దారి పక్కన బిలం.. జర పైలం
తాండూరుగ్రామీణ ప్రజల రాకపోకలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడుతున్నాయి. అయితే అదే సమయంలో వివిధ ప్రాంతాల్లో ప్రధాన మార్గాల పక్కన వ్యవసాయ బావులు ప్రమాదకరంగా మారాయి.
పరిగి మండలం మహబూబ్నగర్, షాద్నగర్ ప్రధాన రహదారిపై రాఘవాపూర్ వద్ద పొదల్లో వ్యవసాయ బావి ఉంది. రెండేళ్ల కిందట ఓ కారు అదుపుతప్పి పడిపోయినా అందులో ఉన్న వారు ప్రాణాలతో బయటపడ్డారు.
కుల్కచర్ల నుంచి చాపలగూడెం గ్రామానికి వెళ్లే దారిలో రెండు బావులు, ఒక కుంట ప్రమాదకరంగా ఉన్నాయి.
న్యూస్టుడే, పరిగి, కుల్కచర్ల గ్రామీణ, కుల్కచర్ల, ధారూర్, బొంరాస్పేట, కొడంగల్, దౌల్తాబాద్, వికారాబాద్ గ్రామీణ, దోమ, తాండూరుగ్రామీణ ప్రజల రాకపోకలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడుతున్నాయి. అయితే అదే సమయంలో వివిధ ప్రాంతాల్లో ప్రధాన మార్గాల పక్కన వ్యవసాయ బావులు ప్రమాదకరంగా మారాయి. వీటి చుట్టూ పొదలు పెరగడంతో, ఎటువంటి ఉపద్రవం ముంచుకు వస్తుందోనన్న భయాందోళన వాహనదారులను వెంటాడుతోంది. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్న ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ‘న్యూస్టుడే’ జిల్లా వ్యాప్తంగా పరిశీలించగా వెలుగులోకి వచ్చిన అంశాలు ఇలా ఉన్నాయి.
మలుపులో ముప్పు..
- కుల్కచర్ల మండల పరిధి నాగమ్మగడ్డ తండా- చెరువుముందలి తండా వద్ద మూలమలుపు వద్దే బావి ఉంది. చుట్టూ చెట్లు పెరగడంతో కనిపించడం లేదు. రెండేళ్ల కిందట జేసీబీ ఇందులో పడిపోయింది.
- ధారూర్ మండల పరిధి బాచారం సమీపంలో ప్రధాన రోడ్డులో వ్యవసాయ బావి ఉంది. ఆ నీటితోనే రైతులు వ్యవసాయం చేస్తున్నారు. దీంతో బావిని పూడ్చకుండా రక్షణ గోడను ఏర్పాటు చేశారు. అయినా అదుపు తప్పితే ప్రమాదమే.
- పరిగి -దోమ వెళ్లే ప్రధాన రహదారి సుల్తాన్పూర్ వద్ద కుంట మీదుగా ప్రయాణించాల్సి వస్తోంది. రెgడు నెలల కిందట ఓ పాఠశాల బస్సు కుంటలోకి వెళ్లింది. విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారు.
- దోమ మండల పరిధి ఐనాపూర్, దిర్సంపల్లికి వెళ్లేదారిలో బావులు ప్రమాదకరంగా ఉన్నాయి. రోడ్డుకు ఆనుకుని ఉన్నా, బోర్డులు ఏర్పాటు చేయలేదు. వేగంగా వస్తే ప్రమాదం పొంచి ఉంది. దిర్సంపల్లి మార్గంలో పాలేపల్లి సమీపంలోని బావిలోకి గతంలో ద్విచక్రవాహనం దూసుకెళ్లినా, ప్రమాదం తప్పింది.
కొడంగల్ నియోజకవర్గంలో
- బొంరాస్పేట మండలం బాపల్లితండా- సాగారం తండాల మధ్యలో గౌరారం సమీపంలో రోడ్డు పక్కనే వ్యవసాయ బావి ప్రమాదకరంగా ఉంది. దుద్యాల మండలం నాజ్ఖాన్పల్లి- చిల్ముల్మైలారం రోడ్డు పక్కన రెండు ప్రాంతాల్లో బావులున్నాయి.
- దౌల్తాబాద్ మండలం ఈర్లపల్లి- ఊరకుంట రోడ్డులోని బావి చుట్టూ చెట్లు పెరగడంతో వాహనదారులకు కనిపించడంలేదు. దౌల్తాబాద్- యాంకీ, అంతారం నుంచి సుల్తాన్పూర్ మీదుగా నాగసారం, దౌల్తాబాద్- తిమ్మారెడ్డిపల్లి మధ్యలో బావులు ప్రమాదకరంగా మారాయి.
- కొడంగల్ మండలం గుండ్లకుంట- ఉసేన్పూర్, అంగడిరాయిచూర్ సమీపంలో, పెద్దనందిగామ గ్రామాల రోడ్ల సమీపంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
- తాండూరు మండలం చెంగోల్లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పక్కన, సిమెంటు రహదారి వారగా చేదబావి ఉంది. ఏ మాత్రం అజాగ్రత్త వహించినా ముప్పు పొంచి ఉంది. కరణ్కోట ఎస్సీ కాలనీలో నివాసాల మధ్యన చేదబావి ఉండగా మహిళలు తాడుతో కట్టిన బొక్కెన ఆధారంగా ఉదయం, సాయంత్రం నీటిని తోడుకుంటారు. అదుపుతప్పితే బావిలో పడే ప్రమాదముంది. గ్రామ శివారులోని హెడెన్ బావిలో ఓ యువకుడు బావిలోపడి మృతి చెందాడు.
వికారాబాద్ మండల అనంతగిరి ఆలయ సమీపం నుంచి వెళ్లే మార్గం, కెరెళ్లి నుంచి బుగ్గ వెళ్లే మార్గంలో రోడ్డుకు ఇరువైపులా గుంతలు పడ్డాయి. అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా చర్యలు చేపట్టలేదు. ఈ మార్గంలో నిత్యం వేలల్లో వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. ఆయా ప్రాంతాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మ్యాన్హోల్ నుంచి వంటనూనెల వ్యర్థాలు
[ 27-07-2024]
ఆర్టీసీ క్రాస్రోడ్డు పరిధిలోని ప్రధాన రహదారిపై ఓ డ్రైనేజీ మ్యాన్హోల్ నుంచి శుక్రవారం ఉదయం వంటనూనెల వ్యర్థాలు పొంగిపొర్లాయి. -
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
[ 27-07-2024]
రైల్లో దూర ప్రయాణం.. రాత్రిళ్లు చల్లగాలి.. కబుర్లు చెప్పుకుంటూ నిద్రలోకి జారుకుంటే చాలు.. అదును కోసం చూస్తున్న దొంగలకు పండగే. -
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
[ 27-07-2024]
మహేశ్వరంలోని ఓ హోటల్లో చోరీ చేసేందుకు వచ్చిన ఓ దొంగ.. పోలీసులకు కనీసం ఒక్క క్లూ కూడా దొరక్కుండా.. ఎంతో జాగ్రత్తగా పథకం వేశాడు. -
పనులు కదలాలి.. ప్రగతి పరుగిడాలి
[ 27-07-2024]
ఎనిమిదేళ్ల కిందట రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రాంటుగా హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ)కు అందిన మొత్తం కేవలం రూ.250 కోట్లు. అప్పటి నుంచి బల్దియాకు ఒక్కపైసా కూడా గ్రాంటుగా నిధులందలేదు. -
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
[ 27-07-2024]
రాజీవ్ రహదారిపై అతివేగంగా కారు నడిపి బస్సును ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి చెందారు. -
ఆ భూముల జాడ.. దేవుడికే తెలియాలి
[ 27-07-2024]
రాజధాని పరిధిలో 9వేల ఎకరాలకుపైనే దేవాదాయశాఖ భూములున్నాయి. నిత్యం ధూప, దీప నైవేద్యాల కోసం గతంలో అనేక మంది భూవిరాళాలు ఇచ్చారు. -
పాలక మండలి సభ్యుల సంబరాలు
[ 27-07-2024]
నగరం అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరు శాఖలకు కలిపి పద్దులో రూ.10వేల కోట్లను కేటాయించడంపై కాంగ్రెస్కు చెందిన జీహెచ్ఎంసీ పాలకమండలి సభ్యులు శుక్రవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు. -
మా ఇష్టం.. మేమిట్లే జేస్తం
[ 27-07-2024]
రాజధాని నగరంలో బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు వేగంగా పెరుగుతుండడంతో వాటికి అవసరమైన ఇటుకల తయారీ కోసం కొందరు నీళ్లు సమృద్ధిగా ఉన్న జంటజలాశయాల పరివాహక ప్రాంతాన్ని ఎంచుకున్నారు. -
కుటుంబాలను కూల్చేస్తున్న రీల్స్
[ 27-07-2024]
రీల్స్ మోజులో పడి తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగిల్చినవారు కొందరైతే.. కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకున్నవారు మరికొందరు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
యువతలో పెరుగుతున్న హృద్రోగ ముప్పు
[ 27-07-2024]
యువతలో గుండె సమస్యలు పెరుగుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. -
విద్యుత్తు అధికారుల్లో సూర్యాఘర్ జోష్
[ 27-07-2024]
సౌర విద్యుత్తును 300 యూనిట్ల వరకూ పొందే ‘పీఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’ పథకంలో ఎక్కువ మందిని చేర్పించే విద్యుత్తు అధికారులకు కేంద్రం ప్రోత్సహకాలు ప్రకటించింది. -
మాజీ రాష్ట్రపతి సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం సందర్శన
[ 27-07-2024]
శంషాబాద్ మండలం శ్రీరామనగరంలో వెలిసిన సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శుక్రవారం సందర్శించారు. -
దేశభక్తి చాటిన కార్గిల్ విజయోత్సవ ర్యాలీ
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధ విజయోత్సవానికి పాతికేళ్ల సందర్భంగా శుక్రవారం నారాయణగూడలోని రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి(అర్బీవీఆర్ఆర్) మహిళా కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్-2, తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ స్వచ్ఛంద సంస్థల సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ పలు ప్రాంతాల్లో కొనసాగింది. -
కోట్పల్లి కల్పవల్లి
[ 27-07-2024]
జిల్లాలో అతిపెద్దదైన కోట్పల్లి ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. బడ్జెట్లో రూ.8 కోట్లు కేటాయించింది. -
అరణ్యం కబ్జా పర్వం.. కొనసాగుతున్న వివాదం!
[ 27-07-2024]
రెండు దశాబ్దాలుగా జిల్లాకు చెందిన అటవీ భూములను ఆక్రమించుకుని కర్ణాటక వాసులు సాగు చేస్తూ పంటలు పండిస్తున్నారు. -
బాధిత అంధ బాలికను, కుటుంబాన్ని ఆదుకోవాలి
[ 27-07-2024]
మలక్పేట ప్రభుత్వ అంధ బాలికల వసతి గృహం వద్ద శుక్రవారం ఆందోళనలు కొనసాగాయి. -
రాష్ట్రపతి నిలయాల్లో సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం
[ 27-07-2024]
ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతిగా రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం, సిమ్లా, దిల్లీలోని రాష్ట్రపతి భవనాల సందర్శనకు సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు రాష్ట్రపతి నిలయం అధికారులు తెలిపారు. -
శిల్పారామం పేరు, లోగో వాడొద్దు
[ 27-07-2024]
అనుమతి లేకుండా శిల్పారామం పేరు, లోగోను ఇతరులు ఉపయోగించరాదని శిల్పారామం ప్రత్యేకాధికారి జి.కిషన్రావు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. -
ఆలయాల్లో కానుకలు చోరీ!
[ 27-07-2024]
దేవాలయాలు లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న టి.నరేందర్(27)ను శుక్రవారం అరెస్ట్ చేసినట్టు ఫలక్నుమా ఏసీపీ ఎన్.ఎల్.నారాయణరాజు తెలిపారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
స్టంట్ చేస్తూ, కాలుచేయి పోగొట్టుకున్న యువకుడు: రైల్వే పోస్టు వైరల్
-
మరో రికార్డును సొంతం చేసుకున్న విశాఖ ఉక్కు .. కార్మికుల హర్షాతిరేకాలు
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్