పుర బడ్జెట్ రూ.66.98 కోట్లు
వికారాబాద్ పురపాలక సంఘం 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ సమావేశం పురపాలక సమావేశ మందిరంలో శుక్రవారం అధ్యక్షురాలు సి.మంజుల అధ్యక్షతన జరిగింది.
మాట్లాడుతున్న పురపాలక అధ్యక్షురాలు సి.మంజుల, చిత్రంలో అదనపు కలెక్టర్ రాహుల్శర్మ, ఉపాధ్యక్షురాలు శంషాద్బేగం
వికారాబాద్ మున్సిపాలిటీ: వికారాబాద్ పురపాలక సంఘం 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ సమావేశం పురపాలక సమావేశ మందిరంలో శుక్రవారం అధ్యక్షురాలు సి.మంజుల అధ్యక్షతన జరిగింది. కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్శర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం సమావేశ వివరాలను అధ్యక్షురాలు మంజుల వివరించారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.66.98 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారు. ఇందులో ఖర్చులు రూ.66.72 కోట్లు పోను మిగులు బడ్జెట్ రూ.26.03 లక్షలని పేర్కొన్నారు. వీటిలో పన్నులు ద్వారా రూ.10 కోట్లు, పన్నేతరల పనుల కింద రూ.10.16 కోట్ల ఆదాయం వస్తుందని సూచించారు. నాన్ ప్లానింగ్ గ్రాంట్ల కింద రూ.3.30 కోట్లు వస్తుందని అంచనా వేశారు. అంచనా వ్యయం రూ.66.72 కోట్లని తెలిపారు. సిబ్బంది వేతనాలు రూ.5.85 కోట్లు, విద్యుత్తు ఛార్జీలు రూ.1.75 కోట్లు, రుణాలకు రూ.1.10కోట్లు, నిర్వహణ వ్యయం రూ.3.22 కోట్లు వ్యయం అవుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షురాలు శంషాద్బేగం, కమిషనర్ జాకీర్ అహ్మద్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.
హరితహారం లక్ష్యాలను అధిగమించాలి
వికారాబాద్ మున్సిపాలిటీ: జిల్లాలో హరితహారంలో నిర్ణయించిన లక్ష్యాలను అధిగమించాలని అదనపు కలెక్టర్ రాహుల్శర్మ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో హరితహారం కార్యాచరణపై సంబంధిత అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. లక్ష్యాలకు అనుగుణంగా మొక్కలను నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. ఔషధ మొక్కలను నాటేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. గ్రామాల్లో ఖాళీ స్థలాలను గుర్తించి మొక్కలను నాటేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పొలం గట్లపై, రోడ్లకు ఇరువైపులా పెద్ద మొక్కలను నాటాలని సూచించారు. సమావేశంలో డీఎఫ్ఓ జ్ఞానేశ్వర్, డీఆర్డీఓ శ్రీనివాస్, పరిశ్రమల శాఖ మేనేజర్ వినయ్కుమార్, జిల్లా అధికారులు అనిల్కుమార్, గోపాల్, సామెల్ జాకబ్, అర్చన, పుర కమిషనర్లు జాకీర్ అహ్మద్, వెంకటయ్య, బలరాంనాయక్, విక్రమ్సింహరెడ్డి పాల్గొన్నారు.
వైద్య, ఆరోగ్యశాఖలో ఖాళీల భర్తీ
వికారాబాద్ మున్సిపాలిటీ: వికారాబాద్ జిల్లాలో జాతీయ ఆరోగ్య మిషన్ కార్యక్రమం కింద ఒప్పంద సేవల పద్ధతిపై ఖాళీలను భర్తీ చేస్తున్నామని జిల్లా వైద్యాధికారి డాక్టర్ పల్వన్ కుమార్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. వివిధ కేటగిరీల కింద 54 పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈనెల 24 నుంచి 29 వరకు జిల్లా ఆరోగ్య, వైద్యాధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పనులు కదలాలి.. ప్రగతి పరుగిడాలి
[ 27-07-2024]
ఎనిమిదేళ్ల కిందట రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రాంటుగా హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ)కు అందిన మొత్తం కేవలం రూ.250 కోట్లు. అప్పటి నుంచి బల్దియాకు ఒక్కపైసా కూడా గ్రాంటుగా నిధులందలేదు. -
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
[ 27-07-2024]
మహేశ్వరంలోని ఓ హోటల్లో చోరీ చేసేందుకు వచ్చిన ఓ దొంగ.. పోలీసులకు కనీసం ఒక్క క్లూ కూడా దొరక్కుండా.. ఎంతో జాగ్రత్తగా పథకం వేశాడు. -
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
[ 27-07-2024]
రాజీవ్ రహదారిపై అతివేగంగా కారు నడిపి బస్సును ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి చెందారు. -
ఆ భూముల జాడ.. దేవుడికే తెలియాలి
[ 27-07-2024]
రాజధాని పరిధిలో 9వేల ఎకరాలకుపైనే దేవాదాయశాఖ భూములున్నాయి. నిత్యం ధూప, దీప నైవేద్యాల కోసం గతంలో అనేక మంది భూవిరాళాలు ఇచ్చారు. -
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
[ 27-07-2024]
రైల్లో దూర ప్రయాణం.. రాత్రిళ్లు చల్లగాలి.. కబుర్లు చెప్పుకుంటూ నిద్రలోకి జారుకుంటే చాలు.. అదును కోసం చూస్తున్న దొంగలకు పండగే. -
పాలక మండలి సభ్యుల సంబరాలు
[ 27-07-2024]
నగరం అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరు శాఖలకు కలిపి పద్దులో రూ.10వేల కోట్లను కేటాయించడంపై కాంగ్రెస్కు చెందిన జీహెచ్ఎంసీ పాలకమండలి సభ్యులు శుక్రవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు. -
మా ఇష్టం.. మేమిట్లే జేస్తం
[ 27-07-2024]
రాజధాని నగరంలో బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు వేగంగా పెరుగుతుండడంతో వాటికి అవసరమైన ఇటుకల తయారీ కోసం కొందరు నీళ్లు సమృద్ధిగా ఉన్న జంటజలాశయాల పరివాహక ప్రాంతాన్ని ఎంచుకున్నారు. -
మ్యాన్హోల్ నుంచి వంటనూనెల వ్యర్థాలు
[ 27-07-2024]
ఆర్టీసీ క్రాస్రోడ్డు పరిధిలోని ప్రధాన రహదారిపై ఓ డ్రైనేజీ మ్యాన్హోల్ నుంచి శుక్రవారం ఉదయం వంటనూనెల వ్యర్థాలు పొంగిపొర్లాయి. -
కుటుంబాలను కూల్చేస్తున్న రీల్స్
[ 27-07-2024]
రీల్స్ మోజులో పడి తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగిల్చినవారు కొందరైతే.. కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకున్నవారు మరికొందరు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
యువతలో పెరుగుతున్న హృద్రోగ ముప్పు
[ 27-07-2024]
యువతలో గుండె సమస్యలు పెరుగుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. -
విద్యుత్తు అధికారుల్లో సూర్యాఘర్ జోష్
[ 27-07-2024]
సౌర విద్యుత్తును 300 యూనిట్ల వరకూ పొందే ‘పీఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’ పథకంలో ఎక్కువ మందిని చేర్పించే విద్యుత్తు అధికారులకు కేంద్రం ప్రోత్సహకాలు ప్రకటించింది. -
మాజీ రాష్ట్రపతి సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం సందర్శన
[ 27-07-2024]
శంషాబాద్ మండలం శ్రీరామనగరంలో వెలిసిన సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శుక్రవారం సందర్శించారు. -
దేశభక్తి చాటిన కార్గిల్ విజయోత్సవ ర్యాలీ
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధ విజయోత్సవానికి పాతికేళ్ల సందర్భంగా శుక్రవారం నారాయణగూడలోని రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి(అర్బీవీఆర్ఆర్) మహిళా కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్-2, తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ స్వచ్ఛంద సంస్థల సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ పలు ప్రాంతాల్లో కొనసాగింది. -
కోట్పల్లి కల్పవల్లి
[ 27-07-2024]
జిల్లాలో అతిపెద్దదైన కోట్పల్లి ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. బడ్జెట్లో రూ.8 కోట్లు కేటాయించింది. -
అరణ్యం కబ్జా పర్వం.. కొనసాగుతున్న వివాదం!
[ 27-07-2024]
రెండు దశాబ్దాలుగా జిల్లాకు చెందిన అటవీ భూములను ఆక్రమించుకుని కర్ణాటక వాసులు సాగు చేస్తూ పంటలు పండిస్తున్నారు. -
బాధిత అంధ బాలికను, కుటుంబాన్ని ఆదుకోవాలి
[ 27-07-2024]
మలక్పేట ప్రభుత్వ అంధ బాలికల వసతి గృహం వద్ద శుక్రవారం ఆందోళనలు కొనసాగాయి. -
రాష్ట్రపతి నిలయాల్లో సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం
[ 27-07-2024]
ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతిగా రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం, సిమ్లా, దిల్లీలోని రాష్ట్రపతి భవనాల సందర్శనకు సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు రాష్ట్రపతి నిలయం అధికారులు తెలిపారు. -
శిల్పారామం పేరు, లోగో వాడొద్దు
[ 27-07-2024]
అనుమతి లేకుండా శిల్పారామం పేరు, లోగోను ఇతరులు ఉపయోగించరాదని శిల్పారామం ప్రత్యేకాధికారి జి.కిషన్రావు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. -
ఆలయాల్లో కానుకలు చోరీ!
[ 27-07-2024]
దేవాలయాలు లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న టి.నరేందర్(27)ను శుక్రవారం అరెస్ట్ చేసినట్టు ఫలక్నుమా ఏసీపీ ఎన్.ఎల్.నారాయణరాజు తెలిపారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి