logo

60 ఏళ్లలో జరగని అభివృద్ధి పదేళ్లలో జరిగింది

దేశంలో అరవై ఏళ్ల కాంగ్రెస్‌ అధికారంలో జరగని అభివృద్ధి.. పదేళ్ల ప్రధాని మోదీ పాలనలో జరిగిందని భాజపా జాతీయ నాయకుడు, మధ్యప్రదేశ్‌ భాజపా ఇన్‌ఛార్జి మురళీధర్‌రావు తెలిపారు.

Published : 24 Feb 2024 03:07 IST

మాట్లాడుతున్న మురళీధర్‌రావు

ఇబ్రహీంపట్నం, యాచారం, న్యూస్‌టుడే: దేశంలో అరవై ఏళ్ల కాంగ్రెస్‌ అధికారంలో జరగని అభివృద్ధి.. పదేళ్ల ప్రధాని మోదీ పాలనలో జరిగిందని భాజపా జాతీయ నాయకుడు, మధ్యప్రదేశ్‌ భాజపా ఇన్‌ఛార్జి మురళీధర్‌రావు తెలిపారు. భాజపా నిర్వహిస్తున్న విజయ సంకల్ప యాత్ర శుక్రవారం యాచారం, మంచాల మీదుగా రాత్రి ఇబ్రహీంపట్నం చేరుకుంది. భాజపా అసెంబ్లీ కన్వీనర్‌ ఎన్ను యాదగిరిరెడ్డి అధ్యక్షతన అంబేడ్కర్‌ చౌరస్తాలో సభ నిర్వహించారు. ఈ సభలో మురళీధర్‌రావు మాట్లాడారు. నాడు కాంగ్రెస్‌.. దేశ అభివృద్ధిని విస్మరించి అవినీతి పాలన సాగించిందని, నేడు భాజపా పాలనలో ప్రపంచంలోనే ఎక్కడాలేని విధంగా ఆదర్శంగా పనిచేస్తోందని వివరించారు. దేశంలో 50 కోట్ల మంది పేదలకు ఫ్రీ బ్యాంకు ఖాతాలు తెరిచి ఇచ్చిన ఘనత మోదీ సర్కారుకే దక్కుతుందన్నారు. మరోసారి కేంద్రంలో భాజపా ప్రభుత్వం అధికారంలోకి వస్తే అభివృద్ధి చెందిన దేశాల సరసన.. మన దేశం నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో కామారెడ్డి, అర్మూర్‌ ఎమ్మెల్యేలు కాటేపల్లి వెంకటరమణారెడ్డి, రాకేష్‌రెడ్డి, భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనోహర్‌రెడ్డి, యాత్ర ప్రముఖ్‌ కాసం వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌, రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని