27-07-2024]
రైల్లో దూర ప్రయాణం.. రాత్రిళ్లు చల్లగాలి.. కబుర్లు చెప్పుకుంటూ నిద్రలోకి జారుకుంటే చాలు.. అదును కోసం చూస్తున్న దొంగలకు పండగే. -
పాలక మండలి సభ్యుల సంబరాలు
[ 27-07-2024]
నగరం అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరు శాఖలకు కలిపి పద్దులో రూ.10వేల కోట్లను కేటాయించడంపై కాంగ్రెస్కు చెందిన జీహెచ్ఎంసీ పాలకమండలి సభ్యులు శుక్రవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు. -
మా ఇష్టం.. మేమిట్లే జేస్తం
[ 27-07-2024]
రాజధాని నగరంలో బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు వేగంగా పెరుగుతుండడంతో వాటికి అవసరమైన ఇటుకల తయారీ కోసం కొందరు నీళ్లు సమృద్ధిగా ఉన్న జంటజలాశయాల పరివాహక ప్రాంతాన్ని ఎంచుకున్నారు. -
మ్యాన్హోల్ నుంచి వంటనూనెల వ్యర్థాలు
[ 27-07-2024]
ఆర్టీసీ క్రాస్రోడ్డు పరిధిలోని ప్రధాన రహదారిపై ఓ డ్రైనేజీ మ్యాన్హోల్ నుంచి శుక్రవారం ఉదయం వంటనూనెల వ్యర్థాలు పొంగిపొర్లాయి. -
కుటుంబాలను కూల్చేస్తున్న రీల్స్
[ 27-07-2024]
రీల్స్ మోజులో పడి తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగిల్చినవారు కొందరైతే.. కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకున్నవారు మరికొందరు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
యువతలో పెరుగుతున్న హృద్రోగ ముప్పు
[ 27-07-2024]
యువతలో గుండె సమస్యలు పెరుగుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. -
విద్యుత్తు అధికారుల్లో సూర్యాఘర్ జోష్
[ 27-07-2024]
సౌర విద్యుత్తును 300 యూనిట్ల వరకూ పొందే ‘పీఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’ పథకంలో ఎక్కువ మందిని చేర్పించే విద్యుత్తు అధికారులకు కేంద్రం ప్రోత్సహకాలు ప్రకటించింది. -
మాజీ రాష్ట్రపతి సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం సందర్శన
[ 27-07-2024]
శంషాబాద్ మండలం శ్రీరామనగరంలో వెలిసిన సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శుక్రవారం సందర్శించారు. -
దేశభక్తి చాటిన కార్గిల్ విజయోత్సవ ర్యాలీ
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధ విజయోత్సవానికి పాతికేళ్ల సందర్భంగా శుక్రవారం నారాయణగూడలోని రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి(అర్బీవీఆర్ఆర్) మహిళా కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్-2, తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ స్వచ్ఛంద సంస్థల సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ పలు ప్రాంతాల్లో కొనసాగింది. -
కోట్పల్లి కల్పవల్లి
[ 27-07-2024]
జిల్లాలో అతిపెద్దదైన కోట్పల్లి ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. బడ్జెట్లో రూ.8 కోట్లు కేటాయించింది. -
అరణ్యం కబ్జా పర్వం.. కొనసాగుతున్న వివాదం!
[ 27-07-2024]
రెండు దశాబ్దాలుగా జిల్లాకు చెందిన అటవీ భూములను ఆక్రమించుకుని కర్ణాటక వాసులు సాగు చేస్తూ పంటలు పండిస్తున్నారు. -
బాధిత అంధ బాలికను, కుటుంబాన్ని ఆదుకోవాలి
[ 27-07-2024]
మలక్పేట ప్రభుత్వ అంధ బాలికల వసతి గృహం వద్ద శుక్రవారం ఆందోళనలు కొనసాగాయి. -
రాష్ట్రపతి నిలయాల్లో సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం
[ 27-07-2024]
ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతిగా రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం, సిమ్లా, దిల్లీలోని రాష్ట్రపతి భవనాల సందర్శనకు సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు రాష్ట్రపతి నిలయం అధికారులు తెలిపారు. -
శిల్పారామం పేరు, లోగో వాడొద్దు
[ 27-07-2024]
అనుమతి లేకుండా శిల్పారామం పేరు, లోగోను ఇతరులు ఉపయోగించరాదని శిల్పారామం ప్రత్యేకాధికారి జి.కిషన్రావు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. -
ఆలయాల్లో కానుకలు చోరీ!
[ 27-07-2024]
దేవాలయాలు లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న టి.నరేందర్(27)ను శుక్రవారం అరెస్ట్ చేసినట్టు ఫలక్నుమా ఏసీపీ ఎన్.ఎల్.నారాయణరాజు తెలిపారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి