logo

భారాసను రాష్ట్రంలో భూస్థాపితం చేస్తాం

కుటుంబ ఎజెండాతో పని చేస్తున్న భారాస పార్టీని రాష్ట్రంలో భూస్థాపితం చేయడమే భాజపా లక్ష్యమని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌ అన్నారు.

Published : 22 Feb 2024 02:36 IST

మాట్లాడుతున్న లక్ష్మణ్‌, మురళీధర్‌రావు, విశ్వేశ్వర్‌రెడ్డి తదితరులు

చేవెళ్ల, న్యూస్‌టుడే: కుటుంబ ఎజెండాతో పని చేస్తున్న భారాస పార్టీని రాష్ట్రంలో భూస్థాపితం చేయడమే భాజపా లక్ష్యమని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌ అన్నారు. ఆయన చేపట్టిన విజయ సంకల్ప యాత్ర బుధవారం రాత్రి చేవెళ్ల పట్టణానికి చేరింది. శంకర్‌పల్లి చౌరస్తాలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ.. పదేళ్లు అధికారం చేపట్టిన భారాస నాయకులు రూ.వేల కోట్ల అవినీతికి పాల్పడి రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆరోపించారు. దోపిడీ దొంగలను ఓడిస్తే గజదొంగలు అందలమెక్కారని కాంగ్రెస్‌ పార్టీని ఉద్దేశించి విమర్శించారు. సభలో భాజపా మధ్యప్రదేశ్‌ ఇన్‌ఛార్జి మురళీధర్‌ రావు, కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి, అధికార ప్రతినిధి రాణిరుద్రమ, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రత్నం, జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి, అత్తెల్లి అనంత్‌రెడ్డి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని