తల్లుల చెంత.. తరాల పులకింత..!
వనదేవతల సన్నిధిలో భక్తజనం పులకిస్తోంది.. ఆధ్యాత్మిక లోకంలో తేలియాడుతోంది.. బాలలకు రంగుల ప్రపంచం ముచ్చట గొల్పుతోంది.. యువతలో భక్తిభావం వెల్లువెత్తుతోంది.
వన దేవతలకు తీరొక్క మొక్కులు
న్యూస్టుడే, మేడారం (డోర్నకల్)
వనదేవతల సన్నిధిలో భక్తజనం పులకిస్తోంది.. ఆధ్యాత్మిక లోకంలో తేలియాడుతోంది.. బాలలకు రంగుల ప్రపంచం ముచ్చట గొల్పుతోంది.. యువతలో భక్తిభావం వెల్లువెత్తుతోంది. తల్లుల చెంత కొంత సమయం గడిపేందుకు వృద్ధుల్లో చైతన్యం ఉరకలేస్తోంది.. వయసుతో సంబంధం లేకుండా పసికందు మొదలు వృద్ధుల వరకు అమ్మల దర్శనంతో తన్మయత్వం చెందుతున్నారు. మేడారంలో ఎవరిని చూసినా సమ్మక్క, సారలమ్మల నామస్మరణే.. ఆధ్యాత్మిక చింతనే..
వన దేవతల దర్శనానికి ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా నుంచి లక్షలాదిగా భక్తులు తరలివస్తున్నారు. జంపన్న వాగులో పుణ్యస్నానం చేసి సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులకు తీరొక్క మొక్కులు చెల్లిస్తున్నారు. ఆలయ ప్రాంగణం, జంపన్న వాగు వద్ద ముడుపులు కడుతున్నారు. సంతానం కోసం ఊయల, సుమంగళిగా వర్ధిల్లాలని గాజులు మొక్కుగా సమర్పిస్తున్నారు. ఎదురుకోడి, కోడె, చిల్లర నాణేలు, గంట, ఎత్తుబెల్లం(బంగారం), ఒడిబియ్యం, తలనీలాలు, తదితర మొక్కులు చెల్లిస్తున్నారు.
జాతర ప్రత్యేకతలు
- గురువారం మేడారంలోని చిలుకలగుట్ట నుంచి సమ్మక్క తల్లిని గద్దెకు చేర్చారు. ఈ మహాఘట్టాన్ని చూసేందుకు చిలుకలగుట్ట నుంచి గద్దెల వరకు భక్తులు బారులు తీరారు.
- మేడారంలోని గిరిజన మ్యూజియం ఆవరణలో కోయ గిరిజనుల సమ్మేళనం నిర్వహించారు. దాదాపు 30కి పైగా ఇలవేల్పులను ఆయా వంశస్థులు ఒకే చోటుకు చేర్చారు. పగిడలతో ఆదివాసీ నృత్యాలు చేశారు. ఇలవేల్పులకు పూజలు నిర్వహించి సహపంక్తి భోజనాలు చేశారు.
- జంపన్నవాగులో ఒక్కరోజే దాదాపు 20 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు చేసినట్లు అంచనా.
- వనదేవతలను కేంద్ర మంత్రి కిషన్రెడ్డి దర్శించుకున్నారు. మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవితతో పాటు ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, సత్యవతి రాథోడ్ అమ్మవార్లకు మొక్కులు చెల్లించారు.
ఈనాడు డిజిటల్, జయశంకర్ భూపాలపల్లి
అమ్మల జ్ఞాపిక.. ఆసక్తికరం
న్యూస్టుడే, మేడారం (కాజీపేట): మేడారం జాతర గుర్తుగా ప్రముఖులకు అందించే జ్ఞాపికను ఈసారి రాష్ట్ర ప్రభుత్వం విభిన్నంగా రూపొందించింది. గాజుగ్లాస్ ఫ్రేములో సమ్మక్క, సారలమ్మ గద్దెలు, వాటి మీద చెట్టు మొదళ్లకు కట్టిన చీరలతో కూడిన రూపాన్ని తయారు చేశారు. గురువారం సమ్మక్క దర్శనం కోసం వచ్చిన కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి మంత్రి సీతక్క దీన్ని బహూకరించారు.
హెలికాప్టర్లో వెళ్లొద్దామా..
న్యూస్టుడే, కాజీపేట టౌన్: మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర చూసి, తల్లులను దర్శించుకోవడానికి కాజీపేట సెయింట్ గాబ్రియల్ పాఠశాల నుంచి గురువారం హెలికాప్టర్ ద్వారా భక్తులు తరలి వెళ్లారు. హైదరాబాద్ నుంచి కాజీపేటకు చేరుకున్న హెలికాప్టర్ అప్పటికే ఆన్లైన్ ద్వారా టికెట్ బుక్ చేసుకున్న ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాలకు చెందినవారిని మేడారానికి తీసుకెళ్లింది. గాలిలోకి ఎగిరిన అనంతరం 15 నిమిషాల్లో మేడారానికి చేరుకున్నట్లు భక్తులు తెలిపారు. ఒక్కొక్కరికి ప్రయాణ ఛార్జీ రూ.28,999. మేడారం అందాలను వీక్షించడానికి రూ.4,800 టికెట్ నిర్ణయించారు. హెలికాప్టర్ రోజుకు కేవలం మూడు నుంచి నాలుగు ట్రిప్పులు మాత్రమే మేడారానికి వెళ్లగలదని తుంబే ఏవియేషన్ అధికారులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మ్యాన్హోల్ నుంచి వంటనూనెల వ్యర్థాలు
[ 27-07-2024]
ఆర్టీసీ క్రాస్రోడ్డు పరిధిలోని ప్రధాన రహదారిపై ఓ డ్రైనేజీ మ్యాన్హోల్ నుంచి శుక్రవారం ఉదయం వంటనూనెల వ్యర్థాలు పొంగిపొర్లాయి. -
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
[ 27-07-2024]
రైల్లో దూర ప్రయాణం.. రాత్రిళ్లు చల్లగాలి.. కబుర్లు చెప్పుకుంటూ నిద్రలోకి జారుకుంటే చాలు.. అదును కోసం చూస్తున్న దొంగలకు పండగే. -
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
[ 27-07-2024]
మహేశ్వరంలోని ఓ హోటల్లో చోరీ చేసేందుకు వచ్చిన ఓ దొంగ.. పోలీసులకు కనీసం ఒక్క క్లూ కూడా దొరక్కుండా.. ఎంతో జాగ్రత్తగా పథకం వేశాడు. -
పనులు కదలాలి.. ప్రగతి పరుగిడాలి
[ 27-07-2024]
ఎనిమిదేళ్ల కిందట రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రాంటుగా హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ)కు అందిన మొత్తం కేవలం రూ.250 కోట్లు. అప్పటి నుంచి బల్దియాకు ఒక్కపైసా కూడా గ్రాంటుగా నిధులందలేదు. -
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
[ 27-07-2024]
రాజీవ్ రహదారిపై అతివేగంగా కారు నడిపి బస్సును ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి చెందారు. -
ఆ భూముల జాడ.. దేవుడికే తెలియాలి
[ 27-07-2024]
రాజధాని పరిధిలో 9వేల ఎకరాలకుపైనే దేవాదాయశాఖ భూములున్నాయి. నిత్యం ధూప, దీప నైవేద్యాల కోసం గతంలో అనేక మంది భూవిరాళాలు ఇచ్చారు. -
పాలక మండలి సభ్యుల సంబరాలు
[ 27-07-2024]
నగరం అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరు శాఖలకు కలిపి పద్దులో రూ.10వేల కోట్లను కేటాయించడంపై కాంగ్రెస్కు చెందిన జీహెచ్ఎంసీ పాలకమండలి సభ్యులు శుక్రవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు. -
మా ఇష్టం.. మేమిట్లే జేస్తం
[ 27-07-2024]
రాజధాని నగరంలో బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు వేగంగా పెరుగుతుండడంతో వాటికి అవసరమైన ఇటుకల తయారీ కోసం కొందరు నీళ్లు సమృద్ధిగా ఉన్న జంటజలాశయాల పరివాహక ప్రాంతాన్ని ఎంచుకున్నారు. -
కుటుంబాలను కూల్చేస్తున్న రీల్స్
[ 27-07-2024]
రీల్స్ మోజులో పడి తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగిల్చినవారు కొందరైతే.. కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకున్నవారు మరికొందరు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
యువతలో పెరుగుతున్న హృద్రోగ ముప్పు
[ 27-07-2024]
యువతలో గుండె సమస్యలు పెరుగుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. -
విద్యుత్తు అధికారుల్లో సూర్యాఘర్ జోష్
[ 27-07-2024]
సౌర విద్యుత్తును 300 యూనిట్ల వరకూ పొందే ‘పీఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’ పథకంలో ఎక్కువ మందిని చేర్పించే విద్యుత్తు అధికారులకు కేంద్రం ప్రోత్సహకాలు ప్రకటించింది. -
మాజీ రాష్ట్రపతి సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం సందర్శన
[ 27-07-2024]
శంషాబాద్ మండలం శ్రీరామనగరంలో వెలిసిన సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శుక్రవారం సందర్శించారు. -
దేశభక్తి చాటిన కార్గిల్ విజయోత్సవ ర్యాలీ
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధ విజయోత్సవానికి పాతికేళ్ల సందర్భంగా శుక్రవారం నారాయణగూడలోని రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి(అర్బీవీఆర్ఆర్) మహిళా కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్-2, తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ స్వచ్ఛంద సంస్థల సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ పలు ప్రాంతాల్లో కొనసాగింది. -
కోట్పల్లి కల్పవల్లి
[ 27-07-2024]
జిల్లాలో అతిపెద్దదైన కోట్పల్లి ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. బడ్జెట్లో రూ.8 కోట్లు కేటాయించింది. -
అరణ్యం కబ్జా పర్వం.. కొనసాగుతున్న వివాదం!
[ 27-07-2024]
రెండు దశాబ్దాలుగా జిల్లాకు చెందిన అటవీ భూములను ఆక్రమించుకుని కర్ణాటక వాసులు సాగు చేస్తూ పంటలు పండిస్తున్నారు. -
బాధిత అంధ బాలికను, కుటుంబాన్ని ఆదుకోవాలి
[ 27-07-2024]
మలక్పేట ప్రభుత్వ అంధ బాలికల వసతి గృహం వద్ద శుక్రవారం ఆందోళనలు కొనసాగాయి. -
రాష్ట్రపతి నిలయాల్లో సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం
[ 27-07-2024]
ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతిగా రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం, సిమ్లా, దిల్లీలోని రాష్ట్రపతి భవనాల సందర్శనకు సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు రాష్ట్రపతి నిలయం అధికారులు తెలిపారు. -
శిల్పారామం పేరు, లోగో వాడొద్దు
[ 27-07-2024]
అనుమతి లేకుండా శిల్పారామం పేరు, లోగోను ఇతరులు ఉపయోగించరాదని శిల్పారామం ప్రత్యేకాధికారి జి.కిషన్రావు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. -
ఆలయాల్లో కానుకలు చోరీ!
[ 27-07-2024]
దేవాలయాలు లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న టి.నరేందర్(27)ను శుక్రవారం అరెస్ట్ చేసినట్టు ఫలక్నుమా ఏసీపీ ఎన్.ఎల్.నారాయణరాజు తెలిపారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
స్టంట్ చేస్తూ, కాలుచేయి పోగొట్టుకున్న యువకుడు: రైల్వే పోస్టు వైరల్
-
మరో రికార్డును సొంతం చేసుకున్న విశాఖ ఉక్కు .. కార్మికుల హర్షాతిరేకాలు
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్