పట్టాల దారిలో ఆలస్య ప్రయాణం
ఇతర రాష్ట్రాల నుంచి రైళ్లలో రాజధానికి వస్తున్న వేలాది మంది నిత్యం ఉదయం నరక యాతన అనుభవిస్తున్నారు. సికింద్రాబాద్ శివార్లలోనే గంటల పాటు రైళ్లను నిలిపివేయడంతో ప్రయాణికులు అవస్థలుపడుతూ అందులోనే ఉండాల్సి వస్తోంది.
శివార్లలోనే గంటల కొద్దీ నిలిపివేత
ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి
ఇతర రాష్ట్రాల నుంచి రైళ్లలో రాజధానికి వస్తున్న వేలాది మంది నిత్యం ఉదయం నరక యాతన అనుభవిస్తున్నారు. సికింద్రాబాద్ శివార్లలోనే గంటల పాటు రైళ్లను నిలిపివేయడంతో ప్రయాణికులు అవస్థలుపడుతూ అందులోనే ఉండాల్సి వస్తోంది. గంట నుంచి అయిదు గంటలు ఆలస్యంగా చేరుతుండటంతో రైల్వే అధికారులపై మండిపడుతున్నారు. 5 గంటలు ఆలస్యంగా చేరుకున్న ప్రయాణికులు బుధవారం స్టేషన్ మేనేజర్ కార్యాలయంవద్ద ధర్నాకు దిగారు.
నగరంలోని మూడు ప్రధాన రైల్వే స్టేషన్లనుంచి నిత్యం వివిధ రాష్ట్రాలకు 250 రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. అత్యధికం సికింద్రాబాద్ కేంద్రంగా తిరుగుతుంటాయి. ఈ స్టేషన్లో పది ప్లాట్ఫాంలున్నా రైళ్లను నిలపడానికి చాలాసార్లు ఇబ్బంది ఏర్పడుతోంది. ఉదయం, సాయంత్రం కొన్ని రైళ్లను అవుటర్లో నిలపాల్సి వస్తోంది. ఉదయం 3 గంటల నుంచి 9 గంటల వరకు దాదాపు 40 రైళ్లు వివిధ రాష్ట్రాల నుంచి సికింద్రాబాద్ వస్తుంటాయి. ఉదయమే కొన్ని రైళ్లను సికింద్రాబాద్ స్టేషన్లోనే ఉంచి నిర్వహణ పనులు, శుభ్రం చేయడానికి రెండు గంటలు తీసుకుంటున్నారు. వందేభారత్ వంటి వాటిని పది నిమిషాల్లోనే చేస్తుండగా, ఇతర రైళ్లను తాపీగా చేస్తున్నారు. ప్లాట్ఫాం మీదనుంచి ఈ రైళ్లు త్వరగా కదలక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే రైళ్లకు అవకాశముండటం లేదు. గూడ్సురైళ్లు కూడా మరో కారణం. గతంలో గూడ్సు రైళ్లను సికింద్రాబాద్ నుంచి నడిపేవారు కాదు. ఆదాయాన్ని పెంచుకోవడానికి కొన్ని నెలలుగా సికింద్రాబాద్ స్టేషన్ మీదుగా నడుపుతున్నారు. వీటి రాకపోకల వేళ ప్రయాణికుల రైళ్లను నిలుపుతున్నారు. బుధవారం చాలా రైళ్లు గంటలు ఆలస్యంగా సికింద్రాబాద్కు చేరుకోవడంతో వేలాది మంది ప్రయాణికులు ఆగ్రహంతో రైల్వే అధికారులను నిలదీయడానికి సిద్ధపడ్డారు. 07610 నంబరుతో నడిచే తిరుపతి-పూర్ణా వయా సికింద్రాబాద్ రైలు దాదాపు అయిదు గంటలకు పైగా ఆలస్యంగా చేరుకుంది. ఇందులో ప్రయాణికులు నల్గొండ జిల్లా బొమ్మాయిపల్లి స్టేషన్ మేనేజర్ వద్ద ఆందోళన చేశారు. సికింద్రాబాద్ అవుటర్లో గంటన్నర ఆపడంతో.. ఉదయం 4 గంటలకు రావాల్సిన రైలు 9.30 గంటలకు వచ్చింది. టాయిలెట్లలో నీళ్లు కూడా లేక ప్రయాణికులు, చిన్నారులు అల్లాడిపోయారు. సికింద్రాబాద్ స్టేషన్ వద్దా కొంతమంది.. అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఠంచనుగా వచ్చే విశాఖపట్టణం గోదావరి ఎక్స్ప్రెస్ కూడా రెండు గంటలు ఆలస్యమైంది. గరీబ్రథ్ సైతం 2 గంటలు ఆలస్యంగా నడిచింది. ఇలా చాలా రైళ్లు ఆలస్యం కావడంతో అనేక మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నెలలో సగం రోజులు ఇలానే ఉంటున్నా దక్షిణమధ్య రైల్వే జీఎం పట్టించుకోవడం లేదని ప్రయాణికుల సంఘాలు మండిపడుతున్నాయి. తక్షణం చర్యలు తీసుకోకపోతే రైలు నిలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
[ 27-07-2024]
రైల్లో దూర ప్రయాణం.. రాత్రిళ్లు చల్లగాలి.. కబుర్లు చెప్పుకుంటూ నిద్రలోకి జారుకుంటే చాలు.. అదును కోసం చూస్తున్న దొంగలకు పండగే. -
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
[ 27-07-2024]
మహేశ్వరంలోని ఓ హోటల్లో చోరీ చేసేందుకు వచ్చిన ఓ దొంగ.. పోలీసులకు కనీసం ఒక్క క్లూ కూడా దొరక్కుండా.. ఎంతో జాగ్రత్తగా పథకం వేశాడు. -
పనులు కదలాలి.. ప్రగతి పరుగిడాలి
[ 27-07-2024]
ఎనిమిదేళ్ల కిందట రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రాంటుగా హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ)కు అందిన మొత్తం కేవలం రూ.250 కోట్లు. అప్పటి నుంచి బల్దియాకు ఒక్కపైసా కూడా గ్రాంటుగా నిధులందలేదు. -
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
[ 27-07-2024]
రాజీవ్ రహదారిపై అతివేగంగా కారు నడిపి బస్సును ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి చెందారు. -
ఆ భూముల జాడ.. దేవుడికే తెలియాలి
[ 27-07-2024]
రాజధాని పరిధిలో 9వేల ఎకరాలకుపైనే దేవాదాయశాఖ భూములున్నాయి. నిత్యం ధూప, దీప నైవేద్యాల కోసం గతంలో అనేక మంది భూవిరాళాలు ఇచ్చారు. -
పాలక మండలి సభ్యుల సంబరాలు
[ 27-07-2024]
నగరం అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరు శాఖలకు కలిపి పద్దులో రూ.10వేల కోట్లను కేటాయించడంపై కాంగ్రెస్కు చెందిన జీహెచ్ఎంసీ పాలకమండలి సభ్యులు శుక్రవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు. -
మా ఇష్టం.. మేమిట్లే జేస్తం
[ 27-07-2024]
రాజధాని నగరంలో బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు వేగంగా పెరుగుతుండడంతో వాటికి అవసరమైన ఇటుకల తయారీ కోసం కొందరు నీళ్లు సమృద్ధిగా ఉన్న జంటజలాశయాల పరివాహక ప్రాంతాన్ని ఎంచుకున్నారు. -
మ్యాన్హోల్ నుంచి వంటనూనెల వ్యర్థాలు
[ 27-07-2024]
ఆర్టీసీ క్రాస్రోడ్డు పరిధిలోని ప్రధాన రహదారిపై ఓ డ్రైనేజీ మ్యాన్హోల్ నుంచి శుక్రవారం ఉదయం వంటనూనెల వ్యర్థాలు పొంగిపొర్లాయి. -
కుటుంబాలను కూల్చేస్తున్న రీల్స్
[ 27-07-2024]
రీల్స్ మోజులో పడి తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగిల్చినవారు కొందరైతే.. కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకున్నవారు మరికొందరు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
యువతలో పెరుగుతున్న హృద్రోగ ముప్పు
[ 27-07-2024]
యువతలో గుండె సమస్యలు పెరుగుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. -
విద్యుత్తు అధికారుల్లో సూర్యాఘర్ జోష్
[ 27-07-2024]
సౌర విద్యుత్తును 300 యూనిట్ల వరకూ పొందే ‘పీఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’ పథకంలో ఎక్కువ మందిని చేర్పించే విద్యుత్తు అధికారులకు కేంద్రం ప్రోత్సహకాలు ప్రకటించింది. -
మాజీ రాష్ట్రపతి సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం సందర్శన
[ 27-07-2024]
శంషాబాద్ మండలం శ్రీరామనగరంలో వెలిసిన సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శుక్రవారం సందర్శించారు. -
దేశభక్తి చాటిన కార్గిల్ విజయోత్సవ ర్యాలీ
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధ విజయోత్సవానికి పాతికేళ్ల సందర్భంగా శుక్రవారం నారాయణగూడలోని రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి(అర్బీవీఆర్ఆర్) మహిళా కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్-2, తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ స్వచ్ఛంద సంస్థల సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ పలు ప్రాంతాల్లో కొనసాగింది. -
కోట్పల్లి కల్పవల్లి
[ 27-07-2024]
జిల్లాలో అతిపెద్దదైన కోట్పల్లి ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. బడ్జెట్లో రూ.8 కోట్లు కేటాయించింది. -
అరణ్యం కబ్జా పర్వం.. కొనసాగుతున్న వివాదం!
[ 27-07-2024]
రెండు దశాబ్దాలుగా జిల్లాకు చెందిన అటవీ భూములను ఆక్రమించుకుని కర్ణాటక వాసులు సాగు చేస్తూ పంటలు పండిస్తున్నారు. -
బాధిత అంధ బాలికను, కుటుంబాన్ని ఆదుకోవాలి
[ 27-07-2024]
మలక్పేట ప్రభుత్వ అంధ బాలికల వసతి గృహం వద్ద శుక్రవారం ఆందోళనలు కొనసాగాయి. -
రాష్ట్రపతి నిలయాల్లో సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం
[ 27-07-2024]
ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతిగా రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం, సిమ్లా, దిల్లీలోని రాష్ట్రపతి భవనాల సందర్శనకు సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు రాష్ట్రపతి నిలయం అధికారులు తెలిపారు. -
శిల్పారామం పేరు, లోగో వాడొద్దు
[ 27-07-2024]
అనుమతి లేకుండా శిల్పారామం పేరు, లోగోను ఇతరులు ఉపయోగించరాదని శిల్పారామం ప్రత్యేకాధికారి జి.కిషన్రావు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. -
ఆలయాల్లో కానుకలు చోరీ!
[ 27-07-2024]
దేవాలయాలు లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న టి.నరేందర్(27)ను శుక్రవారం అరెస్ట్ చేసినట్టు ఫలక్నుమా ఏసీపీ ఎన్.ఎల్.నారాయణరాజు తెలిపారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే