నిబంధనలు కనం.. ప్రాణాలు పణం
జీహెచ్ఎంసీలోని కొందరు అవినీతి అధికారులు.. పైవంతెనలు, మెట్రో మార్గాల పిట్ట గోడలపై ప్రకటనలు ఏర్పాటు చేసుకునేందుకు అవకాశమిస్తున్నారు. ఎఫ్ఓబీలు, భవన సముదాయాల గోడలపై ఎల్ఈడీ ప్రకటనలకు అనధికారికంగా ఊతమిస్తున్నారు.
ఎఫ్ఓబీ, మెట్రో మార్గం, పైవంతెనలకు ప్రకటనలు
వర్షం, ఈదురు గాలులొస్తే రోడ్లపై పడే ప్రమాదం
మామూళ్ల కోసం ప్రాణాపాయమైనా కొనసాగింపు
ఈనాడు, హైదరాబాద్
జీహెచ్ఎంసీలోని కొందరు అవినీతి అధికారులు.. పైవంతెనలు, మెట్రో మార్గాల పిట్ట గోడలపై ప్రకటనలు ఏర్పాటు చేసుకునేందుకు అవకాశమిస్తున్నారు. ఎఫ్ఓబీలు, భవన సముదాయాల గోడలపై ఎల్ఈడీ ప్రకటనలకు అనధికారికంగా ఊతమిస్తున్నారు. ప్రతినెలా రూ.లక్షల్లో కమీషన్లు దండుకుంటున్నారు. ఓ వైపు జీహెచ్ఎంసీ ఆదాయానికి గండి కొడుతూ.. మరోవైపు ప్రజల ప్రాణాలకు ముప్పు తెస్తున్నారు. పీకపై కత్తి పెట్టినట్లు, వాహనదారుల కోసం సిద్ధంగా ఉన్న యమపాశంలా ఆయా ప్రకటన బోర్డులు రోడ్డుపై వేలాడుతూ కనిపిస్తుంటాయి. చట్ట ప్రకారం వాటికి అనుమతి లేకపోయినా.. ఆమ్యామ్యాల కోసం అధికారులే ప్రోత్సహిస్తున్నారన్న విమర్శలున్నాయి.
జీవో.68తో ద్వంద ప్రమాణాలు..
గత ప్రభుత్వం 2018లో జీవో.68 పేరుతో కొత్త ప్రకటనల విధానాన్ని తీసుకొచ్చింది. ప్రజల శ్రేయస్సు కోసమంటూ.. రోడ్లకు ఇరువైపులా 15అడుగులకన్నా ఎత్తులో ఎలాంటి ప్రకటనలు ఉండొద్దని నిషేధం విధించింది. అంతవరకు బాగానేఉన్నా.. మెట్రో రైలు ఆస్తులకు ఆ ఉత్తర్వు వర్తించదు. మెట్రో సంస్థ, ప్రభుత్వానికి మధ్య ఆమేర ఒప్పందం ఉందని జీహెచ్ఎంసీ చెబుతోంది. ఒకేరోడ్డుపై ఉన్న వేర్వేరు ఆస్తులపై ఏర్పాటుచేసుకునే ప్రకటనలకు రెండు రకాల నిబంధనలు ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. మెట్రో మార్గంపై ప్రతి కూడలి వద్ద పిట్టగోడకు ఇనుప జాలీలను తగిలించారు. టన్నుల కొద్దీ బరువుండే జాలీలు రహదారిపై వేలాడుతూ ఉంటాయి. సికింద్రాబాద్ సంగీత్ చౌరస్తా, పంజాగుట్ట, ఆర్టీసీ క్రాసురోడ్డు, ఖైరతాబాద్, అమీర్పేట, జేబీఎస్, ప్యారడైజ్, బేగంపేట తదితర ప్రాంతాల్లో.. ఆయా జాలీలు 15 నుంచి 18మీటర్ల ఎత్తులో ఉంటాయి. తెలుగుతల్లి కూడలి, సైబర్ టవర్స్ తదితర కూడళ్లలో పైవంతెనలపై అలాంటి ప్రకటనలు కనిపిస్తున్నాయి. ఈదురు గాలులు, భారీ వర్షాలు వచ్చినప్పుడు, ప్రకృతి విపత్తుల సమయంలో ఫ్లెక్సీలు చిరిగిపోయి వాహనదారులపై పడే ప్రమాదముంది. కొందరు అధికారుల స్వప్రయోజనాలు, రాజకీయ నేతల ప్రచారానికే ఉపయోగపడే ఆ హోర్డింగ్లను తొలగించాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు.
వీటితోనే ప్రమాదం..
- మెట్రో పిల్లర్లపై ఏర్పాటు చేసుకునే ప్రకటనలతో పెద్దగా ప్రమాదం లేదని, రోడ్డుపై తోరణాల్లా వేలాడదీసే ప్రకటనలతో ముప్పు పొంచి ఉంది.
- నగరంలో ప్రస్తుతం మెట్రో మార్గం, పైవంతెనల పిట్టగోడలపై ఏర్పాటు చేసిన ప్రకటనలు 200 ఉన్నాయి. అందులో కొన్ని అనుమతి లేనివి. వాటిపై వచ్చే ఆదాయం పూర్తిగా అధికారులు, ప్రజాప్రతినిధుల జేబుల్లోకి వెళ్తుంది. అధికారిక ప్రకటనలకు యాడ్ ఏజెన్సీలు నెలకు రూ.10లక్షల మేర రుసుము తీసుకుని, మెట్రో సంస్థకు రూ.25వేలు చెల్లిస్తాయని సమాచారం.
- స్టేషన్ స్కైవాక్లు 120, రైలింగ్ యాడ్లు 2వేలు, పిల్లర్లపై 2వేలు, రోడ్డుపై తోరణంలా ఉండే పిల్లర్లకు 150 ప్రకటనలను ఏర్పాటు చేస్తుంటారు. వాటిలో కొన్ని అనధికారికమని, మిగిలిన వాటికి ఏజెన్సీలు నెలకు రూ.5లక్షల నుంచి రూ.15లక్షల మేర రుసుము తీసుకుని, మెట్రో సంస్థకు రూ.2వేల నుంచి రూ.50వేల మేర చెల్లిస్తుంటాయని జీహెచ్ఎంసీ పాలకమండలి తాజాగా గగ్గోలు పెట్టింది. బల్దియాకు రూపాయి కూడా వాటి నుంచి ఆదాయం రావట్లేదని గుర్తు చేసింది.
- ఆదాయం పేరుతో తాజాగా జీహెచ్ఎంసీ జీవో68ను రద్దు చేయాలని కోరుతూ సర్కారుకు లేఖ రాసిందని, రద్దు చేయకుండా సవరణలు చేయాలని నగరవాసులు కోరుతున్నారు. హోర్డింగులు, రోడ్లపై ప్రకటనలు, ఫ్లెక్సీ బోర్డులు, ఇతరత్రా ప్రమాదకర ప్రకటనలు ప్రమాదకరమని గుర్తు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
[ 27-07-2024]
రైల్లో దూర ప్రయాణం.. రాత్రిళ్లు చల్లగాలి.. కబుర్లు చెప్పుకుంటూ నిద్రలోకి జారుకుంటే చాలు.. అదును కోసం చూస్తున్న దొంగలకు పండగే. -
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
[ 27-07-2024]
మహేశ్వరంలోని ఓ హోటల్లో చోరీ చేసేందుకు వచ్చిన ఓ దొంగ.. పోలీసులకు కనీసం ఒక్క క్లూ కూడా దొరక్కుండా.. ఎంతో జాగ్రత్తగా పథకం వేశాడు. -
పనులు కదలాలి.. ప్రగతి పరుగిడాలి
[ 27-07-2024]
ఎనిమిదేళ్ల కిందట రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రాంటుగా హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ)కు అందిన మొత్తం కేవలం రూ.250 కోట్లు. అప్పటి నుంచి బల్దియాకు ఒక్కపైసా కూడా గ్రాంటుగా నిధులందలేదు. -
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
[ 27-07-2024]
రాజీవ్ రహదారిపై అతివేగంగా కారు నడిపి బస్సును ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి చెందారు. -
ఆ భూముల జాడ.. దేవుడికే తెలియాలి
[ 27-07-2024]
రాజధాని పరిధిలో 9వేల ఎకరాలకుపైనే దేవాదాయశాఖ భూములున్నాయి. నిత్యం ధూప, దీప నైవేద్యాల కోసం గతంలో అనేక మంది భూవిరాళాలు ఇచ్చారు. -
పాలక మండలి సభ్యుల సంబరాలు
[ 27-07-2024]
నగరం అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరు శాఖలకు కలిపి పద్దులో రూ.10వేల కోట్లను కేటాయించడంపై కాంగ్రెస్కు చెందిన జీహెచ్ఎంసీ పాలకమండలి సభ్యులు శుక్రవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు. -
మా ఇష్టం.. మేమిట్లే జేస్తం
[ 27-07-2024]
రాజధాని నగరంలో బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు వేగంగా పెరుగుతుండడంతో వాటికి అవసరమైన ఇటుకల తయారీ కోసం కొందరు నీళ్లు సమృద్ధిగా ఉన్న జంటజలాశయాల పరివాహక ప్రాంతాన్ని ఎంచుకున్నారు. -
మ్యాన్హోల్ నుంచి వంటనూనెల వ్యర్థాలు
[ 27-07-2024]
ఆర్టీసీ క్రాస్రోడ్డు పరిధిలోని ప్రధాన రహదారిపై ఓ డ్రైనేజీ మ్యాన్హోల్ నుంచి శుక్రవారం ఉదయం వంటనూనెల వ్యర్థాలు పొంగిపొర్లాయి. -
కుటుంబాలను కూల్చేస్తున్న రీల్స్
[ 27-07-2024]
రీల్స్ మోజులో పడి తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగిల్చినవారు కొందరైతే.. కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకున్నవారు మరికొందరు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
యువతలో పెరుగుతున్న హృద్రోగ ముప్పు
[ 27-07-2024]
యువతలో గుండె సమస్యలు పెరుగుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. -
విద్యుత్తు అధికారుల్లో సూర్యాఘర్ జోష్
[ 27-07-2024]
సౌర విద్యుత్తును 300 యూనిట్ల వరకూ పొందే ‘పీఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’ పథకంలో ఎక్కువ మందిని చేర్పించే విద్యుత్తు అధికారులకు కేంద్రం ప్రోత్సహకాలు ప్రకటించింది. -
మాజీ రాష్ట్రపతి సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం సందర్శన
[ 27-07-2024]
శంషాబాద్ మండలం శ్రీరామనగరంలో వెలిసిన సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శుక్రవారం సందర్శించారు. -
దేశభక్తి చాటిన కార్గిల్ విజయోత్సవ ర్యాలీ
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధ విజయోత్సవానికి పాతికేళ్ల సందర్భంగా శుక్రవారం నారాయణగూడలోని రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి(అర్బీవీఆర్ఆర్) మహిళా కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్-2, తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ స్వచ్ఛంద సంస్థల సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ పలు ప్రాంతాల్లో కొనసాగింది. -
కోట్పల్లి కల్పవల్లి
[ 27-07-2024]
జిల్లాలో అతిపెద్దదైన కోట్పల్లి ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. బడ్జెట్లో రూ.8 కోట్లు కేటాయించింది. -
అరణ్యం కబ్జా పర్వం.. కొనసాగుతున్న వివాదం!
[ 27-07-2024]
రెండు దశాబ్దాలుగా జిల్లాకు చెందిన అటవీ భూములను ఆక్రమించుకుని కర్ణాటక వాసులు సాగు చేస్తూ పంటలు పండిస్తున్నారు. -
బాధిత అంధ బాలికను, కుటుంబాన్ని ఆదుకోవాలి
[ 27-07-2024]
మలక్పేట ప్రభుత్వ అంధ బాలికల వసతి గృహం వద్ద శుక్రవారం ఆందోళనలు కొనసాగాయి. -
రాష్ట్రపతి నిలయాల్లో సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం
[ 27-07-2024]
ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతిగా రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం, సిమ్లా, దిల్లీలోని రాష్ట్రపతి భవనాల సందర్శనకు సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు రాష్ట్రపతి నిలయం అధికారులు తెలిపారు. -
శిల్పారామం పేరు, లోగో వాడొద్దు
[ 27-07-2024]
అనుమతి లేకుండా శిల్పారామం పేరు, లోగోను ఇతరులు ఉపయోగించరాదని శిల్పారామం ప్రత్యేకాధికారి జి.కిషన్రావు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. -
ఆలయాల్లో కానుకలు చోరీ!
[ 27-07-2024]
దేవాలయాలు లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న టి.నరేందర్(27)ను శుక్రవారం అరెస్ట్ చేసినట్టు ఫలక్నుమా ఏసీపీ ఎన్.ఎల్.నారాయణరాజు తెలిపారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్