సంతానభాగ్యం
అత్యాధునిక ఆరోగ్య సదుపాయాలు, నిపుణులైన వైద్యులు అందుబాటులో ఉండటంతో క్లిష్టమైన చికిత్సల కోసం దేశ, విదేశాల నుంచి రోగులు హైదరాబాద్ వస్తున్నారు. దేశంలోనే భాగ్యనగరం వైద్య పర్యటకంగా వేగంగా ఎదుగుతోంది.
అమెరికా, యూరప్, మధ్య ప్రాచ్య దేశాల నుంచి నగరానికి రాక
సంతానలేమికి చికిత్స తీసుకుంటున్న దంపతులు
ఈనాడు, హైదరాబాద్
అత్యాధునిక ఆరోగ్య సదుపాయాలు, నిపుణులైన వైద్యులు అందుబాటులో ఉండటంతో క్లిష్టమైన చికిత్సల కోసం దేశ, విదేశాల నుంచి రోగులు హైదరాబాద్ వస్తున్నారు. దేశంలోనే భాగ్యనగరం వైద్య పర్యటకంగా వేగంగా ఎదుగుతోంది. రోగులకు చికిత్స కోసమే కాదు.. సంతానం లేని తల్లిదండ్రులు సైతం తమ లోపాలను సరిచేసుకోవడానికి దేశంలోని వేర్వేరు ప్రాంతాల నుంచే కాకుండా విదేశాల నుంచి వచ్చి ఇక్కడ చికిత్స తీసుకుంటున్నారని వైద్యులు చెబుతున్నారు.
సామాజికంగా వచ్చిన మార్పులతో ఆలస్యంగా వివాహం చేసుకోవడం, మధుమేహం, ఊబకాయం, పని ఒత్తిడి వంటి జీవనశైలి సమస్యలతో పాటు జన్యుపర లోపాలు, ఇతర కారణాలతో కొందరు దంపతులు సంతానభాగ్యానికి నోచుకోవడం లేదని వైద్యులు అంటున్నారు. ఇలాంటివారు సంతాన సాఫల్య కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. నగరంలోనే 400కిపైగా ఈ తరహా కేంద్రాలున్నాయని జీనోమ్ ఫౌండేషన్ తెలిపింది. వీటిలో స్థానికులే కాదు ఇతర రాష్ట్రాలు, విదేశాలనుంచి వచ్చి చికిత్స తీసుకుంటున్నారు. ఐటీ ఉద్యోగుల్లో ఎక్కువగా సంతానలేమి సమస్యను చూస్తున్నామని డాక్టర్లు చెబుతున్నారు. కెరీర్ ముఖ్యమని ఆలస్యంగా పిల్లలను కనాలనుకునే దంపతులు అండాన్ని/శుక్రకణాలను ఫ్రీజ్ చేసుకోవాలని సూచిస్తున్నారు. కృత్రిమ గర్భధారణ చికిత్స పద్ధతుల్లో 50 ఏళ్లుగా ఎన్నో మార్పులు వచ్చాయని.. నిబంధనలమేరకు మన దగ్గర ఈ చికిత్స సులువుగా అందుబాటులో ఉండటంతో దేశ, విదేశాల నుంచి వస్తున్నారని వైద్యులు అంటున్నారు.
పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి..
సంతాన సాఫల్య కేంద్రాలు సిటీల్లో పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. దంపతుల బలహీనతల్ని కొందరు సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అనుమతులు లేకుండా పనిచేస్తున్నాయని, వందశాతం గ్యారంటీ అంటూ నమ్మబలుకుతున్నాయని, వీరితో జాగ్రత్త అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ విధానాలతో వంద శాతం గ్యారంటీగా పిల్లలు పుడతారు అనేది అబద్దమని ఈ రంగంలో రెండు దశాబ్దాల అనుభవం కలిగిన డాక్టర్ కృష్ణ చైతన్య అన్నారు.
కౌన్సిలింగ్ ప్రధానం..
పరీక్షల అనంతరం పిల్లలు పుట్టే అవకాశం ఏ మేరకు ఉందో వైద్యులు ఒక అవగాహనకు వస్తారు. అయితే కొందరిలో పిల్లలు పుట్టే అవకాశం ఉండదు. ఆ విషయాన్ని ఆ దంపతులకు చెప్పడం చాలా కష్టమైన విషయమని డాక్టర్లు అంటున్నారు. ఇందుకోసం బాధ్యత కల్గిన ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా కౌన్సిలింగ్ కేంద్రాలు, కౌన్సిలర్లను ఏర్పాటు చేసి వారికి అవగాహన కల్పిస్తున్నారని చెప్పారు.
ఆయా దేశాల నుంచి ఇటీవల పెరిగారు
- డాక్టర్ సుమప్రసాద్, ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్
సంతానలేమి సమస్యలకు చికిత్స తీసుకునేందుకు అమెరికా, యూరప్, మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి ఎంతోమంది జంటలు మన దగ్గరకు వస్తుంటారు. అక్కడ చికిత్స లేక కాదు.. మన దగ్గర వైద్య విధానం, వైద్యులు రోగులకు అందుబాటులో ఉంటారు. మన వైద్యులు అత్యాధునిక చికిత్స పద్ధతులు, విధానాలపై శిక్షణ పొంది ఉన్నారు. ఆయా దేశాల నుంచి గత 30 ఏళ్లుగా మన దగ్గరకు రావడం గమనిస్తున్నాం. ఇటీవల ఇది మరింత పెరిగింది. ఇది మంచి విషయమే. వైద్య పర్యటకంతో మనకు ఆదాయం పెరుగుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మ్యాన్హోల్ నుంచి వంటనూనెల వ్యర్థాలు
[ 27-07-2024]
ఆర్టీసీ క్రాస్రోడ్డు పరిధిలోని ప్రధాన రహదారిపై ఓ డ్రైనేజీ మ్యాన్హోల్ నుంచి శుక్రవారం ఉదయం వంటనూనెల వ్యర్థాలు పొంగిపొర్లాయి. -
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
[ 27-07-2024]
రైల్లో దూర ప్రయాణం.. రాత్రిళ్లు చల్లగాలి.. కబుర్లు చెప్పుకుంటూ నిద్రలోకి జారుకుంటే చాలు.. అదును కోసం చూస్తున్న దొంగలకు పండగే. -
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
[ 27-07-2024]
మహేశ్వరంలోని ఓ హోటల్లో చోరీ చేసేందుకు వచ్చిన ఓ దొంగ.. పోలీసులకు కనీసం ఒక్క క్లూ కూడా దొరక్కుండా.. ఎంతో జాగ్రత్తగా పథకం వేశాడు. -
పనులు కదలాలి.. ప్రగతి పరుగిడాలి
[ 27-07-2024]
ఎనిమిదేళ్ల కిందట రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రాంటుగా హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ)కు అందిన మొత్తం కేవలం రూ.250 కోట్లు. అప్పటి నుంచి బల్దియాకు ఒక్కపైసా కూడా గ్రాంటుగా నిధులందలేదు. -
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
[ 27-07-2024]
రాజీవ్ రహదారిపై అతివేగంగా కారు నడిపి బస్సును ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి చెందారు. -
ఆ భూముల జాడ.. దేవుడికే తెలియాలి
[ 27-07-2024]
రాజధాని పరిధిలో 9వేల ఎకరాలకుపైనే దేవాదాయశాఖ భూములున్నాయి. నిత్యం ధూప, దీప నైవేద్యాల కోసం గతంలో అనేక మంది భూవిరాళాలు ఇచ్చారు. -
పాలక మండలి సభ్యుల సంబరాలు
[ 27-07-2024]
నగరం అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరు శాఖలకు కలిపి పద్దులో రూ.10వేల కోట్లను కేటాయించడంపై కాంగ్రెస్కు చెందిన జీహెచ్ఎంసీ పాలకమండలి సభ్యులు శుక్రవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు. -
మా ఇష్టం.. మేమిట్లే జేస్తం
[ 27-07-2024]
రాజధాని నగరంలో బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు వేగంగా పెరుగుతుండడంతో వాటికి అవసరమైన ఇటుకల తయారీ కోసం కొందరు నీళ్లు సమృద్ధిగా ఉన్న జంటజలాశయాల పరివాహక ప్రాంతాన్ని ఎంచుకున్నారు. -
