logo

చార్టెర్డ్‌ అకౌంటెంట్లకు రూ.2.48 కోట్ల టోకరా

చార్టెర్డ్‌ అకౌంటెంట్‌(సీఏ)లను లక్ష్యంగా చేసుకొని రూ.2.48 కోట్లు దండుకొన్న నిందితుడిని హైదరాబాద్‌ సీసీఎస్‌-డీడీ పోలీసులు అరెస్టు చేశారు.

Published : 24 Feb 2024 02:44 IST

శ్రీనాథ్‌ రాఠి

నారాయణగూడ, న్యూస్‌టుడే: చార్టెర్డ్‌ అకౌంటెంట్‌(సీఏ)లను లక్ష్యంగా చేసుకొని రూ.2.48 కోట్లు దండుకొన్న నిందితుడిని హైదరాబాద్‌ సీసీఎస్‌-డీడీ పోలీసులు అరెస్టు చేశారు. కాచిగూడ నింబోలిఅడ్డాలోని శ్రీకృష్ణ అపార్ట్‌మెంట్‌లో నివాసముండే శ్రీనాథ్‌ రాఠీ(29) చార్టెర్డ్‌ అకౌంటెంట్ల వద్ద తప్పుడు వాగ్దానాలతో డబ్బు దండుకున్నాడు.  తర్వాత అందుబాటులో లేడు. ఫోన్‌కాల్స్‌కి స్పందించడం లేదు. నిందితుడిని గురువారం సీసీఎస్‌ పోలీసులు అరెస్టు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని