logo

కళ్లలో కారం చల్లి, కత్తులతో పొడిచి

కళ్లలో కారం చల్లి.. కత్తులతో పొడిచి ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. ఉప్పల్‌ పోలీసుల కథనం ప్రకారం.. సికింద్రాబాద్‌కు చెందిన పుస్తకాల సాయికుమార్‌(43) సెకండ్‌హ్యాండ్‌ కార్ల వ్యాపారి.

Published : 23 Feb 2024 02:34 IST

సెకండ్‌హ్యాండ్‌ కార్ల వ్యాపారి దారుణ హత్య

ఉప్పల్‌, న్యూస్‌టుడే: కళ్లలో కారం చల్లి.. కత్తులతో పొడిచి ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. ఉప్పల్‌ పోలీసుల కథనం ప్రకారం.. సికింద్రాబాద్‌కు చెందిన పుస్తకాల సాయికుమార్‌(43) సెకండ్‌హ్యాండ్‌ కార్ల వ్యాపారి. ఆయన గతంలో చిలుకానగర్‌ డివిజన్‌ ఆదర్శనగర్‌లో ఉండేవారు. బుధవారం రాత్రి ఉప్పల్‌ వెలుగుగుట్ట ప్రాంతంలో సాయికుమార్‌పై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన సాయికుమార్‌ను గాంధీకి తరలించగా.. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు.

తల్లీకూతురు పనేనా..?: సాయికుమార్‌ ఆదర్శనగర్‌లో ఉండే సమయంలో ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉన్నట్టుగా తెలిసింది. ఆమె కొంతకాలంగా సాయికుమార్‌ను దూరం పెడుతున్నప్పటికీ అతడు వెంటపడుతున్నాడు. దీంతో అతడ్ని హతం చేసేందుకు కూతురితో కలిసి పథకం వేసినట్లు తెలిసింది. సాయికుమార్‌ను వెలుగుగుట్ట ప్రాంతానికి రప్పించి మరో ఇద్దరితో కలిసి కళ్లలో కారం చల్లి, కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేసినట్టుగా సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని