బకాయిలతో దూరమవుతున్న భవిత
దివ్యాంగులు భవిత కేంద్రాలకు వచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయాణ భత్యం చెల్లించాలి. గతంలో సక్రమంగా చెల్లించిన ప్రభుత్వం.. ప్రస్తుతం ఇవ్వడం లేదు. దీంతో దివ్యాంగ విద్యార్థులు తీవ్ర ఇబ్బందిపడుతున్నారు.
దివ్యాంగ విద్యార్థులకు చెల్లించని భత్యం
కేంద్రంలో విద్యార్థులు
వికారాబాద్ కలెక్టరేట్, పరిగి, న్యూస్టుడే: దివ్యాంగులు భవిత కేంద్రాలకు వచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయాణ భత్యం చెల్లించాలి. గతంలో సక్రమంగా చెల్లించిన ప్రభుత్వం.. ప్రస్తుతం ఇవ్వడం లేదు. దీంతో దివ్యాంగ విద్యార్థులు తీవ్ర ఇబ్బందిపడుతున్నారు. గత 18 నెలలుగా ఒక్క నయాపైసా విడుదల చేయలేదు. దీంతో భవిత కేంద్రాల్లో చదువుకుంటున్న వారు సొంత డబ్బులు వెచ్చించాల్సి వస్తోంది. ప్రభుత్వం ప్రయాణ భత్యం చెల్లించకపోవడంతో కొందరు పేద విద్యార్థులు పాఠశాలలకు రావడం మానేశారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలిపినా ప్రయోజనం లేదు. విద్యార్థులకు వివిధ దీర్ఘకాలిక వ్యాధులకు శస్త్ర చికిత్స అందించి సాధారణ స్థితికి తీసుకురావాలన్న లక్ష్యం నీరుగారుతోంది.
రూ.11.98 లక్షలు రావాలి
జిల్లాలో 27 భవిత(విలీన విద్యా వనరుల) కేంద్రాలున్నాయి. వీటిలో 347 మంది పిల్లలున్నారు. ప్రతి మండలంలో ఒక కేంద్రం ఉండగా కొన్ని మండలాల్లో రెండు ఉన్నాయి. కేంద్రానికి ఒకరు చొప్పున రిసోర్స్ పర్సన్లు ఉన్నారు. ఈ కేంద్రాల్లో 5 నుంచి 14 ఏళ్లలోపు పిల్లల్ని చేర్చుకుంటారు. ప్రయాణ భత్యం ఒక్కొక్కరికి ప్రతి నెల రూ.500 వారి ఖాతాల్లో జమ చేయాలి. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలు తల్లిదండ్రుల సహాయంతో పాఠశాలకు వస్తున్నందున ఒక్కొక్కరికి నెలకు రూ.550 ప్రయాణ భత్యం ఇవ్వాలి. బాలికలకు అదనపు ప్రోత్సాహకంగా నెలకు రూ.200 చెల్లిస్తారు. రీడర్ అలవెన్స్ కింద నెలకు రూ.60 చెల్లిస్తారు. వీరందరికీ 2022-23లో పది నెలలు, 2023-24 లో 8 నెలలు మొత్తం 18 నెలలకు సంబంధించిన భత్యం చెల్లించాలి. 2022-23 సంవత్సరానికి 347 మంది విద్యార్థులకు రూ.11.98 లక్షలు విడుదల కావాల్సి ఉంది. 2023-24 సంవత్సరం 8 నెలల లెక్కలు అధికారులు తీస్తున్నారు. ప్రయాణభత్యం రాకపోవటంతో తల్లిదండ్రులే సొంత డబ్బులు చెల్లించి చిన్నారులకు భవిత కేంద్రాలకు పంపుతున్నారు. డబ్బులు చెల్లించలేని వారు సక్రమంగా రావడం లేదు. దీంతో వీరికి అందాల్సిన సేవలు పూర్తిస్థాయిలో అందటం లేదు.
2022-23లో రావాల్సినవి..
- విద్యార్థులకు సహాయకులుగా వచ్చే వారికి చెల్లించే భత్యం 111 మందికి రూ.5.55 లక్షలు
- ప్రయాణ భత్యం 57 మంది విద్యార్థులకు రూ.3.13 లక్షలు
- బాలికలకు ప్రోత్సాహకం 159 మందికి రూ.3.18 లక్షలు
- రీడర్ అలవెన్స్లు 20 మందికి రూ.12 వేలు
- మొత్తం రూ.11,98,500లు.
త్వరలో విడుదల చేస్తామన్నారు
- రజనీకుమారి, సమ్మిళిత విద్య కోఆర్డినేటర్
విద్యార్థులకు రావాల్సిన బకాయిలను త్వరలో విడుదల చేస్తామని అధికారులు సమాచారం అందజేశారు. విద్యార్థుల వివరాలను ఆన్లైన్లో పొందుపర్చి ఉన్నతాధికారులకు పంపించాం. నిధులు విడుదల చేస్తే విద్యార్థుల ఖాతాలో జమ అవుతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మ్యాన్హోల్ నుంచి వంటనూనెల వ్యర్థాలు
[ 27-07-2024]
ఆర్టీసీ క్రాస్రోడ్డు పరిధిలోని ప్రధాన రహదారిపై ఓ డ్రైనేజీ మ్యాన్హోల్ నుంచి శుక్రవారం ఉదయం వంటనూనెల వ్యర్థాలు పొంగిపొర్లాయి. -
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
[ 27-07-2024]
రైల్లో దూర ప్రయాణం.. రాత్రిళ్లు చల్లగాలి.. కబుర్లు చెప్పుకుంటూ నిద్రలోకి జారుకుంటే చాలు.. అదును కోసం చూస్తున్న దొంగలకు పండగే. -
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
[ 27-07-2024]
మహేశ్వరంలోని ఓ హోటల్లో చోరీ చేసేందుకు వచ్చిన ఓ దొంగ.. పోలీసులకు కనీసం ఒక్క క్లూ కూడా దొరక్కుండా.. ఎంతో జాగ్రత్తగా పథకం వేశాడు. -
పనులు కదలాలి.. ప్రగతి పరుగిడాలి
[ 27-07-2024]
ఎనిమిదేళ్ల కిందట రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రాంటుగా హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ)కు అందిన మొత్తం కేవలం రూ.250 కోట్లు. అప్పటి నుంచి బల్దియాకు ఒక్కపైసా కూడా గ్రాంటుగా నిధులందలేదు. -
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
[ 27-07-2024]
రాజీవ్ రహదారిపై అతివేగంగా కారు నడిపి బస్సును ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి చెందారు. -
ఆ భూముల జాడ.. దేవుడికే తెలియాలి
[ 27-07-2024]
రాజధాని పరిధిలో 9వేల ఎకరాలకుపైనే దేవాదాయశాఖ భూములున్నాయి. నిత్యం ధూప, దీప నైవేద్యాల కోసం గతంలో అనేక మంది భూవిరాళాలు ఇచ్చారు. -
పాలక మండలి సభ్యుల సంబరాలు
[ 27-07-2024]
నగరం అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరు శాఖలకు కలిపి పద్దులో రూ.10వేల కోట్లను కేటాయించడంపై కాంగ్రెస్కు చెందిన జీహెచ్ఎంసీ పాలకమండలి సభ్యులు శుక్రవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు. -
మా ఇష్టం.. మేమిట్లే జేస్తం
[ 27-07-2024]
రాజధాని నగరంలో బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు వేగంగా పెరుగుతుండడంతో వాటికి అవసరమైన ఇటుకల తయారీ కోసం కొందరు నీళ్లు సమృద్ధిగా ఉన్న జంటజలాశయాల పరివాహక ప్రాంతాన్ని ఎంచుకున్నారు. -
కుటుంబాలను కూల్చేస్తున్న రీల్స్
[ 27-07-2024]
రీల్స్ మోజులో పడి తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగిల్చినవారు కొందరైతే.. కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకున్నవారు మరికొందరు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
యువతలో పెరుగుతున్న హృద్రోగ ముప్పు
[ 27-07-2024]
యువతలో గుండె సమస్యలు పెరుగుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. -
విద్యుత్తు అధికారుల్లో సూర్యాఘర్ జోష్
[ 27-07-2024]
సౌర విద్యుత్తును 300 యూనిట్ల వరకూ పొందే ‘పీఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’ పథకంలో ఎక్కువ మందిని చేర్పించే విద్యుత్తు అధికారులకు కేంద్రం ప్రోత్సహకాలు ప్రకటించింది. -
మాజీ రాష్ట్రపతి సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం సందర్శన
[ 27-07-2024]
శంషాబాద్ మండలం శ్రీరామనగరంలో వెలిసిన సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శుక్రవారం సందర్శించారు. -
దేశభక్తి చాటిన కార్గిల్ విజయోత్సవ ర్యాలీ
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధ విజయోత్సవానికి పాతికేళ్ల సందర్భంగా శుక్రవారం నారాయణగూడలోని రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి(అర్బీవీఆర్ఆర్) మహిళా కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్-2, తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ స్వచ్ఛంద సంస్థల సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ పలు ప్రాంతాల్లో కొనసాగింది. -
కోట్పల్లి కల్పవల్లి
[ 27-07-2024]
జిల్లాలో అతిపెద్దదైన కోట్పల్లి ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. బడ్జెట్లో రూ.8 కోట్లు కేటాయించింది. -
అరణ్యం కబ్జా పర్వం.. కొనసాగుతున్న వివాదం!
[ 27-07-2024]
రెండు దశాబ్దాలుగా జిల్లాకు చెందిన అటవీ భూములను ఆక్రమించుకుని కర్ణాటక వాసులు సాగు చేస్తూ పంటలు పండిస్తున్నారు. -
బాధిత అంధ బాలికను, కుటుంబాన్ని ఆదుకోవాలి
[ 27-07-2024]
మలక్పేట ప్రభుత్వ అంధ బాలికల వసతి గృహం వద్ద శుక్రవారం ఆందోళనలు కొనసాగాయి. -
రాష్ట్రపతి నిలయాల్లో సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం
[ 27-07-2024]
ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతిగా రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం, సిమ్లా, దిల్లీలోని రాష్ట్రపతి భవనాల సందర్శనకు సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు రాష్ట్రపతి నిలయం అధికారులు తెలిపారు. -
శిల్పారామం పేరు, లోగో వాడొద్దు
[ 27-07-2024]
అనుమతి లేకుండా శిల్పారామం పేరు, లోగోను ఇతరులు ఉపయోగించరాదని శిల్పారామం ప్రత్యేకాధికారి జి.కిషన్రావు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. -
ఆలయాల్లో కానుకలు చోరీ!
[ 27-07-2024]
దేవాలయాలు లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న టి.నరేందర్(27)ను శుక్రవారం అరెస్ట్ చేసినట్టు ఫలక్నుమా ఏసీపీ ఎన్.ఎల్.నారాయణరాజు తెలిపారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం