Hyderabad: 14 టేబుళ్లు, 16 - 25 రౌండ్లు.. విజేత తేలేదిలా..
ఎన్నికల పర్వంలో చివరిది.. అత్యంత కీలకమైన ప్రక్రియ ఓట్ల లెక్కింపునకు రంగం సిద్ధమైంది. అవసరమైన అధికారులు, సిబ్బందికి విధుల కేటాయింపు పూర్తయింది. ఆదివారం వేకువ జామున 5గంటలకే ఉద్యోగులు, సిబ్బంది లెక్కింపు కేంద్రాలకు చేరుకోవాలని ఎన్నికల విభాగం ఆదేశించింది.
ఉదయం 5గంటలకే లెక్కింపు కేంద్రాలకు అధికారలు
నియోజకవర్గానికి 14 టేబుళ్లు, తపాలా ఓట్లకు అదనం
మొదట చార్మినార్ ఫలితం
ఈనాడు, హైదరాబాద్
గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలోని లెక్కింపు కేంద్రం
ఎన్నికల పర్వంలో చివరిది.. అత్యంత కీలకమైన ప్రక్రియ ఓట్ల లెక్కింపునకు రంగం సిద్ధమైంది. అవసరమైన అధికారులు, సిబ్బందికి విధుల కేటాయింపు పూర్తయింది. ఆదివారం వేకువ జామున 5గంటలకే ఉద్యోగులు, సిబ్బంది లెక్కింపు కేంద్రాలకు చేరుకోవాలని ఎన్నికల విభాగం ఆదేశించింది. ఓట్ల లెక్కింపుపై గంటపాటు ఉద్యోగులకు దిశా నిర్దేశం చేసి, అనంతరం అభ్యర్థుల సమక్షంలో ఉదయం 8గంటలకు ప్రక్రియ ప్రారంభిస్తామని అధికారులు స్పష్టం చేశారు. ఒక్కో నియోజకవర్గానికి 14 టేబుళ్లు ఏర్పాటుచేసి ఈవీఎంల్లో నమోదైన ఓట్లను లెక్కిస్తామంటున్నారు. తపాలా ఓట్ల లెక్కింపునకు అదనపు టేబుళ్లు ఉంటాయి.
టేబుల్ వద్ద ఎవరెవరంటే..
ఓ సూపర్వైజర్, ఇద్దరు సహాయకులు, ఓ మైక్రో అబ్జర్వర్ ఉంటారు. అభ్యర్థులు తమ ఏజెంటును కూడా ఉంచొచ్చు. వీరు ఇచ్చే లెక్కలను సంబంధిత నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి(ఆర్వో), కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన పరిశీలకులు సరిచూస్తారు. సవ్యమేనని నిర్ధారించుకున్నాక ఆ రౌండ్ ఫలితాన్ని ప్రకటిస్తారు. ఈ సారి ఓట్ల లెక్కింపునకు ప్రత్యేక సాఫ్ట్వేర్ అందుబాటులోకి వచ్చిందని, వేగంగా ఫలితాల వెల్లడి జరగనుందని అధికారులు ధీమా వ్యక్తంచేస్తున్నారు.
15 రౌండ్లలోనే..
తపాలా ఓట్లు, సర్వీసు ఓట్లను ముందుగా లెక్కిస్తారు. ఈ ప్రక్రియ 8గంటలకు మొదలైతే.. 20 నుంచి 30 నిమిషాల్లో ఫలితం వెల్లడవుతుందని అధికారుల అంచనా. హైదరాబాద్ జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో తక్కువ పోలింగ్ కేంద్రాలున్న నియోజకవర్గం చార్మినార్. అక్కడ 202 కేంద్రాల్లో ఎన్నిక జరగ్గా, ఆయా ఈవీఎంల్లోని ఓట్ల లెక్కింపు 15 రౌండ్లలో పూర్తవుతుంది. మిగిలిన స్థానాల్లో ఫలితాలకు 16 నుంచి 25 రౌండ్లు వేచిచూడాలి.
14టేబుళ్లపై ఈవీఎంలు..
ఈవీఎంలలో నమోదైన ఓట్ల లెక్కింపునకు నియోజకవర్గానికి 14 టేబుళ్లు ఏర్పాటుకానున్నాయి. సహాయకులు పోలింగ్ కేంద్రాల ఈవీఎంలను క్రమపద్ధతిలో తీసుకొచ్చి టేబుళ్లపై ఉంచుతారు. సూపర్వైజర్ వాటిపై ఉండే రిజల్ట్ మీటను నొక్కి పార్టీలవారీగా నమోదైన ఓట్ల లెక్క నమోదు చేసుకుంటారు. మైక్రో అబ్జర్వర్ వాటిని పట్టికలో పొందుపరిచి ఆర్వోకు అందిస్తారు. అన్ని టేబుళ్ల లెక్కలను కలిపితే.. ఓ రౌండు ఫలితం వచ్చినట్లు. పరిశీలన తర్వాత సంబంధిత ఆర్వో, పరిశీలకులు ఫలితాన్ని వెల్లడిస్తారు. చివరి రౌండు ఫలితం పూర్తయ్యాక ఎన్నికల సంఘం అభ్యర్థి గెలుపును ప్రకటిస్తుంది. రిటర్నింగ్ అధికారి అభ్యర్థికి గెలుపు ధ్రువీకరణపత్రం అందజేస్తారు.
వీవీప్యాట్ల చీటీలనూ..
ఓటరు ఈవీఎంను నొక్కగానే.. పక్కనున్న వీవీప్యాట్ డబ్బాలో..సదరు అభ్యర్థి గుర్తుతో ముద్రితమైన చీటీ పడడం ఓటేసిన వారు గమనించే ఉంటారు. నియోజకవర్గంలోని ఏవేని ఐదు పోలింగ్ కేంద్రాల వీవీప్యాట్ల చీటీలను చివర్లో లెక్కిస్తారు. ఈవీఎం, వీవీప్యాట్ల లెక్కను సరిపోల్చేందుకు అలా చేస్తారు. కొన్ని పోలింగ్ కేంద్రాల ఈవీఎంలు ఫలితాల వెల్లడిలో మొరాయిస్తే.. అప్పుడు వీవీప్యాట్ల ఓట్లను(మొదటి స్థానంలోని అభ్యర్థికి, రెండో స్థానంలోని అభ్యర్థికి మధ్య తక్కువ ఓట్ల వ్యత్యాసం ఉన్నప్పుడు) లెక్కిస్తారు.
ఆఖరుగా శేరిలింగంపల్లి
రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని 13 నియోజకవర్గాల్లో ఎక్కువ పోలింగ్ కేంద్రాలున్న నియోజవర్గం శేరిలింగంపల్లి. అక్కడ 622 కేంద్రాల్లో పోలింగ్ జరిగింది. ఓట్ల లెక్కింపు 23 రౌండ్లలో పూర్తవుతుంది.
- పోలింగ్ కేంద్రాలు ఎక్కువగా ఉన్న ఎల్బీనగర్, మహేశ్వరం, రాజేంద్రనగర్, మేడ్చల్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాలకు 28 టేబుళ్ల చొప్పున ఎన్నికల అధికారులు ఏర్పాటుచేశారు. ఆయా నియోజవర్గాల్లో ఓట్ల లెక్కింపు 19 నుంచి 21 రౌండ్లలో పూర్తవుతుంది.
- ఇబ్రహీంపట్నం, షాద్నగర్, కల్వకుర్తి నియోజకవర్గాల్లో తక్కువ టేబుళ్ల ఏర్పాటుతో అక్కడ కూడా 19 నుంచి 23 రౌండ్లలోపు లెక్కింపు పూర్తవనుంది.
- కూకట్పల్లి, మేడ్చల్, కుత్బుల్లాపూర్, ఉప్పల్ నియోజకవర్గాల్లో 21 నుంచి 22 రౌండ్లలోపు ఓట్ల లెక్కింపు పూర్తవుతుందని అధికారులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మ్యాన్హోల్ నుంచి వంటనూనెల వ్యర్థాలు
[ 27-07-2024]
ఆర్టీసీ క్రాస్రోడ్డు పరిధిలోని ప్రధాన రహదారిపై ఓ డ్రైనేజీ మ్యాన్హోల్ నుంచి శుక్రవారం ఉదయం వంటనూనెల వ్యర్థాలు పొంగిపొర్లాయి. -
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
[ 27-07-2024]
రైల్లో దూర ప్రయాణం.. రాత్రిళ్లు చల్లగాలి.. కబుర్లు చెప్పుకుంటూ నిద్రలోకి జారుకుంటే చాలు.. అదును కోసం చూస్తున్న దొంగలకు పండగే. -
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
[ 27-07-2024]
మహేశ్వరంలోని ఓ హోటల్లో చోరీ చేసేందుకు వచ్చిన ఓ దొంగ.. పోలీసులకు కనీసం ఒక్క క్లూ కూడా దొరక్కుండా.. ఎంతో జాగ్రత్తగా పథకం వేశాడు. -
పనులు కదలాలి.. ప్రగతి పరుగిడాలి
[ 27-07-2024]
ఎనిమిదేళ్ల కిందట రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రాంటుగా హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ)కు అందిన మొత్తం కేవలం రూ.250 కోట్లు. అప్పటి నుంచి బల్దియాకు ఒక్కపైసా కూడా గ్రాంటుగా నిధులందలేదు. -
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
[ 27-07-2024]
రాజీవ్ రహదారిపై అతివేగంగా కారు నడిపి బస్సును ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి చెందారు. -
ఆ భూముల జాడ.. దేవుడికే తెలియాలి
[ 27-07-2024]
రాజధాని పరిధిలో 9వేల ఎకరాలకుపైనే దేవాదాయశాఖ భూములున్నాయి. నిత్యం ధూప, దీప నైవేద్యాల కోసం గతంలో అనేక మంది భూవిరాళాలు ఇచ్చారు. -
పాలక మండలి సభ్యుల సంబరాలు
[ 27-07-2024]
నగరం అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరు శాఖలకు కలిపి పద్దులో రూ.10వేల కోట్లను కేటాయించడంపై కాంగ్రెస్కు చెందిన జీహెచ్ఎంసీ పాలకమండలి సభ్యులు శుక్రవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు. -
మా ఇష్టం.. మేమిట్లే జేస్తం
[ 27-07-2024]
రాజధాని నగరంలో బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు వేగంగా పెరుగుతుండడంతో వాటికి అవసరమైన ఇటుకల తయారీ కోసం కొందరు నీళ్లు సమృద్ధిగా ఉన్న జంటజలాశయాల పరివాహక ప్రాంతాన్ని ఎంచుకున్నారు. -
కుటుంబాలను కూల్చేస్తున్న రీల్స్
[ 27-07-2024]
రీల్స్ మోజులో పడి తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగిల్చినవారు కొందరైతే.. కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకున్నవారు మరికొందరు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
యువతలో పెరుగుతున్న హృద్రోగ ముప్పు
[ 27-07-2024]
యువతలో గుండె సమస్యలు పెరుగుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. -
విద్యుత్తు అధికారుల్లో సూర్యాఘర్ జోష్
[ 27-07-2024]
సౌర విద్యుత్తును 300 యూనిట్ల వరకూ పొందే ‘పీఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’ పథకంలో ఎక్కువ మందిని చేర్పించే విద్యుత్తు అధికారులకు కేంద్రం ప్రోత్సహకాలు ప్రకటించింది. -
మాజీ రాష్ట్రపతి సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం సందర్శన
[ 27-07-2024]
శంషాబాద్ మండలం శ్రీరామనగరంలో వెలిసిన సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శుక్రవారం సందర్శించారు. -
దేశభక్తి చాటిన కార్గిల్ విజయోత్సవ ర్యాలీ
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధ విజయోత్సవానికి పాతికేళ్ల సందర్భంగా శుక్రవారం నారాయణగూడలోని రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి(అర్బీవీఆర్ఆర్) మహిళా కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్-2, తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ స్వచ్ఛంద సంస్థల సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ పలు ప్రాంతాల్లో కొనసాగింది. -
కోట్పల్లి కల్పవల్లి
[ 27-07-2024]
జిల్లాలో అతిపెద్దదైన కోట్పల్లి ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. బడ్జెట్లో రూ.8 కోట్లు కేటాయించింది. -
అరణ్యం కబ్జా పర్వం.. కొనసాగుతున్న వివాదం!
[ 27-07-2024]
రెండు దశాబ్దాలుగా జిల్లాకు చెందిన అటవీ భూములను ఆక్రమించుకుని కర్ణాటక వాసులు సాగు చేస్తూ పంటలు పండిస్తున్నారు. -
బాధిత అంధ బాలికను, కుటుంబాన్ని ఆదుకోవాలి
[ 27-07-2024]
మలక్పేట ప్రభుత్వ అంధ బాలికల వసతి గృహం వద్ద శుక్రవారం ఆందోళనలు కొనసాగాయి. -
రాష్ట్రపతి నిలయాల్లో సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం
[ 27-07-2024]
ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతిగా రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం, సిమ్లా, దిల్లీలోని రాష్ట్రపతి భవనాల సందర్శనకు సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు రాష్ట్రపతి నిలయం అధికారులు తెలిపారు. -
శిల్పారామం పేరు, లోగో వాడొద్దు
[ 27-07-2024]
అనుమతి లేకుండా శిల్పారామం పేరు, లోగోను ఇతరులు ఉపయోగించరాదని శిల్పారామం ప్రత్యేకాధికారి జి.కిషన్రావు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. -
ఆలయాల్లో కానుకలు చోరీ!
[ 27-07-2024]
దేవాలయాలు లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న టి.నరేందర్(27)ను శుక్రవారం అరెస్ట్ చేసినట్టు ఫలక్నుమా ఏసీపీ ఎన్.ఎల్.నారాయణరాజు తెలిపారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్