Revanth Reddy: సీఎం పీఠంపై కొడంగల్ కిరణం
కొడంగల్ వాసుల ఉత్కంఠకు తెరపడింది. మూడు రోజులుగా మా ఎమ్మెల్యేని ముఖ్యమంత్రిగా ఎప్పుడు ప్రకటిస్తారా అని ఎదురుచూసిన క్షణాలు ఆవిష్కృతమయ్యాయి. సీఎల్పీ నేతగా ఎనుముల రేవంత్రెడ్డి పేరు ప్రకటించగానే..
కొడంగల్ వాసుల ఉత్కంఠకు తెరపడింది. మూడు రోజులుగా మా ఎమ్మెల్యేని ముఖ్యమంత్రిగా ఎప్పుడు ప్రకటిస్తారా అని ఎదురుచూసిన క్షణాలు ఆవిష్కృతమయ్యాయి. సీఎల్పీ నేతగా ఎనుముల రేవంత్రెడ్డి(Revanth Reddy) పేరు ప్రకటించగానే.. ఆ సెగ్మెంట్తోపాటు, వికారాబాద్ జిల్లా వాసులు ఆనందంలో మునిగిపోయారు. ముఖ్యంగా కాంగ్రెస్ శ్రేణులు వీధుల్లోకొచ్చి బాణసంచా కాలుస్తూ సంబురాలు చేసుకున్నారు. ఇదే సమయంలో అభివృద్ధిపరంగా నూతన ముఖ్యమంత్రి ముందు కొన్ని ఆకాంక్షలను ఉంచారు.
👉 Follow EENADU WhatsApp Channel
జిల్లా వాసుల్లో కోటి ఆశలు
న్యూస్టుడే, కొడంగల్, బొంరాస్పేట
ఎన్నికల ప్రచారంలో భాగంగా వికారాబాద్లో పాల్గొన్న రేవంత్రెడ్డి. చిత్రంలో టి. రామ్మోహన్రెడ్డి, బుయ్యని మనోహర్రెడ్డి, గడ్డం ప్రసాద్కుమార్.
కొడంగల్.. ప్రస్తుతం ఏ నోట విన్నా ఇదే పేరు. రాష్ట్ర స్థాయిలో మారుమోగుతోంది. అందుకు కారణం..రేవంత్రెడ్డి. కొడంగల్ నియోజకవర్గం ఎమ్మెల్యే హోదా నుంచి ఒక్కో మెట్టు ఎదిగి టీపీసీసీ అధ్యక్షుడి స్థానానికి చేరుకున్న ఆయన ఇప్పుడు ఏకంగా తెలంగాణ రాష్ట్ర సీఎం కుర్చీలో ఆసీనులవుతున్నారు. రాష్ట్రాన్ని పాలించబోతున్నారు. ఎన్నికల ప్రచారంలో రేవంత్రెడ్డి విజయం కోసం కార్యకర్తలు కాబోయే ముఖ్యమంత్రిగా ప్రచారం చేశారు. ఇక్కడి ప్రజలు సైతం నమ్మకంతో భారీ మెజార్టీతో గెలిపించారు.
తమ ప్రాంత వాసి..
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని కొడంగల్ రాష్ట్ర రాజధానికి వంద కిలో మీటర్ల దూరంలో కర్ణాటక రాష్ట్రానికి సరిహద్దులో ఉండటంతో నిరాదరణతో అభివృద్ధిలో వెనుకబడింది. జిల్లాల ఏర్పాటులో భాగంగా మూడు మండలాలతో వికారాబాద్ పరిధిలోకి వచ్చింది. ఉపాధి అవకాశాలు లేక వలసలు వెళ్తుంటారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరును అధిష్ఠానం ప్రకటించడంతో ఈ ప్రాంతం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుందని కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు.
బొంరాస్పేట మండల కేంద్రంలో సంబురాలు
ఎమ్మెల్యేగా సాధించిన ప్రగతి ఇది..
సాంకేతిక విద్యలో భాగంగా కోస్గి పట్టణంలో పాలిటెక్నిక్ కళాశాల, భవన నిర్మాణానికి నిధుల మంజూరు. కోస్గిలో బస్ డిపో ఏర్పాటుకు ఐదు ఎకరాల భూమిని సొంతంగా కొనుగోలు చేసి ఆర్టీసీ అధికారులకు విరాళంగా ఇచ్చారు.
- కొడంగల్లో డిగ్రీ కళాశాలకు సొంతభవనం నిర్మాణానికి నిధులు మంజూరు చేయించారు.
- కోస్గి, కొడంగల్ ఆస్పత్రులను వంద పడకలకు స్థాయి పెంచాలని ప్రతిపాదనలు పంపగా రాష్ట్ర ప్రభుత్వం 50 పడకల స్థాయిలో భవనాలు నిర్మించింది.
- కొడంగల్లో అగ్నిమాపక కేంద్రం మంజూరు, మార్కెట్ యార్డు ఏర్పాటు, గిరిజన గురుకులానికి సొంతభవనం.
కొడంగల్, కోస్గి పట్టణాల్లో రోడ్ల విస్తరణ పనులకు నిధులు తీసుకొచ్చి పనులు చేపట్టారు.దౌల్తాబాద్లో మినీ ట్యాంక్బండ్ ఏర్పాటు చేశారు.
రేవంత్రెడ్డి నివాసం వద్ద కాంగ్రెస్ శ్రేణులు
ఇవీ ప్రధాన హామీలు..
మరింత వృద్ధి చెందాల్సిన కళాశాల
- వికారాబాద్- కృష్ణా రైల్వే లైన్ను కొడంగల్ నియోజకవర్గం మీదుగా తీసుకు రావడం.
- ఇక్కడి ప్రాంతానికి సిమెంట్ పరిశ్రమలను తీసుకొచ్చి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం.
- నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల పథకం మంజూరు చేస్తూ తీసుకొచ్చిన జీవో 69 అమలుతో సాగు నీరు.
- డివిజన్స్థాయి ప్రభుత్వ కార్యాలయాలు కొడంగల్లో ఏర్పాటు.
ప్రజలు ఆశిస్తున్నవివి..
ఉన్నత విద్యావకాశాలు పెంచాలి. రవాణా, సాగు నీరు, మార్కెటింగ్ రంగాల్లో సౌకర్యాలు కల్పించాలి. బొంరాస్పేట, దౌల్తాబాద్ మండలాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను 30 పడకల స్థాయికి పెంచాలి. నియోజకవర్గంలోని గురుకుల విద్యాలయాలకు సొంత భవనాలు నిర్మించాలి. బీజాపూర్- హైదరాబాద్ జాతీయ రహదారిపై ఉన్న బొంరాస్పేట చెరువును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలి.
చరిత్ర సృష్టించిన రేవంత్రెడ్డి
వికారాబాద్: వికారాబాద్ జిల్లా అవతరించాక కొడంగల్ నియోజకవర్గంలోని కొడంగల్, బొంరాస్పేట, దుద్యాల, దౌల్తాబాద్ మండలాలు జిల్లా పరిధిలోకి రాగా, కోస్గి, మద్దూర్, కొత్తపల్లి, గుండుమాల్ నారాయణపేట జిల్లా పరిధిలోకి మారాయి. మర్పల్లి మండలం సిరిపురం గ్రామానికి చెందిన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి 1975, 1989లలో రెండు సార్లు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన తొలి వ్యక్తి కాగా, గతంలో రెండుసార్లు, తాజాగా వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ ఎమ్మెల్యేగా గెలిచిన రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టనున్న రెండో వ్యక్తిగా చరిత్ర సృష్టించారు.
పరుగులిడాలి.. పాలమూరు జలాలు
వికారాబాద్: జిల్లాకు పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలు జిల్లాను సస్యశ్యామలం చేస్తాయని ఆశిస్తున్నారు. వికారాబాద్ పట్టణ పరిధిలోని అనంతగిరి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందాల్సి ఉంది. వికారాబాద్ పట్టణానికి బాహ్య వలయ రహదారి (రింగ్రోడ్), వ్యవసాయ వర్సిటీ, కొత్త పరిశ్రమల ఏర్పాటుతో యువతకు ఉపాధి కల్పన పెరగాలి.
- వివిధ అభివృద్ధి పనులకు నిధుల మంజూరు, కొడంగల్ నియోజక వర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో జూనియర్ కళాశాలలు, కొడంగల్, కోస్గి మండలాల్లో త్రిపుల్ ఐటీ కళాశాలల ఏర్పాటు కావాల్సి ఉంది.
- పరిగి నియోజకవర్గంలో వంద పడకల ఆస్పత్రి, పారిశ్రామిక వాడ, పాలిటెక్నిక్, ఐటీ కళాశాలలు, గ్రామాల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తారని ప్రజలు ఆశిస్తున్నారు.
- తాండూర్ నియోజకవర్గంలోని కోట్పల్లి ప్రాజెక్టు ఆధునికీకరణ, జిన్గుర్తిలో పారిశ్రామిక వాడ, ఈఎస్ఐ ఆస్పత్రి, కంది బోర్డు, వాయు కాలుష్య నివారణ జరగాలని కోరుతున్నారు.
అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తా
- గుర్నాథ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, కొడంగల్
రేవంత్రెడ్డి ముఖ్యమంత్రిగా ఇక్కడి ప్రాంతానికి చేయబోయే అభివృద్ధికి తన వంతుగా పూర్తి సహకారం అందిస్తా. కొడంగల్ ఎమ్మెల్యేగా గెలుపొందిన వ్యక్తి ముఖ్యమంత్రిగా అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాం.
పేదలకు మేలు జరుగుతుంది
- రాంచంద్రారెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి, బొంరాస్పేట
కొడంగల్ ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి అవకాశం రావడంతో ఇక్కడి ప్రాంతానికి ఎనలేని మేలు జరుగుతుందని ఆశిస్తున్నాం. విద్య, ఉపాధి, వైద్య, రవాణా, రహదారుల సౌకర్యాలు మెరుగుపడుతాయి. సంక్షేమ పథకాలు ఎక్కువ సంఖ్యలో లబ్ధిదారులకు అందుతాయి. సాగు నీటి వనరులు అభివృద్ధి జరుగుతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తీసుకున్న రూ.13 వేలు తిరిగి ఇవ్వలేదని...
[ 16-05-2024]
డబ్బు విషయమై తలెత్తిన వివాదం యువకుడి హత్యకు దారితీసింది. అర్ధరాత్రి ఇద్దరు వ్యక్తులు కత్తితో పొడిచి, బండరాయితో మోది దారుణంగా హతమార్చిన ఘటన పాతబస్తీ హుస్సేనిఆలం ఠాణా పరిధిలో జరిగింది. -
జలమండలి వావ్!
[ 16-05-2024]
నీటి ట్యాంకర్ బుక్ చేస్తే ఎప్పుడొస్తుందో.. అసలు వస్తుందో.. రాదో తెలియని పరిస్థితి. ఇక నుంచి ఇలాంటి ఇబ్బందులకు జలమండలి చెక్ పెట్టనుంది. వాటర్ ఆన్ వీల్స్ (వావ్) పేరుతో కొత్త యాప్నకు శ్రీకారం చుట్టింది. -
నంబర్ ప్లేట్ లేకపోతే.. ఠాణాకే వాహనం
[ 16-05-2024]
హైదరాబాద్ నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో ఈ మధ్య కాలంలో పలు సెల్ఫోన్ స్నాచింగ్లు జరిగాయి. సుమారు 700 ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకుని, బాధితులకు అప్పగించారు. -
మీటరు గిర్రుమంది.. గుండె గుబిల్లు మంది
[ 16-05-2024]
ఎండల తీవ్రత ఈసారి మే నెలతో పోలిస్తే ఇప్పటివరకు ఏప్రిల్లో అధికంగా ఉంది. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వినియోగదారుల కరెంట్ వాడకం కూడా అదే రీతిలో పెరిగింది. -
అనుమతులా.. అవెలా ఉంటాయ్?
[ 16-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రక్రియ నిర్వహణలో రెవెన్యూ, పురపాలక శాఖల అధికారులు నిమగ్నమై ఉండగా..కొందరు రియల్ వెంచర్ల ప్రతినిధులు అనధికారికంగా లేఅవుట్లు వేస్తున్నారు. -
ఉస్మానియా.. జేఎన్టీయూ వీసీ పోస్టులకు డిమాండ్
[ 16-05-2024]
రాష్ట్రంలోని పలు వర్సిటీలకు త్వరలో ఉపకులపతులను నియమించనున్న నేపథ్యంలో రాజధానిలో ఉన్న 5 ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ఉస్మానియా, జేఎన్టీయూ వర్సిటీల వీసీ పోస్టులకు డిమాండ్ ఏర్పడింది. -
భౌబోయ్
[ 16-05-2024]
అధిక ఉష్ణోగ్రతలతో జనమే కాదు...జంతువులూ అల్లాడిపోతున్నాయి. ముఖ్యంగా కుక్కలపై ఎండ తీవ్ర ప్రభావం చూపుతోంది. తాగడానికి నీళ్లు, ఆహారం దొరక్క ఇబ్బందులు పడుతున్నాయి. -
కళ్ల ముందే కాలిపోయిన కన్నవాళ్లు
[ 16-05-2024]
కళ్ల ముందే కన్నవారు సజీవ దహనం అవుతున్నా ఏమీ చేయలేని దుస్థితి. చెల్లెలు కూతురు వారి చేతిలో మంటలకు ఆహుతవుతున్నా తెలియని పరిస్థితి. -
కరెంట్ సరఫరాకు కొత్త చిక్కులు
[ 16-05-2024]
నగరంలో విద్యుత్తు సరఫరాకు కొత్త చిక్కులు వచ్చాయి. గాలులకు ఇదివరకు చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్తు తీగలపై పడటంతో ట్రిప్పయ్యేవి. ఇప్పుడు వీటికి తోడు వినైల్ బ్యానర్లు ఇబ్బందికరంగా మారాయి. -
నగరం నిప్పుల కొలిమి
[ 16-05-2024]
సూరీడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. భగభగలతో బయటకు రాలేని పరిస్థితి. అత్యవసర పనులపై వెళ్లాలన్నా జనం భయపడుతున్నారు. -
శివపార్వతుల కల్యాణం.. కనులారా వీక్షణం
[ 16-05-2024]
వీరారెడ్డిపల్లి వీరభద్రేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పార్వతీ పరమేశ్వరుల కల్యాణోత్సవాన్ని బుధవారం కనుల పండువగా నిర్వహించారు. -
మహిళా చైతన్యం.. ఏమైందో..?
[ 16-05-2024]
పార్లమెంట్ ఎన్నికల్లో (ఈ నెల 13న జరిగిన) జిల్లా మహిళలు ఓటు వేయడానికి అంతగా ఆసక్తి కనబర్చలేదు. ఇందుకుగల కారణాలపై నేతలు ఆరా తీస్తున్నారు. -
నత్త నడకన కొనుగోళ్లు.. రైతన్న దిగాలు
[ 16-05-2024]
ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని విక్రయించేందుకు అన్నదాతలు ఆపసోపాలు పడాల్సి వస్తోంది. సర్కారు కొనుగోలు కేంద్రాల్ని ఏర్పాటు చేసినా అన్నిచోట్లా పూర్తి అందుబాటులోకి రాలేదు. వడివడిగా కొనుగోళ్లు సాగడం లేదు. -
సినిమా తెర మూగబోతోంది
[ 16-05-2024]
జిల్లాలోని సింగిల్ తెర సినిమా థియేటర్లు శుక్రవారం నుంచి ఈనెలాఖరు వరకు మూత పడుతున్నాయి. దీంతో వాటిలో పనిచేసే సిబ్బందికి ఉపాధిపై ఈ ప్రభావం పడక తప్పడంలేదు. -
నీరింకిన వాగులు.. ఒట్టిపోయిన బోర్లు
[ 16-05-2024]
వర్షాలు లేక యాసంగి పంటలు అనుకున్నంతగా సాగలేదు. జిల్లాలోని వాగులు, వంకల్లో ఎగువ నుంచి వచ్చే నీటి ప్రవాహం ఆగిపోయింది. దీంతో వాగులన్నీ రాళ్లు, ఇసుక దిబ్బలతో దర్శనమిస్తున్నాయి. -
నిధులు అందవు.. నిర్మాణాలు సాగవు
[ 16-05-2024]
ప్రభుత్వం క్రీడా రంగానికి తగిన ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెబుతున్నా క్షేత్ర స్థాయిలో ఆ దిశగా అడుగులు పడటంలేదు. దీంతో జిల్లాలోని క్రీడాకారులు నైపుణ్యానికి మెరుగులు దిద్దుకోలేక పోతున్నారు. -
ముగిసిన ఎన్నికలు.. మిగిలిన కేసులు
[ 16-05-2024]
పార్లమెంటు ఎన్నికలు ప్రశాంతంగా ముగియగా.. ప్రచారం సందర్భంగా వేర్వేరు పార్టీల నేతలపై నమోదైన కేసుల విచారణ ఇప్పుడే పట్టాలెక్కింది. -
నిమ్స్మే గ్రౌండ్స్లో మేకప్ ఆర్టిస్టు హత్య
[ 16-05-2024]
నిర్మానుష్య ప్రాంతంలో ఓ యువకుడు హత్యకు గురైన సంఘటన బోరబండ పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం అర్ధరాత్రి జరిగింది. -
హవాలా సొమ్ము స్వాధీనం కేసులో మలుపులు
[ 16-05-2024]
మేడిపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో యువకుడి ఆత్మహత్య వ్యవహారం కలకలం రేపుతోంది. యాదాద్రి జిల్లా గుండాల మండలానికి చెందిన వడ్లకొండ రంజిత్(24) ఈ నెల 11న మేడిపల్లి పరిధి చెంగిచెర్లలోని అతని నివాసంలో బలవన్మరణం చేసుకున్నాడు. -
‘ఎంఐఎం గెలిచే అవకాశమే లేదు’
[ 16-05-2024]
హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ఈసారి ఎంఐఎం గెలిచే అవకాశమే లేదని.. అవసరమైతే అక్కడ రీ పోలింగ్ జరిపిస్తామని భాజపా అభ్యర్థి కొంపెల్ల మాధవీలత అన్నారు. -
ఈజ్ మై ట్రిప్కు మొట్టికాయలు
[ 16-05-2024]
విమాన టిక్కెట్ల బుకింగ్లో అనైతిక వ్యాపారానికి పాల్పడిన ఈజ్ మై ట్రిప్కు హైదరాబాద్ వినియోగదారుల కమిషన్- 1 మొట్టికాయలు వేసింది. -
లులుమాల్లో 17, 18, 19న ఫ్యాషన్ షో
[ 16-05-2024]
లులుమాల్ ఆధ్వర్యంలో ఈ నెల 17నుంచి 19 తేదీ వరకు ‘లులుస్ ఐకనిక్ షో, లులు ఫ్యాషన్ వీక్’ పేరిట వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు మాల్ ప్రతినిధులు తెలిపారు. -
థీమ్ పార్కుపై యూపీ ఆసక్తి
[ 16-05-2024]
వర్షపు నీటిని ఒడిసిపట్టే విధానాలను వివరిస్తూ జూబ్లీహిల్స్ రోడ్డు నెంబరు 51లో జలమండలి ఆధ్వర్యంలో నిర్మించిన వాటర్ హార్వెస్టింగ్ థీమ్ పార్కుపై ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఆసక్తి చూపింది. -
మలక్పేటలో రెనోవా బీబీ క్యాన్సర్ ఆసుపత్రి
[ 16-05-2024]
మలక్పేటలోని బీబీ క్యాన్సర్ ఆసుపత్రి.. రెనోవా బీబీ క్యాన్సర్ ఆసుపత్రిగా మారింది. ఇందుకు సంబంధించి బీబీ క్యాన్సర్ ఆసుపత్రి, రెనోవా ఆసుపత్రుల మధ్య బుధవారం ఒప్పందం జరిగింది.