కుటుంబాలను కూల్చేస్తున్న రీల్స్
[ 27-07-2024]
రీల్స్ మోజులో పడి తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగిల్చినవారు కొందరైతే.. కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకున్నవారు మరికొందరు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
యువతలో పెరుగుతున్న హృద్రోగ ముప్పు
[ 27-07-2024]
యువతలో గుండె సమస్యలు పెరుగుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. -
విద్యుత్తు అధికారుల్లో సూర్యాఘర్ జోష్
[ 27-07-2024]
సౌర విద్యుత్తును 300 యూనిట్ల వరకూ పొందే ‘పీఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’ పథకంలో ఎక్కువ మందిని చేర్పించే విద్యుత్తు అధికారులకు కేంద్రం ప్రోత్సహకాలు ప్రకటించింది. -
మాజీ రాష్ట్రపతి సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం సందర్శన
[ 27-07-2024]
శంషాబాద్ మండలం శ్రీరామనగరంలో వెలిసిన సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శుక్రవారం సందర్శించారు. -
దేశభక్తి చాటిన కార్గిల్ విజయోత్సవ ర్యాలీ
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధ విజయోత్సవానికి పాతికేళ్ల సందర్భంగా శుక్రవారం నారాయణగూడలోని రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి(అర్బీవీఆర్ఆర్) మహిళా కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్-2, తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ స్వచ్ఛంద సంస్థల సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ పలు ప్రాంతాల్లో కొనసాగింది. -
కోట్పల్లి కల్పవల్లి
[ 27-07-2024]
జిల్లాలో అతిపెద్దదైన కోట్పల్లి ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. బడ్జెట్లో రూ.8 కోట్లు కేటాయించింది. -
అరణ్యం కబ్జా పర్వం.. కొనసాగుతున్న వివాదం!
[ 27-07-2024]
రెండు దశాబ్దాలుగా జిల్లాకు చెందిన అటవీ భూములను ఆక్రమించుకుని కర్ణాటక వాసులు సాగు చేస్తూ పంటలు పండిస్తున్నారు. -
బాధిత అంధ బాలికను, కుటుంబాన్ని ఆదుకోవాలి
[ 27-07-2024]
మలక్పేట ప్రభుత్వ అంధ బాలికల వసతి గృహం వద్ద శుక్రవారం ఆందోళనలు కొనసాగాయి. -
రాష్ట్రపతి నిలయాల్లో సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం
[ 27-07-2024]
ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతిగా రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం, సిమ్లా, దిల్లీలోని రాష్ట్రపతి భవనాల సందర్శనకు సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు రాష్ట్రపతి నిలయం అధికారులు తెలిపారు. -
శిల్పారామం పేరు, లోగో వాడొద్దు
[ 27-07-2024]
అనుమతి లేకుండా శిల్పారామం పేరు, లోగోను ఇతరులు ఉపయోగించరాదని శిల్పారామం ప్రత్యేకాధికారి జి.కిషన్రావు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. -
ఆలయాల్లో కానుకలు చోరీ!
[ 27-07-2024]
దేవాలయాలు లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న టి.నరేందర్(27)ను శుక్రవారం అరెస్ట్ చేసినట్టు ఫలక్నుమా ఏసీపీ ఎన్.ఎల్.నారాయణరాజు తెలిపారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు