ఉచితంగా ఇస్తూ.. ప్రాణాలను పరీక్షిస్తూ..
రెండురోజుల కిందట అత్తాపూర్లో ఓ వ్యక్తి పార్కులో స్పృహతప్పి పడిపోయాడు. స్థానికులు సపర్యలు చేసి ఆరా తీయగా కల్లు తాగినట్లు బదులిచ్చాడు.
మత్తు స్థాయి పరీక్షించేందుకు అమాయకులకు ఎర
విచ్చలవిడిగా కల్తీ కల్లు విక్రయాలు
ఈనాడు-హైదరాబాద్: రెండురోజుల కిందట అత్తాపూర్లో ఓ వ్యక్తి పార్కులో స్పృహతప్పి పడిపోయాడు. స్థానికులు సపర్యలు చేసి ఆరా తీయగా కల్లు తాగినట్లు బదులిచ్చాడు. ఎందుకంత తాగావని ప్రశ్నించగా.. ఉదయాన్నే దుకాణ నిర్వాహకులు ఉచితంగా ఇస్తారని, తయారుచేసిన కల్లులో ఏ స్థాయిలో రసాయనాలు కలిసాయో తెలుసుకునేందుకుగాను అలా ఇస్తారని చెప్పాడు.
ఇటీవల యూసుఫ్గూడ పోలీసులు స్థానికంగా కల్లు కాంపౌండ్లో తనిఖీలు నిర్వహించగా 50 కిలోల సోడియం బైకార్బొనేట్, 25 కిలోల తెల్ల పొడి, సాక్రిన్, చక్కెర వంటివి స్వాధీనం చేసుకున్నారు. ఈ పదార్థాలన్నీ కలిపి కల్తు తయారుచేసి విక్రయిస్తున్నట్లు నిందితులు అంగీకరిస్తున్నారు.
ఇవే కాదు.. నగరంలోని కొన్ని కల్లు దుకాణాలు కేంద్రంగా దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. దుకాణాల పరిసరాల్లో దోపిడీలు, హత్యలు ఒకెత్తయితే.. నిర్వాహకులు చేస్తున్న దాష్టీకాలకు హద్దు లేకుండా పోతోంది. రసాయనాలు, నిషేధిత మత్తుపదార్థాలు కలిపి తయారుచేస్తున్న కల్లు విక్రయించే ముందు.. ‘టెస్టింగ్’ పేరుతో తెల్లవారుజామున ఉచితంగా ఇస్తున్నారు. భిక్షాటన చేసేవారు, మత్తుకు బాగా అలవాటుపడిన వారికి దీన్ని ఇస్తున్నారు. ఇది తాగినవారికి బాగా మత్తు వచ్చినా, కొద్దిసేపటికే స్పృహ కోల్పోయినా అందులో రసాయనాలు ఎక్కువైనట్లు నిర్వాహకులు నిర్ధారించుకుంటున్నారు. తర్వాత డోసు తగ్గించేందుకు ఇతర మిశ్రమాలు కలుపుతారు. ఒకవేళ సాధారణంగా ఉన్నట్లు గుర్తిస్తే రసాయనం ఎక్కువ కలుపుతారు. నగరంలోని కొన్ని కల్లు దుకాణాల్లో సాగుతున్న ఈ అమానవీయ విధానంతో.. టెస్టింగ్ కల్లు తాగుతున్న కొందరు స్పృహ కోల్పోయి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న ఘటనలూ ఉన్నాయి.
చెట్టు లేకున్నా..
జిల్లాల నుంచి నగరానికి వచ్చే కల్లు సరిపోదు. దీంతో కొందరు ఆల్ఫ్రాజోలం, సోడియం బైకార్బొనేట్, డైజోఫాం, క్లోరల్ హైడ్రేట్ లాంటి ప్రమాదకర రసాయనాల మిశ్రమాలు ఉపయోగిస్తున్నారు. జిల్లాల నుంచి 100లీటర్ల కల్లు సేకరిస్తే.. వేర్వేరు మిశ్రమాలతో వెయ్యి లీటర్లు చేస్తున్నారు. నాగర్కర్నూలు జిల్లా బిజినేపల్లి, సంగారెడ్డి జిల్లా జిన్నారం, నగరంలోని సూరారం ప్రాంతాల్లో అరెస్టయిన నిందితులిచ్చిన సమాచారంతో ఆల్ఫ్రాజోలం నెట్వర్క్ను ఛేదించి రూ.3 కోట్ల సరకును పట్టుకున్నారు.
కరవైన నిఘా
కొన్ని దుకాణాల్లో కల్తీ కల్లు విక్రయిస్తున్నా ఆబ్కారీ శాఖ తనిఖీలు చేపట్టడం లేదు. గతేడాది శివారులోని ఓ దుకాణంలో కల్లు తాగి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. నిర్వాహకులు మృతదేహాన్ని బైకుపై తీసుకెళ్లి దూరంగా విసిరేశారు. ఈ వ్యవహారం కలకలం రేపినా.. ఆ దుకాణం కొనసాగుతూనే ఉంది.
శరీరంపై తీవ్ర ప్రభావం
-డాక్టర్ రమేశ్కుమార్, గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, ఉస్మానియా ఆసుపత్రి
నిషేధిత రసాయనాలు, ఇతర పదార్థాలతో చేసిన కల్లు తాగడం డ్రగ్స్ తీసుకోవడంలాంటిదే. ఇది తాగితే దీర్ఘకాలంలో అనేక అనారోగ్య సమస్యలు తప్పవు. అలవాటుపడి సమయానికి కల్లు దొరక్కపోతే.. వారి ప్రవర్తన అసాధారణంగా మారుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పనులు కదలాలి.. ప్రగతి పరుగిడాలి
[ 27-07-2024]
ఎనిమిదేళ్ల కిందట రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రాంటుగా హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ)కు అందిన మొత్తం కేవలం రూ.250 కోట్లు. అప్పటి నుంచి బల్దియాకు ఒక్కపైసా కూడా గ్రాంటుగా నిధులందలేదు. -
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
[ 27-07-2024]
మహేశ్వరంలోని ఓ హోటల్లో చోరీ చేసేందుకు వచ్చిన ఓ దొంగ.. పోలీసులకు కనీసం ఒక్క క్లూ కూడా దొరక్కుండా.. ఎంతో జాగ్రత్తగా పథకం వేశాడు. -
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
[ 27-07-2024]
రాజీవ్ రహదారిపై అతివేగంగా కారు నడిపి బస్సును ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి చెందారు. -
ఆ భూముల జాడ.. దేవుడికే తెలియాలి
[ 27-07-2024]
రాజధాని పరిధిలో 9వేల ఎకరాలకుపైనే దేవాదాయశాఖ భూములున్నాయి. నిత్యం ధూప, దీప నైవేద్యాల కోసం గతంలో అనేక మంది భూవిరాళాలు ఇచ్చారు. -
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
[ 27-07-2024]
రైల్లో దూర ప్రయాణం.. రాత్రిళ్లు చల్లగాలి.. కబుర్లు చెప్పుకుంటూ నిద్రలోకి జారుకుంటే చాలు.. అదును కోసం చూస్తున్న దొంగలకు పండగే. -
పాలక మండలి సభ్యుల సంబరాలు
[ 27-07-2024]
నగరం అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరు శాఖలకు కలిపి పద్దులో రూ.10వేల కోట్లను కేటాయించడంపై కాంగ్రెస్కు చెందిన జీహెచ్ఎంసీ పాలకమండలి సభ్యులు శుక్రవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు. -
మా ఇష్టం.. మేమిట్లే జేస్తం
[ 27-07-2024]
రాజధాని నగరంలో బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు వేగంగా పెరుగుతుండడంతో వాటికి అవసరమైన ఇటుకల తయారీ కోసం కొందరు నీళ్లు సమృద్ధిగా ఉన్న జంటజలాశయాల పరివాహక ప్రాంతాన్ని ఎంచుకున్నారు. -
మ్యాన్హోల్ నుంచి వంటనూనెల వ్యర్థాలు
[ 27-07-2024]
ఆర్టీసీ క్రాస్రోడ్డు పరిధిలోని ప్రధాన రహదారిపై ఓ డ్రైనేజీ మ్యాన్హోల్ నుంచి శుక్రవారం ఉదయం వంటనూనెల వ్యర్థాలు పొంగిపొర్లాయి. -
కుటుంబాలను కూల్చేస్తున్న రీల్స్
[ 27-07-2024]
రీల్స్ మోజులో పడి తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగిల్చినవారు కొందరైతే.. కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకున్నవారు మరికొందరు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
యువతలో పెరుగుతున్న హృద్రోగ ముప్పు
[ 27-07-2024]
యువతలో గుండె సమస్యలు పెరుగుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. -
విద్యుత్తు అధికారుల్లో సూర్యాఘర్ జోష్
[ 27-07-2024]
సౌర విద్యుత్తును 300 యూనిట్ల వరకూ పొందే ‘పీఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’ పథకంలో ఎక్కువ మందిని చేర్పించే విద్యుత్తు అధికారులకు కేంద్రం ప్రోత్సహకాలు ప్రకటించింది. -
మాజీ రాష్ట్రపతి సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం సందర్శన
[ 27-07-2024]
శంషాబాద్ మండలం శ్రీరామనగరంలో వెలిసిన సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శుక్రవారం సందర్శించారు. -
దేశభక్తి చాటిన కార్గిల్ విజయోత్సవ ర్యాలీ
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధ విజయోత్సవానికి పాతికేళ్ల సందర్భంగా శుక్రవారం నారాయణగూడలోని రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి(అర్బీవీఆర్ఆర్) మహిళా కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్-2, తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ స్వచ్ఛంద సంస్థల సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ పలు ప్రాంతాల్లో కొనసాగింది. -
కోట్పల్లి కల్పవల్లి
[ 27-07-2024]
జిల్లాలో అతిపెద్దదైన కోట్పల్లి ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. బడ్జెట్లో రూ.8 కోట్లు కేటాయించింది. -
అరణ్యం కబ్జా పర్వం.. కొనసాగుతున్న వివాదం!
[ 27-07-2024]
రెండు దశాబ్దాలుగా జిల్లాకు చెందిన అటవీ భూములను ఆక్రమించుకుని కర్ణాటక వాసులు సాగు చేస్తూ పంటలు పండిస్తున్నారు. -
బాధిత అంధ బాలికను, కుటుంబాన్ని ఆదుకోవాలి
[ 27-07-2024]
మలక్పేట ప్రభుత్వ అంధ బాలికల వసతి గృహం వద్ద శుక్రవారం ఆందోళనలు కొనసాగాయి. -
రాష్ట్రపతి నిలయాల్లో సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం
[ 27-07-2024]
ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతిగా రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం, సిమ్లా, దిల్లీలోని రాష్ట్రపతి భవనాల సందర్శనకు సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు రాష్ట్రపతి నిలయం అధికారులు తెలిపారు. -
శిల్పారామం పేరు, లోగో వాడొద్దు
[ 27-07-2024]
అనుమతి లేకుండా శిల్పారామం పేరు, లోగోను ఇతరులు ఉపయోగించరాదని శిల్పారామం ప్రత్యేకాధికారి జి.కిషన్రావు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. -
ఆలయాల్లో కానుకలు చోరీ!
[ 27-07-2024]
దేవాలయాలు లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న టి.నరేందర్(27)ను శుక్రవారం అరెస్ట్ చేసినట్టు ఫలక్నుమా ఏసీపీ ఎన్.ఎల్.నారాయణరాజు తెలిపారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే