logo

పట్టించుకోనందుకే కాంగ్రెస్‌లో చేరా: స్వప్న

భారాస పార్టీ నుంచి తాండూరు మున్సిపల్‌ అధ్యక్షురాలిగా కొనసాగినా స్వపక్షమే తనను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని, అందుకే కాంగ్రెస్‌లో చేరానని తాటికొండ స్వప్న తెలిపారు.

Updated : 22 Feb 2024 05:51 IST

స్వప్న మెడలో కండువా వేస్తున్న ముఖ్యమంత్రి

తాండూరు, తాండూరు టౌన్‌, న్యూస్‌టుడే: భారాస పార్టీ నుంచి తాండూరు మున్సిపల్‌ అధ్యక్షురాలిగా కొనసాగినా స్వపక్షమే తనను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని, అందుకే కాంగ్రెస్‌లో చేరానని తాటికొండ స్వప్న తెలిపారు. ఆమె బుధవారం భారాసకు రాజీనామా చేసి కోస్గిలో జరిగిన సభలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆమె ‘న్యూస్‌టుడే’తో మాట్లాడారు. పట్టణ అభివృద్ధి పరంగా కౌన్సిలర్లు, మాజీ ఎమ్మెల్యే సహకరించలేదని తెలిపారు. ఈ నేపథ్యంలో తనకు జరుగుతున్న ఇబ్బందిని భారాస ప్రభుత్వంలోని అధినాయకులకు  పలుమార్లు వివరించినా స్పందన లేకపోయిందని వాపోయారు.  తాండూరు పట్టణాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో భారాసను వీడి కాంగ్రెస్‌ పార్టీలో చేరానని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని