logo

షణ్ముఖ్‌ జశ్వంత్‌కు 41ఎ సీఆర్‌పీసీ నోటీసు

గంజాయితో పట్టుబడిన కేసులో యూట్యూబర్‌, బిగ్‌బాస్‌ ఫేమ్‌ షణ్ముణ్‌ జశ్వంత్‌కు వైద్యపరీక్షలు నిర్వహించి తదుపరి విచారణకు హాజరుకావాలని 41ఎ సీఆర్‌పీసీ కింద నోటీసులు జారీ

Published : 24 Feb 2024 07:49 IST

నార్సింగి న్యూస్‌టుడే: గంజాయితో పట్టుబడిన కేసులో యూట్యూబర్‌, బిగ్‌బాస్‌ ఫేమ్‌ షణ్ముణ్‌ జశ్వంత్‌కు వైద్యపరీక్షలు నిర్వహించి తదుపరి విచారణకు హాజరుకావాలని 41ఎ సీఆర్‌పీసీ కింద నోటీసులు జారీ చేసినట్లు నార్సింగి ఇన్‌స్పెక్టర్‌ హరికృష్ణారెడ్డి తెలిపారు. వైద్య పరీక్షల నివేదిక 15 రోజుల్లో వస్తుందన్నారు. ఓ యువతిని   పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసగించిన కేసు విచారణ కోసం పుప్పాలగూడలోని సంపత్‌ వినయ్‌ ఇంటికి వెళ్లిన పోలీసులకు ఆ ఇంట్లో అతని సోదరుడు షణ్ముఖ్‌ జశ్వంత్‌ 18 గ్రాముల గంజాయితో పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ మేరకు నార్సింగి పోలీసులు షణ్ముఖ్‌ జశ్వంత్‌పై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని