Hyderbad: బలహీనంగా ఉన్నాడని చికిత్సకొస్తే.. బలైపోయాడు
బలహీనంగా ఉన్నాడని ఒక్కగానొక్క కొడుకును ఆసుపత్రిలో చేర్చిన ఆ తల్లిదండ్రులకు కడుపుకోతే మిగిలింది. ఉన్నట్టుండి మూర్ఛ రావడంతో బాలుడ్ని ఎమర్జెన్సీ వార్డుకు ఒళ్లో ఎత్తుకుని తీసుకెళ్తున్న సందర్భంలో ఆ తల్లీకొడుకులిద్దరూ కిందపడి గాయాలకు గురయ్యారు.
నాంపల్లి: బలహీనంగా ఉన్నాడని ఒక్కగానొక్క కొడుకును ఆసుపత్రిలో చేర్చిన ఆ తల్లిదండ్రులకు కడుపుకోతే మిగిలింది. ఉన్నట్టుండి మూర్ఛ రావడంతో బాలుడ్ని ఎమర్జెన్సీ వార్డుకు ఒళ్లో ఎత్తుకుని తీసుకెళ్తున్న సందర్భంలో ఆ తల్లీకొడుకులిద్దరూ కిందపడి గాయాలకు గురయ్యారు. వారిలో బాలుడు చికిత్స పొందుతూ మృత్యుఒడికి చేరాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన నిలోఫర్ ఆసుపత్రిలో జరిగింది. నాంపల్లి ఎస్సై నాజింఅలీ, బాధితుల కథనం ప్రకారం... కూకట్పల్లి సుమిత్రానగర్ ఎల్లంబండ కు చెందిన ఇ.రమేష్, మహాలక్ష్మికి ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి తొలిచూరుగా కూతురు జన్మించగా అనారోగ్యంతో మృతిచెందింది. రెండో సంతానం సిద్ధు (ఏడాదిన్నర) కొంతకాలంగా బలహీనంగా ఉండటంతో తల్లిదండ్రులు అతన్ని నెల రోజుల క్రితం రెడ్హిల్స్లోని నిలోఫర్ ఆసుపత్రిలో చేర్పించి వైద్యం చేయిస్తున్నారు. ఈ నెల 9న బాలుడికి ఒక్కసారిగా మూర్ఛ రావడంతో ఎమర్జెన్సీ వార్డుకు తీసుకెళ్లాల్సిందిగా ఆసుపత్రిలోని సిబ్బంది సూచించడంతో తల్లి మహాలక్ష్మి సిద్ధును ఎత్తుకుని పరుగులు తీసింది. ఆమె కాళ్లకు చీర అడ్డుపడి ఆసుపత్రిలోని మెట్ల వద్ద కిందపడిపోయింది. ఒళ్లోనే ఉన్న సిద్ధు కూడా కిందపడటంతో ఇద్దరి తలలకు గాయాలయ్యాయి. దీంతో వారికి ఆసుపత్రిలోనే చికిత్స అందించారు. చిన్నారి సిద్ధు పరిస్థితి విషమించడంతో సోమవారం రాత్రి మృతిచెందాడు. స్ట్రెచర్పై తరలించే ఏర్పాట్లు చేసిఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మందులు కొనేందుకు వెళ్తున్న సందర్భంలో తల్లీకొడుకులిద్దరూ కిందపడ్డారని పోలీసులు చెబుతుండటం గమనార్హం. ఈ మేరకు నాంపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేసీఆర్, కేటీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి ఉత్తమ్
[ 26-07-2024]
కమీషన్లకు కక్కుర్తిపడి ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేశారని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మండిపడ్డారు. -
స్మితా సబర్వాల్ వ్యాఖ్యలు సమంజసం కాదు: కోదండరాం
[ 26-07-2024]
ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై తెలంగాణ జన సమితి(తెజస) అధ్యక్షుడు ఆచార్య కోదండరాం మండిపడ్డారు. -
డివైడర్ దాటి బస్సును ఢీకొన్న కారు.. ఇద్దరి మృతి
[ 26-07-2024]
రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పిన ఓ కారు డివైడర్ దాటి అవతలివైపు మార్గంలో వెళ్తున్న బస్సును ఢీకొట్టింది. -
తాగి వాహనం నడిపిన వ్యక్తిపై ట్రాఫిక్ సీఐ జులుం
[ 26-07-2024]
మద్యం తాగి వాహనం నడిపితే కేసు నమోదు చేసి జరిమానా విధించాలి కానీ ఓ ట్రాఫిక్ సీఐ అత్యుత్సాహంతో యువకుడిపై చేయి చేసుకున్నారు. -
ఒలింపిక్స్ పోరులో మన భాగ్యాలు.. హైదరాబాద్లో శిక్షణ పొంది అంతర్జాతీయ స్థాయికి
[ 26-07-2024]
విశ్వ క్రీడా సంబరం వచ్చేసింది. క్రీడా ప్రపంచం ఎంతగానో ఎదురు చూసే ఒలింపిక్స్కు నేడే తెరలేవనుంది. పారిస్ ఒలింపిక్స్లో పతకాల వేటకు భారత అథ్లెట్లు సిద్ధమయ్యారు. -
మహానగరికి ఊపిరి
[ 26-07-2024]
ఓ వైపు అప్పులు.. వడ్డీలు.. మరోవైపు నిలిచిన అభివృద్ధి పనులు.. గుత్తేదారుల ఆందోళనలు.. ఉద్యోగుల జీతాలు చెల్లించలేని స్థితిలో ఉన్న జీహెచ్ఎంసీకి రాష్ట్ర బడ్జెట్ ఊరటనిచ్చింది. -
అంచనాలను ‘భట్టి’ కేటాయింపులు
[ 26-07-2024]
బాహ్యవలయ రహదారి వరకు భాగ్యనగరమే. ఈ ప్రాతిపదికనే రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి ప్రణాళికలు రచిస్తోంది. హైదరాబాద్ జిల్లా పూర్తిగా, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాలు పాక్షికంగా నగర పరిధిలోకి వస్తున్నాయి. -
ప్రాంగణాలు బురదమయం.. ప్రయాణికులకు అసౌకర్యం
[ 26-07-2024]
జిల్లాలో వారం రోజులుగా ముసురు వర్షాలు పడుతున్నాయి. వీటివల్ల ప్రధాన రోడ్లతోపాటు గ్రామీణ రోడ్లు, ప్రయాణ ప్రాంగణాలు బురదమయంగా మారిపోతున్నాయి. -
సంక్షేమానికి చోటు.. అభివృద్ధికి బాట
[ 26-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం 2024-25 సంవత్సరానికి అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్లో వ్యవసాయానికి అగ్రాసం లభించింది. ఇదే సమయంలో అన్ని వర్గాల సంక్షేమంపై దృష్టి సారించామనీ, ఆమేరకు నిధుల కేటాయింపు -
ఆర్థిక ఇబ్బందులతో అమ్మ.. తట్టుకోలేక కుమారుడు ఆత్మహత్య
[ 26-07-2024]
ఆర్థిక ఇబ్బందులతో బుధవారం రాత్రి తల్లి ఆత్మహత్యకు పాల్పడగా, అది చూసిన పెద్ద కుమారుడు సైతం ఉరి వేసుకున్న హృదయ విదారక ఘటన చైతన్యపురి ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. -
అంధ బాలికపై అమానుషం.. వెల్లువెత్తిన నిరసన
[ 26-07-2024]
అంధ బాలికపై అమానుషం ఘటనలో నిందితుడిని మలక్పేట ఠాణా పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
ఫర్నిచర్ కర్మాగారం యజమానికి రిమాండ్
[ 26-07-2024]
జియాగూడ వెంకటేశ్వరనగర్లోని తిరుపతి ఫర్నిచర్స్లో భారీ అగ్నిప్రమాదం సంభవించి ఒకే కుటుంబానికి చెందిన తండ్రీకూతుళ్లు మృతి చెందారు. -
శంషాబాద్ విమానాశ్రయంలో హెల్ప్ డెస్క్
[ 26-07-2024]
రద్దీ సమయంలో యాప్ ఆధారిత క్యాబ్ వాహనాల కొరతను పరిష్కరించడం కోసం ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పేర్లు ప్రదర్శించమని బలవంతం చేయలేరు: సుప్రీం
-
ఆ రాష్ట్రాలను విభజించే కుట్ర - మమతా బెనర్జీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘మేం ఉండగా ఆమె పిల్లలు లేనివారు ఎలా అవుతారు?’: కమలాహారిస్కు సవతి కుమార్తె మద్దతు
-
17ఏళ్ల నాటి హత్య కేసు.. ఒకే ఫ్యామిలీలో తొమ్మిది మంది సహా 14మందికి జీవిత ఖైదు
-
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్